చికిత్స పొందుతూ రిమాండ్ ఖైదీ మృతి
మహారాణిపేట: హత్య కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భూసరి రాజబాబు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. గతేడాది నవంబర్లో ఏజెన్సీలోని కొయ్యూరు మండలం, బకులూరు సమీపంలో జరిగిన హత్య కేసులో రాజబాబు రెండో నిందితుడిగా ఉన్నారు. రిమాండ్ ఖైదీగా విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ఆరోగ్యం విషమించడంతో కేజీహెచ్కు తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మరణించాడు. రాజబాబు మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి, మృతదేహాన్ని జైలు అధికారుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కేజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ మెహర్కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment