సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత

Published Wed, Feb 19 2025 1:39 AM | Last Updated on Wed, Feb 19 2025 1:35 AM

సరియా

సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత

వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరి మృతి

భయాందోళనలో గ్రామస్తులు

ప్రత్యేక మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ సరియాపల్లిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. చిన్నా,పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది వాంతులు,విరోచనాలతో బాధపడుతున్నారు. వాంతులు, విరోచనాలతో ఒకే రోజు ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.మంగళవారం ఉదయం గ్రామానికి చెందిన గోల్లోరి దనియా(56), సాయంత్రం ఏడాది బాలుడు కిలో వినయ్‌ వాంతులు,విరోచనాలతో మృతి చెందారు. ప్రసుత్తం గ్రామంలో కొర్రా విక్రత్‌,కొర్రా హర్షిత్‌,వంతాల సిద్ధాంత్‌,కొర్రా వసంత అనే ఏడాదిలోపు చిన్నారులతో పాటు మరికొంత మంది వాంతలు,విరోచనాలతో బాధపడుతున్నారు. చాలా మంది 10 రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్నారు. ఇటీవల కిలగాడ వైద్య సిబ్బంది గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించి, వైద్య సేవలు అందించినా అదుపులోకి రాకపోవడంతో గ్రామస్తులకు కంటిమీదకునుకు కరువైంది. తక్షణమే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యేక మెడికల్‌ క్యాంప్‌ ఏర్పాటు చేయాలని బంగారుమెట్ట సర్పంచ్‌ రత్న,వైఎస్సార్‌సీపీ మండల నేత మోహన్‌,సరియాపల్లి గ్రామస్తులు కోరారు.దీనిపై కిలగాడ వైద్యాధికారి రమేష్‌ వద్ద ప్రస్తవించగా సరియాపల్లిలో గత వారం వైద్య శిబిరం నిర్వహించామని, బుధవారం మరోసారి శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైతే పీహెచ్‌సీకి తీసుకువచ్చి వైద్య సేవలు అందిస్తామని ఆయన చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత 1
1/2

సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత

సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత 2
2/2

సరియాపల్లిలో 20 మందికి అస్వస్థత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement