
తాటిచెట్లపాలెం: వేగవంతమైన ప్రయాణానికి పేరొందిన వందే భారత్ రైళ్లను మరింత విస్తరించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మరో వందే భారత్ రైలును విశాఖకు నడిపేందుకు ఈస్ట్కోస్ట్ రైల్వే సిద్ధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం విశాఖపట్నం–సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్కు రెండు వందే భారత్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.
మూడో వందేభారత్ దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ మధ్య నడిపేందుకు ఒడిశా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. వాల్తేర్ డివిజన్ నుంచి ఏ విధమైన అధికారిక సమాచారం లేనప్పటికీ ఈ రైలు నడిచేది మాత్రం వాస్తవమేనని తెలిసింది. కొంచెం మార్పులతోనైనా లేదా ఇదే విధంగానైనా దుర్గ్–విశాఖపట్నం–దుర్గ్ వందే భారత్ రాకపోకలు సాగించనుంది. దుర్గ్–విశాఖపట్నం(20829) వందే«భారత్ ఎక్స్ప్రెస్ ఉదయం 6 గంటలకు దుర్గ్లో బయల్దేరి మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో విశాఖపట్నంలో విశాఖపట్నం–దుర్గ్(20830) వందే భారత్ మధ్యాహ్నం 2.50 గంటలకు బయల్దేరి రాత్రి 10.50 గంటలకు దుర్గ్ చేరుకుంటుందని సమాచారం.