
సాక్షి,అమరావతి: వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక చర్యలు చేపట్టామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపించారని ఆయన తెలిపారు. రెండేళ్లలో బీసీలకు రూ.69వేల 800 కోట్లు లబ్ధి చేకూరుందని ఆయన పేర్కొన్నారు. మరో వైపు బీసీలకు రుణాలెక్కడ అని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అని వేణుగోపాలకృష్ణ విమర్శించారు