కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం పర్యటన | Central Medical and Health Team from Delhi visit Alluri Sitarama Raju district | Sakshi
Sakshi News home page

కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం పర్యటన

Published Wed, Feb 12 2025 4:34 AM | Last Updated on Wed, Feb 12 2025 4:34 AM

Central Medical and Health Team from Delhi visit Alluri Sitarama Raju district

ముంచంగిపుట్టు సీహెచ్‌సీ, కిలగాడ పీహెచ్‌సీ తనిఖీ

ఆరోగ్య కేంద్రాల స్థితిగతులు, అందుతున్న వైద్యంపై ఆరా

ముంచంగిపుట్టు: ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర వైద్య, ఆరోగ్య బృందం ప్రతినిధులు అల్లూరి సీతా­రామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండల కేంద్రంలో మంగళవారం పర్యటించారు. స్థాని­క కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను తనిఖీ చేశా­­రు. మందుల స్టాక్, రికార్డులను పరిశీలించారు. అనంతరం రక్త పరీక్షల గదికి వెళ్లి నెల వారీగా నమోదవుతున్న మలేరియా, టైఫాయిడ్‌ కేసుల వివరాలను వైద్యాధికారులు సంతోశ్, ధరణిల­ను అడిగి తెలుసుకున్నారు. 

కేసుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడంలో జాప్యాన్ని గుర్తించి, ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూ­చించారు. వార్డుల్లో ఉన్న రోగులతో మాట్లా­డి, అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. గ్రామా­ల నుంచి ఆరోగ్య కేంద్రాలకు మధ్య దూరం, రవాణా సౌకర్యం, రోడ్ల పరిస్థితిని అడిగి తెలు­సుకున్నారు. అనంతరం సిక్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌ (ఎస్‌ఎన్‌సీయూ)ను, పుట్టిన బిడ్డలు, బాలింతల ఆరోగ్య పరీక్షలు, అధికంగా నమోద­వుతున్న కేసులను పరిశీలించి పలు సూచ­నలు చేశారు. 

కర్రిముఖిపుట్టు, దార్రెల గ్రామా­ల్లో ఉన్న సబ్‌ సెంటర్లు, వెల్‌నెస్‌ సెంటర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. గర్భిణు­ల­కు, బాలింతలకు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టి­కాహారంపై ఆరా తీశారు. అనంతరం కిల­గాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించా­రు. రికార్డులు తనిఖీ చేశారు. రక్తహీనత కేసుల వివరాలను అడిగి తెలుసు­కున్నారు. వ్యాక్సి­నేషన్‌ తీరుపై ఆరా తీశారు. 

మందులను ఎప్ప­టి­కప్పుడు అందుబాటులో ఉంచుకోవాలని సూ­చించి, నిల్వ లేని మందుల వివరాలు నమోదు చేసుకున్నారు. సీహెచ్‌సీ, పీహెచ్‌సీ, సబ్‌సెంటర్ల నిర్వహణలో లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా ఢిల్లీకి చెందిన కేంద్ర సచివాలయ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరుణ్‌ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement