
ఏకంగా 4 నుంచి ఐదు వేలమందిని సురక్షితంగా వరద నుంచి దాటించిన..
సాక్షి, అల్లూరి: గతేడాది, ఈ ఏడాది గోదావరి వరదల సందర్భంగా.. సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించి ప్రజలను రక్షించిన కూనవరం ఎస్సై వెంకటేశన్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్.. సోమవారం కూనవరంలో పర్యటించారు. ఆ సమయంలో సభకు హాజరవుతున్న టైంలో ఒక విజ్ఞాపన కోసం బస్సు దిగారాయన. అయితే.. అక్కడే ఉన్న స్థానికులు.. అధికారులు బాగా పని చేశారని సీఎం జగన్కు వివరించారు. ఈ క్రమంలో ఎస్సై వెంకటేశన్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం.. గతేడాది అయితే దాదాపు 4 నుంచి 5 వేల మంది గ్రామస్తులను తరలించడంలో కీలక పాత్ర పోషించాడని సీఎం జగన్కు వివరించారు.
దీంతో.. సీఎం జగన్ ఆయన్ని భుజం తట్టి అభినందించారు. అంతేకాదు ఎస్సై వెంకటేశన్కు పోలీస్ మెడల్ ఇవ్వాలంటూ పక్కనే ఉన్న అధికారులకు సిఫార్సు చేశారాయన.