ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య | Intermediate Student Ends Life In Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

Apr 15 2025 4:51 AM | Updated on Apr 15 2025 4:51 AM

Intermediate Student Ends Life In Visakhapatnam

మర్రిపాలెం: ఇంటర్‌ మొ­దటి సంవత్సరంలో ఫెయిల్‌ కావడంతో వి­శా­ఖలో ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహ­త్య చేసుకుంది. విశాఖ జిల్లా రెడ్డి కంచరపాలెంకు చెందిన నిహారిక(17) నగరంలోని ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివింది. జువాలజీ సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ అయ్యింది.

దీంతో మనస్తాపం చెందిన నిహారిక సోమ­వారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి.. కిందకు దించేసరికి ఆమె ప్రాణాలు కోల్పోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement