తిరుమల : దేశవ్యాప్తంగా కోవిడ్–19 తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని దానిని ఇంకా పెంచుతామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇందులోని ముఖ్యాంశాలు..
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణకట్టతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.
- సర్వ దర్శనం టోకెన్లను 22 వేల నుంచి 15 వేలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాం. భక్తులు ఈ మార్పును గమనించాలి.
- అన్న ప్రసాద కేంద్రం, గదుల కేటాయింపు కౌంటర్ల వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాల ఏర్పాటు. ఊ తిరుమలకు వచ్చే భక్తులు తమ వెంట తప్పనిసరిగా మాస్కులు, శానిటైజర్లు తెచ్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment