
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో బర్రెను ఢీకొని స్కార్పియో వాహనం పల్టీ కొట్టింది. ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ఒకరు దుర్మరణం చెందారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.