Buffalo
-
ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది...
భువనగిరి: అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన అడవి దున్న ఎట్టకేలకు చిక్కింది. అయితే అది మృతిచెందినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడురోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరిస్తున్న అడవి దున్నను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు, పశువైద్యాధికారులతో కలిపి 10 బృందాలను ఏర్పాటు చేశారు. అడవి దున్నకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు వరంగల్ జూపార్క్ నుంచి వైద్యులు కూడా వచ్చారు. శుక్రవారం భువనగిరి మండలం రెడ్డినాయక్ తండా పరిసర ప్రాంతాల్లో అడవి దున్న సంచరిస్తున్నట్లు గుర్తించి వైద్యులు అడవి దున్నకు సమీపంలో నుంచి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. దీంతో భయంతో అడవి దున్న అక్కడ ఉన్న గుట్టల పైన పరుగులు పెట్టి పడిపోయింది. మత్తుతో ఉన్న దున్నను వాహనంలోకి ఎక్కించే క్రమంలో పరిశీలించగా అది మృతిచెందినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల నుంచి పరుగులు పెడుతున్న అడవి దున్న అప్పటికే అనార్యోగానికి గురికావడంతో పాటు మత్తు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత పరుగులు పెట్టడం వల్ల మృతిచెందినట్లు జిల్లా అటవీశాఖ అధికారి తెలిపింది. అడవి దున్నకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు పేర్కొన్నారు. -
ఆ దున్నపోతు మాదే!
అనంతపురం: దేవర దున్నపోతు కోసం రెండు గ్రామాల మధ్య వివాదం రాజుకుంది. కూడేరు మండలం ముద్దలాపురంలో ముత్యాలమ్మ, కదరగుంటలో బొడ్రాయి ప్రతిష్ట సందర్భంగా దేవర నిర్వహణకు గ్రామస్తులు పూనుకున్నారు. ఇందు కోసం దేవరలో బలి ఇచ్చేందుకు గ్రామానికి ఒక దున్నపోతును వదిలారు. ఈ రెండు దున్నపోతులు నాలుగేళ్లుగా సమీప గ్రామాల్లో సంచరిస్తున్నాయి. ఈ నెల 22న దేవర ఉండడంతో ఇటీవల గ్రామంలోకి వచ్చిన దున్నపోతును కదరకుంట గ్రామస్తులు కట్టేశారు. 21వ తేదీన ముద్దలాపురంలో దేవర ఉంది. దీంతో పక్క గ్రామంలో కట్టేసిన దున్నపోతు తమ గ్రామానికి చెందినదేనని ముద్దలాపురం గ్రామస్తులు నిర్ధారణకు వచ్చారు. తమ దున్నపోతును వదిలేస్తు దేవర చేసుకుంటామని కోరగా కడదరకుంట గ్రామస్తులు ఇందుకు ససేమిరా అన్నారు. అది తమదేనని ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. దీంతో గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుండడంతో ముద్దలాపురం గ్రామస్తులు శుక్రవారం ఎస్పీని కలిసేందుకు కార్యాలయానికి వెళ్లారు. ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించే సోమవారం రోజున రావాలంటూ సిబ్బంది సూచించడంతో గ్రామస్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. -
రూ. 23 కోట్ల దున్న.. నెలకు రూ. 5 లక్షల ఆదాయం
కొందరు ఎవరినైనా తిట్టేటప్పుడు దున్నపోతులా ఉన్నావ్ అంటూ ఎగతాళి చేస్తుంటారు. అయితే మనం ఇప్పుడు చెప్పుకోబోయే దున్నపోతు గురించి తెలిస్తే ఇకపై అలాంటి మాట అనరు. ఎందుకంటే ఈ దున్నపోతు ధర, అది తినే తిండి, అంతకు మించి దీని ద్వారా వచ్చే ఆదాయం గురించి తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.ఆ దున్నపోతు ఖరీదు రూ.23 కోట్లు అని చెబితే ఎవరైనా నమ్ముతారా? అవును.. ఇది అక్షరాలా నిజం. అయితే దాని వలన వచ్చే ఆదాయం గురించి తెలిస్తే అంత ధర ఉండటంతో తప్పులేదంటాం. ఇప్పుడు ఆ దున్నపోతు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆ దున్నపోతు వీర్యాన్ని అమ్మడంతో పాటు ఇతర మార్గాల ద్వారా దాని యజమాని నెలకు రూ.4 నుంచి రూ.5 లక్షల వరకూ సంపాదిస్తుండటం విశేషం. హర్యానాకు చెందిన ఆ దున్నపోతు పేరు అన్మోల్.హర్యానాలోని సిర్సాలో ఉంటున్న పల్వీందర్ సింగ్ అనే రైతు ఈ అన్మోల్ను పెంచుతున్నాడు. దాని వయసు ఎనిమిదేళ్లు. బరువు 1500 కిలోలు. ఈ దున్నపోతును రూ.23 కోట్లు ఇస్తానన్నా పల్వీందర్ సింగ్ ఎవరికీ అమ్మబోనని తెగేసి చెబుతున్నాడు. ఉత్తరాదిన జరిగే పుష్కర్ మేళా, ఆల్ ఇండియా ఫార్మర్స్ ఫెయిర్ వంటి ప్రదర్శనల్లో ఈ అన్మోల్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంటుంది. దీని భారీ ఆకారం ఎవరినైనా ఇట్టే కంగుతినేలా చేస్తుంది.ఇక ఈ అన్మోల్ ఎంత తిండి తింటుందో తెలిస్తే ఎవరైనా ఆశ్యర్యపోకమానరు. ఇది అధిక కేలరీలు కలిగిన ఆహార పదార్థాలు, డ్రైఫ్రూట్స్ను తింటుంది. దాని తిండి కోసం యజమాని రోజూ రూ.1,500 ఖర్చు చేస్తుంటాడు. అంటే నెలకు దానిని మేపడానికి రూ.45 వేల వరకు ఖర్చవుతుందన్నమాట. అది ప్రతి రోజూ 250 గ్రాముల బాదాం, నాలుగు కిలోల దానిమ్మలు, 30 అరటిపండ్లు, ఐదు లీటర్ల పాలు, 20 గుడ్లను తింటుంది. వీటితోపాటు అది ఆయిల్ కేక్, పచ్చి గడ్డి, దేశీ నెయ్యి, సోయాబీన్, మొక్కజొన్నలను కూడా తింటుంది. అన్మోల్ దున్నపోతుకు దాని యజమాని పల్వీందర్ సింగ్ రోజూ స్నానం చేయిస్తుంటాడు. ఇందుకోసం బాదాం నూనె, ఆవ నూనెలను కూడా వినియోగించడం విశేషం.ఇది కూడా చదవండి: Pakistan: ఊపిరాడక వేల మంది ఆస్పత్రులకు పరుగులు -
గేదెకు పోస్టుమార్టం.. కారణమిదే?
పట్నా: బీహార్లోని పట్నాలో ఓ విచిత్ర ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు జరిపిన కాల్పుల్లో ఒక గేదె మృతి చెందగా, దానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహింపజేస్తున్నారు. గేదెకు పోస్టుమార్టం నిర్వహించడం ఇదే తొలిసారని సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం రాత్రి పట్నాకు 40 కిలోమీటర్ల దూరంలోని ధన్రువాలోని నద్వాన్ సోన్మై గ్రామంలో గేదెలను మేపిన అనంతరం మున్నా కుమార్, నావల్ కుమార్ అనే అన్నదమ్ములు ఇంటికి తిరిగి వస్తున్నారు.ఇంతలో నలుగురు వ్యక్తులు మోటార్సైకిల్పై వచ్చారు. వారు ముందుగా నావల్ ప్రసాద్ను కత్తితో పొడిచారు. ఆ తర్వాత అతనిపై కాల్పులు జరిపారు. అయితే మున్నా ప్రసాద్ తృటిలో తప్పించుకోగా, నిందితులు అక్కడున్న గేదెపై కాల్పులు జరిపారు.ఈ ఘటనలో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాల్పుల శబ్ధం విన్న సమీప గ్రామస్తులు అక్కడికి వచ్చి నిందితులను తరిమికొట్టారు. వారు మోటార్సైకిల్పై పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే వారు కిందపడిపోయారు. దీంతో వారు మోటార్సైకిల్ను అక్కడే వదిలేసి పారిపోయారు.సమాచారం అందుకున్న వెంటనే ధన్రువా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బైక్, పిస్టల్, బుల్లెట్, కత్తి, బుల్లెట్ కేసింగ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్నాలోని మసౌరీ సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కన్హయ్య సింగ్ మాట్లాడుతూ, నిందితులు రైతుతోపాటు ఒక గేదెపై కాల్పులు జరిపారన్నారు. ప్రస్తుతం రైతు నావల్ ప్రసాద్ మృతదేహానికి పోస్ట్మార్టం జరుగుతుండగా, గేదెకు కూడా పశువైద్యశాలలో పోస్ట్మార్టం చేస్తున్నారు. ఆ గేదె ఎలా మృతిచెందిందనే విషయాన్ని తెలుకునేందుకే దానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన తెలిపారు. -
బర్రె కోసం 10 కిలోల బంగారు చైన్
-
మాయమయింది మళ్లీ వచ్చింది
అనుకోని అతిథి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్న ప్రత్యక్షమైంది. ఇక్కడి అడవుల్లో 150 ఏళ్ల క్రితం అదృశ్యమైన మహిషం తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. తలచిందే తడవుగా.. అడవి దున్న వలచి రావడంతో వన్యప్రాణి ప్రేమికులు ఉప్పొంగిపోతున్నారు.ఆత్మకూరు రూరల్: నల్లమల అడవుల్లో 1870 కాలంలో అదృశ్యమైన అడవి దున్న నల్లమలలో తిరిగి కనిపించడం అటవీ అధికారులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత అడవి దున్న (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందిన ఈ దున్నలు నల్లమల అడవుల్లో ఒకప్పుడు విస్తారంగా సంచరించేవి. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైపోయిన అడవి దున్న వన్యప్రాణి ప్రేమికులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ నాగార్జున సాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యంలోని ఆత్మకూరు డివిజన్లో బైర్లూటి, వెలుగోడు నార్త్ బీట్లలో కనిపించింది. ప్రస్తుతం నల్లమలకు తూర్పున ఉండే పాపికొండలు (పోలవరం అటవీ ప్రాంతం).. çకర్ణాటకలోని పశి్చమ కనుమలలో మాత్రమే ఉండే అడవి దున్న వందల కిలోమీటర్ల దూరాన్ని దాటుకుని నల్లమల చేరడం అద్భుతమైన విషయమే. నెల క్రితమే కనిపించినా.. నెల రోజుల కిందట సాధారణ విధుల్లో భాగంగా ఆత్మకూరు అటవీ డివిజన్లోని బైర్లూటి రేంజ్ తలమడుగు అటవీ ప్రాంతంలో ఫుట్ పెట్రోలింగ్ చేస్తున్న సిబ్బందికి అడవి దున్న కనిపించింది. ఆ వెంటనే వీడియో, ఫొటోలు తీసిన సిబ్బంది ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అయితే.. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు రహస్యంగా ఉంచారు. ఆ తరువాత ఇదే అటవీ డివిజన్లోని వెలుగోడు రేంజ్లో గల నార్త్ బీట్ జీరో పాయింట్ వద్ద సిబ్బందికి మరోమారు అడవి దున్న కనిపించి నల్లమలలో తన ఉనికిని చాటింది.అప్రయత్నంగానే సాకారం ఒకప్పుడు నల్లమలలో విస్తారంగా సంచరించి అదృశ్యమైన అడవి దున్నలను తిరిగి నల్లమలలోకి తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ఇటీవల ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్(డబ్లూడబ్ల్యూఎఫ్) సంస్థ సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ రెడ్డీస్ ల్యాబ్ ఈ మహత్తర కార్యక్రమం కోసం రూ.కోటి విరాళం ఇచ్చేందుకు అంగీకరించింది. అటవీ అధికారులు అడవి దున్నల తరలింపు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ మహిషం తనంతట తానే పూర్వ ఆవాసానికి చేరుకోవడంతో వన్యప్రాణి ప్రేముకులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. నల్లమలలో అడవి దున్న ప్రత్యక్షమవడం శుభసూచకంగా భావిస్తున్నారు. ఆశ్చర్యమే కానీ.. అసాధ్యం కాదు ఆత్మకూరు అటవీ డివిజన్లో అడవి దున్నను మా సిబ్బంది రెండు ప్రాంతాల్లో గుర్తించారు. ఇది కొంత ఆశ్చ్యర్యం కలిగించే విషయమే. కానీ.. అసాధ్యమైనదేమీ కాదు. పెద్ద పులులు, ఏనుగులు వంటి భారీ జంతువులు సుదూర ప్రాంతాలకు తరలివెళ్లడం సాధారణమే. ఈ అడవి దున్న కూడా అలా మైదాన ప్రాంతాలను దాటుకుని నల్లమల చేరి ఉంటుంది. ఇది పాపికొండలు అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నాం. – సాయిబాబా, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు, నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం -
ప్రతీ కుక్కకీ ఒక రోజుంటది.. లక్ అంటే నీదేరా!
-
కోకాపేట్లోని బఫెలో వైల్డ్ వింగ్స్.. ఆటిజంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం..(ఫొటోలు)
-
మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది. రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. రైతు రామ్హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కూడా చూడండి: పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి? -
గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు
లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం -
ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్పై నుంచి జారి..
జంతువుల పట్ల కొందరు అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎలాంటి హానీ చేయకపోయినా సరే శిక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా మనసును కలచివేసేలా ఉంటున్నాయి. అయితే ఇలాగే ఓ మూగజీవాన్ని శిక్షించబోయిన ఆకతాయికి ఊహించని షాక్ తలిగింది. స్నేహితుడితో కలిసి బైక్పై వెళ్తున్న అతడు.. రోడ్డుపై ఉన్న ఓ గేదెను తన్నాడు. ఆ వెంటనే బైక్పై నుంచి జారి కిందపడ్డాడు. బైక్ను రైడ్ చేస్తున్న అతని స్నేహితుడు కూడా అదుపుతప్పి పోల్ను ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు గాయాలపాలయ్యారు. Instant karma 😂 pic.twitter.com/jNFMfEf9Fm — CCTV IDIOTS (@cctvidiots) April 30, 2023 అయితే గతంలో ఎప్పుడో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆకతాయిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. గేదె ఏం చేసిందని తన్నావు.. చూడు ఇప్పుడు నీకు ఏం జరిగిందో.. అందుకే మూగజీవాలకు హాని చేయెద్దు అని హితవు పలికారు. మరో నెటిజన్ ఈ వీడియోపై స్పందిస్తూ.. ఇన్స్టాంట్ ఖర్మ అంటే భయ్యా.. తప్పు చేసిన వెంటనే శిక్ష పడుతుంది. క్షణం కూడా ఆలస్యం కాదు.. అంటూ యువకుడ్ని చీవాట్లు పెట్టాడు. చదవండి: బ్యానెట్పై మనిషిని ఈడ్చుకెళ్లి..ఎంపీ డ్రైవర్ దారుణం! -
68 ప్రమాదాలు.. వందే భారత్ రైలు వైపు వెళ్లొద్దు! గేదెలకు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనతో పాటు వందే భారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి వినూత్నంగా నిరసన తెలిపారు. వందే భారత్ రైలు ప్రారంభమయ్యాక ఇప్పటివరకు దాదాపు 68 ప్రమాదాలు జరిగాయని, గేదెలు, ఆవులను ఢీకొని వందే భారత్ రైళ్లు దెబ్బతిన్నాయని సతీష్రెడ్డి అన్నారు. నాగోలులో ఆయన మాట్లాడుతూ, మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలును ప్రారంభిస్తున్నారని, దయచేసి అటువైపు వెళ్లొద్దు.. మీరు పొరపాటున తాకినా రైలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అసలే ఆ రైళ్లు చాలా వీక్గా ఉంటాయి’’ అని గేదెలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకే వందే భారత్ స్కీంను ప్రధానమంత్రి మోదీ ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్రెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టెడన్నం కోసం..ప్రాణాలే పణంగా!.. గత ఏడాదిలోనే 17 మంది మృతి -
కోట్లు పలుకుతోంది.. ఈ దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు ఎగబడుతున్న జనం!
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఇటీవల పశువుల ప్రదర్శన (సంత) నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు ముజఫర్ నగర్లోని సంతకు చేరుకున్నాయి. అయితే ఈ సంతలో అందరి చూపు ఓ దున్నపోతుపై పడింది. అక్కడ జరగుతున్న సంతలో ప్రధాన ఆకర్షణగా అదే నిలిచింది. సంతకు హాజరైన ప్రతీ ఒక్కరూ దానితో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఇంతకీ ఆ దున్నపోతు ఎందుకంత ప్రత్యేకమంటే? దీని ధర రూ.10 కోట్లు సంతలో అందరి చూపును ఆకట్టుకున్న ఈ దున్నపోతు పేరు ఘోలు. బాహుబలి సినిమాలో ఉండే ఎద్దుకి ఏ మాత్రం తీసిపోన్నట్లు కనిపిస్తుంది. గురువారం జరిగిన జంతు సంతలో పానిపట్ నుంచి తీసుకొచ్చిన ఈ దున్నపోతు ముర్రా జాతికి చెందినది. ఈ ప్రత్యేక జాతి దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతోందట. 16 క్వింటాళ్ల బరువున్న దీన్ని హర్యానాలోని పానిపట్ నుంచి ముజఫర్నగర్లోని పశువుల సంతకు తీసుకొచ్చారు. ఇది పద్మశ్రీ అవార్డు పొందిన పానిపట్లోని దిద్వాడి గ్రామ నివాసి నరేంద్ర సింగ్కు చెందినది. ఘోలుకు రోజుకు 10 కిలోల వరకు మేత తింటుందట. ముజఫర్ నగర్ పశువుల ప్రదర్శనకు చేరిన ఈ దున్నపోతు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ దున్నపోతు యజమాని దీని ఆహారంతో పాటు, దాని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. -
మండపేట గేదా.. మజాకా! నాలుగేళ్ల వయసు, రోజుకు 26.59 లీటర్ల పాలు
మండపేట (డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ): ఆ గేదె వయసు నాలుగేళ్లు. పాలదిగుబడిలో తన తల్లిని మించిపోయింది. రోజుకు 26.59 లీటర్లు పాలు ఇస్తూ రికార్డు సృష్టించింది. ఆ గేదె తల్లి రోజుకు 26.58 లీటర్లు పాలు ఇస్తూ రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. తల్లి గేదె ఆరో ఈతలో అత్యధిక దిగుబడి ఇస్తే... నాలుగేళ్ల వయసు కలిగిన పిల్ల గేదె రెండో ఈతలోనే తల్లిని మించి రికార్డు స్థాయిలో రోజుకు 26.59 లీటర్ల పాల దిగుబడిని నమోదు చేసింది. ఈ విషయాన్ని కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు ఆదివారం నిర్ధారించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన పాడి రైతు ముత్యాల సత్యనారాయణ (అబ్బు) మేలుజాతి పశు పోషణ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల కిందట ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ముర్రా జాతి పాడి గేదెను కొనుగోలు చేశారు. ఆ గేదె గతంలో విజయవాడ, మండపేటల్లో జరిగిన రాష్ట్రస్థాయి పాల దిగుబడి పోటీల్లో రెండుసార్లు మొదటి స్థానంలో నిలిచింది. ఈ గేదె సాధించిన అత్యధిక దిగుబడి 26.58 లీటర్లు. ఇప్పటివరకూ ఆ గేదె తమ వద్ద ఆరు ఈతలు ఈనగా, నాలుగు దున్నపోతులు, రెండు పెయ్యదూడలు పుట్టాయని అబ్బు చెప్పారు. దున్నపోతుల్లో రెండింటిని సెమన్ సేకరణ కేంద్రాల వారు తీసుకువెళ్లగా, మరో రెండు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రికార్డు స్థాయిలో పాలదిగుబడిని ఇస్తున్న పెయ్య ఆరో ఈతలో పుట్టిందని వివరించారు. వీటికి దాణాగా రోజుకు రూ.500 ఖర్చుతో పశుగ్రాసాలు, మొక్కజొన్న, ఉలవలు, తవుడు అందిస్తున్నామని ఆయన చెప్పారు. అధికారికంగా పాలదిగుబడి లెక్కింపు ప్రస్తుతం కేంద్రీయ పశు నమోదు పథకం కింద మండపేట, పరిసర ప్రాంతాల్లో అత్యధిక పాల దిగుబడి ఇచ్చే పాడి పశువుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. కేంద్రీయ పశు నమోదు పథకం ప్రతినిధి డి.రాజేశ్వరరావు పశువుల వద్దకు వెళ్లి మేలుజాతి పాడి గేదెల పాల దిగుబడిని లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా అబ్బుకు చెందిన గేదె ఒక రోజు 26.59 లీటర్ల పాల దిగుబడిని ఇచ్చిందని రాజేశ్వరరావు తెలిపారు. రెండో ఈతలోనే ఈస్థాయిలో దిగుబడి వస్తే మున్ముందు మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. అత్యధిక దిగుబడినిచ్చే పాడి పశువుల వివరాలను సెమన్ సేకరణ కేంద్రాలకు పంపుతామని, వీటి ద్వారా మేలుజాతి పాడి పశువుల పునరుత్పత్తికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజేశ్వరరావు తెలిపారు. -
Viral Video: బర్రెను తన్నాడు.. బోర్లా పడ్డాడు
-
Bomb Cyclone: శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన మంచు తుపాన్.. కోలుకోని అమెరికా (ఫొటోలు)
-
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
Viral Video: నోటికందిన ఆహారాన్ని వదిలేసి.. కొట్టుకున్న సింహాలు..
సింహాలు అడవికి రారాజు. సాధారణంగా సింహాలు వేటాడితే టార్గెట్ గురి తప్పదు. గంభీరత్వానికి నిదర్శనమైన ఇవి ఎప్పుడూ గుంపులుగా దర్శనమిస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జంతువును ఆహారంగా చేసుకోవాలని డిసైడ్ అయితే వార్ వన్సైడ్ అవ్వాల్సిందే. చిన్న చిన్న జంతువులనే కాదు పెద్ద పెద్ద దున్నపోతులు, అడవి దున్నలు, జిరాఫీలను సైతం తమ వశం చేసుకుంటాయి. సింహాలు ఎక్కువగా వేటాడే జంతువుల్లో గేదె ఒకటి. దీని సైజు పెద్దగా ఉండటం వల్ల దాదాపు అయిదు రోజుల వరకు మరే ఇతర జంతువును వేటాడాల్సిన పని ఉండదు. తాజాగా ఓ సింహాల గుంపు కష్టపడి పొలంలో ఒంటరిగా మేస్తున్న గేదెపై దాడి చేసి ఆహారంగా తెచ్చుకున్నాయి. మిగతా గేదెల నుంచి దానిని దూరంగా తీసుకొచ్చి తినడం ప్రారంభించాయి. అయితే ఇంతలో ఏమయ్యిందో తెలిదు కానీ ఆడ సింహాల(శివంగి) మధ్య గొడవ ప్రారంభమైంది. నోటికి వరకు వచ్చిన ఆహారాన్ని పక్కకు పెట్టి మరీ ఒక్కొక్కటిగా దాడి చేసుకున్నాయి. శివంగిలు కొట్టుకుంటుంటే.. ఒక్క సింహం మాత్రం గేదెను అలాగే అదిమి పట్టుకుంది. చివరికి అది కూడా గొడవలో జాయిన్ అయ్యింది. ఇంకేముంది ఇదే మంచి చాన్స్ అని భావించిన గేదె మెల్లగా అక్కడి నుంచి లేచి పరుగు అందుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘గేదె అదృష్టం బాగుంది. పాపం సింహాలకు ఈ రోజు ఉపవాసమే. ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. చదవండి: రెచ్చిపోయిన మాజీ ఐఏఎస్ కూతురు.. రోడ్డుపై క్రికెట్ బ్యాట్తో రచ్చ.. Lions fight while eating a water buffalo, then it casually walks off pic.twitter.com/JGiKMVJaQQ — OddIy Terrifying (@OTerrifying) October 19, 2022 -
Viral Video: గేదె ముందు యువతి కుంగ్ఫూ స్టెప్పులు.. దెబ్బకు చిర్రెత్తడంతో..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి అందరికి ఫేమస్ అయిపోవాలన్న పిచ్చి బాగా పెరిగిపోతుంది. రీల్స్, షార్ట్స్ వంటి వీడియోలు రికార్డ్ చేసి నెట్టింట్లో అప్లోడ్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. నలుగురిలో పాపులారిటీ తెచ్చుకోవాలన్న భ్రమలో మితిమీరి ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో తాము ఏం చేస్తున్నమన్నది తెలియకుండా లేకుండా రెచ్చిపోతున్నారు. అయితే కొందరు తమ పిచ్చి ప్రవర్తనకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాగే చేసింది. జంతువు ముందు ఓవరాక్షన్ చేసి చివరికి ఫలితం అనుభవించింది. గులాబీ, నీలిరంగు డ్రెస్ ధరించిన ఓ యువతి తాడుతో కట్టేసిన గేదేకు దానా వేస్తూ చిందులు వేసింది. ఆకలితో ఉన్న గేదే ముందు చిత్ర విచిత్రంగా డాన్స్ చేసింది. కుంగ్ ఫూ స్టెప్పులు చేస్తూ దానికి చిరాకు తెప్పించింది.. ఇంకేముంది చిర్రెత్తిపోయిన గేదే ఒక్కసారిగా తన రెండు కొమ్ములతో యువతిని దూరంగా నెట్టిపడేసింది. దీంతో యువతి ఎగిరి పక్కన ఉన్న కంచె మీద పడింది. చదవండి: మెట్రో స్టేషన్పై వ్యక్తి హల్చల్.. పోయే కాలం అంటే ఇదేనేమో భయ్యా! ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. కానీ రెండు నెలల క్రితమే ఈ వీడియోను సైకో బిహారీ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయడంతో.. తాజాగా నెట్టింట్లో వైరలవుతోంది. ఆకలితో ఉన్న జంతువులను ఇబ్బంది పెట్టవద్దు. గేదేకు పాపం యువతి డ్యాన్స్ నచ్చలేదు. ఇంకొంచెం ప్రాక్టిస్ చేసుంటే బాగుండు’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 5 లక్షలకు పైగా వ్యూస్, 25 వేల లైకులు వచ్చాయి. View this post on Instagram A post shared by Psycho Bihari (@psycho_biihari) -
గొర్ర గేదె మృతి
పోలవరం రూరల్: మండలంలోని ఎల్ఎన్డీపేట గ్రామ సమీపంలోని డేరా కొండ అటవీ ప్రాంతంలో గొర్రగేదె మృతిచెందింది. రెండు రోజుల క్రితం జీడిమామిడి పిక్కలు ఏరుకునేందుకు వెళ్లిన ముగ్గురు వ్యక్తుల పై దాడి చేసిన ఘటన విధితమే. ఈ దాడిలో కట్టవ రామాయమ్మ అక్కడికక్కడే మృతిచెందగా, పంది కొవ్వాడయ్య, పంది గంగాభవానీలకు గాయాలయ్యాయి. వీరు చికిత్స పొందుతున్నారు. అటవీప్రాంతంలో పొదల నుంచి దుర్వాసన రావడంతో పశువుల కాపరులు గుర్తించి గొర్ర గేదె చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ సమాచారాన్ని అధికారులకు స్థానిక వీఆర్వో సమాచారం ఇచ్చారు. దాడి జరిగిన రోజునే గొర్ర గేదె మృతిచెంది ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఐతే గొర్ర గేదె చనిపోవడానికి గల కారణాలు తెలియరాలేద. -
దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని..
కొత్తపల్లి: దున్నపోతుతో తొక్కించుకుంటే ఊరికి మేలు జరుగుతుందని అక్కడి ప్రజల విశ్వాసం. ప్రతి ఏడాది మాదిరిగానే కొత్తపల్లి మండలం అమీనాబాద్లో పోలేరమ్మ తీర్థంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. గురువారం ఉదయం దున్నపోతును తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిని గరగ నృత్యాల మధ్య గ్రామమంతా ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా నేలపై వరుసగా పడుకున్నారు. వారి మీదుగా దున్నపోతును నడిపించారు. ఓ భక్తురాలు కూడా వీరిని తొక్కుకుంటూ ముందుకు సాగింది. అలా మూడుసార్లు భక్తులు దున్నపోతుతో తొక్కించుకున్నారు. ఇలా తొక్కించుకోవడం వలన వల్ల గ్రామానికి ఉన్న అరిష్టం పోవడంతో పాటు తమ కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. గతంలో ఈ దున్నపోతును బలి ఇచ్చేవారు. ఇప్పుడు అలా చేయకుండా పూజల అనంతరం విడిచి పెట్టేస్తున్నారు. -
Viral Video: దున్నపోతుతో యవ్వారం.. దెబ్బకు గాల్లో ఎగిరి పడ్డారు..
చాలా మంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంటారు. మనం ఏం చేసినా అది మనకు తప్పక తిరిగి వస్తుందని భావిస్తుంటారు. ఎవరికైనా మంచి చేసినా లేదా హాని తలపెట్టినా దాని ఫలితం తప్పక అనుభవిస్తామని గట్టిగా నమ్ముతారు. అచ్చం ఇలాగే కొంత మంది తాము చేసిన ఘనకార్యానికి తక్షణ కర్మను ఎదుర్కొన్న ఘటన తాజాగా చోటుచేసుకుంది. భారత అటవీశాఖ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విటర్లో మార్చి 28న షేర్ చేసిన ఓ వీడియో తాజాగా నెట్టింట్లో వైరల్గా మారింది. ఇందులో అయిదుగురు వ్యక్తులు దున్నపోతు మీద కూర్చొని రోడ్డు మీద సవారీ చేస్తున్నారు. వీళ్లు రోడ్డుపై బైక్పై, గుర్రం మీద వెళుతున్న మరికొంతమందితో పోటీపడి రైడ్ చేస్తున్నారు. పక్కన వెళుతున్న వారు హారన్లు కొడుతూ ముందుకు దూసుకు వెళ్తుండటంతో.. దున్నపోతు కూడా వేగంగా వెళ్లాలని దాని మీద ఉన్న వ్యక్తులు దున్నపోతును రెండు దెబ్బలు వేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. చదవండి: భయానక వీడియో.. మహిళ చెవిలోకి దూరిన పీత.. ఎలా బయటకు తీశారంటే.. దెబ్బలు తిన్న దున్నపోతు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కుడివైపుకు తిరిగింది. బండి చక్రాలలో ఒకటి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో బండి మీదున్న అయిదుగురు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై ఎగిరిపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జంతువులను చిత్ర హింసలు పెడితే తగిన శిక్ష అనుభవిస్తారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ‘ఈ వీడియో మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది. నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ ముగింపు ఇది. కర్మ తిరిగి పొందారు’ అని కామెంట్లు చేశారు. Karma 🙏 (Watch till the end) pic.twitter.com/4ixpQ7Z5xO — Susanta Nanda IFS (@susantananda3) March 28, 2022 -
Viral Video: భయంతో చెట్టెక్కిన సింహం... ఏ మాత్రం పట్టు తప్పినా అంతే!
Lion Hangs From A Tree: జంతువులకు సంబంధించిన రకరకాల వీడియోలను చూశాం. క్రూరమృగాలైన సైలెంట్గా ఉన్నాయని వేలాకోళం చేసి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు కోకొల్లలు. అయితే ఒక్కోసారి ఆ క్రూరమృగాలు కూడా టైం బాగోకపోతే చిన్న జంతువులకు భయపడాల్సిందే. చలి చీమల చేత చచ్చిన పాము మాదిరిగా ఉంటుంది. అచ్చం అలాంటి ఘటనే ఒక అడవిలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...సింహాలను అడవికి రాజు అంటారు . అలాంటి సింహాన్ని చూసి ఏ జంతువైన భయంతో పరిగెడుతుంది. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా సింహమే భయంతో చెట్టెక్కింది. అసలేం జరిగిందంటే.. అడవి గేదేల మందను చూసి సంహం ఒక్కసారిగి బిత్తరపోయి భయంతో పారిపోయేందుకు ప్రయత్నించింది. పైగా అక్కడకు దగ్గరలో ఉన్న చెట్టెక్కి బిక్కుబిక్కు మంటూ వేలాడుతూ ఉంది. కానీ అక్కడ ఉన్న గేదెల మంద ఆ సింహ ఎప్పుడూ కిందకు దిగుతుందా అన్నట్లుగా ఆ చెట్టు చుట్టూ చేరి చూస్తున్నాయి. ఈ ఘటకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by wild animal shorts (@wild_animal_shorts_) (చదవండి: ఉక్రెయిన్ ఉక్కు వీరులు!.. ఒట్టి చేతులు.. వాటర్ బాటిల్తో బాంబులు నిర్వీర్యం) -
దున్నపోతు వీరంగం.. రైల్వేగేటునే లేపేసింది
సాక్షి, కరీంనగర్: పెద్దపల్లిలో కునారం రైల్వేగేటు వద్ద దున్నపోతు వీరంగాన్ని సృష్టించింది. దున్నపోతు రైల్వేగేటు సమీపంలో చేరుకొని గేటు దాటి అవతలివైపుకి వెళ్తుంది. ఈ క్రమంలో.. సిగ్నల్ పడటంతో రైల్వే కీపర్ గేటును కిందకుదించాడు. దీంతో ఆగ్రహించిన దున్నపోతు.. తన బలం మొత్తాన్ని రైల్వేగేటుపై చూపించింది. అంతటితో ఆగకుండా తన బలమైన కొమ్ములతో రైల్వేగేటును పైకి ఎత్తేసి, వంగిపోయేలా చేసింది. దీంతో కాల్ప శ్రీరాంపూర్, జమ్మికుంట వెళ్లే రహదారిని తాత్కాలికంగా నిలిపేశారు. దీంతో.. ఆమార్గం గుండా వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: మాజీ సీఎం భార్య, కుమార్తెకు కరోనా -
దున్నపోతు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
సాధారణంగా కొన్ని సందర్భాల్లో సాటి మనుషులే.. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు మనకేందుకులే అని వదిలేస్తారు. అయితే, ఒక మూగ జీవి మాత్రం ఆపదలో ఉన్న సాటి జీవికి సహయం చేసి మనుషులు తమ ప్రవర్తనను మార్చుకోవాలనే సందేశాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా, దున్నపోతులు కొన్ని సందర్భాల్లో కోపంగా ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో వాటికి ఎదురుగా ఎవరున్నా కోపంతో పైకి ఎత్తి కిందపడేస్తాయి. కొన్ని చోట్ల దున్నపోతుల పోటీలను నిర్వహిస్తుంటారు. వీటిలో వాటిని ఎరుపు వస్త్రం చూపించి, దాన్ని రెచ్చగొట్టేలా చేసి.. లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ ఆటలో ఒక్కొసారి అనుకొని సంఘటనలు చోటు చేసుకున్నవిషయం మనకు తెలిసిందే. అయితే, ఇక్కడ మాత్రం.. ఒక దున్నపోతు తనకు ఎదురుగా ఉన్న ఒక జీవిని.. కోపంగా కుమ్మకుండా ప్రశాంతంగా దాని ప్రాణాలను కాపాడింది. వివరాలు.. ఈ వీడియోలో ఒక నలుపు రంగు దున్నపోతు, దాని ముందు ఒక తాబేలు ఉన్నాయి. పాపం.. తాబేలు ఇసుకలో నడుచుకుంటూ వెళ్లి బోర్లాపడింది. ఎంత ప్రయత్నించిన పైకి లేవలేకపోయింది. అప్పుడు ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. దీన్ని గమనించిన ఒక దున్నపోతు.. వెంటనే అక్కడికి వెళ్లి తన కొమ్ములతో తాబేలుకు ఆనించి.. పైకి లేచేలా చేసింది. దీంతో ఈ సంఘటనను చూస్తున్న అక్కడి వారంతా అభినందిస్తు కేకలు వేశారు. అయితే, దీన్ని గతంలో మనస్కామ్రాన్ అనే టిక్ టాక్ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. కొందరు మనుషుల కంటే నోరులేని జీవాలే నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. Buffalo saved a tortoise by flipping him over.. 🎥 IG: sanamkamran pic.twitter.com/DpHAbsk2eA — Buitengebieden (@buitengebieden_) December 16, 2021 -
Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం!
నర్సీపట్నం: పాడి గేదె అమ్మకం.. కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం చివరకు ఒకరి మృతికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టానికి చెందిన భీమిరెడ్డి నూకరాజు రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని కృష్ణాపురానికి చెందినబర్ల అప్పారావు వద్ద గేదెను రూ.49 వేలకు కొనుగోలు చేశాడు. అడ్వాన్సుగా రూ.20 వేలు చెల్లించి, మిగతా మొత్తం మూడు రోజుల తరువాత ఇస్తానని చెప్పి గేదెను తీసుకువెళ్లాడు. మూడు రోజులు తరువాత రూ.29 వేలు ఇవ్వలేదు. గేదె కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన బలిఘట్టానికి చెందిన శెట్టి వెంకటరమణను వెంటబెట్టుకుని అప్పారావు డబ్బులు అడిగేందుకు నూకరాజు ఇంటికి వెళ్లాడు. తీసుకువచ్చిన మరుసటి రోజు నుంచే మేత తినటం లేదని గేదె ను తోలుకు పొమ్మని నూకరాజు అన్నాడు. నూకరాజు, అప్పారావు మధ్య డబ్బులు విషయంలో గీజులాడుకుంటున్నారు. మధ్యవర్తి వెంకటరమణ కలుగజేసుకుని ఇవ్వాల్సిన రూ.29 వేలలో రూ. 2 వేలు తగ్గించి రూ.27 వేలు అప్పారావుకు ఇవ్వాలని, లేకుంటే రూ. 2 వేలు తగ్గించి రూ.18 వేలు ఇస్తాడు నువ్వైనా తీసుకోమని నూకరాజుకు చెప్పాడు. తాను ఇచ్చిన రూ.20 వేలలో పైసా తగ్గించిన తీసుకోనని నూకరాజు భీష్మించాడు. దీంతో మధ్యవర్తి, నూకరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో క్షణికావేశంలో నూకరాజు కర్రతో వెంకటరమణ తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. వెంటనే వెంకటరమణను ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరతలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు రిఫర్ చేశారు. విశాఖకు తరలిస్తుండగా వెంకటరమణ మార్గం మధ్యలో మృతి చెందాడు. దీనిపై హత్యగా కేసు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
గేదెలపై పెద్దపులి పంజా
కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో రెండు రోజులుగా పులి బీభత్సం సృష్టిస్తోంది. ఈ మేరకు మండలంలోని ఒడిపిలవంచ సమీపంలో ఓ ఆవుదూడను చంపిన పెద్దపులి.. తాజాగా ఆ గ్రామానికి సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతంలో గేదెల గుంపుపై దాడి చేసి దున్నను ఎత్తుకెళ్లింది. గుమ్మాళ్లపల్లికి చెందిన ఓదేలు అనే పశువుల కాపరి అదే గ్రామానికి చెందిన పలువురు రైతుల గేదెలను మేత కోసం సమీపంలోని వీరాపూర్ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. గేదెలు మేత మేస్తున్న క్రమంలో హఠాత్తుగా పులి గేదెల గుంపుపైకి దూసుకువచ్చినట్లు పశువుల కాపరి తెలిపాడు.పులి దాడిని గమనించి ఓదేలు భయంతో గ్రామంలోకి పరుగులు తీశాడు. జరిగిన సంఘటనపై ప్రజాప్రతినిధుల ద్వారా అటవీశాఖ అధికారులు, పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు. డీఎస్పీ బోనాల కిషన్, సీఐ రంజిత్రావు, ఎఫ్డీఓ వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో స్వాతి సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గేదెల మందలోనుంచి రాజయ్య అనే రైతుకు చెందిన దున్నపోతును పులి ఎత్తుకెళ్లినట్లు ఓదేలు చెప్పాడు. ఘటనా స్థలంలో రక్తం మరకలు, పులి పాదాల గుర్తులను అధికారులు సేకరించారు. పులి ఆచూకీని గుర్తించడానికి అటవీశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఎవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని డీఎస్పీ బోనాల కిషన్, అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. -
వింత ఘటన: గేదె పాలు ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు.. 4 గంటల తర్వాత
భోపాల్: అప్పుడప్పుడు సినిమాల్లో కొన్ని కామెడీ సనిమాల్లో మా ఇల్లు తప్పిపోయిందని, ఓ చిన్న పిల్లాడు తన పెన్సిల్ దారిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సన్నివేశాలను మనం చూసుంటాం. ఈ తరహాలోనే తాజాగా ఓ వ్యక్తి తన గేదె పాలు ఇవ్వడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లోని బింద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బాబూలాల్ జాతవ్ (45) అనే గ్రామస్థుడు శనివారం నయాగావ్ పోలీస్ స్టేషన్కు తన గేదెను తీసుకెళ్లాడు. పోలీసులతో తన గేదె కొన్ని రోజులుగా పాలు ఇవ్వడం లేదని, పాలు కూడా తనని పితకనివ్వడం లేదని తెలిపాడు. తన గేదెకు గ్రామంలో ఎవరో చేతబడి చేశారని, అందుకే పాలు ఇచ్చేందుకు అది నిరాకరిస్తోందని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు ఇచ్చిన నాలుగు గంటల తర్వాత ఆ రైతు మళ్లీ తన గేదెతో పోలీస్స్టేషన్కు చేరుకుని మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు. తన గేదె పాలు ఇచ్చేలా తనకు సహాయం చేయాలని కోరాడు. దీంతో పోలీసులకు అతనికి ఒక పశువైద్యుడి వద్దకు ఆ గేదెను పంపారు. చివరకు తన గేదె పాలు ఇవ్వడంతో ఆదివారం ఉదయం పోలీసుల వద్దకు వెళ్లి అతను ధన్యవాదాలు తెలిపాడు. కాగా ఆ వ్యక్తి తన గేదెతో పోలీస్స్టేషన్కు వెళ్లిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ‘చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతకడం అంటే ఇదే’ అని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనని వారికి థాంక్స్ చెప్తున్నారు. చదవండి: వైరల్: సరదా తీర్చిన యువతి ఫోట్షూట్.. సరిపోయిందా.. ఇంకా కావాలా? -
గేదెపై వచ్చి మరీ అభ్యర్థి నామినేషన్.. ఎందుకంటే?
పాట్నా: పంచాయతీ ఎన్నికలతో బిహార్ రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. ఇప్పటికే ఆర్జేడీ యువ నాయకుడు తేజస్వి యాదవ్ ఓ గ్రామంలో మహిళలకు డబ్బులు పంచుతున్న వీడియో తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ అభ్యర్థి పెరుగుతున్న పెట్రోల్ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. ఊరేగింపుగా గేదెపై వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. చదవండి: రజనీకాంత్ స్టైల్లో మంత్రి హరీశ్రావు డ్యాన్స్ కఠియార్ జిల్లా హసన్గంజ్ పంచాయతీలోని రామ్పూర్ గ్రామస్తుడు మహ్మద్ ఆజాద్ ఆలం. ఓ పాడి రైతు. పాడి పశువులను పెంచి పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో సోమవారం నామినేషన్ వేసేందుకు గేదెపై వెళ్లాడు. అలా ఎందుకు వెళ్లాడని ఆరా తీస్తే.. ‘పెట్రోల్ ధరల పెరుగుదల’ కారణంగా చెప్పాడు. చదవండి: అమ్మా దొంగా ఇక్కడున్నావా? చిన్నారి బిస్కెట్ దొంగతనం వైరల్ ‘పెరుగుతున్న పెట్రోల్ ధరలు నేను భరించలేకపోతున్నా. నేను పాడి రైతును. నేను గేదెపై మాత్రమే ప్రయాణించగలను’ అని అభ్యర్థి ఆలం మీడియాకు తెలిపాడు. అయితే పోటీ చేస్తున్న స్థానం నుంచి గెలిస్తే ఏం చేస్తాడో కూడా చెప్పాడు. గెలిస్తే తాను వైద్య రంగంపై దృష్టి సారిస్తానని ఆలం చెప్పాడు. కాగా బిహార్లో 11 దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న చివరి దశ జరగనుంది. #WATCH | Bihar Panchayat Polls 2021: Azad Alam, a candidate from Katihar district's Rampur panchayat arrived to file his nomination on a buffalo yesterday pic.twitter.com/CBIF0bbqPl — ANI (@ANI) September 13, 2021 -
బైక్ పై వెళ్తున్న దంపతులపై అకస్మాత్తుగా దూసుకెళ్లిన గేదె
పూణే: ఒకోసారి ప్రమాదం అనేది ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో అస్సలు ఊహించలేం. ఏమీ చెయ్యకుండా ఇంట్లోనే కూర్చున్నా కూడా అకస్మాత్తుగా జరిగే ప్రమాదాలతో ఊహించని నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇక తాజాగా అలాంటి సంఘటనే మహారాష్ట్రలోని పూణేలో జరిగింది. దానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జుబేర్ షేక్ అనే వైద్యుడు తన భార్యతో కలిసి పూణేలోని ఖడ మార్కెట్ ప్రాంతంలో బైక్ మీద వెళ్తున్నాడు. అదే సమయంలో అబ్దుల్ రజాక్ అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి తన గేదెలను తీసుకెళ్లున్నాడు. అప్పటి వరకు అంతా బాగానే ఉన్నా ఊహించని ఘటనతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. షాపింగ్ పూర్తి చేసుకుని బైక్పై వెళ్తున్న వైద్యుడిపైకి ఒక గేదె దూసుకెళ్లి తన కొమ్ములతో దాడి చేసింది. దీంతో బైక్పై నుంచి భార్యాభర్తలిద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో వైద్యుడు జుబైర్ చేతి వేళ్లు విరిగిపోయాయి. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఇదే విషయంపై జుబైర్ దంపతులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆదారంగా విచారణ కొనసాగించారు. రద్దీ ప్రాంతంలోకి గేదెలను తీసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యారంటూ రజాక్, అతడి సోదరులు సదాకత్, నదాఫత్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదంలో గాయపడ్డ దంపతులకు నష్ట పరిహారం చెల్లించాలని పోలీసులు రజాక్ మరియు అతని సోదరులకు తెలిపారు. ఇక ఈ సంఘటణకు సంభందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
ఆదిలాబాద్ : దున్నపోతుతో దుక్కి దున్నుతున్న రైతు
-
వైరల్: సింహాల బారి నుంచి తన బిడ్డను ఎలా కాపాడుకుందో చూడండి
ప్రపంచంలో ప్రేమకు వెలకట్టలేం. అందుకే ప్రేమకు చిహ్నంగా ఏర్పడ్డ తాజ్మహల్ చరిత్రలో చిరస్థాయిగా తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక తల్లి ప్రేమ విషయానికొస్తే వర్ణించడానికి మాటలు రావు, అంతెందుకు కవులకు సైతం వారి కలంలో సిరా సరిపోదు. ఎందుకంటే తన బిడ్డ కోసం ఆ తల్లి పడే తపన, తాను చేసే త్యాగాలు అలాంటివి మరి. ప్రస్తుతం ఈ వీడియో చూస్తే ఈ మాటలకు సరిగ్గా సరిపోతాయని అనిపిస్తోంది. మనుషుల్లోనైనా, జంతువులైనా తల్లి చూపించే ప్రేమ మారదని ఈ వీడియో నిరూపిస్తుంది. సుశాంత నందా అనే ఐపీఎస్ అధికారి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్గా మారి హల్ చేస్తోంది. ఆ వీడియాలో.. అడవిలో ఓ గేదే తన బిడ్డతో కలసి వెళ్తుండగా అకస్మాత్తుగా ఓ సింహాల గుంపు వాటి పై దాడి చేసింది. ఆ దాడిలో ఓ సింహం గేదే పిల్లను నోటితో పట్టుకుని పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లింది. సాధారణంగా సింహాలతో గేదేలు పోరాడిన ప్రాణాలతో బయట పడలేవు. కానీ ఇక్కడ అన్ని సింహాలున్న గేదే బెదరక తన బిడ్డ కోసం వాటితో పోరాడింది. చివరకు వాటి నోటి నుంచి తన బిడ్డ ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ వీడియా చూసిన నెటిజన్లు తల్లి ప్రేమంటే ఇదే కదా అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Mother’s courage👌 Shared by NIFL pic.twitter.com/V7kjvOLv5f — Susanta Nanda IFS (@susantananda3) June 8, 2021 చదవండి: పాముకు ఊపిరి ఊది ప్రాణం నిలిపిన యువకుడు, వీడియో వైరల్ -
అమ్మ బాబోయ్.. కాపాడండయ్యా నన్ను!
అడవికి రారాజు సింహమే. కానీ, అవతలి నుంచి గుంపుగా వస్తే ఆ సింహాం కూడా తోక ముడవాల్సిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి కెన్యా మసాయి మారా సఫారీలో జరిగింది. నాలుగు సింహాలు.. పక్కనే ఉన్న జింకలను వదిలి.. మందగా ఉన్న అడవి దున్నల మీద కన్నేశాయి. అయితే అది గమనించిన అడవి దున్నలు ఒక్కసారిగా వాటి మీదకు ఉరుకులు తీశాయి. మూడు సింహాలు పారిపోగా.. ఒకటి మాత్రం ఆ దున్నల మధ్య ఇరుక్కుపోయింది ప్రాణ భయంతో పరుగులు తీసిన ఆ మృగరాజు.. అక్కడే ఉన్న ఓ చెట్టు మీదకు ఎక్కేందుకు ప్రయత్నించింది చాలా సేపు ఇబ్బంది పడ్డాక ఎట్లాగోలా పైకి చేరుకుంది కానీ, 500 దాకా ఉన్న అడవి దున్నలు మాత్రం ఆ సింహం చుట్టూ రౌండప్ చేశాయి కొన్ని గంటలపాటు చెట్టుమీదే ఉన్న సింహం.. చీకటి పడ్డాక దున్నలు వెళ్లిపోవడంతో దిగింది నార్వేకు చెందిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఓల్వ్ థోక్లే(54) ఈ రసవత్తరమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధించారు. -
అరుదైన దృశ్యం: రోడ్డుపై అడవి దున్న
వాజేడు(ములుగు) : సాధారణంగా అడవి దున్నలు జనారణ్యంలోకి రావు. కానీ మంగళవారం ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు వద్ద ఓ అడవి దున్న(కారు బర్రె) రోడ్డుపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. ఇక్కడి అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అడవి దున్న ఆనవాళ్లు కనిపించలేదు. అయితే, ఈ బర్రె ధర్మవరం అటవీ ప్రాంతం వైపు నుంచి చెరుకూరు సమీపంలో జాతీయ రహదారి మీదుగా ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న గుట్టల వైపు వెళ్లిందని స్థానికులు తెలిపారు. ఇది రహదారి దాటుతున్నప్పుడు వాహనదారులు తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. -
వైఎస్సార్ జిల్లాలో కారు ప్రమాదం
సాక్షి, వైఎస్ఆర్ జిల్లా: ఆల్విన్ ఫ్యాక్టరీ సమీపంలో బర్రెను ఢీకొని స్కార్పియో వాహనం పల్టీ కొట్టింది. ఆదోని నుంచి తిరుమలకు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో 8 మంది ఉన్నారు. వీరిలో ఒకరు దుర్మరణం చెందారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పొద్దుపొద్దున్నే ఛేజింగ్, కాల్పులు -
ఫస్ట్ కారు కొన్నపుడు కూడా ఇలా లేదు : సోనూసూద్
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి సంక్షోభం సమయం నుంచి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే పనిగా సాగిపోతున్ననటుడు సోనూసూద్ మరసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజాగా బిహార్ వరదల్లో నష్టపోయిన కుటుంబానికి కొండంత అండగా నిలిచారు. అంతేకాదు తన జీవితంలో తొలిసారిగా కారు కొనుక్కునప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదంటూ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. బిహార్ చంపారన్ లోని భోలా గ్రామానికి చెందిన ఒక కుటుంబం, కన్న కొడుకుని, కుటుంబ ఏకైన ఆదాయ వనరు అయిన గేదెను కోల్పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సోనూసూద్ యుద్ధ ప్రాతిపదకన స్పందించారు. తక్షణమే వారికి ఒక కొత్త గేదె అందేలా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, వీరి కోసం కొత్త గేదెను కొంటున్నపుడు కలిగిన ఆనందం తన తొలి కారు కొన్నపుడు కలగలేదంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తాను బిహార్ వచ్చినపుడు ఈ గేదె ఒక గ్లాసు తాజా పాలు తాగుతానంటూ ట్వీట్ చేశారు. (కన్నీళ్లు తుడుచుకో చెల్లి : సోనూసూద్) మరో ఘటనలో క్వారంటైన్ నిబంధనలతో హోటల్ లో చిక్కుకున్న ఫ్యామిలీకి కూడా సోనూసూద్ అండగా నిలిచారు. కరోనా నెగిటివ్ వచ్చినా తరువాత కూడా 3 సంవత్సరాల కుమార్తెతో సింగ్రౌలిలోని హోటల్లో ఉండిపోయామని, సాయం చేయమంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర శిశు మహిళా శాఖను ఉద్దేశించి నిఖితా హరీష్ ట్వీట్ చేశారు. కరోనా పాజిటివ్ రావడంతో 60 రోజుల నవజాత శిశువుతో పాటు తన భార్యను ఆసుపత్రికి తరలించారన్నారు. బెంగతో తన చిన్నారి తిండి కూడా తినడం లేదని ఎలాగైనా తమకు ఇంటికి చేర్చాలంటూ అభ్యర్థించారు. మరో గంటలో మీరు ఇంటికి బయలుదేరబోతున్నారు. బ్యాగులు సర్దుకోమంటూ సోనూ సూద్ వారికి భరోసా ఇచ్చారు. అన్నట్టుగానే హరీష్ సంతోషంగా ఇంటికి చేరడం విశేషం. అంతేనా..సోనూ సూద్ ట్విటర్ ను పరిశీలిస్తే..ఇలాంటి విశేషాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. మీరు దేవుడు అంటూ సహాయం పొందిన వారి కృతజ్ఙతా పూర్వక కన్నీళ్లు ఉంటాయి. కానీ ఆయన మాత్రం తాను మానవమాత్రుడినే అంటారు. I was not as excited buying my first car as I was excited buying a new buffalo 🐃 for you. Will drink a glass of fresh buffalo milk when I come to Bihar. ❤️ https://t.co/6I6azJZ3gZ — sonu sood (@SonuSood) August 21, 2020 You will be leaving for your home in next one hour. Pack your bags. 🙏 https://t.co/2PLbK5tVJc — sonu sood (@SonuSood) August 20, 2020 So grateful to see my daughter smiling again 🙏 @SonuSood pic.twitter.com/umTS9sWnQc — nikhithaharish (@nikhithaharish) August 20, 2020 -
ఆకతాయిలపై గేదె ప్రతీకారం!
-
వైరల్.. ఆకతాయిలపై గేదె ప్రతీకారం!
మూగ జీవాలు అని కూడా చూడకుండా క్రూరంగా ప్రవర్తించిన ఆకతాయిలకు ఓ గేదె తగిన బుద్ధి చెప్పింది. కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై రెండు బండ్లకు గేదెలను కట్టి పోటీ పడ్డారు. సామర్థ్యానికి మించి బండ్లపై ప్రయాణిస్తూ వాటిని హింసించారు. వేగంగా వెళ్లే క్రమంలో వాటిని అతి దారుణంగా కొట్టారు. అయితే కొద్దిదూరం వెళ్లాక.. అందులో ఓ గేదె బండిని డివైడర్కు తగిలేలా చేయడంతో అది కాస్తా బోల్తా పడింది. దీంతో అందులోని ఆకతాయిలు కిందపడిపోయారు. దీంతో ఆ బర్రె అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.‘గేదె ప్రతీకారం.. జంతువులను గుర్తించండి’ అని పేర్కొన్నారు. ప్రవీణ్ కస్వాన్ ఆ వీడియో షేర్ చేసిన కొద్దిసేపటికే అది వైరల్గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై స్పందించిన పలువురు నెటిజన్లు.. అటువంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు చోటుచేసుకుందనే దానిపై స్పష్టత లేదు. -
లంచం అడిగిన తహసీల్దార్కు ఊహించని షాక్
భోపాల్ : లంచం అడిగిన తహసీల్దార్కు ఓ మహిళ ఊహించని షాక్ ఇచ్చింది. లంచంగా తన ఇంటిలో ఉన్న గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. వివరాలు..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ ..పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ పని కావాలంటే రూ. 10వేలు లంచం ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయ అధికారులు అడిగారు. దీంతొ సదరు మహిళ అప్పు చేసి మరీ రూ.10వేలు లంచం అప్పజెప్పింది. అయినప్పటికీ ఆమె పని కాలేదు. కొద్దిరోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి ఆరా తీసింది. ఇంకా పని కాలేదని, మ్యుటేషన్ చేయాలంటే మరో రూ.10వేలు లంచంగా ఇవ్వాలన్నారు. లంచం ఇచ్చేందుకు డబ్బులు లేకపోవడంతో తన గేదెను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్ చేయాలని కోరింది. లంచం అడిగిన విషయం అందరికీ తెలియడంతో తహసీల్దార్ అధికారులు ఆందోళన చెంది.. అసలు నిన్ను లంచం ఎవరు అడిగారు అంటూ ఆ మహిళపై కోపగించుకున్నారు. అంతేకాదు నాలుగు రోజుల కిత్రమే మహిళ పేరున మ్యుటేషన్ చేశామని , తమను అల్లరి చేసేందుకే మహిళ కుట్ర పన్ని కార్యాలయానికి గేదెను తెచ్చిందని ఎమ్మార్వో వివరణ ఇచ్చారు. కాగా, మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని ఎమ్మారో కార్యాలయ అధికారులు తెలిపారు. -
‘అంత ఇచ్చుకోలేను సారూ.. ఈ గేదెను తీసుకెళ్లండి’
భోపాల్: సాధరణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే ఏ పని జరగదనేది జనమేరిగిన సత్యం. ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో కొద్దోగొప్పో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు ఉన్నదే ప్రజలకు సేవ చేయడం కోసం అనే విషయాన్ని జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సామాన్యుల ఆలోచనలో కూడా మార్పు వచ్చింది. దాంతో లంచాలు అడిగే ఆఫీసర్లకు తగిన విధంగా బుద్ధి చెప్తున్నారు. ఇలాంటి ఓ సంఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పాతికవేలు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారికి తగిన గుణపాఠం చెప్పాడో రైతు. వివరాలు.. విదిషా ప్రాంతం సిరోంజ్ జిల్లాకు చెందిన భూపేంద్ర సింగ్కు, ఇతర కుటుంబ సభ్యులతో భు వివాదాలు తలెత్తాయి. వాటిని పరిష్కరించుకోవడం కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సిద్ధార్థ సింగాల్ అక్కడ తహసీల్దార్గా పని చేస్తున్నాడు. భూపేంద్ర సమస్య తెలుసుకుని, దాన్ని పరిష్కరించాలంటే రూ. 25 వేలు లంచం ఇవ్వాలన్నాడు. అందుకు భూపేంద్ర పేదవాడిని అంత సొమ్ము ఇవ్వలేనని ప్రాధేయపడ్డాడు. కానీ సిద్ధర్థ మనసు కరగలేదు. ఇలా గత 6 నెలలుగా భూపేంద్ర తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. కానీ పని మాత్రం కావడం లేదు. తహసీల్దార్ ప్రవర్తనతో విసిగిపోయిన భూపేంద్ర రెండు రోజుల క్రితం తన గేదెను తీసుకువచ్చి సిద్ధార్థ కారుకు కట్టేశాడు. ఆశ్చర్యపోయిన జనాలు ఎందుకిలా చేశావని ప్రశ్నించగా.. అధికారులు కోరిన లంచం ఇవ్వలేనని.. తన గేదెను తీసుకెళ్లమని చెప్పాడు. విషయం కాస్త బయటకు పొక్కడంతో తహసీల్దార్ సిద్ధార్థ కాళ్ల బేరానికి వచ్చాడు. లంచం వద్దు ఏం వద్దు గేదెను తీసుకెళ్లాల్సిందిగా భూపేంద్రను కోరాడు. కానీ భూపేంద్ర ముఖ్యమంత్రి, జిల్లా అధికారికి ఓ మెమరాండం అందజేసిన తర్వాతే గేదెను ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం కాస్తా మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు స్పందిచారు. సిద్ధార్థపై వచ్చిన ఆరోపణలు పరిశీలించి.. తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు
లక్నో : సాధారణంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, హత్యలు, హత్యాచారాలు లాంటి కేసులు నమోదు అవుతుంటాయి. వీటిల్లో ఏదో ఒక కేసు దాదాపు ప్రతి నాయకుడిపై ఉంటుంది. ప్రస్తుత రాజకీయాల్లో అది సర్వసాధారణం కూడా. కానీ ఓ ఎంపీపై వెరైటీగా దొంగతనం కేసు నమోదు అయింది. అది కూడా ఓ విచిత్రమైన దొంగతనం. ఆ ఎంపీ కోట్ల కొద్ది డబ్బులో లేదా తులాల కొద్ది బంగారమో దోపిడీ చేశాడని కేసు నమోదు కాలేదు. కేవలం ఓ గేదెను దొంగిలించాడని ఎంపీపై కేసు పెట్టారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర ప్రదేశ్లోని రాంపూర్లో చోటు చేసుకుంది. ఇక కేసు నమోదు అయిన ఎంపీ ఎవరో కాదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తలో నిలిచే సమాజ్వాదీ పార్టీ ఫైర్ బ్రాండ్, రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్. ఇప్పటికే భూకబ్జా, ల్యాండ్ మాఫియా ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్నఆజం ఖాన్కు తాజాగా ఈ విచిత్ర షాక్ తగలింది. ఎంజీ ఆజంఖాన్ రాంపూర్కు చెందిన అసిఫ్, జాకీర్ అనే వ్యక్తులు ఆజంఖాన్పై ఫిర్యాదు చేశారు. తన అనుచరులతో కలిసి 2016 అక్టోబరు 15న రాంపూర్లోని తమ ఇంటిని ఆజంఖాన్ ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న గేదెతో పాటు రూ.25 వేల నగదును సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇంటి స్థలాలన్ని ఇవ్వాలంటూ ఎంపీ అనచరులు తమపై దాడిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అజంఖాన్పైఎఫ్ఐఆర్ నమోదు చేశారు. .ఎంపీతో పాటుమరో 40 మంది గుర్తు తెలియని వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. కాగా ఎంపీ అజంఖాన్పై ఇప్పటికే భూకబ్జా, వక్ఫ్ ఆస్తుల స్వాధీనం, రెచ్చగొట్టే వ్యాఖలు చేశారంటూ 50 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 28 కేసులు అలియాగంజ్ రైతులు పెట్టినవే కావడం గమనార్హం. -
గేదె కడుపున పందిపిల్ల..?
సాక్షి, సిరిసిల్లఅర్బన్: రాజన్న సిరిసిల్లా జిల్లాలో వింత సంఘటన చోటు చేసుకుంది. సిరిసిల్ల పరిధిలోని చిన్నబోనాలలో గేదె(బర్రె) కడుపులో పంది ఆకారంలో జంతువు జన్మించింది. దీంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోసుకుల మల్లయ్య అనే రైతు ఆదివారం పశువుల అంగడిలో బాలమల్లు అనే రైతు వద్ద గేదెను కొనుగోలు చేశాడు. ఆ మరుసటి రోజే పంది ఆకారంలో ఉన్న దూడకు గేదె జన్మనిచ్చింది. వింత ఆకారంలో ఉన్న దూడను చూసేందుకు జనం తరలివచ్చారు. నెలలు నిండకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని గ్రామస్తులు చర్చించుకున్నారు. -
రెండు నెలల్లో 70 గేదెలు మాయం
సాక్షి, అచ్చంపేట(గుంటూరు) : గేదెలను అపహరిస్తున్న దొంగలను మండలంలోని పుట్లగూడెం గ్రామస్తులు పట్టుకుని బుధవారం పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రెండు మూడు నెలలుగా మండలంలో గేదెల దొంగతనాలు ఎక్కువయ్యాయి. రాత్రి సమయాలలో ఇళ్ల ముందు కట్టేసిన గేదెలను, పగటి పూట పొలాలు వెళ్లిన గేదెలు, ఆవులను కొంతమంది దొంగలించి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. పుట్లగూడానికి చెందిన సుమారు 15 గేదెలు గత రెండు నెలలకాలంలో మాయమయ్యాయి. రెండు మూడు రోజులుగా గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలన్న తపనతో కాపుకాసి రాత్రి గస్తీ తిరిగారు. మంగళవారం రాత్రి మినీలారీలో 4 గేదేలు తరలించడం చూసిన గ్రామస్తులు వారిని వెంబడించి చల్లగరిగ వద్ద అటకాయించారు. అవి అపహరించబడిన గేదెలుగా గుర్తించి అచ్చంపేట ఎస్ఐకి సమాచారం అందచేశారు. ఎస్ఐ తన సిబ్బంది సహాయంతో లారీని, గేదెలను, నిందితులను అచ్చంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. రెండు నెలల కాలంలో సుమారు 70కి పైగా గేదెలు అచ్చంపేట పరిసర గ్రామాల్లో చోరీకి గురయ్యాయి. అచ్చంపేట రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మరమెల ప్రసాదరావు, మార్టూరి నరసింహస్వామి, చిట్టేటి జాన్సీ అనే వారు తమ గేదెలు దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పట్టాభిరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బర్రెనమ్మారని.. గుండు గీశారు
చిన్నచింతకుంట (దేవరకద్ర): జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు తమ సొంత బర్రె (గేదె)తోపాటు దూడను స్నేహితుడి సహాయంతో విక్రయించాడు. వచ్చిన డబ్బుతో హైదరాబాద్కు వెళ్లి జల్సా చేద్దామనుకున్నాడు. ఇంతలో విషయం గ్రామంలో తెలియడంతో సర్పంచ్తోపాటు అధికార పార్టీ నాయకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పంచాయతీలో ఇద్దరు యువకులకు గుండు గీయించారు. అయితే అవమానంగా భావించిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం ముచ్చింతలలో శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా.. గ్రామానికి చెందిన సురేందర్రెడ్డి కుమారుడు మహేశ్వర్రెడ్డి అదే గ్రామానికి చెందిన రాఘవేంద్ర స్నేహితులు. ఇంటర్ వరకు చదివిన వీరు కుటుంబసభ్యులకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. అయితే మహేశ్వర్రెడ్డి జల్సాలకు అలవాటుపడి తరచూ తండ్రిని డబ్బులు ఇవ్వమని అడిగేవాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో స్నేహితుడు రాఘవేంద్ర సహాయంతో మహేశ్వర్రెడ్డి తాను మేపుతున్న పశువుల నుంచి ఓ బర్రె, దూడను తల్లిదండ్రులకు తెలియకుండా దేవరకద్ర సంతకు వెళ్లి రూ.33వేలకు విక్రయించారు. అనంతరం మహేశ్వర్రెడ్డి హైదరాబాద్ వెళ్లిపోయాడు. గ్రామానికి చేరుకున్న రాఘవేంద్రను మహేశ్వర్రెడ్డి తండ్రి సురేందర్రెడ్డి తన కొడుకు ఎక్కడ ఉన్నాడని అడగడంతో జరిగిన విషయం చెప్పాడు. ఈ విషయం గ్రామసర్పంచ్ హరిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హర్షవర్ధన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు మహేశ్వర్రెడ్డిని పిలిపించా రు. గురువారం రాఘవేంద్రను వెంట పెట్టుకుని వెళ్లి అమ్మిన బర్రె, దూడను గ్రామానికి తీసుకువచ్చారు. రాఘవేంద్ర తండ్రి వద్దంటున్నా.. శుక్రవారం గ్రామపెద్దలు, గ్రామస్తుల ఎదుట పంచా యతీ నిర్వహించి యువకులకు గుండు గీయించారు. దీంతో అవమానం భరించలేని రాఘవేంద్ర సూసైడ్ నోట్ రాసి వ్యవసాయ పొలంలోని విద్యు త్ ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పర్వతాలు తెలిపారు. -
వెటర్నరీ వర్సిటీ ముందే ప్రాణం విడిచిన గేదె
రాజేంద్రనగర్: అక్కడ మూగ జీవాలకు ప్రాణం పోసే ఆస్పత్రి ఉంది. దాని పక్కనే రాష్ట్రంలోని మూగ జీవాలకు సోకే రోగాలకు మందులను తయారు చేసే డాక్టర్ల బృందం ఉండే కార్యాలయమూ ఉంది. కానీ, అదే కార్యాలయం ముందు ఒక మూగ జీవం రోడ్డు ప్రమాదంలో గాయపడి నరకయాతన పడి మృతి చెందింది. పదుల సంఖ్యలో డాక్టర్లు, శాస్త్రవేత్తలు ఆ దారి గుండా వెళ్లారు తప్ప ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ప్రాణం పోసే ఆస్పత్రి ముందే ప్రాణం విడిచింది ఆ జీవి. వివరాలు.. రాజేంద్రనగర్ రేడియల్ రోడ్డు ప్రాంతంలో పీవీ నర్సింహారావు తెలంగాణ రాష్ట్ర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. ఇందుకు సంబంధించిన కళాశాల, ఆస్పత్రి, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రధాన రహదారిపైనే ఈ భవనాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఓ గేదెను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. తీవ్ర గాయాలకు గురైన ఆ గేదె.. డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ కార్యాలయం గేటు ముందే పడి విలవిల్లాడింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కొట్టుమిట్టాడి ప్రాణాలు విడిచింది. ఉదయం ఈ కార్యాలయానికి శాస్త్రవేత్తలు, డాక్టర్లు వచ్చారు తప్ప అక్కడే ఉన్న గేదెను మాత్రం పట్టించుకోలేదు. మూగ జీవాల ప్రాణాలు కాపాడాల్సిన శాస్త్రవేత్తలు, డాక్టర్లకు నిలయమైన వారి కార్యాలయం ముందే మూగ జీవి ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గేదె మృతిచెందిన ప్రాంతానికి కూతవేటు దూరంలో జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఉన్నా గేదె కళేబరాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. -
వైరల్: తిరగబడిన దున్నపోతు.!
కొందరు జీవితంలో చిన్న సమస్య వస్తేనే తల్లడిల్లుతారు. ఇక ఆ సమస్యకు మరింత కష్టం తోడైతే.. ఎదవ జీవితం ఎందుకురా! అని బలవన్మరణానికి పాల్పడుతారు. కానీ ఓ దున్నపోతు తన ప్రాణాలు కాపాడుకోవడానికి చేసిన పోరాటం.. చూపిన ధైర్యం ఇలాంటి వారికి ఓ గుణపాఠంగా నిలుస్తోంది. ఆ దున్న పోరాటంలో దెబ్బ మీద దెబ్బ పడినా.. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా చూపిన తెగువ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమయస్పూర్తితో వ్యవహరించి తన మీదకు వచ్చిన సింహాలనే పరుగెత్తించింది. ప్రస్తుతం ఆ దున్న పోరాటానికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్లో ఓ టూర్గైడ్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్గా మారింది. ఆ వీడియో ఏంటంటే.. ఓ సింహం. దున్నపోతును వెంటాడింది. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ దున్న పరుగెత్తుతూ.. నీటికుంటలోకి దూకింది. హమ్మయ్యా! ప్రాణాలు గట్టెక్కినట్టే అనుకొని ప్రశాంతంగా ఈదసాగింది. కానీ గాశారం బాగలేకుంటే అరటిపండు తిన్నా.. పళ్లు ఇరుగుతాయన్నట్లు.. ఆ దున్నకు మరో జఠిల సమస్య ఎదురైంది. సింహం నుంచి గట్టెక్కాంరా! నాయనా! అనుకుంటే మొసళ్లు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇదెక్కడి గోలరో నాయనా! అనుకుంటు ఆ దున్న వాటితో పోరాటం చేసింది. వాటిపైకి తిరగబడింది. ‘ఈ నీళ్ల కుంట కన్నా ఆ భూమి మీదికి వెళ్లడమే నయంరా! బాబూ..’ అనుకుంటూ ఎలాగోలా దున్న ప్రాణాలతో బతుకుజీవుడా అంటూ అందులో నుంచి బయటపడింది. కానీ అక్కడ సీన్ రివర్స్.. ఒక్క సింహం.. కాస్త రెండు, మూడు, నాలుగు సింహాలు ఇలా.. పెద్ద గుంపే అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు.. కొద్ది సేపు ఆగి.. ‘ఇక లాభం లేదు.. తిరగబడాల్సిందే’ అనుకుంది ఆ సింహాలపై ఎదురు దాడికి దిగింది. వాటిని కొద్ది దూరం పరుగెత్తించింది. ఈ గ్యాప్లో పరుగు లక్కించుకొని.. ఐకమత్యమే మహాబలం అన్నట్లు.. తన మిత్రులను గుంపు గుంపులుగా తీసుకొచ్చింది. సింహాలు వర్సెస్ దున్నలు అన్నట్లు సీన్ మారింది. దున్నల గుంపులను చూసిన సింహాలు భయంతో పరుగు లంకించుకున్నాయి..! సమయస్పూర్తితో పోరాటం చేసిన ఆ దున్న తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ వీడియో చూడటానికి ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
తిరగబడిన దున్నపోతు.!
-
జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చింది..ప్రాణం పోయింది..
సాక్షి, పెనుబల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. మండలంలోని పాతకుప్పెనకుంట్ల సెంటర్లోని జాతీయ రహదారిపై గురువారం ఇది జరిగింది. సత్తుపల్లికి చెందిన దారావత్ రత్నబాలు(27), షణ్ముఖ శ్రీనివాస్ కలిసి బైక్పై సత్తుపల్లి నుంచి వియంబంజర్ మీదుగా పెనుగంచిప్రోలు వెళుతున్నారు. మార్గమధ్యలోగల మండలంలోని పాత కుప్పెనకుంట్ల సెంటర్ వద్ద, ఓ గేదె ఒక్కసారిగా జాతీయ రహదారి పైకి పరుగెత్తుకొచ్చి, బైక్ను ఢీకొంది. ఆ వాహనం కింద పడిపోయింది. రోడ్డుపై షణ్ముఖ శ్రీనివాస్, రోడ్డు పక్కన దారావత్ రత్నబాలు పడిపోయారు. బైక్ వెనుకనే, కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ కొత్తగూడెం డిపో బస్సు వేగంగా వచ్చింది. అది అదుపుతప్పి, రోడ్డుపై ఉన్న గేదెను ఢీకొని, రోడ్డు పక్కన పడిపోయిన దారావత్ రత్నబాలు మీద నుంచి ముందుకెళ్లి ఆగింది. హెల్మెట్ ధరించిన తల పైకి బస్సు టైర్ ఎక్కింది. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. షణ్ముఖ శ్రీనివాస్కు గాయాలయ్యాయి. పెనుబల్లి ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించారు. ప్రమాద స్థలాన్ని వియంబంజర్ ఎస్సై తోట నాగరాజు పరిశీలించారు. పెనుబల్లి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం రత్నబాలు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
ముషీరాబాద్లో సదర్ దున్నపోతులు హల్చల్
-
పరుగో.. పరుగు
-
పరుగో.. పరుగు
సమస్యలను చూసి భయపడి పారిపోతే.. మరింత ఎక్కువగా తరుముతుంటాయి. అదే ఒక్కసారి ధైర్యం చేసి ఎదురుతిరిగితే.. చివరికి చావు కూడా మనిల్ని చూసి పారిపోతుందంటారు. సరిగ్గా ఇలానే జరిగింది ఓ చోట. ఆహారం కోసం తిరుగుతున్న ఆడ సింహానికి ఎదురుగా గేదెల మంద కనిపించింది. వాటిని చూడగానే సింహం అబ్బ ‘ఈ రోజు నా పంట పండింది.. ఒక వారానికి సరిపోను ఆహారం దొరికింది’ అని సంబరపడింది. గేదెల మందపై దాడి చేద్దామని భావించి అటుగా వెళ్లింది. అయితే సింహం రాక గమనించిన గేదెలు ఒక్కసారిగా పరుగందుకున్నాయి. తనను చూసి భయపడి పారిపోతున్న గేదెల వెనకాల పరిగెత్తింది సింహం. కానీ ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఒక గేదె సింహం వైపు దూసుకొచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోవడం సింహం వంతయ్యింది. వెంటనే తేరుకుని, కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకుంది. అంత సేపు గేదెలు తనను చూసి భయడటంతో తానే బలవంతురాలిని అనుకున్న సింహం, ఒక్క గేదె ఎదురుతిరిగే సరికి పారిపోయింది. జీవితం కూడా ఇంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోయే బదులు ఎదురుతిరిగితే.. అవే మనల్ని చూసి పారిపోతాయి అనే దానికి ఉదాహరణగా నిలిచింది ఈ వీడియో. -
కాస్త తీయం‘డబ్బా’..!
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల :ఎరక్కపోయి తలపెట్టి ఇరుక్కుపోయిందిఈ గేదె. ద్వారకాతిరుమల తూర్పువీధిలో సోమవారం కనిపించిన ఈ దృశ్యాలుస్థానికులను కాసేపు ఆందోళనకు గురిచేశాయి. కుడితి కోసం డబ్బాలో తలపెట్టినఈ గేదె.. ఇరుక్కుపోయింది. డబ్బా ఎంతసేపటికీ రాకపోవడంతో రోడ్డుపై హల్చల్ చేసింది. దీంతో స్థానికులు హడలెత్తిపోయారు. ఎవరూ డబ్బా తీసేందుకు సాహసించలేదు. ఆఖరికి ఇద్దరు యువకులు చాకచక్యంగాగేదె తల నుంచి డబ్బాను తీశారు. దీంతో బతుకు జీవుడా అంటూ గేదె పరుగులు పెట్టింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
గేదె కొమ్ములతో సింహాన్ని ఎత్తి కొట్టింది
-
ఎత్తి కొడితే.. ఎగిరి పడింది..
దక్షిణాఫ్రికా: ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మానవత్వం అనిపించుకుంటుంది. కానీ నేటి కాలంలో మానవత్వం మాట దేవుడెరుగు..! కనీసం ఇతరులకు కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఈ విషయంలో పశుపక్ష్యాదులు మినహాయింపు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే అవి స్పందిస్తాయి. సహాయం కోసం అర్థిస్తున్న వాళ్లకు చేయూతనందిస్తాయి. తక్షణం స్పందించి వాటికి తోచిన రీతిలో ఇతర మూగ జీవాలకు తోడుగా నిలుస్తాయి. సింహాల బారిన పడి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న ఓ భారీ సైజు బల్లిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఓ గేదె కాపాడింది. తుపాను వేగంతో అక్కడికి చేరుకుని ఆ సింహాల గుంపుని చెండాడింది. ఈ సంఘటన క్రూగర్ జాతీయ పార్కులో ఇటీవల చోటుచేసుకుంది. సింహాల గుంపు ఆ బల్లిని పీక్కు తినేందుకు సిద్ధమౌతున్న వేళ ఆ గేదె చాకచక్యంగా దాన్ని రక్షించింది. క్షణం ఆలస్యమైనా ఆ బల్లి ప్రాణాలు హరీమనేవే. అందుకనే కోపం పట్టలేని గేదె ఒక్క ఉదుటున బల్లిని తన కాలికింద తొక్కిపట్టిన సింహం మీదకి దుమికింది. అపాయం నుంచి బల్లి బయటపడగానే తన రెండు కొమ్ములతో ఆ సింహాన్ని ఎత్తి కొట్టింది. గాల్లో గింగిరాలు తిరుగుతూ కింద పడిన ఆ సింహం కుయ్యో, ముర్రో అంటూ అక్కడ్నుంచి జారుకోగా, మిగతా సింహాలు కూడా దాన్ని అనుసరించాయి. పార్కుని సందర్శిస్తున్న స్యూన్ ఎలోఫ్ అనే వ్యక్తి ఈ సాహస కృత్యాన్ని తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. -
గేదె మృతి : యువకుడి ఆత్మహత్య
పటాన్చెరు టౌన్: పాలిచ్చే గేదె కరెంట్ షాక్తో మృతి చెందింది. దాన్ని తట్టుకోలేక మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పటాన్చెరు మండలంలోని లక్డారం గ్రామానికి చెందిన పాశం విజయ్ కుమార్(21) ఐదు ఆవులు, ఐదు పాడి గేదెలు మేపుకుంటూ పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం ఆవులను, గేదెలను మేత కోసం రుద్రారం గ్రామ శివారులోని రాంనగర్ ప్రాంతంలోని సాయిపార్థ వెంచర్ భూముల వద్దకు తోలుకువెళ్లాడు. అక్కడ తెగిపడిన విద్యుత్ వైర్ గేదెకు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో విజయ్ కుమార్ తన అన్నయ్య అనిల్ కుమార్కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న అనిల్ గేదె మృతి విషయంలో దిగులు పడకు అని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో రాత్రి విజయ్కుమార్ ఎంత సేపటికీ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బంధువులు, తెలిసినవారి వద్ద వెతికినా లాభం లేకపోయింది. దీంతో శుక్రవారం ఉదయం సాయిపార్థ వెంచర్కు వెళ్లి చూడగా విజయ్కుమార్ అక్కడ ఓ చెట్టుకు తన వద్ద ఉన్న టవల్తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాలు ఇచ్చే గేదె మృతి చెందిందనే మనస్తాపంతో విజయ్ కుమార్(21) ఆత్మహత్య చేసుకొని మృతిచెందాడని అతడి అన్నయ్య అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
చేవెళ్ల మహరాజ్
చేవెళ్ల: హైదరాబాద్ నగరంలో ఐదు రోజుల పాటు నిర్వహించే సదర్ ఉత్సవాలకు చేవెళ్ల మహరాజ్(దున్నపోతు) సిద్ధమైంది. తెలంగాణ మహరాజ్గా జాతీయ స్థాయిలో ఖ్యాతిగాంచిన ఈ హరియాణా దున్నపోతు గతేడాది సదర్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే ఉత్సాహంతో ఈ ఏడాది కూడా ఉత్సవాల్లో పాల్గొనేందుకు రెడీ అయ్యింది. 2009లో పుట్టిన మహరాజ్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు పలుకుతున్నట్లు దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. ప్రపంచ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ఈ దున్నపోతు నాలుగుసార్లు విజేతగా నిలిచింది. 2011, 2012, 2016, 2017లో పోటీలకు హాజరై బహుమతులు గెలుచుకుంది. రాజభోగం.. మహరాజ్ ఆలనాపాలనా చూసేందుకు ముగ్గురు మనుషులు ఉన్నారు. మహరాజ్ను రోజూ 5 కిలోమీటర్లు వాకింగ్కు తీసుకెళతారు. మూడు సార్లు ఆయిల్ మసాజ్ చేస్తారు. మూడుసార్లు స్నానం చేయిస్తారు. వీర్యానికి భలే క్రేజ్.. మహరాజ్ వీర్యానికి విపరీతమైన క్రేజ్ ఉంది. గతేడాది నుంచే మహరాజ్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తున్నారు. ముర్రా జాతి దున్నపోతుల ఉత్పత్తికి ఈ వీర్యాన్ని వినియోగిస్తున్నారు. ఒక్క డోస్ వీర్యం ఖరీదు రూ.450. ప్రతి ఏటా మహరాజ్ నుంచి 30 వేల డోస్ల వీర్యాన్ని సేకరిస్తున్నారు. దీని విలువ సుమారు కోటిన్నర వరకు ఉంటుందని దాని యజమాని కోటేశ్వరరావు చెబుతున్నారు. జూనియర్ మహరాజ్లూ సిద్ధం దేశవాళీ పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా ఎన్కే పల్లి సమీపంలో డెయిరీని ఏర్పాటు చేశా. పదేళ్ల క్రితం 10 పశువులతో మొదలుపెట్టిన ఈ డెయిరీలో ప్రస్తుతం 150కి పైగా గేదెలు, ఆవులు ఉన్నాయి. సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పశుగ్రాసం మాత్రమే వీటి దాణాగా వినియోగిస్తా. బ్రీడింగ్ కోసం వివిధ జాతుల పశువులను పెంచుతున్నాం. మహరాజ్ కూడా ఇక్కడే పుట్టింది. మహరాజ్ సంతానంగా రెండు జూనియర్ మహరాజ్లు సిద్ధమవుతున్నాయి. – ఎం.కోటేశ్వరరావు, ‘మహరాజ్’యజమాని ప్రత్యేకతలివే.. పేరు : మహరాజ్ వయసు : 8 ఏళ్లు స్వస్థలం : చేవెళ్ల మండలం,ఎన్కేపల్లి గ్రామం యజమాని : ఎం.కోటేశ్వరరావు బరువు : 1,675 కిలోలు ఎత్తు : 6.2 అడుగులు మార్కెట్ విలువ : రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు రోజువారీ ఆహారం.. పాలు : 16 లీటర్లు ఖర్జూరం : 500 గ్రాములు బాదం, పిస్తా : 500 గ్రాములు (వారానికి రెండుసార్లు) ఉలవలు : 15 నుంచి 20 కిలోలు వీటితో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డి -
గేదె ఢీకొని ‘ఎయిర్ఫోర్స్’ కుమారుడి దుర్మరణం
కోదాడరూరల్ : గేదె ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల పరిధి మొగలాయికోటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎయిర్ఫోర్స్ వెంకటర్రెడ్డి కుమారుడు, స్థానిక రేషన్డీలర్ సింగారెడ్డి జితేందర్రెడ్డి(41) రాత్రి బుల్లెట్పై కోదాడకు వస్తుండగా గ్రామశివారులో గేదెను ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆటోలు కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోని ఖానాపురం వద్ద మృతిచెందాడు. మృతదేహాన్ని బుధవారం కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రెడ్డి కుటుంబంలో విషాదం ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వెంకట్రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ యన కు ఇద్దరు కుమారులు,కుమార్తె. 25ఏళ్ల క్రితం ఓ కుమారు డు కేన్సర్తో, ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో మరో కు మారుడు మృతిచెందడంతో విషాదం అలుముకుంది. -
పాల వెల్లువే లక్ష్యం
-
గేదెను చంపారని గోరక్షకుల దాడి
అలీగఢ్: గేదెను చంపారంటూ ఐదుగురిపై గోరక్షకులు దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో చోటుచేసుకుంది. పన్నా గంజ్కు చెందిన కాలూ బాఘేల్ అనే వ్యక్తి తన డెయిరీలోని వట్టిపోయిన ఒక గేదెను ఇమ్రాన్ అనే పశువుల వ్యాపారికి అమ్మాడు. దాన్ని కాలూ డెయిరీలోనే వధించేలా ఒప్పందం కుదిరింది. ఇమ్రాన్, మరో నలుగురు గేదెను వధిస్తుండగా రక్తం డెయిరీ గేటు బయటికి ప్రవహించింది. దీంతో గోరక్షకులతోపాటు పలువురు డెయిరీలోకి చొరబడి ఇమ్రాన్ బృందంపై దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు గేదెను అక్రమంగా చంపినందుకు ఇమ్రాన్ బృందంతోపాటు డెయిరీ యజమానిని కూడా అరెస్టు చేశారు. -
జై..యువరాజ్!
-
యువరాజ్ విలువ.. రూ. 11 కోట్లు!
-
జై..యువరాజ్!
►సదర్ ఉత్సవాల్లో సందడి చేయనున్న హరియాణా ‘యువరాజ్’ ►ప్రత్యేక ఏసీ కంటైనర్లో నగరానికి.. ►ఈ సారి ధర రూ.11 కోట్లు.. హైదరాబాద్: సదర్ ఉత్సవాల్లో ఈ సారి కూడా హరియాణా ‘యువరాజ్’ (దున్నపోతు) సందడి చేయనుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ నెల 22వ తేదీన హర్యాణాలోని కురుక్షేత్ర జిల్లా సునారియో గ్రామం నుంచి బయలుదేరిన యువరాజ్ ఈ సారి తన కొడుకు ‘ధారా’ తో కలిసి వేడుకల్లో పాల్గొంటుంది. 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం నుంచి ఏసీ సదుపాయం ఉన్న ప్రత్యేక కంటెయినర్లలో నగరానికి తరలిస్తున్నారు. 10 మంది యువకులు దాంతో పాటు హైదరాబాద్ వస్తున్నారు. రోజుకు 125 కిలోమీటర్ల చొప్పున పయనిస్తూ 29వ తేదీ నాటికి నగరానికి చేరుకొనే విధంగా ప్రణాళికను రూపొందించారు. కంటెయినర్లలో దున్నల కోసం ప్రత్యేకంగా రబ్బరుతో మ్యాటింగ్ ఏర్పాటు చేశారు. గత సంవత్సరం రూ.7 కోట్ల ఖరీదు ఉన్న యువరాజ్ ధర ఈ ఏడాది రూ.11 కోట్లకు చేరినట్లు దాని యజమాని కరమ్వీర్సింగ్ ‘సాక్షి’తో చెప్పారు. యువరాజ్ , దాని కొడుకు ధారాతో పాటు, వాటికి కావలసిన నాణ్యమైన దాణా, యాపిల్స్, ఎండు ఫలాలతో మరో ప్రత్యేక వాహనం కూడా వస్తోంది. గత సంవత్సరం విశ్రాంతి లేకుండా పయనించడంతో యువరాజ్ జ్వరంతో అలసిపోయినందువల్ల ఈ సారి మరింత జాగ్రత్తగా తగిన విశ్రాంతిని అందజేస్తూ నగరానికి తీసుకొస్తున్నారు. ఇటీవల న్యూఢిల్లో జరిగిన ప్రదర్శనలో ప్రధాని నరేంద్రమోదీని సైతం అమితంగా ఆకర్షించిన యువరాజ్ నగరంలో ఈ నెల 31వ తేదీన ముషీరాబాద్లో, నవంబర్ 1వ తేదీన నారాయణగూడ వేడుకల్లో పాల్గొననుంది. ఇప్పటి వరకు నగరంలో ప్రదర్శించిన దున్నలు అన్నీ రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖరీదు చేసేవే. కానీ ఏకంగా రూ.11 కోట్ల ఖరీదైన ముర్రా జాతికి చెందిన యువరాజ్ను హైదరాబాద్కు తెప్పించేందుకు, ప్రదర్శన నిమిత్తం రూ.20 లక్షల వరకు ఖర్చు చేయవలసి వస్తోందని అఖిల భారత యాదవ సంఘం.ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. 1800 కిలోల బరువు, 14 ఫీట్ల పొడవు, 6 ఫీట్ల ఎత్తు ఉన్న ఈ దున్నకు ప్రతి రోజు గడ్డి, దాణాతో పాటు, పాలు, బాదం, పిస్తా, కాజు, బెల్లం, క్యారెట్, వంటి ఖరీదైన ఆహారం అందజేస్తున్నట్లు చెప్పారు. ఏటా రూ.కోటికిపైగా ఆదాయం... హరియాణా ‘యువరాజ్’కు ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ మంచి పేరు ఉంది. 2007లో పుట్టిన ఈ దున్న ఇప్పటి వరకు ఎన్నో దూడలకు జన్మనిచ్చింది. దీని వీర్యం కోసం యురోపియన్ దేశాల్లో ఎంతో డిమాండ్ ఉంది. టర్కీ, స్కాట్లండ్, బ్రెజిల్ వంటి దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. నాలుగు రోజులకు ఒక సారి దీని నుంచి వీర్యాన్ని సేకరిస్తారు. అలా సేకరించిన వీర్యాన్ని నైట్రోజన్ సిలిండర్లలో భద్రపరిచి ఇంజక్షన్ల రూపంలో విక్రయిస్తారు. ఒక్కో ఇంజక్షన్ ఖరీదు రూ.400. ఒక్కసారి విడుదలయ్యే వీర్యంపైన రూ. 3 నుంచి రూ.4 లక్షల వరకు లభిస్తుంది. ఇలా ఏటా కొన్ని వందల ఇంజక్షన్లను విక్రయిస్తున్నారు. విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. హర్యానా ‘యువరాజ్’ వీర్యం విక్రయాలపైనే ఏటా రూ.కోటి వరకు ఆదాయం లభించడం గమనార్హం. బయోడేటా దున్న పేరు : యువరాజ్ పుట్టిన తేదీ : 16 జనవరి 2007 తల్లిదండ్రులు : గంగ, యోగరాజ్ స్వస్థలం : కురుక్షేత్ర, హరియాణా యజమాని : కరమ్వీర్సింగ్ ఆహారం : రోజుకు 15 కిలోల యాపిల్స్, 30 లీటర్ల పాటు, 5 కిలోల క్యారెట్, 5 కిలోల బత్తాయి, కిలో కాజు, కిలో బాదం, 5 కిలోల బెల్లం, స్వచ్ఛమైన దాన, గడ్డి, వివిధ రకాల పప్పుల పొట్టు,మొక్కజొన్న పొట్టు వ్యాయామం : ప్రతిరోజు 5 కిలోమీటర్ల నడక అవార్డులు : 12 నేషనల్ చాంపియన్ అవార్డులు, ఒక బెస్ట్ ఎనిమల్ అవార్డు ♦ హైదరాబాద్లో దీపావళి తరువాత 12, 13 తేదీల్లో జరుగనున్న సదర్ ఉత్సవాల కోసం ఇక్కడికి తెప్పించారు. ♦ ఇప్పటికే అందంగా ముస్తాబు చేసిన ‘యువరాజ్’కు ప్రతి రోజు డెట్టాల్తో శుభ్రంగా స్నానం చేయించడంతో పాటు ఖరీదైన నూనెలతో మాసాజ్ చేస్తున్నారు. -
‘బాహుబలి’ దున్నకు బహు కష్టం
గోశాలలో తిండిలేక అవస్థలు పడుతున్న వైనం రాజాపేట: సినీ పరిశ్రమలో జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి గడించిన తెలుగు చలన చిత్రం ‘బాహుబలి’లో నటించిన దున్నకు కష్టం వచ్చింది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి అధునాతన టెక్నాలజీతో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమాలో నటించిన దున్నపోతుకు అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. చివరకు యుద్ధ సన్నివేశంలో రానా బలిచ్చే సన్నివేశంలో అదే దున్నపోతు కనిపిస్తుంది. ఈ దున్నపోతుకు ప్రస్తుతం తిండి కరువైంది. షూటింగ్ పూర్తయిన అనంతరం దాన్ని రాఘవేంద్రస్వామి మంత్రాలయానికి బహూకరించారు. అక్కడ ఏమైందో ఏమోగాని ప్రస్తుతం నల్లగొండ జిల్లా రాజాపేట మండలం చల్లూరులో ఉన్న సహయోగ్ గోశాలలో తలదాచుకుంటోంది. రోజువారీగా తిండి సైతం లేక ప్రస్తుతం ‘బహుబలి’ దున్న అష్టకష్టాలు పడుతోంది. -
పిడుగుపాటుకు రెండు గేదెల మృతి
రేవనపల్లి(భూదాన్పోచంపల్లి) పిడుగుపాటుకు రెండు గెదెలు మృతిచెందాయి. ఈ ఘటన మండలంలోని రేవనపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకొంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన రైతు మైల నర్సింహ రోజుమాదిరిగా శుక్రవారం సాయంత్రం గ్రామసమీపంలోని వ్యవసాయ బావి వద్ద గేదెలను కట్టేసి ఇంటికి వచ్చాడు.రాత్రి వర్షంతో పాటు పిడుగు పడింది. శనివారం ఉదయం బావి వద్దకు వచ్చి చూడగా చెట్టుకు కట్టేసి ఉన్న రెండు ముర్రాజాతి గేదెలు మృతిచెంది ఉన్నాయి. వీటి విలువ రూ. 1.30 లక్షలు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. సమాచారం అందుకొన్న ఆర్ఐ నిర్మల, మండల పశువైద్యాధికారి రాంచంద్రారెడ్డి, వీఆర్వో సుదర్శన్రావు, సర్పంచ్ గోదాసు శశిరేఖజంగయ్యలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి నుంచి వివరాలను అడిగి తెలుసుకొని పంచానామా నిర్వహించారు. -
బర్రెను చూసి సింహం తుర్రుమంది!
అడవికి ఓ న్యాయం ఉంటుంది. ఆ న్యాయం ప్రకారం అడవికి రాజు సింహం. దానిని చూసి అన్నీ జంతువులు భయపడాల్సిందే. ఎదైనా జంతువు ఎదురుతిరిగి నువ్వెంత అని కొమ్ములు ఎగరేస్తే.. సింహం తన పంజా విసురుతుంది. ఎదురుగా జంతువు కనిపిస్తేనే దానికి ఆహారంగా మారిపోతుంది. అలాంటిది ఎదురుతిరిగితే బతికి బయటపడగలదా? కానీ ఇక్కడ మాత్రం ఆటవిక న్యాయం తిరగబడింది. బర్రె (గెదే)ను చూసి ఆడ సింహం ఒకటి భయపడింది. గెదే మీదకు ఉరికొస్తుంటే.. సింహం బెదిరి పోరిపోయింది. ఆ సింహాన్ని వెంటాడి మరీ గెదే తరిమేసింది. ఈ ఘటన గుజరాత్లోని గిర్ అడవిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన నాటకీయ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. #WACTH Law of the jungle turns - dramatic visuals of a buffalo chasing a lioness into the wild in Gir Forest (Guj)https://t.co/JuKJnQPG4X — ANI (@ANI_news) June 5, 2016 -
బ్రూటల్ రివేంజ్
శత్రువులు రౌండప్ చేశారు.. ఇటు గుండె వేగం పెరిగింది. వాళ్ల కాళ్లు కదులుతున్నాయి.. ఇవతల మైండ్ హీట్ పీక్స్ కు చేరింది. వాడు దూకేశాడు.. అంతసేపు తనతో కలిసి గడ్డిమేసినవాణ్ని దారుణంగా గాయపరిచాడు. అంతే తెగింపు తన్నుకొచ్చేసింది. అవతలిది అడవికి రాజు కావచ్చు, కానీ ప్రాణంకోసం పాకులాటలో అవేవీ పట్టింపుకాదు. గెలిచామాలేదా అన్నది పాయింటే కాదు. బతికామా లేదా అన్నదే ముఖ్యం. దున్నపోతు కాలు దువ్వింది, బ్రూటల్ రివేంజ్ కు సిద్ధమైంది. కట్టడిచేసిన సింహం మూకపైకి ఒక్కసారిగా లంఘించింది. తనతోపాటు దున్నపోతుల బృందాన్ని కాపాడుకునేందుకు సింహాలతో శక్తికిమించి పోరాడింది. కొమ్ములతో వాటిని చీల్చిచెండాడింది. ఎత్తికుదేసింది. కానీ టైమ్.. ఆ టైమ్ సింహాలది. ఒక్క దున్నపోతు పోరాడుతుంటే సహాయానికి రాకుండా విడివిడిగా నిల్చున్న మిగతా దున్నపోతులపై సింహాలు కలిసికట్టుగా దాడిచేశాయి. తోటి జీవులు చనిపోవటాన్నిచూసి.. పోరాడుతోన్న దున్నపోతు సత్తువ నీరుగారిపోయింది. చివరికి సింహాలదే పైచేయి అయింది. దున్నపోతుల గుంపులో సగానికి సగాన్ని హతమార్చాయి. మిగతా సగం పారిపోయాయి. దక్షిణాఫ్రికాలోని ప్రఖ్యాత రిజర్వు ఫారెస్ట్ మలామలాలో చోటుచేసుకున్న ఈ దృశ్యాలను బ్రెజిల్ కు చెందిన మహిళా ఫొటోగ్రాఫర్ మారియాంజెలా లీ ఎంతోసాహసోపేతంగా చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు ఇంటర్నెట్ లో అందరినీ ఆకర్షిస్తున్నాయి. -
ఆశ్చర్యంలో ముంచెత్తిన అతిథి!
కేప్ టౌన్: బారులో తీరిగ్గా మందు తాగుతున్న సమయంలో ఊహించని విధంగా అనుకోని అతిథి ఊడిపడడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మందు గ్లాసులు వదిలిపెట్టి అదేం చేస్తోందని ఆసక్తిగా గమనించడం మొదలు పెట్టారు. దక్షిణాఫ్రికా తూర్పు కేప్ లో పీటర్సన్ ప్రాంతానికి సమీపంలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హ్లోసీ గేమ్ లాడ్జీలోని బారులోకి ఓ అడవి దున్నపోతు ప్రవేశించింది. తీరిగ్గా నడుచుకుంటూ వచ్చి బార్ మధ్యలో ఠీవిగా నిలుచుంది. కొద్దిసేపు చుట్టూ పరిసరాలను పరిశీలించింది. అంతకుముందే లాడ్జి ప్రాంగంణంలోని అడుగుపెట్టిన ఈ అడవి జంతువు స్విమ్మింగ్ పూల్ లో నీళ్లు తాగింది. తర్వాత సన్నని దారి గుండా బార్ లోకి ప్రవేశించింది. అయితే దాని వల్ల ఎటువంటి నష్టం వాటిల్లలేదని బార్ సిబ్బంది తెలిపారు. అది ఏ వస్తువును ముట్టుకోలేదని వెల్లడించారు. బార్ లోకి వచ్చిన దున్నపోతును జాగ్రత్తగా బయటకు పంపించేశారు. బార్ మధ్యలో నిలుచున్న దున్నపోతు ఫొటోను లాడ్జి సిబ్బంది క్యాప్షన్ తో ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. -
రహదారిపై ‘గేదె’ బీభత్సం
రొంపిచర్ల: గుంటూరు జిల్లాలోని అద్దంకి రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు.. జిల్లాలోని రొంపిచర్ల మండలం సంతగుడిపాడు వద్ద ఉన్న అద్దంకి-నార్కెట్పల్లి రహదారి పై ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న లారీకి గేదె అడ్డం రావడంతో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో లారీ వెనక ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇది గుర్తించక లారీని ఢీకొట్టాడు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సు వెనక గేదెల లోడుతో వెళ్తున్న మరో లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.లారీ ఢీకొట్టిన ఆర్టీసీ బస్సులో ప్రయాణికులెవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు . -
సదర్..అదుర్స్
దీపావళి పండుగ సంబరాల్లో భాగంగా నారాయణగూడలో శుక్రవారం రాత్రి నిర్వహించిన సదర్ వేడుకులు అదుర్స్ అన్పించాయి. నిఘనిఘలాడే నలుపుతో ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా నిలిచిన దున్నపోతులు ఠీవీగా నడుస్తుండగా...వాటి ముందు ప్రత్యేక వేషధారణలతో నృత్యాలు చేస్తూ కళాకారులు, యువతీ యువకులు అలరించారు. డప్పు దరువులు, ఆటపాటలు.. దున్నపోతుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. బాజాభజంత్రీల నడుమ అందంగా అలంకరించిన దున్నపోతులతో వాటి యజమానులు ర్యాలీగా నారాయణగూడకు చేరుకున్నారు. యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ సదర్ సమ్మేళనానికి గ్రేటర్ హైదరాబాద్ నుండే కాకుండా మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి కూడా దున్నపోతులను అలంకరించి తీసుకువచ్చారు. సదర్ వ్యవస్థాపకులు మల్లయ్య యాదవ్ కుటుంబ సభ్యులు రెడ్డి కాలేజ్ రోడ్డులో భారీ స్వాగత వేదికను ఏర్పాటు చేశారు. - కాచిగూడ -
యువరాజ్కు యమ క్రేజ్
ముషీరాబాద్: నగరంలో ప్రతిష్టాత్మకంగా జరిగే సదర్ సమ్మేళనానికి హర్యానా రాష్ట్రం అంబాల నుంచి తీసుకొచ్చిన ‘యువరాజ్’ అనే దున్నపోతును చూసేందుకు జనం ఎగబడ్డారు. అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ ఈ దున్నను ముషీరాబాద్ ప్రధాన రహదారిలో గల సత్తర్బాగ్ లో ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న జనం గురువారం పెద్ద ఎత్తున అక్కడకు వచ్చారు. యువరాజుతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. 1600 కేజీల బరువు, 14 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు గల ఈ దున్న గంభీరంగా కనిపిస్తోంది. ఏడు రోజులు వ్యయ ప్రయాసలకు ఓర్చి తీసుకువచ్చినట్టు దాని బాగోగులు చూసే గౌరవ్ కుమార్ తెలిపారు. దీనితో వాకింగ్, మాలిష్ చేయడం గౌరవ్ విధి. నున్నగా కనిపించేందుకు కటింగ్ చేయడం సుందర్ సింగ్ పని. వీరితో పాటు మరో నలుగురు పనివారురు. ప్రస్తుతం యువరాజు వయసు ఏడేళ్లు. యువరాజు తల్లి గంగ 17 ఏళ్లు, తండ్రి యోగరాజ్ 18 ఏళ్లు. ఇక తమ్ముళ్లు ధోని, భీంరాజ్లు కూడా ఉన్నారు. దీని యజమాని కరమ్ వీర్ సింగ్. -
థాయ్ గ్రామంలో వింత ఆకారం...
ఓ వింత రూపం థాయ్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. థాయ్ ల్యాండ్ లోని మారు మూల గ్రామంలో కనిపించిన ఆ వింతను చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. ఆ రూపం పుట్టింది గేదెకైనా దానికి మొసలి ఆకారం మిళితమై ఉండటాన్ని వింతగా చూస్తున్నారు. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపాన్ని సంతరించుకున్నా... శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు. ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు ఈ వింత జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. అయితే పుట్టిన కొద్ది సమయానికే మృతి చెందిన ఆ జంతువుకు.. వింత ఆకారం ఎలా వచ్చింది అన్న దానిపై ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు. -
గేదెను ఢీకొని యువకుడి మృతి
పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : ఓ యువకుడు బైక్పై వేగంగా వెళ్తూ రోడ్డుపై అడ్డు వచ్చిన గేదెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా పులివెందుల పట్టణం కేంద్రంలో వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. వేముల మండలానికి చెందిన గౌస్ ఫీరా(23) పులివెందుల నుంచి బైక్పై శనివారం అర్ధరాత్రి వేముల వెళ్తున్నాడు. కాగా పట్టణంలోని విజయ హోమ్స్ రింగ్ రోడ్డు వద్ద గౌస్ బైక్తో గేదేను ఢీ కొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ గౌస్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. అయితే బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన గేదె కూడా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. -
ఆ మంత్రిగారి గేదెల దొంగ దొరికాడు!
రాంపూర్: సమాజ్ వాదీ పార్టీ నేత, ఉత్తరప్రదేశ్ మంత్రి అజాం ఖాన్ (మంత్రి గేదెలు..మంచి పోలీసులు) గేదెల దొంగ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 2014, జనవరి 31వ తేదీన అజాం ఖాన్ కు చెందిన గేదెల కొట్టాం నుంచి లక్షల రూపాయల విలువైన ఏడు గేదేలను కొంతమంది దుండగులు దొంగింలించారు. దీనిపై అజాం ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ గేదెల ఆచూకీ కనిపెట్టినా.. ఆ దొంగతనానికి పాల్పడిన నిందితులలో ఒకరైన చునాన్ ను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఘటనకు పాల్పడింది ఐదుగురుగా తేలింది. వీరిలో ముగ్గురు దొంగతనానికి ప్రణాళిక రచించగా, మరో ఇద్దరు ఆ గేదెలను అక్కడ నుంచి తరలించినట్లు మోరాదాబాద్ పోలీస్ సూపరిండెంట్ ప్రవాల్ ప్రతాప్ సింగ్ తెలిపారు. కాగా మంత్రిగారి ఫాంహౌజ్ నుంచి ఏడు గేదెలు చోరీకి గురైయ్యాయి. అనంతరం మంత్రి ఆదేశాలతో గేదెల దొంగలను కనిపెట్టే పనిలో పడ్డ పోలీసులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. గేదెల చోరీ కేసుకు సంబంధించి విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అక్కడి ప్రభుత్వం ముగ్గురు పోలీసులను సస్పెండ్ కూడా చేసింది. -
ఆ గేదె.. దొంగని పట్టించింది
కొండాపురం (నెల్లూరు జిల్లా): నిద్రిస్తున్న మహిళ నుంచి నగలు లాక్కుని పారిపోతుండగా అక్కడే ఉన్న గేదె పొడవటంతో గాయాలపాలై ఓ దొంగ దొరికాడు. ఈ సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసుకుంది. మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన మేడేపల్లి విజయమ్మ, ఆమె కుమార్తె దొరసానమ్మ, కొడుకు హజరత్ ఇంటి బయట నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వారి వద్దకు వచ్చి విజయమ్మ మెడలోని నాలుగున్నర సవర్ల బంగారం గొలుసును, చెవి కమ్మలను లాక్కున్నారు. తల్లి, కూతురు గట్టిగా కేకలు వేయటంతో దుండగులు పరుగు అందుకున్నారు. వారిలో ఒకరిని ఇంటి ఆవరణలో కట్టేసిన గేదె పొడవటంతో పక్కనే బండలపై పడి గాయపడ్డాడు. అప్రమత్తమై చుట్టుపక్కల వారు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించగా వాళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆ దొంగని పట్టుకుని చితకబాదారు. అతని దాడిలో విజయమ్మ కూడా గాయపడింది. క్షతగాత్రులను కావలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవసాయ బావిలో గేదె
-
గేదెకు పుట్టినరోజు వేడుక
మామిడికుదురు : నల్లగా నిగనిగలాడుతున్న దేహం, మెడలో పూలదండ, అందంగా వంపులు తిరిగిన కొమ్ములతో ఉన్న ఆ బర్త్ డే బేబీ 'గేదె' బుధవారం ఇష్టంగా కేక్ తింది. అవును.. ఈ రోజు ఆ గేదె పుట్టినరోజు మరి! వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన సూరిబోయిన వీరభద్రానికి, ఆయన పెద్దమ్మ పార్వతి ఓ గేదెను కానుకగా ఇచ్చారు. అదంటే ఎంతో ఇష్టం కలిగిన పార్వతి ఏటా దాని పుట్టిన రోజు వేడుక చేసేవారు. వీరభద్రం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం బంధువులు, పిల్లలు, ఇరుగుపొరుగు వారి సమక్షంలో గేదె 12వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరిపారు. కేక్, స్వీట్లు, అరటిపండ్లు పంచారు. ఆ గేదె తమ ఇంటికి వచ్చిన నాటి నుంచి అంతా మంచే జరుగుతోందని వీరభద్రం తల్లి సత్యవతి పేర్కొన్నారు. ఇలా గేదెకు పుట్టినరోజు వేడుక జరపడం చుట్టుపక్కల వారంతా విశేషంగా చెప్పుకొన్నారు. -
సింహాన్ని సింగిల్గా కుమ్మేసింది..
‘సింహం.. సింగిల్గా వస్తుంది. పందులే గుంపులుగా వస్తాయి’ అన్నది సినిమా డైలాగ్. కానీ.. సింహం సింగిల్గా వస్తే ఏం జరుగుతుందో ఈ ఫొటోలు చూస్తే తెలుస్తుంది! మృగరాజు, గేదె ల ఈ భీకర పోరాటం ఇటీవల జాంబియాలోని దక్షిణ లాంగ్వా జాతీయ పార్కులో చోటుచేసుకుంది. బాగా ఆకలితో ఉన్న సింహం అడవి గేదెల మందపై కన్నేసింది. ఒంటరిగా మిగిలిన గేదెపైకి దూకింది. అయితే, పారిపోవడానికి బదులుగా ఎదురుతిరిగిన గేదె సింహంతో తలపడింది. సింహం పంజా దెబ్బలతో విరుచుకుపడగా.. గేదె దాన్ని కొమ్ములతో పెకైత్తి కుమ్మేసింది. వీటి పోరాటం దాదాపు గంటసేపు సాగింది. రెండూ తీవ్రంగా గాయపడ్డాయి. చివరికి బతుకుజీవుడా అంటూ పొదల్లోకి పారిపోయినా.. రెండు రోజుల తర్వాత సింహం చనిపోయింది. పార్కులో సఫారీ గైడ్గా పనిచేసే ఆర్మ్స్ట్రాంగ్-ఫోర్డ్ అనే వ్యక్తి ఈ పోరు దృశ్యాలను తన కెమెరాలో బంధించారు. -
పశు క్రాంతి
లీటర్లకొద్దీ పాలిచ్చే గేదెలు.. ట్రాక్టర్కు తీసిపోకుండా నాగలి దున్నగలిగే దున్నపోతులు.. కళ్లు తిప్పుకోనివ్వని జెర్సీ ఆవుల అందాలు! ఇవన్నీ ఎక్కడో కాదు... నగరం నడిబొడ్డునే. నగరంలోని నార్సింగికి పల్లె కదిలొచ్చింది. పండుగ కళ తెచ్చింది... ప్రతి ఏటా సంక్రాంతి తర్వాతి రెండో శుక్రవారం లంగర్హౌస్ సమీపంలోని నార్సింగ్ మార్కెట్ కమిటీలో జరిగే పశువుల సంతలో పండుగ కళ కనబడుతోంది. పంటలు చేతికొచ్చి, డబ్బులు సమకూరాక రైతులు పశువులు కొనడం అనవాయితీగా వస్తోంది. నిజాం కాలం నుంచి కొనసాగుతున్న ఈ అంగడిలో హర్యానాకు చెందిన ముర్రా, మహారాష్ట్రలోని ఘోడేగావ్, గుజరాత్లోని ధుళియా, ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రా గుజ్జరి గేదెలు, దున్నపోతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈఏడు సంతలో నేపాల్ పశువులు కూడా అడుగిడుతున్నాయి. సెలబ్రిటీలు కూడా తమకిష్టమైన పశువులు కొనుగోలు చేసే ఈ సంతలో ఒక్కరోజే కోటి రూపాయలకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ముర్రానా మాజాకా... నల్లటి రంగు. భారీ దేహం. చెక్కినట్టుగా మెలితిరిగిన కొమ్ములు, జిగేల్మనిపించే పెద్ద కళ్లు.. ముర్రా జాతి బర్రెలు చూడగానే కట్టిపడేస్తున్నాయి. రోజుకు బకెట్ల కొద్దీ పాలు ఇచ్చే ఈ బర్రెల ధర లక్ష నుంచి రెండు లక్షలు పలికినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు వ్యాపారులు. హర్యానా, మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చిన ఈ పశువులకు డిమాండ్ ఎక్కువ ఉందని హర్యానా వాసి ఉమాశంకర్ చెబుతున్నాడు. ఆవాల నూనె, బెల్లం, చక్కెరలను నీటిలో కలిపి ఈ బర్రెలకు ఇవ్వడం వల్ల కాల్షియం మోతాదు పెరిగి పాలు ఎక్కువగా ఇస్తాయని తెలిపారు. భళా ధుళియా... గుజరాత్ పోరుబందర్ నుంచి తీసుకొచ్చిన ధుళియా జాతి బర్రెలు కూడా ముర్రా, మిన్ని జాతి కంటే ఏమాత్రం తీసిపోవడం లేదు. మంచి దేహ దారుఢ్యం కలిగిన ఈ బర్రెలను జాఫ్రి ధుళియా అని కూడా పిలుస్తుంటారు. ఇవి రోజు పొద్దున, సాయంత్రం కలిసి 20 లీటర్ల పాలు ఇస్తాయని పశువుల విక్రేత డి.నవీన్ కుమార్ తెలిపారు. పత్తి పిండి, కంది పొట్టు, వరిగడ్డి, పచ్చిగడ్డి, గోధుమ, కంది, శనగ పొట్టులను కలిపి ఈ ధుళియాలకు పెడతామంటున్నారు. కరిష్మా కేక... బర్రెలంటే మాకు ప్రాణం. పశువులను దేవతతో సమానంగా చూస్తాం. నాకు నచ్చిన ధుళియా జాతికి చెందిన ఈ బర్రెకు కరిష్మా అని పేరు పెట్టుకున్నా. 20 లీటర్ల పాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కరిష్మాను అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటున్నారు అబ్దుల్ అజ్మద్. హర్యానా నుంచి తీసుకొచ్చిన జెర్సీ ఆవుల అందాలు కళ్లు తిప్పుకోనివ్వడం లేదు. ‘ఇవి 50వేల వరకు పలకొచ్చు. రోజుకు పది లీటర్ల పాలు ఇస్తాయ’ని రైతు లతికా శర్మ తెలిపారు. - వాంకె శ్రీనివాస్ -
పచ్చిమేతతోనే పాడి
ఖమ్మం వ్యవసాయం: మన రాష్ట్రంలో పశుసంపదకు కావాల్సిన మేతలో మూడో వంతు మాత్రమే లభిస్తోంది. ఈ పశుగ్రాసం కొరత కారణంగానే పాల ఉత్పత్తి తక్కువగా ఉంది. రోజుకు ఒక పశువుకు 30 నుంచి 40 కిలోల పచ్చిమేత అవసరం. అంటే సంవత్సరానికి ఒక పశువు 10 నుంచి 14 టన్నుల పచ్చిమేత తింటుంది. పాడి రైతులకు ఇంత వరకు అనేక రకాలైన పశుగ్రాసాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన సంకరజాతి పశుగ్రాసాల్లో ముఖ్యమైనవి ఒకటి షుగర్గ్రేజ్, రెండోది న్యూట్రిఫీడ్. ఈ రకాల పశుగ్రాసాలను ఇప్పటికే జిల్లాలోని మధిర, ఎర్రుపాలెం తదితర ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఈ మేతనే పాడి పశువులకు మేపుతూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. షుగర్ గ్రేజ్ ఇది ఏక వార్షిక పశుగ్రాసం. ఒక ఎకరానికి 4-5 కిలోలు పశుగ్రాసం విత్తనాలు వేసుకోవాలి. షుగర్గ్రేజ్ వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఆరోగ్యకరమైన పిలకలు వస్తాయి. ఈ మేత విత్తనాలను 2-3 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. సాలు నుంచి సాలుకు 30 సెంటీమీటర్ల నిడివి, మొక్క నుంచి మొక్కకు 25 సెం.మీ దూరం ఉండాలి. ఇది నీటి ఎద్దడిని తట్టుకుని అధిక దిగుబడిని ఇచ్చే పంట. తేలికైన నేలల్లో 5-7 రోజుల్లో ఒక తడి, బరువు నేలల్లో 7-10 రోజుల్లో ఒక తడి పెట్టాలి. అత్యధిక పశుగ్రాసం ఉత్పత్తి చేయడమే కాక కాండం మెత్తగా ఉండి చెరుకులాగా తీయగా రుచికరంగా ఉంటుంది. ఈ పశుగ్రాసం తీపిగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. పశుగ్రాసం కూడా వృథా కాదు. ఈ పశుగ్రాసాన్ని మేపడం వల్ల రోజుకు రెండు లీటర్ల పాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఎర్రుపాలెం మండలానికి చెందిన రైతులు ఈ పశుగ్రాసాన్ని పెంచుతున్నారు. అధిక పాల ఉత్పత్తి సాధిస్తున్నారు. పాతరగడ్డిగా కూడా షుగర్గ్రేజ్ను ఉపయోగించుకోవచ్చు. న్యూట్రిఫీడ్ సజ్జ పశుగ్రాసం నుంచి అభివృద్ధి చేసిన సంకరజాతి గడ్డి రకం ఇది. ఈ పశుగ్రాసంలో 14 నుంచి 16 శాతం మాంస కృత్తులు ఉంటాయి. అధికశక్తినిచ్చే ఖనిజ లవణాలనూ ఇది కలిగి ఉంటుంది. ఈ పశుగ్రాసం మేపడం వల్ల గేదె, పాడిపశువులలో పాల ఉత్పత్తి, వెన్నశాతం పెరుగుతుంది. ఒక ఎకరానికి 3 కిలోల విత్తనాలు సరిపోతాయి. బోదెలు తోలి బోదెల్లో ఈ విత్తనాలు విత్తుకోవడం మంచిది. ఈ విధానం వల్ల అధిక పశుగ్రాసం పొందవచ్చు. బహువార్షిక పశుగ్రాసం విత్తితే 70-80 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత నత్రజని ఎరువులు, నీరు పెట్టడం వల్ల రెండో కోతను 40-45రోజుల్లో పొందవచ్చు. ఆరుతడులు ఇవ్వడం వల్ల చాలా కోతలకు అవకాశం ఉంది. ఈ రెండు రకాల పశుగ్రాస విత్తనాలను పశుసంవర్థకశాఖ 75 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తోంది. -
భౌగోళిక అద్భుతం నయాగరా...
విదేశాలలో! ప్రపంచంలోనే భౌగోళికంగా ప్రసిద్ధి చెందిన నయాగరా జలపాతం కెనడా, అమెరికా దేశాల సరిహద్దులో ఉంది. 167 అడుగుల ఎత్తు నుంచి జలపాతం కొండపై నుంచి కిందికి పడుతుండే దశ్యం మనోహరం. న్యూయార్క్ రాష్ర్టంలోని బఫెల్లో పట్టణానికి సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ జలపాతాన్ని సందర్శించేందుకు అమెరికా ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లను చేసింది. ఒకే సమయం లో కెనడా, అమెరికా దేశాల ప్రజలు, టూరిస్టులు సందర్శించేందుకు భారీ ఏర్పాట్లున్నాయి. కెనడాలోని హార్షూ జలపాతం, నయాగరా జలపాతం పక్క పక్కనే ఉన్నాయి. అయితే విస్తీర్ణంలో హార్షూ జలపాతం కంటె నయాగరానే పెద్దది. నయాగర జలపాతాన్ని అతి సమీపం నుంచి పడవలోనూ, సొరంగమార్గం ద్వారా సందర్శించవచ్చు. పడవలో 17 డాలర్లు, సొరంగమార్గంలో వెళ్లేందుకు 12 డాలర్లు చెల్లించాలి. నయాగరాను సందర్శించేందుకు మెయిడ్ మిస్త్ నుంచి కిందికి లిఫ్ట్లో వెళ్లాలి. పడవలోకి వెళ్లే ముందు సందర్శకులకు రెయిన్కోట్ ఇస్తారు. పడవ కెనడాలోని హార్స్షూ జలపాతం దగ్గరగా వెళుతుంది. అ సమయంలో పై నుంచి దుముకుతున్న జలపాతాన్ని అతి సమీపం నుంచి తిలకించడం జీవితంలో మరపురాని అనుభూతిగా మిగులుతుంది. అక్కడ నుంచి పడవ నయాగరా జలపాతం వైపు మళ్లుతుంది. అక్కడ సాయంత్రం సూర్యకిరణాలు పడడం వల్ల ఇంధ్రదనుస్సు సందర్శకులకు కనువిందు చేస్తుంది. కెనడా వైపు నుంచి వచ్చే సందర్శకులకు ఎర్ర రంగు రెయిన్కోట్, అమెరికా వైపు నుంచి వచ్చే వారికి నీలిరంగు రెయిన్కోట్ ఇస్తారు. అమెరికా సరిహద్దు నుంచి కెనడాలోని భవనాలు, రోడ్లు, కార్లు, ఇతర దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. నయాగరా జలపాతం అడుగు భాగానికి చేరుకునేందుకు కొండ ను చీల్చి సొరంగ మార్గం ఏర్పాటు చేశారు. ఈ మార్గంలోకి వెళ్లేందుకు నయాగర నది పై నిర్మించిన వంతెన దాటి అవతలి వైపుకు వెళ్లాలి. ఈ మార్గంలో వెళ్లే సందర్శకులకు జారిపడిపోకుండా ప్రత్యేకమైన పాదరక్షలు ఇస్తారు. ఆ మార్గం దాటి వెళ్లే దారిలో తెల్లని పక్షులు స్వాగతం పలుకుతాయి. పక్షులను దాటి మెట్ల మార్గం ద్వారా నది సమీపంలోకి వెళ్లి, అక్కడ నుంచి జలపాతం పడుతున్న ప్రాంతాన్ని అతి సమీపం నుంచి చూడవచ్చు. రాత్రి పూట జలపాతం నీరు నీలి, ఎరుపు, పసుపు రంగుల్లో తిలకించవచ్చు. - జి.గంగాధర్ -
పశువాంఛతో...రెండేళ్ల జైలు
కరీంనగర్ : కామవాంఛ తీర్చుకోవడానికి పశువుపై సంభోగ ప్రయత్నం చేసిన ఓ వ్యక్తికి న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన బొజ్జ బాలయ్యకు పాలిచ్చే గేదె ఉంది. దానిని రోజులాగే ఇంటిముందు చెట్టుకు కట్టివేశాడు. ఉదయం మేత వేసేందుకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన నీలం లచ్చయ్య (48) ఒంటిపై బట్టలు లేకుండా గేదెతో సంభోగం చేస్తుండగా చూసి అరవటంతో అతడు పరారయ్యాడు. గేదె యజమాని బాలయ్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గేదె నుంచి శాంపిల్స్ సేకరించి హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పోలీసులు లచ్చయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అప్పటినుంచి అతగాడు జిల్లా జైల్లో ఉంటే కేసు విచారణకు హాజరు అవుతున్నాడు. ఈ సంఘటన 2013 జూలై 12న జరిగింది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కరీంనగర్ అదనపు జుడీషియల్ మెజిస్ట్రేట్ అజహర్ హుస్సేన్ ...లచ్చయ్యకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. దాంతో పాటు రూ.100 జరిమానా విధించారు. -
‘దున్నపోతు మీద వాన..
‘దున్నపోతు మీద వాన.. కొయ్యలగూడెం, : దున్నపోతు మీద వాన.. ఈ సర్కారు పాలన అంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఐసీడీఎస్ సెక్టర్ పరిధిలోని సుమారు వందమంది సిబ్బంది ఐసీడీఎస్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పటి వరకు కనీసం యూనియన్ నాయకులతో ప్రభుత్వం చర్చలకు రాకపోవటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. 22వ తేదీ వరకు కొనసాగించనున్న సమ్మెలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసి ప్రజాప్రతినిధులను నిలదీయనున్నట్టు సభ్యులు పేర్కొన్నారు. యూనియర్ అధ్యక్షురాలు జి.విజయకుమారి, ఎస్కే నూర్జహాన్, జి.సుబ్బాయమ్మ, ఎస్.శ్రీదేవి, శాంతకుమారి, కె.కుమారి, భాస్కరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
‘లక్ష’ణమైన గేదె!
హైదరాబాద్లోని నార్సింగిలో శుక్రవారంపశు సంక్రాంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో హర్యానాకు చెందిన ధూళియా జాతి గేదె రూ.2.10లక్షలకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. రోజూ 35 లీటర్ల పాలిచ్చేఈ గేదెను మహేష్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు.