జీఎస్‌డీపీ పెరగడానికి సూచనలు ఇవ్వండి | Target to increase to Rs 199 lakh crore by 2047: GSDP | Sakshi
Sakshi News home page

జీఎస్‌డీపీ పెరగడానికి సూచనలు ఇవ్వండి

Published Sun, Sep 29 2024 6:00 AM | Last Updated on Sun, Sep 29 2024 6:00 AM

Target to increase to Rs 199 lakh crore by 2047: GSDP

2047 నాటికి రూ.199 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యం

పారిశ్రామికవేత్తలను కోరిన పరిశ్రమల శాఖ

సాక్షి, అమరావతి: పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుందని, ఇందులో భాగ­స్వా­ములు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ పారి­శ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా 2047 నాటికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)ని రూ.199 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. ఇదే సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.35,69,000కు పెంచాలని లక్ష్యం నిర్దేశించుకున్నామని వెల్లడించింది. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి పారిశ్రామిక­వేత్తలు సూచనలు, సలహాలు ఇవ్వాలని పరిశ్రమల శాఖ కోరింది.

వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందని తెలిపింది. ప్రతి సూచన, సలహాను పరిగణనలోకి తీసుకోవడమే కాకుండా పారిశ్రామికవేత్తల చొరవను గుర్తిస్తూ ఈ–­సర్టిఫికెట్‌ను కూడా ప్రదానం చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ, ఏపీ ఎకన­మిక్‌ బోర్డు, ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) సామాజిక మాధ్యమాల ద్వారా పారిశ్రామిక­వేత్తలకు పిలుపునిచ్చాయి. సూచనలు, సలహాలను   http:// swarnandhra.ap.gov.in/­Suggestions ద్వారా తెలియజేయొచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement