TDP Leaders Incognito In Fake Home Guards Scandal - Sakshi
Sakshi News home page

నకి­లీ హోంగార్డుల కుంభకోణం: అజ్ఞాతంలోకి టీడీపీ నేతలు

Published Mon, Dec 12 2022 10:37 AM | Last Updated on Mon, Dec 12 2022 2:57 PM

TDP Leaders Incognito In Fake Home Guards Scandal - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిత్తూరు అర్బన్‌ : చిత్తూరు పోలీసు శాఖను కుదిపేస్తున్న నకి­లీ హోంగార్డుల కుంభకోణంలో వన్‌టౌన్‌ పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరిలో ఆర్‌. మణిగండన్, టి.యువరాజ్, బీఆర్‌ కిరణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు హోంగార్డులు, ఓ కానిస్టేబుల్‌ ఉన్నట్లు తెలుస్తోం­ది. త్వరలో వీరిని మీడియా ఎదుట హాజరుపరిచే అవ­కాశ­ముంది. 87 మంది నిరుద్యోగులను దొడ్డిదారిన పోలీసు శాఖలోకి చొప్పించిన బాగోతం తెలిసిందే.

ఇదే కేసుకు సంబంధించి కుట్రలో భాగమైన జిల్లాకు చెందిన కొందరు టీడీ­పీ నేతలు ముందస్తు బెయిల్‌ పొందేందుకు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. ఇక నకిలీ హోంగార్డుల వ్యవహారంలో అవకతవకలను గుర్తించిన చిత్తూరు ఏఆర్‌ ఆర్‌ఐ మురళీధర్, ఎస్పీ రిషాంత్‌రెడ్డి ఆదేశాలతో వన్‌టౌన్‌ సీఐ నరసింహరాజు ఐపీసీ 420, 419, 409, 468, 471 రెడ్‌విత్‌ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.  

ఆ 87 మందికీ తొలగింపు ఉత్తర్వులు 
మరోవైపు.. పోస్టులు పొందిన 87 మందినీ డీఐజీ ఆది­వారం విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు వీళ్లను తొలగించకపోతే కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి హోంగార్డు కోటా చూపించి వీరంతా ఉద్యోగాల్లో చేరి­పోయే ప్రమాదాన్ని పసిగట్టి ఈ నిర్ణయం హుటా­హుటిన తీసుకున్నారు. ఈ 87 మందిలో 28 మంది టీటీడీలో, చిత్తూరు, తిరుపతి అగ్నిమాపక శాఖలో 22 మంది, కాణిపాకం ఆలయంలో 15 మంది, చిత్తూరు, తి­రు­పతి రవాణాశాఖలో 10 మంది, లా అండ్‌ ఆర్డర్‌లో ఐదుగు­రు, చిత్తూరు జిల్లా జైల్లో ముగ్గురు, తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్, చిత్తూ­రు స్త్రీ–శిశు సంక్షేమశాఖలో ఒకొక్కరు, ఇప్పటికే స­స్పెన్షన్‌లో ఉన్న ఒకరితోపాటు సర్వీసు నుంచి తొలగించిన మరొకరు ఉన్నారు. మరోవైపు ఈ కుట్రపై చిత్తూరు ఎస్పీ వై. రిషాంత్‌రెడ్డి స్పందిస్తూ లోతుగా దర్యాప్తు జరుగు­తుందని, బాధ్యులందరిపైనా చర్యలుంటాయని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement