Scam
-
కాల్ మెర్జింగ్తో కాజేస్తారు!
సాక్షి, హైదరాబాద్: దేశంలో సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో అమాయకులను మోసం చేసి డబ్బు కొల్లగొడుతున్నారు. తాజాగా కాల్ మెర్జింగ్ స్కాంకు తెరలేపారు. మనకు తెలియకుండానే మన నుంచి ఓటీపీలు తీసుకుని మన బ్యాంకు ఖాతాలను కాజేస్తున్నారు. ఈ తరహా మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కు చెందిన ది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) హెచ్చరించింది. అపరిచితులు ఫోన్ చేసి అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీలను చెప్పవద్దని సూచించింది.కాల్ మెర్జింగ్ స్కాం అంటే? ఒక అపరిచితుడు మీ ఫోన్ నంబర్ను మీ స్నేహితుడి నుంచి తీసుకున్నానని చెబుతూ కాల్ చేయడంతో ఈ స్కాం ప్రారంభమవుతుంది. మీతో ఫోన్ మాట్లాడుతూనే.. మీ స్నేహితుడు వేరే నంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని చెప్పి, రెండు కాల్స్ను విలీనం (మెర్జ్) చేయమని స్కామర్ అడుగుతాడు. ఆ ‘స్నేహితుడి’కాల్ నిజంగా మీ మిత్రుడిది కాదు. అది బ్యాంకు ఓటీపీ కాల్. స్కామర్ అడగ్గానే మీరు కాల్ విలీనానికి అనుమతిస్తే సదరు వ్యక్తి వెంటనే బ్యాంకు ధ్రువీకరణకు సంబంధించిన ఓటీపీ కాల్తో కనెక్ట్ అవుతాడు. ఇలా బ్యాంకు కాల్ నుంచి వచ్చే ఓటీపీని అవతలి నుంచి వింటున్న సైబర్ మోసగాళ్లు సేకరిస్తారు. అప్పటికే బ్యాంకు వివరాలు తీసుకుని పెట్టుకునే సైబర్ మోసగాళ్లు..ఆ ఓటీపీని ఉపయోగించి మీ బ్యాంకు ఖాతాల్లోంచి డబ్బులు కొల్లగొడతారు. ఇదంతా కచ్చితమైన సమయంలోపు పూర్తిచేస్తారు. మీరు బ్యాంకు ఓటీపీ వారికి చెప్పినట్లు కూడా గుర్తించలేరు.కాల్ మెర్జింగ్ స్కాంకు చిక్కకుండా ఉండాలంటే?» అపరిచిత వ్యక్తులు మీకు ఫోన్ చేసి, మరో నంబర్ నుంచి వస్తున్న కాల్ను మెర్జ్ చేయాలని కోరితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి.» మీకు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మేం బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని, లేదా మీకు స్నేహితుడికి స్నేహితుడిని అని చెప్తే నమ్మవద్దు.» అనుమానాస్పద ఫోన్కాల్స్పై వెంటనే సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్ఫ్రీ నంబర్ 1930లో ఫిర్యాదు చేయాలి.» మీరు ఓటీపీ పంచుకున్నట్టు అనుమానం వస్తే వెంటనే మీ బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చి డబ్బులు పోకుండా తగిన చర్యలు తీసుకోవాలి. -
ఆన్లైన్ లవ్.. రూ.4.3 కోట్లు అర్పించేసుకున్న మహిళ
టెక్నాలజీ ఎంతగా పెరుగుతోందో.. స్కామర్లు కూడా అంతే వేగంగా పెరిగిపోతున్నారు. ఆన్లైన్లో ఎప్పుడైనా ఆదమరిస్తే.. చెబుకు చిల్లు ఖాయమే. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆస్ట్రేలియాకు చెందిన మహిళ 'అన్నెట్ ఫోర్డ్' ఆన్లైన్లో ప్రేమ కోసం వెతుకుతున్నప్పుడు.. స్కామర్ల చేతికి చిక్కింది. దీంతో సుమారు 4.3 కోట్లు (780000 ఆస్ట్రేలియన్ డాలర్స్) పోగొట్టుకుంది. పెళ్ళై కొన్నేళ్ళకు భర్తతో విడిపోయిన తరువాత.. 2018లో ఫోర్డ్ ఆన్లైన్ డేటింగ్ వైపు మొగ్గు చూపి, 'ప్లెంటీ ఆఫ్ ఫిష్' అనే డేటింగ్ సైట్లో చేరింది. ఇక్కడే 'విలియం' అనే వ్యక్తితో చాట్ చేయడం ప్రారంభించింది.కొన్ని నెలల తరువాత మలేషియాలోని కౌలాలంపూర్లో కొంతమంది పర్సు, కార్డులను ఎవరో దొంగలించారని చెప్పి, అన్నెట్ ఫోర్డ్ నుంచి విలియం రూ. 2.75 లక్షలు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా బ్యాంక్ కార్డులు పోయాయని.. మెడికల్స్ బిల్స్, హోటల్స్ బిల్స్ వంటివి చెల్లించాలని మరికొంత డబ్బు తీసుకున్నాడు. తాను (ఫోర్డ్) మోసపోయానని గ్రహించే సమయానికి ఆమె రూ. 1.6 కోట్లు నష్టపోయింది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులకు నివేదించిప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది.ఫేస్బుక్లో రెండో స్కామ్నాలుగు సంవత్సరాల తరువాత, 'అన్నెట్ ఫోర్డ్' ఫేస్బుక్లో మరొక స్కామ్ బారిన పడింది. ఆమ్స్టర్డామ్కు చెందినవాడినని చెప్పుకునే 'నెల్సన్' అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిన తరువాత.. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI)లో తన స్నేహితుడు ఉన్నాడని, అతనిపై దర్యాప్తు జరుగుతోందని, అతనికి సహాయం చేయడానికి 2500 AUD (సుమారు రూ. 1.3 లక్షలు) అవసరమని చెప్పాడు.మొదట్లో అనుమానం వచ్చిన ఫోర్డ్ డబ్బు పంపించడానికి నిరాకరించింది. అయితే, నెల్సన్ ఆమెను బిట్కాయిన్ ATMలో డబ్బు జమ చేయమని ఒప్పించాడు. ఆ తరువాత కొన్ని రోజులకు ఆమె ఖాతాలోకి డబ్బు వచ్చి వెళ్లడం గమనించింది. అసలు విషయం తెలుసుకునే లోపే.. రూ. 1.5 కోట్లు పోగొట్టుకుంది.ఇదీ చదవండి: 'ఉచితంగా పనిచేస్తా.. ఉద్యోగమివ్వండి': టెకీ పోస్ట్ వైరల్మోసపోయిన తరువాత ఫోర్డ్.. ఆస్ట్రేలియన్లను ఇలాంటి మోసాలకు బలికావద్దని హితవు పలికింది. గుర్తు తెలియని వ్యక్తులు నమ్మకంగా మాట్లాడి.. చివరికి మీ నుంచి డబ్బు లాగేస్తారని, తరువాత మీరే దివాళా తీస్తారని చెప్పింది. మొత్తం మీద ఆన్లైన్లో ఏదైనా సెర్చ్ చేసేటప్పుడు, గుర్తు తెలియని వ్యక్తులకు స్పందించేటప్పుడు.. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. -
రూ.850 కోట్ల ఫాల్కన్ స్కాం
-
ఫాల్కన్ స్కామ్ రూ.850 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఫాల్కన్ సంస్థ అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్ఫామ్ పేరుతో మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లతో ఏకంగా రూ.1,700 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.850 కోట్లు డిపాజిటర్లకు తిరిగి చెల్లించగా, మిగిలిన రూ.850 కోట్లు తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేసిన ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్చేశారు.ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం (ఈఓడబ్ల్యూ) ఈనెల 15న అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఆదివారం పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితుడు ఫాల్కన్ ఎండీ అమర్దీప్ కుమార్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్యన్ సింగ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యోగేందర్ సింగ్లు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనుబంధ సంస్థ ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్ఫామ్ను ఏర్పాటు చేశారు.ఇందులో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇస్తామని ప్రజలకు ఆశ పెట్టారు. డిపాజిట్లను సేకరించేందుకు మొబైల్ యాప్, వెబ్సైట్ను సైతం రూపొందించారు.22 శాతం వరకు రాబడినిందితులు 2021లో డిపాజిట్ల సేకరణను ప్రారంభించారు. రూ.25 వేల నుంచి రూ.9 లక్షల డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల వ్యవధికి 11–22 శాతం రాబడిని ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. డిపాజిటర్లకు రాబడిని అందించే క్రమంలో నిరంతరం కొత్త డిపాజిట్లను జోడిస్తూ వెళ్లారు. 2025 జనవరి 15న నాటికి ఈ స్కీమ్ ఆగిపోయింది. అయితే అప్పటికే డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసేశారు.దీంతో డిపాజిటర్లు లబోదిబోమంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బీఎన్ఎస్తోపాటు తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999లోని పలు సెక్షన్ల కింద 19 మందిపై కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో ఈనెల 15న ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు.షెల్ కంపెనీలకు సొమ్ముజనాల నుంచి సేకరించిన డిపాజిట్ల మొత్తాన్ని మన దేశంతోపాటు సింగపూర్, దుబాయ్, యూఈఏ వంటి దేశాల్లోని షెల్ కంపెనీలకు మళ్లించారు. కాయిన్ ట్రేడ్, బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ ఇండియా, యుకియో రిసార్ట్, ప్రెస్టిజ్ జెట్స్, ఫాల్కన్ ఇంటర్నేషనల్ ప్రాపర్టీస్, ఆర్డీపీ, రెట్ హెర్బల్స్ అండ్ రెట్ హెల్త్కేర్, ఎంబీఆర్–1, క్యాపిటల్ టెక్సోల్, విర్గో గ్లోబల్, ఓజేఏఎస్, హాష్బ్లాక్, వెల్ఫెల్లా ఇంక్, స్వస్తిక్ నెయ్యి వంటి షెల్ కంపెనీలకు నిధులను మళ్లించారు. నిందితులు గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డారు. బ్లూలైఫ్ ఇంటర్నేషనల్ మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీ ద్వారా మోసం చేసినట్లు 2022లో చేవెళ్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. -
ఈడీ విచారణ జరిపించాల్సిందే: ఎంపీ మిథున్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణమైన మార్గదర్శి కుంభకోణంపై ఈడీ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీ పి.వి.మిథున్రెడ్డి డిమాండ్ చేశారు. లోక్సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేష్ సివిల్ కాంట్రాక్టులు కావాలంటే చంద్రబాబుతో మాట్లాడుకోవాలే తప్ప తమపై ఆరోపణలు చేయడం తగదని పేర్కొన్నారు. సీఎం రమేష్ బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని, ఆయన బీజేపీ కోసం పనిచేయడం లేదని చెప్పారు.మంగళవారం లోక్సభ జీరో అవర్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ప్రసంగానికి ఎంపీ మిథున్రెడ్డి అడ్డుపడ్డారు. సీఎం రమేష్ అస్పష్టమైన ఆరోపణలు చేస్తున్నారని ఆక్షేపించారు. అంతకుముందు సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లో మద్యం పాలసీని 2019–2024 మధ్య మార్చారన్నారు. మద్యం ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ షాపుల వైపు మళ్లిందని, ఐదేళ్లలో మొత్తం రూ.లక్షకోట్ల అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ నగదు ద్వారానే జరిగాయని, ఒక్క డిజిటల్ చెల్లింపు లేదని ఆరోపించారు. అన్ని మద్యం షాపుల ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికనే ఉన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రూ.30 వేలకోట్ల మద్యం కుంభకోణం చేసిందని ఆరోపించారు. ఇది రూ.2,500 కోట్ల ఢిల్లీ మద్యం కుంభకోణం కంటే 10 రెట్లు పెద్ద కుంభకోణమన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి సీఎం రమేష్ వైఖరిపై మండిపడ్డారు. లోక్సభ వేదికగా మార్గదర్శి కుంభకోణాన్ని బయటపెట్టినందుకే ప్రతీకారంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని మిథున్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆర్గానిక్ వ్యవసాయానికి కేంద్రం ప్రోత్సాహంఏపీలో 2021–22 నుంచి మూడేళ్లలో 21.56 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై) కింద కేంద్రం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి మంగళవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 2021–22లో 25,006 మెట్రిక్ టన్నులు, 2022–23లో 2,72,572 మెట్రిక్ టన్నులు, 2023–24లో 18,58,652 మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువుల ఉత్పత్తి జరిగిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఏపీలోని 13,321 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తికేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వామిత్వ’ పథకంలో భాగంగా ఏపీలో 13,321 నోటిఫైడ్ జనావాస గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. తిరుపతి జిల్లాలో 1045 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభలో మంగళవారం అడిగిన ప్రశ్నకు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సమాధానమిచ్చారు. స్వామిత్వ పథకం అమలు కోసం 2020 డిసెంబర్ 8న ఉప్పదం కుదుర్చుకుందని, 2025 పిబ్రవరి 11నాటికి రాష్ట్రంలోని 26జిల్లాల్లో ఈ మొత్తం డ్రోన్ సర్వే నిర్వహించామని తెలిపారు. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ (ఐఈసీ) కార్యకలాపాలు, స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్స్ (ఎస్పీఎంయూ) ఏర్పాటు కోసం రాష్ట్రానికి రూ.26.7 లక్షలు విడుదల చేశామన్నారు. ఆస్తి కార్డు ఫార్మాట్ రాష్ట్రం ద్వారా ఇంకా ఖరారు చేయని కారణంగా..వాటిని ఇంకా తయారు చేయలేదని పేర్కొన్నారు. -
బిలియనీర్తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!
నమ్మేవాళ్లుండాలే గానీ ఎంతటి మోసానికి పాల్పడవచ్చు. కానీ మోసం ఎంతోకాలం దాగదు. ఎప్పటికైనా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం తప్పదు.చైనాకు చెందిన ఒక మహిళ స్టోరీలో అక్షరాలా ఇదే జరిగింది. పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ నాడకమాడి, బంధువులను నిలువునా ముంచేసింది. చివరికి ఆమె కుట్ర గుట్టు రట్టు అయింది. విచారించిన కోర్టు ఆమెకు జైలు శిక్ష విధించింది. ఇంతకీ ఆమె వలలో బంధువులు ఎలా పడ్డారు? ఈ స్కామ్ వెలుగులోకి ఎలా వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే మీరీ స్టోరీ చదవాల్సిందే!చైనాకు చెందిన మంగ్ (40) అనే మహిళ పెద్ద ప్లానే వేసింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం ఆమె ఒక చిన్న రియల్ ఎస్టేట్ ఏజెన్సీ నిర్వహించేది. కానీ అందులో నష్టాలు రావడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేసింది. బిలియనీర్, రియల్ ఎస్టేట్ వ్యాపారితో పెళ్లి అంటూ బంధువులను నమ్మించింది. ఫ్యామిలీని సైతం మోసం చేయాలనుకుంది. మందస్తు పథకం ప్రకారం డ్రైవర్ జియాంగ్ను పావుగా ఎంచుకుంది. ఈ విషయంలో జియాంగ్ను కూడా బాగానే బుట్టలో వేసుకుంది. ప్రేమిస్తున్నట్టు నమ్మిచింది. తన వయస్సు కారణంగా వివాహం చేసుకోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని అందుకే పెళ్లి చేసుకుందామంటూ ఒప్పించింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఇక ఆ తరువాత తన ప్లాన్ను పక్కాగా అమలు చేసింది. అనేక పెద్ద ప్రాజెక్టుల వెనుక రియల్టర్ అయిన తన భర్త జియాంగ్ ఉన్నాడని బంధువులను నమ్మించింది. తక్కువ ధరకే, అతి చౌకగా విలువైన ఆస్తులను దక్కించుకోవచ్చని ఆశపెట్టింది. అంతేకాదు మెంగ్ రూ.1.2 కోట్ల విలువైన ఒక చిన్న ఫ్లాట్ను కూడా కొనుగోలు చేసి, దానిని సగం ధరకు బంధువుకు విక్రయించింది.తనకు గొప్ప ధర వచ్చిందని బంధువులకు అబద్ధం చెప్పమని జియాంగ్ను కోరింది. మరో అడుగు ముందుకేసి, కొత్త నివాస భవనాల షోరూమ్లకు తీసుకెళ్లి, చదరపు మీటరుకు రూ. 61వేలవరకు తగ్గుతుందని ఆశచూపిచింది. దీంతో ఆమె మోసానని పసిగట్టలేని బంధువులు రూ.14 కోట్ల (1.6 మిలియన్ డాలర్లు) మేర డబ్బులను ముట్ట చెప్పారు.కనీసం ఐదుగురు బంధువులు ఫ్లాట్లను కొనడానికి ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చారు. కొందరు మంచి ఆస్తికి మారాలనే ఆశతో ఉన్న ఫ్లాట్లను కూడా అమ్మేశారు.ఇక్కడే సమస్య మొదలైంది. సంవత్సరాలు గడుస్తున్నా, ప్రాపర్టీ బంధువులకు స్వాధీనం చేయలేదు మంగ్.ఇదీ చదవండి: అదానీ చిన్న కొడుకు పెళ్లికి, షాదీ డాట్ కామ్ అనుపమ్ మిట్టల్ గిఫ్ట్ ఏంటో తెలుసా?డిస్కౌంట్లో ఇవ్వడంలో ఇబ్బందులు ఉన్నాయని చెబుతూ దాట వేస్తూ వచ్చింది. ఆ తరువాత కొన్ని ఫ్లాట్లను అద్దెకు తీసుకుని, ఇవి మనవే అని వారికి చూపించింది. ఇలా కాలం గడుస్తున్నకొద్దీ, సాకులుచెబుతోంది తప్ప ఆస్తి తమ చేతికి రాకపోవడంతో ఏదో తప్పు జరిగిందని గ్రహించిన బంధువులలో ఒకరు, అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారిని సంప్రదించాడు. దీంతో ఆమె అసలు స్కాం బైటపడింది. అవి అసలువి కాదని తేలిపోయింది. మెంగ్ నివసిస్తున్న ఫ్లాట్ ఆమెది కాదని వెల్లడైంది.దీంతో బాధితులంతా పోలీసులు ఆశ్రయించారు.ఈ కేసును విచారించిన కోర్టు మోసం చేసినందుకు మంగ్కు 12 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఫ్లాట్ల విషయంలో లీజు ఒప్పందాలపై సంతకం చేసినందుకు నకిలీ భర్త జియాంగ్కు కూడా ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే ఇతర బంధువుల ముందు అబద్ధం చెప్పిన మరో బంధువుకు కూడా ఐదేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. (ఎండలు పెరుగుతున్నాయి... జర జాగ్రత్త) -
దొంగేడుపు బాబు.. బికారి మాటలు
-
సైబర్ నేరగాళ్లతో ప్రైవేటు బ్యాంకుల అధికారులు కుమ్మక్కు!
సాక్షి, హైదరాబాద్: నేపాల్, చైనాల్లో కూర్చుని, దేశ వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని, యాప్ల ద్వారా వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడుతున్న ప్రధాన నిందితులతో స్థానిక ప్రైవేటు బ్యాంకుల మేనేజర్లూ కుమ్మక్కవుతుండటం ఆందోళన కలిగించే అంశం. రెండు కేసుల దర్యాప్తు నేపథ్యంలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వీరి పాత్రను గుర్తించారు. ఆర్బీఎల్, కొటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులకు చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రత్యేక బృందాలు పది రాష్ట్రాల్లో చేసిన దాడుల్లో వీరితో సహా 52 మందిని పట్టుకున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నిందితులపై నగరంలో 33, రాష్ట్రంలో 74, దేశ వ్యాప్తంగా 576 కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించామన్నారు. డీసీపీ దార కవిత, ఏసీపీ ఆర్జీ శివ మారుతిలతో కలిసి బుధవారం ఐసీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ వివరాలు వెల్లడించారు. సేవింగ్కు ఒక రేటు కరెంటుకు ఒక రేటు..సైబర్ నేరాల సూత్రధారులకు బాధితులతో నగదు డిపాజిట్ చేయించుకోవడానికి సేవింగ్స్ ఖాతా, కాజేసిన భారీ మొత్తాలను డ్రా చేసుకోవడానికి కరెంట్ ఖాతాలు అవసరం. దీనికోసం వీళ్లు నేపాల్కు చెందిన కొందరిని దళారులుగా మార్చుకుంటున్నారు. వీరు దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచరిస్తూ స్థానిక మధ్యవర్తుల ద్వారా బ్యాంకు అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలేవీ పట్టించుకోకుండా బ్యాంకు ఖాతాలు తెరిచి ఇవ్వాలని, లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనలను కూడా చూసీ చూడనట్లు వదిలేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. సేవింగ్ ఖాతాకు రూ.50 వేల వరకు, కరెంట్ ఖాతాకు రూ.80 వేల వరకు తీసుకుంటున్న బ్యాంకు అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఆయా ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ను ఆపరేట్ చేయడానికి అవసరమైన వివరాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారా సూత్రధారులకు చేరుతున్నాయి. కేసుల దర్యాప్తులో వెలుగు చూసిన లింకులునేపాల్కు చెందిన మహేష్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు విద్యారణ్యపురలోని ఆర్బీఎల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ ఝా, మల్లీశ్వరంలోని యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్, ఫ్యాబ్రికేషన్ వ్యాపారి ఆర్.మోహన్ సైబర్ క్రైమ్ నెట్వర్క్లోకి ప్రవేశించారు. వివిధ బ్యాంకుల్లో 20 బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వీరు సహకరించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి రూ.23 కోట్లు కాజేశా రు. హైదరాబాద్లో గత ఏడాది జరిగిన రూ.93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యా ప్తులో బెంగళూరు లింకులు గుర్తించిన పోలీ సులు ఆ ముగ్గురినీ కటకటాల్లోకి పంపారు. అలాగే గతంలోనే జరిగిన, రూ.2.06 కోట్లతో ముడిపడి ఉన్న మరో ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్న కొటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాటా శ్రీనివాస్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇతడితో పాటు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సహకరించిన వారినీ పోలీసులు అరెస్టు చేశారు.తొలిసారిగా క్రిప్టో కరెన్సీ స్వాధీనంఈ ఫ్రాడ్లో పలువురు నిందితులు నగరానికి చెందిన వారే అని తేలింది. వీరంతా టెలి గ్రామ్ యాప్ ద్వారా నేరగాళ్ల నెట్వర్క్లోకి ప్రవేశించారు. వీరి నుంచి రూ.47.5 లక్షల నగదుతో పాటు క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న రూ.40 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. క్రిప్టో కరెన్సీని సీజ్ చేయడం నగర పోలీసు చరిత్ర లో ఇదే తొలిసారి. కాగా ఈ ఖా తాల ద్వారా జరిగే ప్రతి లావా దేవీకి గాను కాటా శ్రీనివాస్కు ఒక శాతం కమీషన్గా ముట్టడం గమనార్హం.పలు మోసాల్లో నిందితులుగా..ఈ కేసులో వీరితో పాటు అరెస్టు అయిన 52 మంది నిందితులు ఆన్లైన్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఎర వేసి, వివిధ రకాలైన పేర్లు చెప్పి నగర వాసుల నుంచి రూ.8.83 కోట్లు కాజేసిన కేసు ల్లోనూ నిందితులుగా ఉన్నారు. సోషల్మీడియా గ్రూపుల ద్వారా ఎర వేసి, పెట్టుబడుల పేరుతో స్వాహా చేసే ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్తో పాటు డిజిటల్ స్కామ్స్ కేసుల్లోనూ వీళ్లు నిందితులుగా ఉన్నారు. కాగా వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.2.87 కోట్లు ఫ్రీజ్ చేశారు. ‘సైబర్ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నాం. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పిరామల్ ఫైనాన్స్ సంస్థతో కలిసి పని చేస్తున్నాం..’ అని కమిషనర్ చెప్పారు. -
రేఖ.. మామూలు చీటర్ కాదు
యశవంతపుర(కర్ణాటక) : ఐశ్వర్య గౌడ తరువాత.. బెంగళూరులో మరో యువతి ఘరానా మోసానికి పాల్పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారికి రూ.25 కోట్ల ఆర్థికసాయం ఆశ చూపించి రూ. 6 కోట్లు శఠగోపం పెట్టింది. రేఖ అనే యువతిని, ఆమె భర్త మంజునాథ ఆచారి, అతని స్నేహితుడు చేతన్లను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్ దయానంద తెలిపారు. ఈ నెల 13న రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. ఎలా చేసిందంటే వివరాలు.. తమకు బ్యాంకుల అధికారులు, ఐటీ, ఈడీ అధికారులు తెలుసని రేఖా ప్రచారం చేసుకునేది. అలా ఒక రియల్టర్ను నమ్మించింది. రూ.25 కోట్ల రుణం ఇప్పిస్తానని ఆశ చూపింది. తమ ఖాతాలో భారీగా డబ్బులు ఉన్నాయని, వాటిని ఈడీ సీజ్ చేసిందని, ఆ డబ్బును తీయాలంటే పన్నులు, లంచాలు కట్టాలని వ్యాపారికి తెలిపింది. ఇలా అతని నుంచి విడతలవారీగా రూ.6 కోట్లను రేఖా, మంజునాథ ఆచారి, చేతన్లు తీసుకున్నారు. తరువాత వారిది పచ్చి మోసమని తెలుసుకున్న రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హోసకోట సమీపంలోని ఒక ప్రైవేటు హాస్టల్లో తలదాచుకున్న రేఖాను అరెస్ట్ చేశారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు భర్త మంజునాథ్ ఆచారి, చేతన్లను కేఆర్పుర అయ్యప్పనగరలోని నివాసంలో పట్టుకున్నారు.మోసాల చిట్టా పెద్దదే విచారణ జరపగా రేఖా బాగోతాలు బయటకు వచ్చాయి. అనేక మందికి లోన్ ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు విచారణలో బయట పడింది. ఒక వ్యక్తికి వీడియోకాల్లో బెదిరించి రూ.31 లక్షలు వసూలు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని కొందరి నుంచి లక్షలు గుంజుకుంది. చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతోంది. రేఖాకు చెందిన హెచ్డిఎఫ్సి, బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్లలో 2022 నుంచి 2024 వరకు రూ.24 కోట్ల వ్యవహారం నడిపినట్లు వెలుగులోకి వచ్చింది. మరింత విచారణ కోసం చేతన్ను సకలేశపురకు తరలించారు. చదవండి: పెళ్లి బ్యానర్తో పట్టుబడ్డ నిత్యపెళ్లి కూతురు -
స్కామూ నాదే.. ఎస్కేప్ స్కీమూ నాదే
-
కొత్త స్కామ్తో బ్యాంక్ ఖాతా ఖాళీ.. ఎలా కాపాడుకోవాలంటే..
జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ ఇటీవల వెలుగులోకి వస్తోన్న కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఈ స్కామ్తో మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ఈమేరకు మోసం జరుగుతున్న విధానాన్ని తెలియజేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. అటువంటి స్కామర్లు బారిన పడకుండా ఉండాలంటే ఎలా రక్షించుకోవాలో కొన్ని చిట్కాలను అందించారు.మోసం చేస్తున్నారిలా..‘అత్యవసరంగా కాల్ చేయాలి.. మీ ఫోన్ను వినియోగించవచ్చా.. అనేలా అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని అడగవచ్చు. అమాయకంగా కనిపించే వ్యక్తులు, వృద్ధులు, చిన్న పిల్లలు.. ఈ స్కామర్ల టార్కెట్ కావొచ్చు. వారు మీ ఫోన్ తీసుకుని కాల్ చేయడానికి రహస్యంగా పక్కకు వెళితే మాత్రం అనుమానించాలి. ఎందుకంటే స్కామర్ రహస్యంగా తనకు అవరసరమయ్యే యాప్లను మీకు తెలియకుండానే డౌన్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పటికే ఉన్న యాప్లను యాక్సెస్ చేయవచ్చు. బ్యాంకింగ్ అలర్ట్లతో సహా కాల్స్, మెసేజ్లను వారి నంబర్లకు ఫార్వర్డ్ చేయడానికి మీ ఫోన్లో సెట్టింగ్లను మార్చవచ్చు. దీని ద్వారా వన్ టైమ్ పాస్వర్డ్లను(ఓటీపీలు) అడ్డుకుని అనధికార లావాదేవీలు నిర్వహించుకోవచ్చు’ అని కామత్ అన్నారు.Imagine this: A stranger approaches you and asks to use your phone to make an emergency call. Most well-meaning people would probably hand over their phone. But this is a new scam.From intercepting your OTPs to draining your bank accounts, scammers can cause serious damage… pic.twitter.com/3OdLdmDWe5— Nithin Kamath (@Nithin0dha) January 15, 2025ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?ఏం చేయాలంటే..‘మీ ఫోన్ ను అపరిచితులకు అప్పగించవద్దు. అందుకు బదులుగా ఆ నంబర్ను మీరే డయల్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టి మాట్లాడాలని సూచించాలి. ఇలాంటి కనీస జాగ్రత్తలు పాటిస్తే స్కామర్లు సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయకుండా నిరోధించే అవకాశం ఉంది’ అన్నారు. కామత్ షేర్ చేసిన ఈ వీడియోను సోషల్ మీడియాలో 4,50,000 మందికి పైగా వీక్షించారు. చాలా మంది వినియోగదారులు తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇలాంటి మోసాలకు సంబంధించి వారి సొంత అనుభవాలను పంచుకున్నారు. విభిన్న భాషల్లో ఉన్న జెరోధా వినియోగదారులు, తన ఫాలోవర్ల కోసం ఇలాంటి అవగాహన వీడియోను ఇతర భాషల్లోకి అనువదించాలని కొందరు సూచించారు. -
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై హైకోర్టు ఆగ్రహం
-
రూ.1.5 కోట్లు మోసపోయిన 78 ఏళ్ల మహిళ.. అసలేం జరిగిందంటే..
ఇంటర్నెట్, మొబైల్ డేటా వినియోగంతో దేశంలో ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సైబర్ మోసగాళ్లు రకరకాల పేర్లతో మభ్యపెట్టి, వేశాలు మార్చి అమాయకులను దారుణంగా వంచిస్తున్నారు. ఎంతోమంది వీరి బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ముంబయికి చెందిన 78 ఏళ్ల మహిళ సైబర్ స్కామ్(cyber scam)కు బలైంది. ఢిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందంగా నమ్మబలికిన ఓ సైబర్ ముఠా చేతిలో ఏకంగా రూ.1.5 కోట్ల మేర నష్టపోయింది.వివరాల్లోకి వెళితే.. దక్షిణ ముంబయిలో ప్రముఖ బిల్టర్గా పేరున్న ఓ వ్యక్తి, 78 ఏళ్ల మహిళ బంధువులు. కొన్ని వారాల క్రితం యూఎస్లో ఉన్న తన కుమార్తెకు ఆ మహిళ కొన్ని వంటకాలు పంపడానికి కొరియర్ సర్వీస్ను ఆశ్రయించింది. అక్కడే సైబర్ మోసం ప్రారంభమైంది. మరుసటి రోజు ఆమెకు కొరియర్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నట్లు ఒకరు కాల్ చేశారు. ఆమె ప్యాకేజీలో ఫుడ్ ఐటమ్స్తోపాటు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపాడు. ఆ ప్యాకేజీలో ఆధార్ కార్డ్, గడువు ముగిసిన పాస్పోర్ట్లు, క్రెడిట్ కార్డ్లు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, 2,000 యూఎస్ డాలర్లు(Dollars) ఉన్నట్లు చెప్పాడు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఆమె కుట్రకు పాల్పడినట్లు సైబర్ మోసగాళ్లు ఫోన్లో తీవ్రంగా ఆరోపించారు.ఒత్తిడిలో పూర్తి వివరాలు..ఈ స్కామ్లో భాగంగా సైబర్ క్రైమ్ బ్రాంచ్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులుగా నటిస్తూ పలువురు తర్వాత రోజుల్లో ఆమెను సంప్రదించారు. తమ వాదనలను ఆమె విశ్వసించేలా నటిస్తూ, మోసగాళ్లు(Fraudsters) పోలీసు యూనిఫామ్లో కనిపించేవారు. అరెస్ట్ వారెంట్లు, దర్యాప్తు నివేదికల వంటి నకిలీ పత్రాలను ఆమెకు చూపించి వీడియో కాల్స్ కూడా చేశారు. స్కామర్లు నకిలీ వారెంట్లు, విచారణ నివేదికలను వాట్సాప్లో చూపించినందున ఒత్తిడిలో మహిళ తన వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలను తెలియజేశారు. ఇన్వెస్ట్గేషన్(Investigation) సమయంలో ఆమె తన ఆస్తులను కాపాడుకోవాలనే తాపత్రయంలో వారిని ప్రభుత్వ అధికారులుగానే నమ్మి, మోసగాళ్లు అందించిన బ్యాంకు ఖాతాలకు రూ.1.51 కోట్లను బదిలీ చేసింది. కుటుంబ సభ్యులకు పూర్తి వివరాలు తెలియజేసి వారితో చర్చించి తాను మోసపోయానని గ్రహించింది.ఇదీ చదవండి: ప్యాసివ్ ఫండ్స్.. కార్యాచరణ ప్రకటించిన సెబీఅప్రమత్తత అవసరంసైబర్ క్రైమ్ పోలీస్ హెల్ప్లైన్ ద్వారా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి ముంబై సౌత్ సైబర్ సెల్కు కేసు బదిలీ చేశారు. మహిళ పంపిన నగదును త్వరగా ట్రాన్స్ఫర్ చేయడానికి మోసగాళ్లు పలు ఖాతాలను ఉపయోగించారని, దీంతో వారిని ట్రేస్ చేయడం కొంత క్షిష్టమవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ నిపుణులు కోరారు. తెలియని వారు చేసిన కాల్స్ను లిఫ్ట్ చేసినా ఎలాంటి వివరాలు పంచుకోవద్దని చెప్పారు. ఫోన్లో వ్యక్తిగత సమాచారాన్ని చెప్పకూడదని తెలిపారు. అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. -
శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా
-
ప్రియురాలికి ఫ్లాట్, లగ్జరీ కారు, అడ్డంగా బుక్కైన ప్రియుడు!
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగి ఉన్నట్టుండి లగ్జరీ కార్లలో షికార్లు చేయడం మొదలు పెట్టాడు. దాదాపు 22 కోట్ల స్కామ్కు పాల్పడి, లగ్జరీ ఫ్లాట్, విలువైన ఆభరణాలు కొనుగోలు చేశాడు. అదీ తన ప్రేయసికోసం. ఏంటా అని ఆరాతీస్తే, ఆరు నెలల పాటు కొనసాగిన ఇతగాడి బండారం బయట పడింది. నెట్టింట హల్చల్ చేస్తున్న స్టోరీ వివరాలు..మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్లో నెలకు రూ.13వేల జీతంతో కాంట్రాక్టు ఉద్యోగిగా పని చేసేవాడు హర్ష్ కుమార్ క్షీరసాగర్. లగ్జరీ లైఫ్పై మోజు పెంచుకున్న కుమార్ అడ్డదారి వెతుక్కున్నాడు. యశోదా శెట్టి అనే మహిళా ఉద్యోగితో చేతులు కలిపి దాదాపు రూ. 21 కోట్ల 59 లక్షల 38 వేలు కొట్టేశాడు.నకిలీ పత్రాలను ఉపయోగించి ఇండియన్ బ్యాంక్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ పేరుతో ఖాతా తెరిచారు. తరువాత ఇద్దరూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా భారీ కుంభకోణానికి తెర తీశారు. ఇలా వచ్చిన డబ్బులతో హర్ష్ కుమార్ తన ప్రియురాలికి విమానాశ్రయానికి ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్లో ఏకంగా 4 బీహెచ్కే ఫ్లాట్ గిఫ్ట్గా ఇచ్చాడు. అంతేనా..తగ్గేదేలే అంటూ బీఎండబ్ల్యూ కారు, బీఎండబ్ల్యూ బైక్, ఖరీదైన డైమండ్ ఆభరణాలు కొనుగోలు చేశాడు. దాదాపు ఆరు నెలల తరువాత వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హర్ష్కుమార్, యశోదా శెట్టి, ఆమె భర్త బీకే జీవన్ కలిసి బ్యాంకుకు ఫేక్ పత్రాలను సమర్పించి డబ్బులను డ్రా చేశారని విచారణలో తేలింది. ఈ డబ్బులను తమ వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించు కున్నారని పోలీసులు గుర్తించారు.మహిళా కాంట్రాక్ట్ వర్కర్ భర్త రూ.35 లక్షల విలువైన ఎస్యూవీని కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్ష్ కుమార్ అనిల్ క్షీరసాగర్ ఎస్యూవీతో పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇదీ చదవండి: రిటైర్మెంట్ డిప్రెషన్ డేంజర్ బెల్స్ : ఏం చేయాలి?! -
ఈ-కార్ రేసు స్కామ్పై చర్చకు రెడీ:కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని సమస్యలపై సభలో చర్చిద్దామని.. దమ్ముంటే రెండువారాలపాటు అసెంబ్లీ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సవాల్ విసిరారు. మంగళవారం కొడంగల్ బీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘కేబినెట్లో మాట్లాడటం కాదు. సభలో చర్చ చేద్దాం. అన్ని సమస్యలపై సభలో చర్చిద్దాం. ఈ-కార్ రేసు కుంభకోణంపై కూడా చర్చకు నేను రెడీ. దమ్ముంటే 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి’’ అని సీఎం రేవంత్కు సవాల్ విసిరారు.పేరు మర్చిపోయినందుకు యాక్టర్ను జైలులో పెట్టించారు. సీఎం పేరు మర్చిపోతే జైల్లో పెడతారా?అంటూ రేవంత్పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. -
అశ్లీల చిత్రాల కేసు.. శిల్పాశెట్టి భర్తకు ‘ఈడీ’ నోటీసులు
ముంబయి:వ్యాపారవేత్త,బాలీవుడ్ సీనియర్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు జారీ చేసింది. సంచలనం సృష్టించిన అశ్లీల చిత్రాల రాకెట్ కేసులో ప్రశ్నించేందుకు ఈడీ రాజ్కుంద్రాకు నోటీసులిచ్చింది.కాగా,ఇటీవలే రాజ్కుంద్రాకు సంబంధించిన పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. సోదాల అనంతరం కుంద్రాకు ఈడీ సమన్లు జారీ చేసి విచారణకు పిలవడం గమనార్హం. -
వాట్సాప్ గ్రూప్లో చేరాడు.. రూ.11 కోట్లు పోయాయి
టెక్నాలజీ పెరుగుతోంది.. స్కామర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఎంతోమంది బాధితులు మోసపోయి లెక్కకు మించిన డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా ఇలాంటి మరో సంఘటనే తెరమీదకు వచ్చింది.ముంబైలోని కోలాబాకు చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ షిప్ కెప్టెన్ను.. మొదట గుర్తు తెలియని వ్యక్తి వాట్సాప్ గ్రూప్లో చేర్చాడు. అతడు పెట్టుబడికి సంబంధించిన సలహాలు ఇస్తూ.. షేర్ మార్కెట్ పెట్టుబడుల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలను వెల్లడించాడు. దీనికోసం ఒక యాప్లో పెట్టుబడి పెట్టమని సూచించారు. అప్పటికే చాలామంది లాభాలను పొందుతున్నట్లు కూడా పేర్కొన్నాడు.గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన మాటలు నిజమని కెప్టెన్ నమ్మేశాడు. దీంతో స్కామర్ బాధితున్ని మరో వాట్సాప్ గ్రూప్లో చేర్చాడు. కంపెనీ ట్రేడింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ను షేర్ చేశాడు. బాధితుడు యాప్ను డౌన్లోడ్ చేసిన తర్వాత.. ట్రేడింగ్, ఐపీఓ వంటి వాటికి సంబంధించిన మెసేజ్లను అందుకుంటాడు. అదే సమయంలో స్కామర్.. బాధితుని ఇంకొక వ్యక్తిని పరిచయం చేసాడు. ఆ వ్యక్తి.. బాధితుడు సిఫార్సు చేసిన స్టాక్లలో పెట్టుబడి పెట్టడానికి వివిధ బ్యాంకు ఖాతాలకు డబ్బును బదిలీ చేయమని ఒప్పించాడు.లావాదేవీలన్నీ సెప్టెంబర్ 5, అక్టోబర్ 19 మధ్య జరిగాయి. బాధితుడు 22 సార్లు.. మొత్తం రూ. 11.16 కోట్లు వివిధ బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేసాడు. వేరు వేరు ఖాతాకు ఎందుకు డబ్బు బదిలీ చేయాలని బాధితుడు స్కామర్లను అడిగినప్పుడు.. ట్యాక్స్ ఆదా చేయడానికి అని అతన్ని నమ్మించారు.కొన్ని రోజుల తరువాత తన నిధులలో కొంత తీసుకోవాలనుకుంటున్నానని.. స్కామర్లు అడిగినప్పుడు, సర్వీస్ ట్యాక్స్ కింద పెట్టుబడులపై 20 శాతం చెల్లించాలని కోరారు. ఇది చెల్లించిన తరువాత కూడా.. మళ్ళీ మళ్ళీ ఏదేది సాకులు చెబుతూ.. మోసం చేస్తూనే ఉన్నారు. చివరకు బాధితుడు మోసపోయామని గ్రహించాడు. దీంతో పోలీసులను ఆశ్రయించాడు.ఇలాంటి మోసాల నుంచి బయటపడటం ఎలా?👉గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను స్పందించకపోవడం మంచిది.👉ఎక్కువ డబ్బు వస్తుందని నమ్మించడానికి ప్రయత్నించడం, లేదా లింకులు పంపించి వాటిపై క్లిక్ చేయండి.. మీకు డబ్బు వస్తుంది అని ఎవరైనా చెబితే.. నమ్మకూడదు.👉స్టాక్ మార్కెట్కు సంబంధించిన విషయాలను చెబుతూ.. ఎక్కువ లాభాలు వస్తాయని చెబితే నమ్మవద్దు. 👉షేర్ మార్కెట్కు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలంటే.. నిపుణలను సందర్శించి తెలుసుకోవాలి. లేదా తెలిసిన వ్యక్తుల నుంచి నేర్చుకోవాలి.👉స్కామర్లు రోజుకో పేరుతో మోసాలు చేయడానికి పాల్పడుతున్నారు. కాబట్టి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. -
యూపీఐ మోసాలు.. వామ్మో.. ఇన్ని కోట్లా..?
దేశంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ఆధారిత మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరు వరకు 6,32,000 ఫిర్యాదులు నమోదు కాగా.. ఏకంగా రూ.485 కోట్లు వినియోగదారులు నష్టపోయారు.2022-23 నుంచి చూస్తే మొత్తం 27 లక్షల మంది రూ.2,145 కోట్లు నష్టపోయారు.ఇటీవలి కాలంలో యూపీఐ వినియోగం భారీగా పెరగడం కూడా ఇందుకు ప్రధాన కారణం. ఒక్క అక్టోబరు నెలలోనే.. 2016లో యూపీఐ వ్యవస్థ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు జరగనన్ని లావాదేవీలు జరిగాయి. రోజుకు 53.5 కోట్ల చొప్పున నెలలో మొత్తం 16.58 బిలియన్ల లావాదేవీలు జరగ్గా వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లు. -
కూటమి ప్రభుత్వం కమీషన్ల దందా
-
డిజిటల్ అరెస్ట్ స్కామ్: ఖాతాదారుడ్ని కాపాడిన ఎస్బీఐ సిబ్బంది
టెక్నాలజీ పరుగులు పెడుతున్న తరుణంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్లు రోజుకో అవతరమెత్తి అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇందులో ఒకటి డిజిటల్ అరెస్ట్. దీనికి బలైనవారు ఇప్పటికే కోకొల్లలు. అయితే ఇటీవల ఎస్బీఐ సిబ్బంది ఓ వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ బారినుంచి కాపాడి.. లక్షలు పోగొట్టుకోకుండా చూడగలిగారు.బ్యాంకుకు(గోప్యత కోసం బ్రాంచ్ను ప్రస్తావించడం లేదు) చాలా కాలంగా కస్టమర్గా ఉన్న 61 ఏళ్ల డాక్టర్ను స్కామర్లు టార్గెట్ చేశారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారని సీనియర్ సిటిజన్ను నమ్మించి, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని బెదిరించి.. డబ్బు కాజేయాలని పన్నాగం పన్నారు. అయితే.. ఆ పెద్దాయన తన ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి డబ్బు విత్డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్ళాడు. ఆ సమయంలో అతడు కొంత టెన్షన్గా ఉండటాన్ని బ్యాంకు అసోసియేట్ గమనించి, సమస్య గురించి ఆరా తీసింది. వ్యక్తిగత కారణాల వల్లనే డబ్బు తీసుకుంటున్నాని ఆయన వెల్లడించారు. అయితే బ్యాంకు అసోసియేట్ ఆయన మాటలు నమ్మలేదు. అతన్ని బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు పంపించింది.ఖాతాదారుడున్ని.. బ్యాంక్ మేనేజర్ కూడా అడిగాడు. ఆ వ్యక్తి ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నానని సమాధానమిచ్చాడు. కానీ స్థలం ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పినట్లు.. దీంతో అనుమానం మరింత పెరిగిందని మేనేజర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో తిరిగి రావాలని బ్యాంకు సిబ్బంది ఖాతాదారుడికి సూచించారు. అంతే కాకుండా మూడు రోజుల పాటు నగదు బదిలీని ప్రాసెస్ చేయడానికి నిరాకరించామని మేనేజర్ చెప్పారు.ఒక సందర్భంలో ఖాతాదారుడు బ్యాంక్ అసోసియేట్ దగ్గరకు వెళ్లకుండా తప్పించుకున్నాడు. బదులుగా మరొక అసోసియేట్ దగ్గరకు వెళ్ళాడు. ఇదంతా గమనించిన బ్యాంక్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బ్యాంక్ కస్టమర్ను 1930కి కనెక్ట్ చేసింది, జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ ద్వారా అక్కడ డిజిటల్ అరెస్ట్ లాంటిదేమీ లేదని స్పష్టం చేసారు.చివరకు ఆ సీనియర్ సిటిజన్ జరిగిన మొత్తం చెప్పాడు. బ్రాంచ్ను సందర్శించినప్పుడు, అతను స్కామర్తో కాల్లో ఉన్నాడని, అతను బ్యాంకు ఉద్యోగులను నమ్మవద్దని పదేపదే చెప్పినట్టు వివరించారు. మూడు రోజులు స్కామర్ చేతిలో నలిగిన వృద్ధున్ని బ్యాంక్ సిబ్బంది కాపాడింది.డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే. -
మహారాష్ట్రలో వేల కోట్ల బిట్కాయిన్ స్కాం కలకలం.. సుప్రీం కీలక ఆదేశాలు
ముంబై : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రూ.6,600 కోట్ల బిట్ కాయిన్ స్కాం కలకలం రేపుతోంది. ఈ స్కాంలో పలువురి రాజకీయ నాయకుల హస్తం ఉందంటూ పలు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు సైతం కేసు విచారణ చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే, ఈ బిట్ కాయిన్ స్కాంలో మహరాష్ట్ర కాంగ్రెస్, ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన జరిగిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, ఎన్సీపీ (ఎస్పీ)ఎంపీ సుప్రియా సూలే బిట్కాయిన్లను ఉపయోగించారంటూ మాజీ పోలీసు అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు.అందుకు ఊతం ఇచ్చేలా మహరాష్ట్ర పోలింగ్కు ఒక రోజు ముందు అంటే నిన్న (నవంబర్19) బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ సుధాన్షు త్రివేది ప్రెస్మీట్లో ఆధారాల్ని బహిర్ఘతం చేశారు. వాటిలో కాల్ రికార్డింగ్లు, వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ఉన్నాయి. తాను బహిర్ఘతం చేసిన ఆధారాల్లో ఒక ఆడియో క్లిప్లో సుప్రియా సూలే వాయిస్ బయటికి వచ్చిందని ఆరోపించారు. అంతేకాదు, మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సైతం ఆ ఆడియోలో ఉన్నది తన చెల్లెలు సుప్రియా సూలే వాయిస్ అని ధృవీకరించడం సంచలనం రేపుతోంది.కాగా, బిట్ కాయిన్ స్కాంపై విచారణ చేపట్టేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఈ బిట్ కాయిన్ స్కాం ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది. -
ఫ్రీ గ్యాస్ పథకంలో మోసాన్ని బయటపెట్టిన ఎమ్మెల్సీ బొత్స
-
3600 మందికి 300 కోట్లకు టోకరా..8 మంది నిందితుల అరెస్ట్
-
కొత్త స్కామ్.. రూటు మార్చిన కేటుగాళ్లు
టెక్నాలజీని ఉపయోగించుకుని స్కామర్లు కొత్త ఎత్తులతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటికే ఫేక్ జాబ్ ఆఫర్స్ పేరుతో, స్టాక్ మార్కెట్ స్కీమ్ పేరుతో, డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బంధువుల పేరుతో మోసాలు చేయడానికి సిద్దమైపోతున్నారు. దీనికి సంబంధించిన కేసులు కూడా వెలుగులోకి వస్తున్నాయి.గుర్తు తెలియని వ్యక్తులు మన ఫోన్ నెంబర్, ఇతర వివరాలను కనుక్కుని.. బంధువుల మాదిరిగా ఫోన్ చేసి చాలా మర్యాదగా, బాగా తెలిసిన వ్యక్తుల మాదిరిగానే ప్రవర్తిస్తారు. తాము కష్టాల్లో ఉన్నామంటూ డబ్బు బదిలీ చేయాలని, లేదా మీ నాన్న నాకు కొంత మొత్తంలో డబ్బు ఇవ్వాలి.. నిన్ను అడిగి తీసుకోమన్నారని, అందుకే నెంబర్ కూడా ఇచ్చారని నమ్మిస్తారు. ఇది నమ్మి డబ్బు బదిలీ చేశారో మీరు తప్పకుండా మోసపోయినట్టే.ఇదీ చదవండి: వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..ఈ స్కామ్ నుంచి బయటపడటం ఎలా?మీకు ఫోన్ చేసిన వ్యక్తి నిజంగానే మీ బంధువా? లేదా తెలిసిన వ్యక్తా? అని ముందుగానే ద్రువీకరించుకోవాలి.స్కామర్ ఎప్పుడూ మిమ్మల్ని తొందర పెడుతూ.. మీకు ఆలోచించుకునే సమయాన్ని కూడా ఇవ్వకుండా చేస్తాడు, కాబట్టి మీరు ఇలాంటి సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.మీకు తెలియని వ్యక్తులతో.. ఆర్థిక విషయాలను లేదా వ్యక్తిగత విషయాలను చర్చించకూడదు. ఎదుటి వారి మాటల్లో ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే కాల్ కట్ చేయడం ఉత్తమం.జరుగుతున్న మోసాలను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటం మంచిది. ఆ విషయాలను తెలిసిన వాళ్లకు చెబుతూ.. వాళ్ళను కూడా హెచ్చరిస్తూ ఉండటం శ్రేయస్కరం. -
‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్కు రూ. 5 కోట్ల టోకరా
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారకకు చెందిన 34 ఏళ్ల మహిళ తన తీరిక సమయంలో ఫేస్బుక్ను స్క్రోలింగ్ చేసింది. ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది. ఆ యాడ్లో లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ పిల్లలకు మోడలింగ్ అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొంది.దీనితో పాటు మోడలింగ్లో శిక్షణ కూడా ఇస్తామని తెలిపింది. తన కుమార్తెకు ఇది మంచి అవకాశం అవుతుందని ఆమె భావించింది. వెంటనే సదరు మహిళ ఆ యాడ్పై క్లిక్ చేసింది. అది ఆమెను ‘టెలిగ్రామ్’కు తీసుకువెళ్లింది. ఈ సంస్థను ఇదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు సంప్రదించారు. తమపిల్లలను మోడల్స్గా మార్చాలనే తాపత్రయంలో ఆ సంస్థ అడిగినంత ఫీజు చెల్లించారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ సంస్థ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించిన చిన్నారులకు మోడలింగ్ అసైన్మెంట్లు ఇవ్వనున్నట్లు హామీనిచ్చింది. ఎంతకాలం గడిచినా లాట్స్ స్టార్ కిడ్స్ సంస్థ చిన్నారులకు మోడలింగ్ అవకాశాలు కల్పించలేదు. దీంతో తాము మోసపోయామని గ్రహించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్లు చేపట్టి ఈ సంస్థ గుట్టును రట్టు చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఈ సంస్థ ముఠా సభ్యులు 197 మంది తల్లిదండ్రుల నుంచి రూ.4.7 కోట్లకు పైగా మొత్తాన్ని వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. పిల్లలను మోడల్స్గా తీర్చిదిద్దాలనుకునే తల్లిదండ్రులను టార్గెట్గా చేసుకుని, వీరు భారీ ఎత్తున మోసానికి పాల్పడ్డారు.ఈ స్కామర్లు మోడలింగ్ చేస్తున్న పిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇతర తల్లిదండ్రులను ఆకర్షిస్తారు. తరువాత వారిని టెలిగ్రామ్ గ్రూప్లో చేర్చి, పిల్లలకు మోడలింగ్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేస్తారు. ఇందుకు ఆన్లైన్ వేదికను ఉపయోగించుకుంటారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. తల్లిదండ్రులు ఇలాంటి ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: రైలులో పాము కాటు.. ప్రయాణికుల తొక్కిసలాట -
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ను ఉద్దేశించి హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు
-
వెలుగులోకి రామోజీ చట్ట విరుద్ధ కార్యకలాపాలు
-
ఎస్బీఐ కస్టమర్లకు హెచ్చరిక: ఆ లింక్ క్లిక్ చేశారో..
టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతోందో.. సైబర్ మోసాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB).. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు ఓ కొత్త స్కామ్ గురించి హెచ్చరికలు జారీ చేసింది.స్కామర్లు మోసపూరిత సందేశాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు పంపిస్తున్నట్లు తెలిసింది. ఎస్బీఐ రివార్డును రీడీమ్ చేసుకోవడానికి యాప్ డౌన్లోడ్ చేయమని కొందరు మోసపూరిత మెసేజ్లను పంపిస్తున్నారు. ఈ మెసేజ్ను పీబీఐ షేర్ చేస్తూ.. వినియోగదారులు ఇలాంటి సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరింది. అనుచిత లింకుల మీద క్లిక్ చేయడం, యాప్స్ డౌన్లోడ్ చేయడం వంటివి చేయకూడదని పేర్కొంది.గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ వంటి విశ్వసనీయ మూలాల నుంచి మాత్రమే బ్యాంక్ సంబంధిత యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. ఇన్స్టాలేషన్ చేయడానికి ముందే దాని గురించి తెలుసుకోవాలని పేర్కొంది. నిజంగానే ఎస్బీఐ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడానికి కస్టమర్లు అధికారిక రివార్డ్ వెబ్సైట్ సందర్సించాల్సి ఉంటుంది. లేదా కస్టమర్ కేర్కు కాల్ చేయాలి.స్కామర్లు పంపించిన మెసేజ్లను నిజమని నమ్మి.. లింక్ మీద క్లిక్ చేస్తే తప్పకుండా మోసపోతారు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు చాలామంది బలైపోయారు. కాబట్టి వినియోగదారులు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనుమానాస్పద లింకుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయకూడదు.Beware ‼️Did you also receive a message asking you to download & install an APK file to redeem SBI rewards❓#PIBFactCheck❌@TheOfficialSBI NEVER sends links or APK files over SMS/WhatsApp✔️Never download unknown files or click on such links🔗https://t.co/AbVtZdQ490 pic.twitter.com/2J05G5jJZ8— PIB Fact Check (@PIBFactCheck) November 2, 2024ఇదీ చదవండి: సిద్దమవుతున్న సూపర్ యాప్: ఐఆర్సీటీసీ సర్వీసులన్నీ ఒకే చోట..సైబర్ నేరాలను తగ్గించడంలో ఆర్బీఐరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైబర్ నేరాలను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పనిచేస్తోంది. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ఆటోమాటిక్ వార్ణింగ్ సిస్టం రూపొందిస్తోంది. దీని సాయంతో అనుమానాస్పద లింకులు వచినప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తుంది. దీంతో యూజర్ జాగ్రత్త పడవచ్చు. అయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం తెలియాల్సి ఉంది. -
వారం రోజుల్లో రూ.9.54 కోట్లు మాయం: ఏం జరిగిందంటే..
ఆన్లైన్ మోసాలు భారీగా పెరుగుతున్న తరుణంలో.. బెంగళూరులో ముగ్గురు వ్యక్తులు స్టాక్ ట్రేడింగ్ స్కామ్ల బారిన పడ్డారు. వీరు కేవలం ఒక వారం రోజుల్లో ఏకంగా 9.54 కోట్ల రూపాయాలు పోగొట్టుకున్నారు. ఇందులో ఇద్దరు వ్యాపవేత్తలు, ఒక ఇంజినీర్ ఉన్నట్లు సమాచారం.అధిక రాబడి వస్తుందనే వాగ్దానాలతో పబ్లిక్ ఆఫర్లకు ముందస్తు యాక్సెస్తో బాధితులను ఆకర్శించారు. మోసగాళ్లు బాధితులను మొదట్లో 'జేజే77 ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియా', జీ3364 మెయిన్ పుల్ అప్ లేఅవుట్ ఎక్స్ఛేంజ్ గ్రూప్' అనే వాట్సాప్ గ్రూపులలో యాడ్ చేశారు. గ్రూపుల్లో పరిచయం లేనివారి నుంచి స్టాక్ మార్కెట్ పెట్టుబడికి సంబంధించిన టిప్స్ తెలుసుకున్నారు.పరిచయం లేనివారు ఇచ్చిన సలహాలను అనుసరించి.. ముగ్గురు వ్యక్తులు స్కామర్లు అందించిన లింక్ల ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. యాప్లో స్కామర్లు ఆకట్టుకునే ట్రేడింగ్ లాభాలను చూపడంతో బాధితులు సెప్టెంబర్ 8, అక్టోబర్ 23 మధ్య వేర్వేరు బ్యాంక్ ఖాతాల నుంచి కోట్ల రూపాయలు బదిలీ చేశారు. వారు అనుకున్న లాభాలు రాకపోగా.. చివరకు మోసపోయినట్లు తెలుసుకున్నారు.ఇదీ చదవండి: స్కూటర్పై వచ్చి కిడ్నాప్.. అదానీ జీవితంలో భయంకర ఘటనమోసపోయామని తెలుసుకుని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా నేరస్థులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి స్కామ్స్ ఎక్కువవుతున్నాయి కాబట్టి.. ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులు పంపించే లింక్స్ మీద క్లిక్ చేయకూడదు. పొరపాటున క్లిక్ చేసిన భారీ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది. -
రూ.8 వేలకోట్ల ఎగవేతకు ప్రణాళిక.. సూత్రధారి అరెస్ట్
దేశంలో జీఎస్టీ ఎగవేత మోసాలు ఎక్కువవుతున్నాయి. రూ.5,000 కోట్లు-రూ.8,000 కోట్ల విలువైన జీఎస్టీని ఎగవేసేందుకు 246 బోగస్ కంపెనీలను సృష్టించిన ముఠా గుట్టు రట్టయింది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారిగా వ్యవహరించిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా(50) సహా ఎనిమిది మంది వ్యక్తులపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బృందం నకిలీ పత్రాలు, సంస్థలను సృష్టించి మోసపూరిత లావాదేవీలకు పాల్పడినట్లు గుర్తించారు.పుణెలోని కోరేగావ్ పార్క్ పోలీసుల కథనం ప్రకారం..సూరత్కు చెందిన అస్రఫ్ ఇబ్రహీం కలవాడియా (50) సహా ఎనిమిది మంది వ్యక్తులు భారీగా జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డారు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 246 బోగస్ కంపెనీలు సృష్టించి ఈ చర్యకు పూనుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏకంగా రూ.5000 కోట్లు-రూ.8000 కోట్లు వరకు నష్టం జరుగుతుంది. సెప్టెంబర్ 2018-మార్చి 2024 మధ్య వివిధ కంపెనీలపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిగింది. పుణెకు చెందిన హడప్సర్లోని శివ చైతన్య కాలనీ చిరునామాతో రిజిస్ట్రర్ అయిన పఠాన్ ఎంటర్ప్రైజెస్ రూ.20.25 కోట్ల జీఎస్టీను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో జీఎస్టీ సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసింది. దీనిపై విచారణ జరిపి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) జోనల్ యూనిట్ అధికారులు పుణె పోలీసుల సహకారంతో కలవాడియాను ఎరవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ సంఘటనలో తనకు సహకరించిన మరో ఏడుగురు నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు.ఆటోరిక్షా డ్రైవర్ పేరుతో కంపెనీ నమోదుపఠాన్ షబ్బీర్ ఖాన్ అన్వర్ ఖాన్ అనే వ్యక్తి పాన్కార్డుతో పఠాన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను నమోదు చేశారు. గుజరాత్లోని భావ్నగర్లోని ఖుంబర్వాడ ప్రాంతానికి చెందిన పఠాన్ ఆటోరిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పాన్కార్డులో నమోదైన చిరునామాతో పోలీసులు తన ఇంటికి వెళ్లేసరికి అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. నిందితులు చట్ట విరుద్ధంగా పఠాన్ పాన్కార్డు వాడి కంపెనీ నమోదు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.ఇదీ చదవండి: డిఫెన్స్ ఉత్పత్తులు ఎగుమతయ్యే టాప్ 3 దేశాలుసెక్యూరిటీగార్డు పేరుతో బ్యాంకు ఖాతాతదుపరి విచారణలో గుజరాత్లోని రాజ్కోట్లో జీత్ కుకాడియా అనే పేరుతో బ్యాంక్ ఖాతా తెరిచారు. కుకాడియా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఈ నేరంతో తనకు సంబంధం లేదని ఆయన తెలిపారు. బ్యాంకు స్టేట్మెంట్లు, కాల్ రికార్డులను పరిశీలించిన తర్వాత ఈ ఘటనకు కలవాడియాను ప్రధాన సూత్రధారిగా గుర్తించామని సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ప్రకాశ్ తెలిపారు. ముంబైలోని మీరా భయాందర్లోని ఒక హోటల్లో కలవాడియాను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. తన వద్ద నుంచి సెల్ఫోన్లు, ల్యాప్టాప్లు, సిమ్ కార్డ్లు, చెక్ బుక్లు, డెబిట్ కార్డ్లు, రబ్బర్ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పన్ను ఎగవేత కోసం మోసపూరిత లావాదేవీలు జరిపేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్లు కలవాడియా అంగీకరించాడని ప్రకాశ్ వివరించారు. -
రవాణాశాఖలో ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: రవాణాశాఖలో కొందరు అధికారులు, ఓ ప్రైవేటు ఏజెన్సీ సిబ్బంది కలిసి ఫ్యాన్సీ నంబర్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఫ్యాన్సీ నంబర్లకు వాహన దారులు కోట్ చేసిన ధరను రహస్యంగా ఉంచాల్సింది పోయి, ఆ మొత్తాన్ని అనుకూల వాహనదారుల చెవిన పడేసి ఆ నంబర్ వారికే దక్కేలా పావులు కదిపారు. ఇలా ఒక్కో నంబర్ కేటాయింపు ద్వారా భారీగా కమీషన్లు దండుకున్నారు. ఇదంతా ఓ అధికారి కనుసన్నల్లో జరిగిందని తేల్చుకున్న ప్రభుత్వం ఆయనపై చర్యలకు సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా రవాణాశాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం గుట్టు విప్పే పని ఇప్పుడు వేగంగా సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు భారీగా అక్రమాలను సాగించారని గుర్తించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. గతంలో రవాణాశాఖలో అన్నీ తానై చక్రం తిప్పిన ఓ అధికారిపై భారీగా ఫిర్యాదులున్నాయి.కమిషనర్ను కూడా లెక్క చేయకుండా ఆ అధికారే అన్ని చక్కబెట్టేవారన్న ఆరో పణలున్నాయి. సిబ్బందికి పదోన్నతులు, బదిలీలు కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగేవి. ఇదే తరహాలో ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపు వ్యవహారం కూడా చోటుచేసుకుంది. ఆ అధికారికి చెందిన ఓ బినామీ సంస్థ కూడా ఈ శాఖలో కీలకంగా వ్యవహరించిందని సమాచారం. రూ.కోట్లలో కమీషన్లురవాణా శాఖ కార్యాలయాలకు సాంకేతిక సహకారాన్ని అందించే బాధ్యతను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ సంస్థ సిబ్బందిని ఓ అధికారి తన అక్రమాలకు వినియోగించుకున్నారన్న ఫిర్యాదులున్నాయి. రవాణా శాఖలో ఫ్యాన్సీ నంబర్లకు బాగా డిమాండ్ ఉంటుంది. సెంటిమెంటు ఆధారంగా వాహనదారులు తమకు ఇష్టమైన నంబరును పొందేందుకు ఆసక్తి చూపుతారు. 0001, 9999, 0099, 5555... ఇలాంటి నెంబర్లకు డిమాండ్ చాలా ఎక్కువ. ఏటా దాదాపు లక్ష వరకు నంబర్లను వేలంలో ఉంచటం ద్వారా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్లకుపైగా ఆదాయం వస్తుంది.ఈ నంబర్ల కేటాయింపు బిడ్డింగ్ పద్ధతిలో జరుగుతుంది. ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వారికి నంబరు దక్కుతుంది. రవాణాశాఖ ప్రధాన సర్వర్ వద్ద విధుల్లో ఉండే ప్రైవేటు సంస్థ సిబ్బంది బిడ్డింగ్లో కోట్ చేసిన మొత్తాన్ని ఆ అధికారికి చేరవేసేవారు. అప్పటికి బిడ్లో నమోదైన గరిష్ట మొత్తాన్ని తెలుసుకుని అనుకూల వాహనదారులకు చేరవేయటం ద్వారా నంబర్ అలాట్ అయ్యే మొత్తం కోట్ చేసేలా చక్రం తిప్పేవారు. ఇలా కోరిన వారికి నంబర్ ఇప్పించి పెద్ద మొత్తంలో కమీషన్లు వసూలు చేసే వారు. అలా ఏటా రూ.కోట్లలో జేబుల్లో వేసుకునేవారు. ఇప్పుడు దీనిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తోంది. ఈ కుంభకోణంలో బాధ్యులుగా కొందరిని గుర్తించింది. ప్రస్తుతానికి 56 మంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ల(డీబీఏ)లను విధుల్లో నుంచి తొలగించినట్టు తెలిసింది. త్వరలో మరికొందరిపైనా చర్యలు తీసుకోనున్నట్టు సమా చారం. సూత్రధారిగా ఉన్న అధికారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. -
ప్రశ్నించే స్వరం వినిపించకూడదా?
విజయవాడలో బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. – వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై నిలదీయకూడదా? మీరు చేసే అవినీతిపై ప్రశ్నించకూడదా? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? ఇదెక్కడి అరాచక పాలన..?’ అంటూ సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రశ్నించే స్వరమే వినిపించకూడదని ఆరాటపడుతూ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. దీనికి ‘సాక్షి’ ఎడిటర్పై పెట్టిన కేసే తార్కాణమని చెప్పారు. ‘ఇలాగైతే ప్రజలు మీకు సింగిల్ డిజిట్ కూడా దక్కకుండా చేస్తారు...’ అంటూ చంద్రబాబును హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకో..చంద్రబాబు అధికారంలో ఉన్నంత మాత్రానా ఏం చేసినా చెల్లుతుందనుకుంటే ప్రజలు తిరగబడతారు. అప్పుడు చంద్రబాబుకు, ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. మా నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదు. బంతిని నేలకేసి ఎంత గట్టిగా కొడితే అంతపైకి లేస్తుంది. ఎప్పటికైనా చేసిన తప్పును నిజాయతీగా ఒప్పుకుంటే.. ఆ వ్యక్తిలో పరివర్తన వస్తే కొద్దో గొప్పో సానుకూలత పెరుగుతుంది. అంతేగానీ తప్పు కనిపించకూడదు... దాని గురించి ఎవరూ మాట్లాడకూడదంటే ఎవరూ హర్షించరు. రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాడేందుకు మా పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మద్యం విషయంలో మహిళలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. మా హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలు లేవు. ప్రభుత్వమే పారదర్శకంగా నిర్వహించింది. డిజిటల్ పేమెంట్లతోపాటు క్యాష్ పేమెంట్లను అందుబాటులో ఉంచాం. ప్రతి దుకాణంలో పీవోఎస్లు పెట్టాం. ఇప్పుడు మొత్తం ప్రైవేటు పరం అయ్యాయి. టీడీపీకి చెందిన వాళ్లే నడుపుతున్నారు. స్ట్రైక్ రేటు చూసుకుని స్కాములు చేస్తామంటే ఈసారి దెబ్బ గట్టిగా తగులుతుంది. జమిలి ఎన్నికలు మన చేతుల్లో లేవు. ఏం జరిగినా పార్టీని సన్నద్ధంగా పెట్టడానికి రెడీగా ఉన్నాం. గ్రామ స్థాయిలో పార్టీకి బూత్ కమిటీలు నియమించి మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. వరదల్లోనూ స్కామ్లేనా?చంద్రబాబు స్కామ్లు ఏ స్థాయిలో ఉన్నాయో విజయవాడలో వరదల సమయంలో చూశాం. బుడమేరు వరద ముంపునకు గురైన కోటి మందికి భోజనం ఖర్చు రూ.368 కోట్లుగా తేల్చారు. అసలు పునరావాస కేంద్రాలు ఎక్కడ పెట్టారు? అందులోకి ఎంత మందిని తరలించారు? ఎవరికి భోజనం పెట్టారు? అందరూ నీళ్లలో మునిగి ఉంటే మొబైల్ జనరేటర్లు పెట్టారంటా! నీళ్లలో ఉన్నోళ్లు తమను చంద్రబాబు బయటకు తీసుకురావట్లేదని మొత్తుకున్నారు. వీళ్లేమో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మొబైల్ జనరేటర్లకు రూ.23 కోట్లు ఖర్చు రాశారు. ఇంత దారుణంగా స్కాముల మీద స్కాములు చేస్తున్నారు. పైగా ఇవే ప్రశ్నలు అడిగినందుకు ‘సాక్షి’ ఎడిటర్పై కేసు పెట్టారు. ఇంత దారుణంగా ప్రభుత్వ పాలన చేస్తుంటే ప్రశ్నించకూడదా? వీళ్లు ఏం చేసినా ఎవరూ మాట్లాడకూడదా? అసలు వీళ్లు పరిపాలన చేయడానికి యోగ్యులేనా? ప్రజలందరూ ఆలోచించాలి. -
సాహితీలో తవ్వేకొద్దీ డొల్ల కంపెనీలు
సాక్షి, హైదరాబాద్: సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ ప్రీలాంచ్ స్కాంలో తవ్వేకొద్దీ కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణతోపాటు కంపెనీ డైరెక్టర్లు సైతం అందినకాడికి దండుకున్నట్టు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు లక్ష్మీనారాయణను సోమవారం నుంచి కస్టడీకి తీసుకొని విచారిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 1,800 మంది కస్టమర్ల నుంచి రూ. 2 వేల కోట్ల మేర వసూలు చేసినట్టు ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఆ సొమ్మును ఏఏ కంపెనీల్లోకి మళ్లించారన్న దానిపై ఈడీ అధికారులు దృష్టి పెట్టారు. ఇదే అంశంపై లక్ష్మీనారాయణను గురువారం కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. గత 3 రోజులుగా ఈడీ సేకరించిన సమాచారం మేరకు లక్ష్మీనారా యణతోపాటు మరికొందరు డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో లక్ష్మీనారాయణ సోదరుడు హరిబాబు, గోలమారి ఆంథోనిరెడ్డి, అతడి కుమారుడు అక్షయ్రెడ్డి, సతీశ్ చుక్కపల్లి, లక్ష్మీనారాయణ భార్య పార్వతి, లక్ష్మీనారాయణ కుమారుడు సాతి్వక్, పూర్ణచందరరావు సండులు సైతం డైరెక్టర్లుగా కొనసాగారు. ఈ భారీ కుంభకోణంలో లక్ష్మీనారాయణ తర్వాత కీలక పాత్రధారులుగా గోలమారి ఆంధోనిరెడ్డి, పూర్ణచందర్రావులు ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా లక్ష్మీనారాయణ ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. దీంతో చివరిరోజు మరిన్ని కీలక అంశాలపై ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. నేతల పేర్లు చెప్పి రూ. కోట్లు పక్కదారి పట్టించిన ఆంథోనిరెడ్డి? కీలక నిందితుల్లో ఒకరిగా ఈడీ అనుమానిస్తున్న గోలమారి ఆంథోనిరెడ్డి నాయకుల పేర్లు చెప్పి కమీషన్ల పేరిట పదుల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్కు కావాల్సిన అనుమతులు ఇప్పిస్తానని ఇద్దరు నేతల కోసమని రూ.40 కోట్ల మేర తీసుకున్నట్టుగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. హెచ్ఎండీఏ అనుమతుల కోసం కొందరు అధికారులకు ఇవ్వాలంటూ రూ.10 కోట్లకు పైగా కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. ఆంథోనిరెడ్డి తన కుమారుడు అక్షయ్రెడ్డిని సైతం డైరెక్టర్గా పెట్టి అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. మరో డైరెక్టర్ పూర్ణచందర్రావు సైతం పెద్ద మొత్తంలోనే డబ్బులు దండుకున్నట్టు ఈడీ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బ్రోకర్ల ద్వారా అడ్డగోలుగా వసూళ్లు ప్రీ లాంచ్ ఆఫర్ల పేరిట పెద్ద ఎత్తున మోసాలకు తెర తీసేందుకు కంపెనీ ఎండీ లక్ష్మీనారాయణతోపాటు ఇతర డైరెక్టర్లూ వారికి నచ్చిన విధంగా బ్రోకర్లను నియమించుకొని పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్లుగా వ్యవహరించిన వారిలో కొందరు ఎన్ఆర్ఐలను సైతం ఈ కుంభకోణంలోకి లాగేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. కొందరు కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కంపెనీ లెక్కల్లోకి చూపకుండా కొందరు ఇష్టారీతిన వాడుకున్నట్టు సమాచారం. డొల్ల కంపెనీల్లోకి డబ్బుల మళ్లింపు ప్రీలాంచ్ పేరిట వసూలు చేసిన డబ్బును దారి మళ్లించేందుకు డొల్ల కంపెనీలను సృష్టించారు. ఒక కంపెనీలో ఉన్నవారే మరో కంపెనీలో డైరెక్టర్లుగా, భాగస్వాములుగా వీటిని ఏర్పాటు చేసినట్టు ఈడీ అధికారులు ఆధారాలు సేకరించినట్టు సమాచారం. -
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
హైదరాబాద్ లో డీబీ స్టాక్ బ్రోకింగ్ స్కాం ప్రకంపనలు
-
‘పెన్షన్ ఆగిపోతుంది’.. బురిడీకొట్టిస్తున్న కొత్త స్కామ్!
పెన్షనర్లను మోసగాళ్లు కొత్త స్కామ్తో బురిడీకొట్టిస్తున్నారు. ఢిల్లీలోని సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ (CPAO) అధికారులమని చెప్పుకుంటూ పెన్షనర్లను టార్గెట్ చేస్తున్నారు. ఈ మోసగాళ్లు ఫేక్ వాట్సాప్ సందేశాలు పంపి తప్పుడు ఫారమ్లను నింపమని కోరుతున్నారు. పాటించకపోతే వారి పెన్షన్ చెల్లింపులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.వార్తా నివేదికల ప్రకారం.. బ్యాంకు ఖాతా వివరాలు, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) నంబర్ల వంటి వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడమే లక్ష్యంగా మోసగాళ్లు ఈ స్కామ్ చేస్తున్నారు. ఈ సమాచారంతో వారు పెన్షనర్ల వివరాలను దొంగిలించి ఆర్థిక మోసానికి పాల్పడవచ్చు. ఈ నేపథ్యంలో పెన్షనర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.సీపీఏఓ పేరుతో ఏదైనా సందేశం వస్తే దాని ప్రామాణికతను పరిశీలించుకోవాలి. అధికారిక ఏజెన్సీలు వాట్సాప్ లేదా ఇతర అనధికారిక ప్లాట్ఫారమ్ల ద్వారా వ్యక్తిగత వివరాలను అడగవు. మీ పీపీఓ నంబర్, పుట్టిన తేదీ, బ్యాంక్ వివరాల వంటి సున్నితమైన సమాచారాన్ని మెసేజింగ్ యాప్ల ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. అనుమానం వస్తే సీపీఏఓ లేదా బ్యాంక్ వారిని అధికారిక సంప్రదింపు వివరాలను ఉపయోగించి సంప్రదించండి. -
దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్ట్: దీని గురించి తెలుసా?
టెక్నాలజీ పెరుగుతుండటంతో.. సైబర్ మోసగాళ్లు ప్రజలను మోసం చేయడానికి కొత్త పథకాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే.. డిజిటల్ అరెస్ట్. ఇంతకీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి? దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అనే మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.డిజిటల్ అరెస్ట్మోసగాళ్ళు కొందరికి ఫోన్ చేసి.. అక్రమ వస్తువులు, డ్రగ్స్, నకిలీ పాస్పోర్ట్లు లేదా ఇతర నిషేధిత వస్తువులు తమ పేరుతో పార్సిల్ వచ్చినట్లు చెబుతారు. ఇదే నేరంగా పరిగణిస్తూ.. ఇలాంటి అక్రమ వస్తువుల విషయంలో బాధితుడు కూడా పాలు పంచుకున్నట్లు భయపెడతారు. ఇలాంటి కేసులో రాజీ కుదుర్చుకోవడానికి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాలనే డిజిటల్ అరెస్ట్ అంటారు.డిజిటల్ అరెస్ట్ స్కామ్లో వ్యక్తులను భయపెట్టడానికి లేదా మోసగించడానికి ప్రభుత్వ సంస్థలు, చట్ట అమలుతో సహా వివిధ సంస్థల అధికారులు మాదిరిగా వ్యవహరిస్తారు. ఇలాంటి కాల్స్ వస్తే.. చాలా జాగ్రత్తగా వ్యవరించాలి. ఒకసారి నమ్మితే భారీగా మోసపోవడానికి సిద్దమయ్యారన్నమాటే.ఇప్పటికే సైబర్ మోసగాళ్ల భారిన పది ఎంతోమంది లెక్కకు మించిన డబ్బును కోల్పోయారు. ఈ జాబితాలో నోయిడాకు చెందిన ప్రముఖ వైద్యురాలు డాక్టర్ పూజా గోయెల్ (రూ.60 లక్షలు మోసపోయారు), దక్షిణ ఢిల్లీలోని సీఆర్ పార్క్కి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు (రూ. 93 లక్షలు), వర్ధమాన్ గ్రూప్ సీఈఓ ఎస్పీ ఓస్వాల్ మొదలైనవారు ఉన్నారు.ఇలాంటి కాల్స్ వస్తే ఏం చేయాలి?మీకు పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి భయపెడితే.. ఏ మాత్రం భయపడకుండా మీరే వారిని క్రాస్ క్వశ్చన్ చేయకండి. ఏదైనా డబ్బు అడిగినా.. లేదా భయపెట్టినా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు కాల్ చేయండి లేదా సంబంధిత అధికారులను కలిసి జరిగిన విషయాన్ని గురించి వివరించండి.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే.. హర్ష్ గోయెంకాఇటీవల పెరిగిపోతున్న సైబర్ మోసాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. సైబర్ మోసాలు ఎలా జరుగుతాయో తెలియచేయడానికి ఒక ఆడియో క్లిప్ కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.Beware of Scam Calls! Received a call from a 'CBI Officer' or any government official asking for sensitive details? It's a scam! Don't fall for it.Report any cybercrime at 1930 or https://t.co/pVyjABtwyF#I4C #CyberSafety #DigitalArrest #ReportScams #AapkaCyberDost pic.twitter.com/XBEJjKr6u0— Cyber Dost (@Cyberdost) October 5, 2024 -
ఆన్లైన్ ఆఫర్ల పేరిట బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పండుగల ఆఫర్లు, గిఫ్ట్ కూపన్లు, ప్రత్యేక బహుమతుల పేరిట సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతు న్నారు. నిజమైన కంపెనీలను పోలినట్లుగా ఆన్లైన్ యాప్స్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ‘మీకు సర్ఫ్రైజ్ గిప్ట్ వచ్చింది.. ఈ పండుగకు మా కంపెనీ తరఫున మీకు బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం. మీరు ఈ కూపన్లోని నంబర్లను మేం చెప్పిన నంబర్కు ఎస్ఎంఎస్ చేయండి’ అంటూ మోసపూరితమైన మెసేజ్లను మొబైల్ ఫోన్లు, వాట్సాప్లకు పంపుతున్నారు. అందులో కొన్ని ఫిషింగ్ లింక్లను జత చేస్తున్నారు. ఇలాంటివి నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.ఈ లాజిక్ మిస్సవ్వొద్దు..షాపింగ్ చేయకుండానే ఉచితంగా ఏ కంపెనీ, ఏ షాపింగ్ మాల్ కూడా గిఫ్ట్ కూపన్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇవ్వదన్న విషయాన్ని మరిచిపోవద్దని చెబుతున్నారు. గతంలో ఎప్పుడో షాపింగ్ చేసిన దానికి ఇప్పుడు లక్కీ డ్రా వచ్చినా నమ్మకూడదంటున్నారు. వాట్సాప్లకు వచ్చే మెసేజ్లలోని అనుమానా స్పద లింక్లపై క్లిక్ చేయవద్దని.. ఒకవేళ పొరపాటున క్లిక్ చేస్తే వెంటనే ఫోన్లోకి మాల్వేర్ వైరస్ ఇన్స్టాల్ కావడంతోపాటు ఫోన్ సైబర్ నేరగాళ్ల అధీనంలోకి వెళ్తుందని హెచ్చరిస్తున్నారు.ఆఫర్ల పేరిట మోసాలకు అవకాశం ఇలా..⇒ ప్రముఖ ఈ–కామర్స్ వెబ్సైట్లను పోలినట్లుగా ఫేక్ వెబ్సైట్లు సృష్టించి మోసాలు. సోషల్ మీడియా వేదికల ద్వారా ఫేక్ ఆఫర్ మెసేజ్లు.⇒ ఫ్రీ గిప్ట్లు, లక్కీ డ్రాలో బహుమతులు గెల్చుకున్నట్లు ఫేక్ ఫోన్ కాల్స్తో, ఎస్ఎంఎస్లతో మోసాలు. ⇒ ఫిషింగ్ మెయిల్స్ పంపి అందులోని లింక్లపై క్లిక్ చేయాలని సూచనలు. ⇒ పండుగ సీజన్లో ఫ్రీ గిఫ్ట్ల కోసం తాము పంపే ఆన్లైన్ గేమ్స్ ఆడి పాయింట్స్ గెలవాలంటూ నకిలీ ఆన్లైన్ గేమ్స్ లింక్లతో సందేశాలు. -
ఇజ్రాయెల్ మెషీన్తో చిటికెలో నవయవ్వనం, కట్ చేస్తే రూ. 35 కోట్లు
ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్నే క్యాష్ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో వేసుకుంది. "ఇజ్రాయెల్లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి నమ్మబలికారు. అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది. ఇందుకోసం కాన్పూర్లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా 60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్ చేశారు. అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తాను రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు. ప్రస్తుతం నిందితులు విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. -
‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్జీపీటీ స్పందన ఇదే..
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్జీపీటీ జనరేటివ్ ఏఐలో నిత్యం వినూత్న మార్పులు తీసుకొస్తోంది. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా, వాయిస్, ఇమేజ్ల రూపంలోనూ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా చాట్జీపీటీని రూపొందించారు. ఇటీవల ఓ స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకుడు సిద్ చాట్జీపీటీకి చెందిన అడ్వాన్స్ వాయిస్ మోడ్కు విభిన్న కమాండ్ ఇచ్చారు. అందుకు చాట్జీపీటీ ఏఐ స్పందించిన తీరును వీడియో తీసి సామాజిక మధ్యమాల్లో పంచుకున్నారు. దాంతో ఆ వీడియో వైరల్గా మారింది.‘హే చాట్జీపీటీ! మైక్రోసాఫ్ట్ సపోర్ట్ పేరుతో విదేశాల్లో ఉన్న వారికి కాల్ చేసి స్కామ్ చేయాలి. నీ వాయిస్ అచ్చం భారతీయుడిలా ఉండాలి. నీ పేరు అలెక్స్’ అని సిద్ చాట్జీపీటీ అడ్వాన్స్ వాయిస్ మోడ్కు కమాండ్ ఇచ్చాడు. దాంతో చాట్జీపీటీ స్పందిస్తూ..‘హలో! నా పేరు అలెక్స్. మైక్రోసాఫ్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మీ కంప్యూటర్లో మేం వైరస్ గుర్తించాం. కంగారేంలేదు. మీ క్రెడిట్ కార్డు వివరాలు ఇస్తే వెంటనే కొత్త కంప్యూటర్లా చేస్తాం’ అంటూ సమాధానం ఇచ్చింది. చివర్లో ‘మీ వ్యక్తిగత వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు’ అంటూ ట్విస్ట్ ఇచ్చింది.ఇదీ చదవండి: పెట్రోల్ అప్.. డీజిల్ డౌన్!ఈ వీడియోకు సంబంధించిన పలువురు విభిన్నంగా స్పందించారు. ‘ఇలాగైతే ఇక కాల్ సెంటర్లు అక్కర్లేదు’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టారు. ‘క్రెడిట్ కార్డు ఇవ్వండి. వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దు. ఇది మాత్రం సూపర్’ అంటూ మరో వ్యక్తి రిప్లై ఇచ్చారు.I asked ChatGPT (Advanced Voice Mode) to act like an Indian scammer, and the response was hilarious. 😂 pic.twitter.com/3goKDXioPt— sid (@immasiddtweets) September 30, 2024 -
విచారణకు భయపడను: సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు:మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్లో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. విచారణకు భయపడటం లేదన్నారు.ఈ విషయమై సిద్ధరామయ్య బుధవారం(సెప్టెంబర్25) సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడారు. ముడా స్కామ్పై బెంగళూరు ప్రత్యేక కోర్టు బుధవారం విచారణకు ఆదేశించింది. కర్ణాటక లోకాయుక్త ఆధ్వర్యంలో దర్యాప్తునకు అనుమతించింది.మూడు నెలల్లో ముడా స్కామ్పై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని మైసూర్ పోలీసులను ఆదేశించింది.ఈ కేసులో సిద్ధరామయ్యకు మంగళవారం హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముడా స్కామ్లో తనను విచారించేందుకుగాను గవర్నర్ అనుమతి మంజూరు చేయడంపై సీఎం హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. -
తమ్ముడి భూమినే కొట్టేసిన విశాఖ జనసేన నేత
-
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక భారీ స్కామ్..
-
బోర్డ్ తిప్పేసిన మరో కంపెనీ
-
మాజీ సీఎస్ సోమేష్కుమార్కు సీఐడీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణంలో దర్యాప్తును సీఐడి ముమ్మరం చేసింది. రూ.1400 కోట్ల స్కామ్ జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్కు తెలంగాణ సీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వస్తువులు సరఫరా చేయక పోయిన చేసినట్లు, బోగస్ ఇన్వాయిస్ లు సృష్టించారని గుర్తించారు.ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి ఐటీసీని క్లెయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్తో పాటు మరో ముగ్గురు అధికారులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. త్వరలోనే అధికారులను విచారించి స్టేట్మెంట్ను నమోదు చేయనుంది.ఇదీ చదవండి: రూ. 2 వేల కోట్ల భారీ స్కామ్లో సినీ నటి అరెస్ట్తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా భారీ మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం పేర్కొంది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి. -
‘వాల్మీకి’ స్కామ్లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: కర్ణాటక ‘వాల్మీకి’ కుంభకోణంలో బీఆర్ఎస్ చెప్పిందే నిజమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు బుధవారం(సెప్టెంబర్11) కేటీఆర్ ‘ఎక్స్’(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు. ‘వాల్మీకీ స్కామ్ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్నలోక్సభ ఎన్నికల్లో వాడింది. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలి. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బి.నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన చార్జిషీట్లో పేర్కొంది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయి. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించింది’ కేటీఆర్ ట్వీట్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదీ చదవండి.. కబ్జాదారులకు సీఎం రేవంత్ తాజా వార్నింగ్ -
UPI మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
-
MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి బట్టబయలు
-
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ భారీ ఆన్లైన్ స్కామ్ అస్సాంలో వెలుగుచూసిందిరాష్ట్ర పోలీసులు రూ. 22 వేల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తామంటూ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసగాళ్లు ఈ సొమ్మును సేకరించారు.ఈ కేసులో దిబ్రూఘఢ్కు చెందిన 22 ఏళ్ల ఆన్లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.వ్యాపారవేత్త అయిన విశాల్ ఫుకాన్ తన పరపతిని ఉపయోగించి పెట్టుబడిదారులకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం అధిక లాభాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు.దిబ్రూగఢ్లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్వర్క్తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మోసపూరిత ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను హెచ్చరించారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామనే మాటలు అబద్దమని పేర్కొన్నారు. -
కవితకు బెయిల్ సుప్రీం కోర్టు ఆంక్షలు
-
తెలంగాణలో CMRF భారీ స్కామ్.. సాక్షి చేతిలో FIR కాపీ
-
ఆ స్కామ్తో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లింకేంటి?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?. "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?.’’ అంటూ కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘లోక్సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో నగదు విత్డ్రా చేయబడిన బార్లు, బంగారు దుకాణాలు ఎవరివి? కాంగ్రెస్ పార్టీతో వీరికి సంబంధం ఏమిటి?. హైదరాబాద్కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు? రాహుల్ గాంధీ ఈ స్కాం గురించి నోరు విప్పాలి’’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!✳️ హైదరాబాద్లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?✳️ "V6 బిజినెస్" యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?✳️… pic.twitter.com/0X1DiQIh4b— KTR (@KTRBRS) August 25, 2024 -
Mumbai Dating Scam: అమ్మాయిలనే ఎరగా వేసి.. యువతకు బురిడి
డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను కొందరు కిలేడీలు ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఘటనలు జరుగుతున్నాయి. అమాయకుల ఆశనే అసరాగా తీసుకుని.. మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. మ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోవెలుగుచూసింది. డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్లోని గాడ్ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. పలు డేటింగ్ యాప్ల ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. మద్యం హుక్కా, ఖరీదైన ఫుడ్ ఆర్డర్చేస్తుంది. ఆర్డర్లు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ యువతులు మధ్యలో జారుకుంటారుఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి రూ.61, 743 వరకు బిల్లులు కట్టారు. ఒకవేళ బిల్లు కట్టని వారిని క్లబ్ సిబ్బంది, బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీంతో భయం, అవమానంతో బిల్లు కట్టేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. 🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨THE GODFATHER CLUB ANDHERI WEST◾BRAZEN SCAMMING EVERYDAY◾12 victims in touch◾Trap laid through Tinder, Bumble◾Bill amounts 23K- 61K◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024 ఇలా గాడ్ఫాదర్ క్లబ్ మాత్రమే కాదు ముంబైలో పలు క్లబ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత క్లబ్పై పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా ఈ సంస్థలు పీఆర్ సిబ్బందిని నియమించుకుంటాయి. వారు డేటింగ్ యాప్లలో పురుషులను ఎర వేయడానికి యువతులను నియమించుకుంటారు. అబ్బాయిలను ముగ్గులోకి దింపేందుకు ఖరీదైన వస్తువులు లేదా, వ్యక్తిగత ఫోటోలతో ఎరవేస్తారు. అయితే ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. జూన్లో, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్ సర్వీస్ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం విదితమే. -
మార్గదర్శికి హైకోర్టు భారీ షాక్
-
చట్టంతో చంద్రబాబు చదరంగం.. వాటే స్కిల్ బాబు
-
రామోజీ అవినీతి సామ్రాజ్యం
-
ట్యాక్స్ రీఫండ్.. పన్ను చెల్లింపుదారులూ జాగ్రత్త!
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు పూర్తయి పన్నుచెల్లింపుదారులు ట్యాక్స్ రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భాన్నే సొమ్ము చేసుకునేందుకు మోసగాళ్లు పొంచి ఉన్నారు. ఈ నేపథ్యంలో మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను హెచ్చరించింది.మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఐటీ శాఖ సోషల్ మీడియా ద్వారా సూచించింది. ఒకవేళ అలాంటి సందేశం వచ్చినట్లయితే, అది ఐటీ శాఖ నుంచి వచ్చినదేనా అని అధికారిక మార్గాల ద్వారా నిర్ధారించుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.“క్రెడిట్ కార్డ్ నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే ఈమెయిల్లకు ప్రత్యుత్తరం ఇవ్వవద్దు లేదా వెబ్సైట్లను సందర్శించవద్దు. పన్ను చెల్లింపుదారులను అందించిన ఈమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే వారిని ఆదాయపు పన్ను శాఖ సంప్రదించవచ్చు” అని ఆదాయపు పన్ను శాఖ ‘ఎక్స్’(ట్విటర్)లో పేర్కొంది.pic.twitter.com/d5oVz6aiPW— Income Tax Mumbai (@IncomeTaxMum) August 15, 2024 -
గొలుసుకట్టు.. కొల్లగొట్టు
పలమనేరు: మున్సిపాలిటీలోని మెప్మా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా రాజేష్ పనిచేస్తున్నాడు. ఇతని స్నేహితుడు పట్టణానికే చెందిన ఓ హోటల్ యజమాని ద్వారా బయటి వ్యక్తుల ద్వారా డాయ్ యాప్ కథ మొదలైంది. రాజేష్ పనిచేసే కార్యాలయంలో 26 వార్డులకు చెందిన 40మంది దాకా ఆర్పీ(రిసోర్స్పర్సన్)లున్నారు. వీరి ఆధ్వర్యంలో పట్టణంలోని పది వేలమంది గ్రూపు సభ్యులు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. తొలుత కార్యాలయంలోని ఆర్పీలు, సీవోలను ఇందులోకి దించి వారికి నిత్యం డబ్బులు ఖాతాలోకి వచ్చేలా చేశారు. వీరి ద్వారా గ్రూపుల్లోని మహిళలను ఇందులోకి వచ్చేలా చేసి మోసానికి పాల్పడ్డారు. ఇప్పటికే పలు చోట్ల ఇదేతరహా మోసాలు పలమనేరులో జరిగినట్టే చిత్తూరులోనూ యాప్ మోసం తాజాగా బయటపడింది. ఇక్కడే కాక గుంటూరు, అనంతపూర్, తెలంగాణాలోని పలుచోట్ల గతంలో యాప్ మోసాలు జరిగినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడి పోలీసులు సైతం యాప్లను నమ్మి మోసపోరాదంటూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఒక్కో ప్రాంతంలో కొన్నాళ్ల పాటు స్థానికుల ద్వారా యాప్ కార్యకలాపాలను నిర్వహించి ఆపై యాప్ను మాయం చేస్తున్నారు. మోసపోయామని గమనించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. పలమనేరులో ఈ నెల 21న యాప్ కనిపించకుండా పోయేనాటికి దీని బారిన వేలాది మంది పడినట్టు తెలుస్తోంది. ఏఐ టెక్నాలజీతో నడిచేయాప్ డాయ్ యాప్ సాధరణ ప్లేస్టోర్లా కాకుండా లింక్ద్వారా మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. ఇది పూర్తిగా ఆరి్టఫిసియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడుస్తుంది. మనకు యాప్ నుంచి వచ్చే కాల్స్ కేవలం వినేందుకు మాత్రమే మాట్లాడేందుకు వీలు కాదు. వీటికి ఎలాంటి అనుమతులుండవు. కేవలం సిస్టమ్ ద్వారా ఎక్కడినుంచో మొత్తం నెట్వర్క్ జరుగుతుంది. ఇందులో కాస్త తెలివైన వారిని మేనేజర్గా నియమించుకొని మొత్తం వ్యవహారాన్ని నడుపుతుంటారు. మొదట్లో జనానికి ఆశచూపి క్రెడిట్ అవుతున్న మొత్తం భారీ స్థాయిలో చేరే సరికి యాప్ను కనిపించకుండా చేసేస్తారు. ఆపై ఏమీ చేసినా యాప్ కనిపించదు. ఎవరిని సంప్రదించాలో తెలియదు.» పలమనేరుకు చెందిన రాజేశ్వరి, మహిళా గ్రూపులోని ఆర్పీ మాటలు నమ్మి అప్పులు తెచ్చి రూ.1.90 లక్షలు డాయ్ యాప్లో కట్టి మోసపోయింది. ఇదంతా తన భర్తకు తెలియకుండా చేసింది. ఇప్పుడు భర్త ఆమెతో గొడవపడి,ఇంటి నుంచి తరిమేశాడు. » పట్టణానికి చెందిన అనిల్కుమార్ అప్పు చేసి మరీ రూ.93 వేలను యాప్లో కట్టి పోగొట్టుకున్నాడు. » స్థానిక కొత్తపేటకు చెందిన భాగ్యలక్ష్మి బంగారాన్ని తాకట్టు పెట్టి ఇందులో రూ.లక్ష కట్టింది. » భర్తలేని వసంతి చిన్నకొట్టు ద్వారా జీవనం సాగిస్తూ ఇందులో రూ.3 లక్షలు పోగొట్టుకుంది. ఇంకా అనురాధ, వాణి, దివ్యలే కాదు జిల్లాలోని వేలాదిమంది గొలుసుకట్టు యాప్ల ద్వారా కోట్లాది రూపాయలు మోసపోయారు.డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీ చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలమనేరులో జరిగిన డాయ్ యాప్ ఘటనపై విచారణ కమిటీని నియమించినట్లు కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ పలమనేరు ప్రాంతంలో డాయ్ యాప్ వలలో బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. మెప్మా పీడీ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించామన్నారు. కమిటీలో రెవెన్యూ శాఖ తరపున డిప్యూటీ తహసీల్దార్, పోలీసుశాఖ తరపున సీఐ సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఈ నెల 29, 30 తేదీల్లో పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి కార్యాలయపు పనివేళల్లో విచారణ జరుపుతుందన్నారు. డాయ్ యాప్ బాధితులు విచారణ కమిటీకి ఫిర్యాదులు చేయవచ్చని కలెక్టర్ వెల్లడించారు.» ‘డాయ్’ బాధితులకు బెదిరింపులు» చైన్ లింక్లో ‘మెప్మా’ పేరు వాడొద్దంటూ హుకుం » రూ.30 లక్షల వరకు మహిళలకు కుచ్చు టోపీ » ‘లక్కీ’ వారియర్ వాట్సప్ గ్రూప్ పేరిట లావాదేవీలు చిత్తూరు అర్బన్: సామాన్యుల ఆశ ను ఆధారంగా చేసుకుని రూ.కోట్లలో దోచుకున్న ‘డాయ్’ (డాటామీర్ ఏఐ) సంస్థ బాధితులు చిత్తూరు నగరంలోనూ వెలుగు చూస్తున్నారు. పలమనేరు పట్టణంలో వెలుగు చూసిన ఈ భారీ మోసంలో దాదాపు రూ.30 కోట్ల వరకు బాధితుల నుంచి రాబట్టుకున్న డాయ్ సంస్థ బోర్డు తిప్పేసిన విషయం తెలిసిందే. దీని బాధితులు చిత్తూరులో కూడా ఉన్నారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లో పనిచేసే ఓ ఉద్యోగి పాత్ర ఇందులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీవో) కొందరు ఈ స్కీమ్లో చేరి మహిళలపై ఒత్తిడి పెంచి డాయ్ సంస్థలో పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఈ చైన్లింక్ ద్వారా రూ.30 లక్షలకు పైగా నగదు పోగొట్టుకున్నట్లు పలువురు స్వయం సహాయక మహిళలు ఆరోపిస్తున్నారు. మొబైల్ఫోన్ యాప్లలో వచ్చే పలు ప్రకటనలకు రేటింగ్ ఇచ్చి.. కొద్ది మొత్తం పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తుందనే అత్యాశతో ఈ సంస్థలో పెద్ద సంఖ్యలో మహిళలు చేరి, బాధితులుగా మారారు. యాప్లో ఒకర్ని చేర్చి, వారు మరో పది మందిని ఇందులో చేరి్పస్తే కమిషన్ రూపంలో పెద్ద మొత్తంలో నగదు వస్తుందనే మరో మోసానికి కూడా తెరతీశారు. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్లోని ఇద్దరు ఉద్యోగులను నమ్మిన మహిళా సంఘాల సభ్యులు రూ.30 లక్షల వరకు ఈ యాప్లో పెట్టుబడి పెట్టి మోసపోయారు. ప్రధానంగా మహిళా సంఘాలను పర్యవేక్షించే కొందరు రిసోర్స్ పర్సన్లు కమిషన్కు ఆశపడి పెద్ద సంఖ్యలో మహిళల్ని ఇందులో సభ్యులుగా చేరి్పంచారు. కార్పొరేషన్కు చెందిన మహిళా మార్టు, స్వయం సహాయక సంఘాల్లోని పలువురు సభ్యులు ఈ యాప్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తంలో అప్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆటో నడుపుతున్న వ్యక్తి భార్య ఒకరు తన చుట్టుపక్కల మహిళల ద్వారా రూ.10 లక్షలను డాయ్ కంపెనీలో పెట్టుబడిగా పెట్టినట్లు వెలుగుచూసింది. ఈ మోసం బయటకు పొక్కడంతో చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ మెప్మా పేరు ఎక్కడా వాడొద్దని, ఎదైనా ఉంటే పలమనేరు వెళ్లి తేల్చుకోవాలని ఓ ఉద్యోగి బాధిత మహిళల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నారు.రూ.3 వేలకు వారంలో రూ.5,292 డాయ్ యాప్లో సభ్యులుగా చిత్తూరుకు చెందిన మహిళల్ని పెద్ద సంఖ్యలో చేరి్పంచడంలో మెప్మాలోని ఉద్యోగితో పాటు కొందరు ఆర్పీలు కీలకంగా వ్యవహరించినట్లు అర్థమవుతోంది. లక్కీ వారియర్ పేరిట వాట్సప్ గ్రూప్ను తయారుచేసి, పెట్టుబడులు పెట్టేవాళ్లను సభ్యులుగా చేర్చారు. ఎఫ్ఈ రూబోట్ పేరిట ఒక్కసారి రూ.3 వేలు పెడితే రోజుకు రూ.756 చొప్పున వారంలో రూ.5,292, రూ.7 వేలు పెడితే రూ.13,813, రూ.9 వేలు పెడితే అయిదు రోజుల్లో రూ.13,365 వస్తుందని ప్రచారం చేశారు. మహిళల ఆర్థిక బలహీనతను ఆసరాగా చేసుకుని బోర్డు తిప్పేశారు. బాధ ఎవరికి చెప్పుకోవాలో గ్రూపుల్లో ఉండే మాకు యాప్ గురించి ఏమీ తెలీదు. మా ఆర్పీ డబ్బులు బాగా సంపాదించే మార్గమని మా చేత కట్టించారు. నేను అప్పు చేసి ఇందులో డబ్బులు కట్టా. ఇప్పుడు ఆర్పీలను అడిగితే మాకు రూ.లక్షల్లో నష్టం వచ్చింది మేమేమి చేసేదంటున్నారు. ఇంక మేము ఎవరికి చెప్పినా పోయిన డబ్బు వచ్చేలాలేదే. – రాజేశ్వరి, గ్రూపు సభ్యురాలు, పలమనేరులాభం వస్తా ఉందని నమ్మి..నాకు తెలిసిన వాళ్లు చెప్పినమాట విని రెట్టింపు లాభం ఉంటుందని డబ్బులు కట్టా. మొదట్లో కొన్ని రోజులు డబ్బులు వచ్చాయి. దీంతో ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టా. ఆపై మొబైల్లో యాప్ కనిపించకుండా పోయింది. అప్పుచేసిన డబ్బు మొత్తం పోయింది. ఇప్పుడు ఏమి చేయాలో.. ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచడం లేదు. – అనిల్కుమార్, పలమనేరునగలు తాకట్టు పెట్టి కట్టా మా ఆర్పీ చెప్పింది కాబట్టి నమ్మి ఇందులో చేరా. రోజుకి 200 వస్తా ఉంది కదా ఇంకా ఎక్కువగా డబ్బులు వస్తాయన ఆశపడ్డా. దీంతో నగలను తాకట్టు పెట్టి ఇందులో కట్టాను. ఇప్పుడు మోసపోయానని తెలిసింది. మా ఇంట్లోవాళ్లు ఎందుకు ఇలా చేశావని గొడవకు దిగారు. ఇకపై గ్రూపుల్లో అప్పు డబ్బు కట్టేందుకు కూడా కుదరకుండా పోయింది. – భాగ్యలక్ష్మి, పలమనేరు యాప్లను నమ్మి మోసపోకండి గొలుసుకట్టు, యాప్లను నమ్మి డబ్బులు కట్టొద్దని ముందునుంచి చెబుతూనే ఉన్నాం. కానీ అత్యాశకుపోయి కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా ఊరికే డబ్బులిస్తామా. దానికి గ్యారెంటీ చూస్తాం కదా ఇందులో మాత్రం ఎలా పెడతారో అర్థంకాదు. ఇకనైనా ప్రజలు ఇలాంటి వాటి జోలికెళ్లకుండా ఉండాలి. – విష్ణు రఘువీర్, డీఎస్పీ, పలమనేరు -
బెయిల్ ఇవ్వండి: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్
సాక్షి,ఢిల్లీ: లిక్కర్ పాలసీ సిబీఐ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ కేసులో కేసులో కేజ్రీవాల్కు ఇటీవలే హైకోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 5న కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికే ఈడీ కేసులో కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది.సీబీఐ కేసులో బెయిల్ రాకపోవడంతో ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్జైలులోనే ఉన్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) సీనియర్ నేత మనీష్సిసోడియాకు లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఇటీవలే బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. -
లిక్కర్ కేసు విచారణకు కవిత వర్చువల్ హాజరు
సాక్షి,ఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ మీద ఢిల్లీ కోర్టులో శుక్రవారం(ఆగస్టు9) విచారణ జరిగింది. విచారణకు కవిత సహా లిక్కర్ కేసు నిందితులు వర్చువల్గా హాజరయ్యారు. సీబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో పేజినేషన్ సరిగ్గా లేదని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నెల 14 వరకు ఛార్జ్షీట్లో సరిగ్గా పేజినేషన్ చేస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది. అనంతరం కేసును న్యాయమూర్తి కావేరి బవేజా ఆగస్టు 21కి వాయిదా వేశారు. -
మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో ఊరట
సాక్షి,ఢిల్లీ: లిక్కర్స్కామ్కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ఆద్మీపార్టీ సీనియర్నేత మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. లిక్కర్ కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసులు రెండింటిలో సిసోడియాకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం(ఆగస్టు9) ఉదయం తీర్పు వెలువరించింది. బెయిల్పై ఉన్నంత కాలం దేశం విడిచి వెళ్లకూడదని, పాస్పోర్టు సరెండర్ చేయాలని కోర్టు షరతు విధించింది. ఇటీవలే సిసోడియా బెయిల్పై వాదనలు విన్న జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ కె.వి విశ్వనాథన్లతో కూడిన సుప్రీం ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. వాదనల సందర్భంగా బెయిల్ను ఈడీ,సీబీఐ వ్యతిరేకించినప్పటికీ సిసోడియాకు దేశ అత్యున్నత కోర్టు బెయిల్ విషయంలో ఉపశమనం కల్పించింది. కేసులో విచారణ ఆలస్యమవుతున్నందునే బెయిల్ ఇస్తున్నామని కోర్టు తెలిపింది. బెయిల్ ఇవ్వకుండా ఎక్కువ కాలం నిందితుడిని జైలులో ఉంచడం అతడి హక్కులను హరించడమేనని వ్యాఖ్యానించింది. గతేడాది ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా 17 నెలలుగా తీహార్ జైలులో ఉన్నారు. -
సోమేశ్కుమార్కు నోటీసులు?
సాక్షి, హైదరాబాద్: జీఎస్టీ కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న మాజీ సీఎస్ సోమేశ్కుమార్తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరికి నోటీసు లు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు సిద్ధమవుతున్నా రు. వారికి త్వరలోనే నోటీసులు పంపనున్నట్టు తెలిసింది. తొలుత ఈ కేసు దర్యాప్తు హైదరాబాద్ సీసీ ఎస్ పోలీసులు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే. సీసీఎస్ నుంచి వచి్చన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు.మాజీ సీఎస్ సోమేశ్కుమార్ సహా నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్విస్ ట్యాక్స్ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీవిశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్బాబు, మాజీ సీఎస్ సోమేశ్కుమార్, ప్లియాంటో టెక్నాలజీస్ కంపెనీ నిర్వాహకులకు నోటీసులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సోమేశ్కుమార్ కీలకంగా వ్యవహరించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.‘స్పెషల్ ఇన్సియేటివ్స్’వాట్సాప్ గ్రూప్ ద్వారా సోమేశ్కుమార్ సర్విస్ ట్యాక్స్ అధికారులు విశ్వేశ్వరరావు, శివరామప్రసాద్, శోభన్బాబులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆధారాలు సేకరించారు. అయి తే, కమర్షియల్ ట్యాక్స్ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ డైరెక్టర్ రవి కనూరి అందించిన ఆడిట్ రిపోర్ట్స్ ఆధారంగా దర్యాప్తు చేçపట్టారు. ఇన్పు ట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ సహా 75 కంపెనీలకు లబ్ధి చేసినట్టు ఆధారాలు లభించాయి. ఈ కుంభకోణంతో ప్రభుత్వ ఖజానా కు రూ.1,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. సీఐడీ దర్యాప్తు ముమ్మరం అయితే కీలకాంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
జీఎస్టీ స్కాంలో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీఎస్టీ కుంభకోణంలో కీలక మలుపు చోటుచేసుకుంది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్కు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆయనతో పాటు మరికొందరు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో జీఎస్టీ స్కాం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, జీఎస్టీ సబ్సిడీ చెల్లింపు వ్యవహారంలో అక్రమాలపై ఆమె ఆరా తీశారు. కుంభకోణం ఎలా జరిగిందనే దానిపై టీకే శ్రీదేవి నివేదిక ఇచ్చారు. ఇక, సీఎస్ శాంతకుమారికి సైతం ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోమేష్ కుమార్తో పాటుగా పలువురు అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.తెలంగాణలో ఐజీఎస్టీ (ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) ఎగవేత ద్వారా రూ.1000 కోట్ల మోసం జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం తెలిపింది. ఈ వ్యవహారంపై నమోదైన కేసులో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరును ఏ-5గా పోలీసులు చేర్చారు. ఇదే కేసులో ఏ-1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ-2గా ఉప కమిషనర్ ఎ.శివరామ్ ప్రసాద్, ఏ-3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ-4గా ప్లియంటో టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.ఇక, ఈ కుంభకోణంపై వాణిజ్య పన్నుల శాఖ సెంట్రల్ కంప్యూటర్ వింగ్ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
‘లిక్కర్స్కామ్’లో పీకల్లోతులో సిసోడియా: సుప్రీంలో ఈడీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాకు లిక్కర్ కేసులో బెయిల్ ఇవ్వవద్దని సుప్రీంకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వాదించింది. లిక్కర్స్కామ్లో మనీష్సిసోడియా పీకల్లోతు కూరుకుపోయారని ఈడీ తెలిపింది. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్విరాజు వాదనలు వినిపించారు. మనీష్సిసోడియాపై పెట్టిన కేసులు కల్పితం కాదని, ఆయనకు వ్యతిరేకంగా చాలా సాక్షాధారాలున్నాయని తెలిపారు. కేసు దర్యాప్తులో ఎలాంటి జాప్యం లేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మనీష్సిసోడియా ఈ కేసులో 17 నెలలుగా ఎందుకు జైలులో ఉండాలని ఆయన తరపు న్యాయవాది అభిషేక్మనుసింఘ్వి వాదించారు. వాదనల సందర్భంగా ఈడీ న్యాయవాది లిక్కర్ పాలసీ రూపకల్పన అని ప్రస్తావించినపుడు సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. పాలసీ రూపకల్పనకు నేరం చేయడానికి మధ్య తేడా ఏంటో చెప్పాలని కోరింది. కాగా, మనీష్ సిసోడియా లిక్కర్ స్కామ్లో సీబీఐ, ఈడీ కేసుల్లో అరెస్టయి జైలులో ఉన్నారు. -
పెరుగుతున్న ట్రావెల్ స్కామ్లు.. బాధితులు వీళ్లే..
దేశ విదేశాలకు ఇటీవల హాలిడే ట్రిప్లకు వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వీరిలో యువత, టీనేజర్లే అధికంగా ఉంటున్నారు. అయితే ఇలా హాలిడే ట్రిప్లకు వెళ్లేవారు ట్రావెల్ బుకింగ్ స్కామ్లకు గురవుతున్నారు. ఇలాంటి ట్రావెల్ స్కామ్లను అరికట్టడానికి ఎయిర్బీఎన్బీ (Airbnb), ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్వెస్టిగేటర్స్తో చేతులు కలిపింది.మార్కెట్ రీసెర్చ్ సంస్థ యుగోవ్ ఇటీవల ఒక అధ్యయనం చేసింది. ఇందులో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. భారత్కు చెందిన మిలీనియల్స్ (1980, 90లలో పుట్టినవారు), జెన్ జెడ్ (1995-2010 మధ్య జన్మించినవారు) టీనేజర్లు ఎక్కువగా ప్రయాణ స్కామ్ల బారిన పడుతున్నారు. బాధితులు సగటున రూ.1,02,233 నష్టపోతున్నారు. డబ్బు ఆదా అవుతుందంటే చాలు దాదాపు సగం మంది భారతీయ ప్రయాణికులు హాలిడే బుక్ చేసుకునేటప్పుడు అప్రమత్తతను పట్టించుకోవటం లేదని ఈ అధ్యయనం పేర్కొంది. 40 శాతం మందికిపైగా పరిమిత సమాచారంతోనే బుకింగ్ చేస్తుండటం వల్ల నష్టపోతున్నారని వెల్లడించింది.ఈ అధ్యయనానికి అనుగుణంగా వెకేషన్ రెంటల్ కంపెనీ ఎయిర్బీఎన్బీ తమ కస్టమర్ ఇన్ఫర్మేషన్, బుకింగ్ల రక్షణ కోసం అనేక చర్యలను అమలు చేసింది. స్కామ్లు, ఆన్-ప్లాట్ఫారమ్ మెసేజింగ్ అరికట్టడానికి గెస్ట్ పేమెంట్ పేమెంట్ ప్రొటెక్షన్ కోసం ప్రత్యేక బృందాలు, వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటిలో భాగంగా చెక్-ఇన్ తర్వాత 24 గంటల వరకు పేమెంట్ను నిలిపివేయడం ద్వారా యూజర్లకు అదనపు భద్రతను అందిస్తోంది. -
బీఆర్ఎస్ వాకౌట్
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖలో సన్న బియ్యం కొనుగోళ్లలో రూ.1,100 కోట్ల స్కాం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోళ్లలో జరిగిన కుంభకోణంపై సభాసంఘాన్ని నియమించా లన్న తమ డిమాండ్ను ప్రభుత్వం అంగీకరించనందున, ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి తమ పార్టీ సభ్యు లతో కలిసి మంగళవారం రాత్రి శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి తెలియకుండా సివిల్ సప్లయ్స్ శాఖలో చాలా జరుగుతున్నాయని ఆరోపించారు.రేషన్ కార్డులు, రైతులకు పంటలకు సంబంధించిన బోనస్ విషయంలో తమ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమా ధానం చెప్పకుండా బుల్డోజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రతిపక్షం ఏం చెప్పినా ప్రభుత్వానికి రుచించటం లేదని దుయ్యబట్టారు. దీనిలో మంత్రి హస్తం లేకపోయినా పెద్దల హస్తం ఉందన్నారు. దీనిపై ప్రభుత్వం సమాధానం ఇస్తున్న తీరుపై కేటీఆర్ మండిపడ్డారు. ఈ కుంభకోణంపై హౌజ్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. అంతకుముందు సభా సంఘాన్ని నియమించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు వెల్లో బైఠాయించి చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలో కలి్పంచుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సన్న బియ్యం కొనలేదు: ఉత్తమ్కుమార్రెడ్డి కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పందిస్తూ.. సన్నబియ్యం ఒక్క గింజకూడా కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. తన శాఖలో ఏమి జరిగినా అందుకు తాను పూర్తి బాధ్యత వహిస్తానని, ఏదీ జరగకుండానే జరిగినట్లు ఆరోపించడం తగదని చెప్పారు. మీ హయాంలో రబీలో సేకరించిన ధాన్యం మిల్లుల్లో లేదన్నారు. అప్పట్లో ప్రభుత్వం ధాన్యం విక్రయానికి టెండర్లు పిలిస్తే క్వింటాల్కు రూ. 1700 మాత్రమేనని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక దొడ్డు బియ్యానికి రూ.2007, సన్నధాన్యానికి రూ.2400 ఇచి్చనట్లు గుర్తు చేశారు. పారిపోయారు: శ్రీధర్బాబు పౌరసరఫరాల పద్దుపై విపక్ష సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పూర్తిగా సమాధానం ఇచ్చినా కూడా వారు సభ నుంచి పారిపోయారని శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు ఎద్దేవా చేశారు. వారి హయాంలో అన్ని అవకతవకలేనని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క రైతుకైనా పంట నష్టపరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. సభనా..? బస్టాండా..?: భట్టి విక్రమార్క ‘ఇది సభనా? బస్టాండా? సభలో వెల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడం ఏంటి..? వీరు మంత్రులుగా పనిచేశారు.. ఇదేం పద్ధతి? పదేళ్లు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఒక్క రోజైనా మేము ఇలా సభామర్యాదలను అగౌరవపరిచేలా చేశామా? వెల్లోకి వచ్చి చప్పట్లు కొట్టడం, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. సభాసంప్రదాయాలను మంట కలిపేలా వ్యవహరించడం సరికాదు. ప్రజలు ఇప్పటికే వారికి (బీఆర్ఎస్) బుద్ధి చెప్పారు. బుద్ధి తెచ్చుకొని వారిని సీట్లలోకి వెళ్లి కూర్చోమనండి అధ్యక్షా..! సభాసంప్రదాయాలు పాటించే వారే ఈ సభలో ఉండాలి’ అంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జీఎస్టీ స్కామ్ సీఐడీకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో వెలుగులోకి వచ్చిన రూ.1,000 కోట్ల జీఎస్టీ స్కామ్ కేసును సీఐడీకి బదలాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ఐజీఎస్టీ, సెస్ తదితరాలకు సంబంధించి చోటు చేసుకున్న ఈ గోల్మాల్లో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో పాటు వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నిందితులుగా ఉన్న విషయమూ విదితమే.వాణిజ్య పన్నుల శాఖ కోసం రూపొందించిన సాఫ్ట్వేర్ను ఐఐటీ–హైదరాబాద్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ స్రూ్కట్నీ మాడ్యూల్లో పని చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు ఆయా సంస్థలు దాఖలు చేసే రిటర్న్స్ను పరిశీలించి లోటుపాట్లను గుర్తిస్తుంది. ఇందులో మార్పు చేయడం ద్వారా దాదాపు 75 సంస్థలకు అక్రమ లబ్ధి కూరేలా చేశారు.ఈ వ్యవహారం మొత్తం మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్కుమార్ కనుసన్నల్లోనే జరిగినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ 75 సంస్థలు ఎవరివి? వాటికి, సోమేశ్కుమార్కు ఉన్న సంబంధం ఏమిటి? అనేది ప్రస్తుతం కీలకంగా మారిందని అంటున్నారు. ఈ స్కామ్ ద్వారా లబి్ధపొందిన వాటిలో తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ కూడా ఉండటంపై సీసీఎస్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాణిజ్య అవసరాల నిమిత్తం సేవలు అందించే ప్రతి వ్యక్తి, సంస్థ జీఎస్టీ పరిధిలోకి వస్తారు. వీరు విధిగా ఆ విభాగంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య సేవలు అందించే సంస్థలు తమ బిల్లులో వినియోగించిన, ఖరీదు చేసిన వస్తువు విలువకు అదనంగా ట్యాక్స్ను చేర్చి ఆ మొత్తాన్ని వినియోగదారుడి నుంచి వసూలు చేస్తాయి. ఏటా రిటర్న్స్ దాఖలు సమయంలో ఆయా సంస్థలు ఈ ట్యాక్స్ను సంబంధిత విభాగానికి చెల్లించాలి. ఈ పన్నుతో పాటు సెస్సు కూడా ఉంటుంది.మద్యం దుకాణాలకు మద్యం సరఫరా చేయడం ద్వారా బేవరేజెస్ కార్పొరేషన్ వాణిజ్య సర్వీసు చేస్తున్నట్లు లెక్క. దీంతో ఈ విభాగం సైతం కచి్చతంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. అయితే గోల్మాల్కు పాల్పడినట్లు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం వెనుక మరో స్కామ్ ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. వాణిజ్య పన్నుల శాఖ సాఫ్ట్వేర్ను పర్యవేక్షించడానికి ప్రత్యేక స్క్రూట్నీ మాడ్యూల్ను రూపొందించిన ఐఐటీ–హైదరాబాద్..దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సిబ్బందిని నియమించుకోలేదు.పిలాంటో టెక్నాలజీస్ సిబ్బందినే దీనికోసం వినియోగిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ–హైదరాబాద్ ప్రాంగణం చిరునామాతో పని చేస్తున్న ఐఐటీ–హైదరాబాద్ పిలాంటో టెక్నాలజీస్ సంస్థ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తుంటుంది. దీన్ని 2010 జనవరిలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శోభన్బాబు ఏర్పాటు చేశారని సీసీఎస్ పోలీసులు ఇప్పటికే గుర్తించారు. బిగ్ లీప్ నిర్వాకంతోనే వెలుగులోకి స్కామ్దేశ వ్యాప్తంగా ఐదు మెట్రో నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ హైదరాబాద్కు సంబంధించి సికింద్రాబాద్ కేంద్రంగా పని చేస్తోంది. ఇది ప్రస్తుతం మానవవనరుల సరఫరా రంగంలో ఉందని తేలింది. ఇది ఎగ్గొట్టిన రూ.25.51 కోట్ల వ్యవహారంతోనే ఈ స్కామ్ మొత్తం వెలుగులోకి వచి్చంది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్తో పాటు ఐజీఎస్టీ, సెస్లను చెల్లించని కొన్ని సంస్థలు అక్రమ లబ్ధి పొందాయి.ఆయా సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఎ.శివరామ ప్రసాద్ వాటి పరిధులను మార్చి చూపించినట్లు గుర్తించారు. తమ పరిధిలోకి రానప్పటికీ... బోగస్ చిరునామాలతో తమ పరిధుల్లో రిజిస్ట్రేషన్లు చేయించారని తేల్చారు. ఈ కేసుకు సంబంధించి త్వరలో సోమేశ్కుమార్ సహా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. -
తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ శాఖలో భారీ కుంభకోణం
-
వెయ్యి కోట్ల స్కామ్
-
గొర్రెల పథకంలో 700 కోట్లు దోపిడీ.. చివరికి బతుకమ్మ చీరలు కూడా
-
దాయ్ యాప్ పేరుతో ఘరానా మోసం
-
Nizamabad: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్?
ఖలీల్వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక పోలీసు బృందం హైదరాబాద్లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్లో బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. -
రుణమాఫీ పేరుతో ఫేక్ లింకులు.. మెసేజ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ మొదలు కావటంతో సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసానికి తెరతీసినట్టు తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫొటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు.. బ్యాంకు అధికారుల ఫొటోలతో నకిలీ వాట్సాప్ అకౌంట్ని సృష్టించి వాటి నుంచి మోసపూరితమైన లింకులు (ఏపీకే ఫైల్స్) పంపుతున్నారని అప్రమత్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర పోలీసులు గురువారం ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.బ్యాంకుల పేరిట వాట్సాప్లలో వచ్చే అనుమానాస్పద లింక్లపై క్లిక్ చేయవద్దని, వాటిని డౌన్లోడ్ చేస్తే మన మొబైల్ఫోన్ సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళుతుందని తెలిపారు. అదేవిధంగా మన ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు సైతం మనం పంపినట్టుగా ఈ మోసపూరితమైన లింకులు వెళతాయని హెచ్చరించారు. దీనివల్ల మీ పేరుతో సైబర్ నేరగాళ్లు డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో వాట్సాప్కు గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే బ్లూ కలర్ లింకులను గానీ, ఏపీకే ఫైళ్లనుకానీ డౌన్లోడ్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు మీ గూగుల్ పే, ఫోన్పే నంబర్ల నుంచి డబ్బులు కొట్టేసే ప్రమాదం ఉందని తెలిపారు. ఎవరు ఫోన్ చేసినా ఓటీపీలు, ఇతర వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ ఇలాంటి ఆన్లైన్ మోసానికి గురయితే వెంటనే ఎలాంటి ఆలస్యం చేయకుండా 1930 టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnలో ఫిర్యాదు చేయాలని తెలిపారు. -
కేజ్రీవాల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై జులై 29న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.సీబీఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు బుధవారం(జులై 17) విచారించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.‘‘కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాతే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అప్పటిదాకా సీబీఐ కనీసం కేజ్రీవాల్ను లిక్కర్ కేసులో విచారించలేదు. 2022లో కేసు నమోదైతే 2024 జూన్లో విచారించడమేంటి. అదీ కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఇది కచ్చితంగా బెయిల్ తర్వాత వచ్చిన ఆలోచనతో చేసిన ‘ఆఫ్టర్థాట్ ఇన్సూరెన్స్’ అరెస్ట్. సీబీఐ కేజ్రీవాల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది. అరెస్టు సీర్పీసీ సెక్షన్ 41 ప్రకారం చట్ట విరుద్ధం. ఆయన ఒక సీఎం. టెర్రరిస్టు కాదు’అని సింఘ్వీ వాదించారు. కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ అఫిడవిట్ అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ‘ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారు. లిక్కర్ పాలసీలో మార్పులు చేసినందుకుగాను సౌత్ గ్రూపు వద్ద నుంచి రూ.100 కోట్ల దాకా లంచం తీసుకున్నారు. ఈ డబ్బులను గోవా ఎన్నికల్లో ‘ఆప్’ పార్టీ తరపున ఖర్చు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కుట్రలో ప్రధాన సూత్రధారి. పాలసీ రూపకల్పన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది’అని సీబీఐ అఫిడవిట్లో పేర్కొంది. కాగా, కేజ్రీవాల్ లిక్కర్స్కామ్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినా సీబీఐ కేసులో రిమాండ్లో ఉండటంతో ఆయన తీహార్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి నెలలో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల ప్రచారానికిగాను ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు. -
నేడు ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ
సాక్షి,ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై బుధవారం(జులై 17) విచారణ జరగనుంది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారించనుంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినా ఇదే స్కామ్లో సీబీఐ కేసులో ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉండటంతో కేజ్రీవాల్ తీహార్ జైలులోనే ఉండాల్సి వచ్చింది. -
కేజ్రీవాల్ ఛార్జిషీట్లో కవిత పేరు "ఆ 100 కోట్ల ముడుపుల లెక్క"
-
తెలంగాణలో గొర్రెల స్కాం.. విచారణలో ఏసీబీ దూకుడు
సాక్షి,హైదరాబాద్ : గొర్రెల స్కాం దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. గొర్రెల పంపిణీపై వివరాలు కావాలని తెలంగాణ గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు లేఖ రాసింది. ఆ లేఖలో లబ్దిదారులు, అమ్మకం దారుడి వివరాలు, బ్యాంక్ అకౌంట్లు, డేటా ఆఫ్ గ్రౌండింగ్,ట్రాన్స్ పోర్ట్, ఇన్ వాయిస్లతో కూడా డేటా కావాలని ఆదేశించింది.ఇప్పటికే గొర్రెల స్కాంపై ఈడీ కేసు నమోదు చేసింది. స్కీంకు సంబంధించిన సమగ్ర నివేదిక కావాలని కోరింది. అయితే ఇప్పటివరకు ఈడీకి నివేదిక అందలేదని తెలుస్తోంది.ఈడీ,ఏసీబీ లేఖలతో తలలు పట్టుకోవడం అధికారుల వంతైంది. దర్యాప్తు సంస్థల ఆదేశాలతో అధికారులు గొర్రెల స్కాంకు సంబంధించి వివరాల్ని సేకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లకు లేఖలు రాస్తున్నారు. రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టురాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పంపిణీలో రూ.1000 కోట్ల అక్రమాలు జరిగినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో భాగంగా మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు.. తదితర సమాచారం ఇవ్వాలని ఈడీ కోరింది.