తిరుపతి: నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు | Tirupati: Fire breaks out at Navajeevan Express At Gudur | Sakshi
Sakshi News home page

తిరుపతి: నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లో మంటలు.. సిబ్బంది అప్రమత్తతో తప్పిన పెనుప్రమాదం

Published Fri, Nov 18 2022 7:17 AM | Last Updated on Fri, Nov 18 2022 8:27 AM

Tirupati: Fire breaks out at Navajeevan Express At Gudur - Sakshi

నవజీవన్ ఎక్స్ ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది.

సాక్షి, తిరుపతి: నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. గూడూరు జంక్షన్ సమీపంలో రైల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. 

అహ్మదాబాద్ నుండి చెన్నై వైపు వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌లోని పాంట్రీ  బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సిబ్బంది.. గూడూరు రైల్వే స్టేషన్‌లో రైలు ఆపి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కారణంగా.. గంట పాటు గూడూరు రైల్వే స్టేషన్‌లోనే రైలు నిలిచిపోయింది.

ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్న రైల్వే అధికారులు. ఘటనపై అధికారుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement