తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 2 గంట‌లు | Tirupati Free Darshan in 8 Hours | Sakshi
Sakshi News home page

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 2 గంట‌లు

Published Fri, Dec 1 2023 8:53 AM | Last Updated on Fri, Dec 1 2023 8:45 PM

Tirupati Free Darshan in 8 Hours - Sakshi

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొంత తక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 5 కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 58,278  మంది స్వామివారిని దర్శించుకోగా 17,220 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.  

టీటీడీకి రెండు బస్సులు విరాళం
చెన్నైకి చెందిన ప్రముఖ విద్యా సంస్థ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ప్రెసిడెంట్  సత్యనారాయణ, వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నారాయణరావు రూ.80 లక్షల విలువైన రెండు  బస్సులను అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేసిన భక్తులు.

అక్టోబర్ లో నెలలో తిరుమల శ్రీవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు
► అక్టోబర్ లో నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 19.73 లక్షలు
► అక్టోబర్ లో నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 108.46 కోట్లు
► నెలలో విక్రయించిన లడ్డులు 97.47 లక్షలు
► అక్టోబర్ లో తలనీలాలు సమర్పించిన భక్తులు 7.06 లక్షలు
► అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 36.50 లక్షలు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement