భక్తుల మృతి అత్యంత బాధాకరం: వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి | YS Jagan expressed deep Sadness On Annamayya district Elephants Attack incident | Sakshi
Sakshi News home page

అన్నమయ్య జిల్లా ఏనుగుల దాడి ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published Tue, Feb 25 2025 12:00 PM | Last Updated on Tue, Feb 25 2025 12:18 PM

YS Jagan expressed deep Sadness On Annamayya district Elephants Attack incident

గుంటూరు, సాక్షి: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో భక్తులు మృతి చెందిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భక్తుల మృతి అత్యంత బాధాకరమన్న ఆయన.. మృతుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. 

‘‘శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగుల దాడి చేయడం అత్యంత బాధాకరం. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ​ వాళ్లకు మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి’’ అని వైఎస్‌ జగన్‌ కోరారు. 

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై దాడి చేశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను వంకాయల దినేష్, తుపాకుల మణమ్మ, చంగల్ రాయుడుగా గుర్తించారు.  శివరాత్రిని పురస్కరించుకుని వై.కోటకు చెందిన భక్తులు ఆలయానికి నడుచుకుని వెళ్తుండగా వారిపై ఏనుగులు దాడి చేశాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement