చీరాల కేంద్రంగా గోవా మద్యం | - | Sakshi
Sakshi News home page

చీరాల కేంద్రంగా గోవా మద్యం

Published Fri, Apr 18 2025 12:46 AM | Last Updated on Fri, Apr 18 2025 12:46 AM

చీరాల కేంద్రంగా గోవా మద్యం

చీరాల కేంద్రంగా గోవా మద్యం

చీరాల: చీరాల కేంద్రంగా గోవా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. రైళ్లలో గోవా నుంచి చీరాల వాడరేవు, తీర ప్రాంతాలకు తరలించి రిసార్టులకు విక్రయిస్తున్నారు. ఇది చాలా కాలంగా కొనసాగుతూనే ఉంది. గురువారం సమాచారం అందుకున్న ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎకై ్సజ్‌ పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గోవా మద్యం నిల్వ ఉంచిన స్థావరాలపై దాడులు నిర్వహించారు. వాడరేవు వైఎస్సార్‌ కాలనీకి చెందిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.55 వేలు విలువ చేసే 550 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టుకు హాజరు పరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌ విధించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏసీ విజయ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా నాన్‌ డ్యూటీ మద్యంను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలా తరచూ మద్యం తరలించిన వారిపై కఠినమైన చట్టాలను ఉపయోగిస్తామన్నారు. దాడులలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఒంగోలు సీఐ రామారావు, చీరాల ఎకై ్సజ్‌ సీఐ పి.నాగేశ్వరరావు, ఎస్సైలు బి.శ్రీహరి, రమాదేవి, రాజేంద్రప్రసాద్‌, టూటౌన్‌ ఏఎస్సై టి.వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

550 బాటిళ్లు స్వాధీనం చేసుకున్న ఎకై ్సజ్‌ పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement