ఉన్నత ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులు | - | Sakshi
Sakshi News home page

ఉన్నత ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులు

Published Thu, Mar 6 2025 12:31 AM | Last Updated on Thu, Mar 6 2025 12:31 AM

ఉన్నత ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులు

ఉన్నత ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులు

దుమ్ముగూడెం : ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వారి ఉన్నతమైన ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులని గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ అన్నారు. బుధవారం లక్ష్మీనగరం రేగుబల్లి 1 గిరిజన బాలికల పాఠశాలలో కెరీర్‌ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మణెమ్మ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖలో చదువుతున్న 8, 9,10 తరగతుల విద్యార్థుల ఆలోచనకు పదును పెట్టేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారని వివరించారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ మామిడి అశోక్‌ కుమార్‌, ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌. సావిత్రి, ఎస్సై వెంకటప్పయ్య, దుమ్ముగూడెం వైద్యాధికారి పుల్లారెడ్డి పాల్గొన్నారు.

గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement