2022 Electric Vehicle Technology Expo Begins In Delhi - Sakshi

కళ్లుచెదిరేలా..2022 ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో

Aug 5 2022 12:09 PM | Updated on Aug 5 2022 1:46 PM

2022 Electric Vehicle Technology Expo begins in Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 15వ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో 2022 అట్టహాసంగా పప్రారంభమైంది. శుక్రవారంమొదలైన ఈ షో  మూడురోజుల పాటు ఆగస్ట్‌ 7 వరకు కొసాగుతుంది. అతిపెద్ద ఆటో షోగా భావిస్తున్న ఈ ప్రదర్శనలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఆటో ఉపకరణాలు, బ్యాటరీలు, ఇతర ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు. 

కేంద్ర సమాచార  ప్రసార  క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ఎక్స్‌పోను ప్రారంభించారు. ద"ఇండియాస్ ఈవీ సెక్టార్: రోడ్‌మ్యాప్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్" పేరుతో ఆగస్టు 4న నిర్వహించిన ఒకరోజు సెమినార్ తర్వాత ఈ ఎక్స్‌పో జరుగుతోంది. ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ ఎక్స్‌పో జరుగుతోంది.   సుమారు 100 మంది భారతీయ అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. ముఖ్యంగా  ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లు, స్కూటర్లు, రిక్షాలు, కార్ట్‌లు, ఇతర ఆటో ఉత్పత్తులు ఈ వేదిక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ లభిస్తోందని,రానున్న కాలంలో డిమాండ్‌మరింతర పుంజుకోనుందని  ఎక్స్‌పో 2022 నిర్వాహకుడు రాజీవ్ అరోరా ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ-వాహనాల తయారీదారులందరిని ఒకవేదికమీదకు తీసకొస్తున్న ఈ ఎక్స్‌పోలో పలు లాంచ్‌లు జరగనున్నాయని తెలిపారు. ఈ ఎక్స్‌పో  ప్రధాన లక్ష్యం కొత్త వ్యాపారాన్ని సృష్టించడం, పర్యావరణ పరిరక్షణ  అని ఆయన పేర్కొన్నారు. కాగా  2015లో తొలిసారిగా నిర్వహించబడిన ఇలాంటి ఎక్స్‌పోలు న్యూఢిల్లీ ,కోల్‌కతాలో బెంగళూరు, లక్నో, హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement