ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం | 5G spectrum auction bidding enters day 6 | Sakshi
Sakshi News home page

ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం

Aug 1 2022 6:25 AM | Updated on Aug 1 2022 6:25 AM

5G spectrum auction bidding enters day 6 - Sakshi

న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌ ఈస్ట్‌ సర్కిల్‌కు శనివారం డిమాండ్‌ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్‌ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement