Bharti Airtel
-
ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్వర్డ్ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్ఫామ్లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్ఫామ్లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు. -
ఎయిర్టెల్ టీవీ, టాటా ప్లే విలీనం!
ముంబై: ప్రయివేట్ రంగ కార్పొరేట్ దిగ్గజాలు టాటా గ్రూప్, భారతీ ఎయిర్టెల్ చేతులు కలపనున్నాయి. తద్వారా నష్టాలలో ఉన్న డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) బిజినెస్లను ఒకటి చేస్తున్నాయి. ఈ అంశంపై భారతీ ఎయిర్టెల్ తాజాగా స్టాక్ ఎక్సే్ఛంజీలకు సమాచారమిచ్చింది. శాటిలైట్, కేబుల్ టీవీ సర్వీసుల భారతీ టెలీమీడియా, టాటా ప్లే(గతంలో టాటా స్కై) విలీనానికి వీలుగా చర్చలు జరుగుతున్నట్లు వెల్లడించింది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఇందుకు వీలుగా షేర్ల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నాయి. ఇటీవల కొంతకాలంగా దేశీ వినియోగదారుల అభిరుచి కేబుళ్ల నుంచి డిజిటల్ ప్లాట్ఫామ్స్వైపు మళ్లుతోంది. ఓటీటీల కారణంగా డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఒప్పందానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొద్ది రోజులుగా లైసెన్స్ ఫీజు తగ్గింపునకు డీటీహెచ్ సంస్థలు అభ్యర్థిస్తున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ప్రస్తుత 8 శాతం ఫీజును ఏజీఆర్లో 3 శాతానికి తగ్గించేందుకు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 2027 చివరికల్లా ఫీజును ఎత్తివేయాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. డీటీహెచ్ యూజర్లు @ 6 కోట్లుతాజా డీల్ నేపథ్యంలో టాటా ప్లేకున్న 1.9 కోట్ల గృహాలతో ఎయిర్టెల్ కనెక్ట్ అయ్యేందుకు వీలు చిక్కనుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సైతం 1.58 కోట్లమంది వినియోగదారులను కలిగి ఉంది. దీంతో టెలికం, బ్రాడ్బ్యాండ్, డీటీహెచ్ సర్వీసులను కలిపి ట్రిపుల్ ప్లే వ్యూహాన్ని అమలు చేసేందుకు అవకాశముంటుంది. ఓవైపు రిలయన్స్ జియో టెలికం, బ్రాడ్బ్యాండ్, కంటెంట్లతో ప్యాకేజీలను ఆఫర్ చేస్తూ సమీకృత సేవలవైపు దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. దేశీయంగా ప్రస్తుతం డీటీహెచ్ వినియోగదారుల సంఖ్య దాదాపు 6 కోట్లు. ట్రాయ్ వివరాల ప్రకారం 2024 జూన్లో ఈ సంఖ్య 6.22 కోట్లుగా నమోదైంది. మొబైలేతర విభాగ ఆదాయాన్ని పెంచుకునే బాటలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్వర్జెన్స్పై దృష్టి పెట్టింది. దేశీయంగా డీటీహెచ్ సేవలలో అతిపెద్ద కంపెనీగా నిలుస్తున్న టాటా ప్లే గతంలో గ్లోబల్ మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ న్యూస్ కార్ప్తో భాగస్వామ్య సంస్థ(టాటా స్కై)ను ఏర్పాటు చేసింది. అయితే 2019లో మర్డోక్ సంస్థ ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్ను వాల్ట్ డిస్నీ కొనుగోలు చేయడంతో భాగస్వామ్య వాటా చేతులు మారింది. ఇతర డీల్స్...ఎయిర్టెల్, టాటా ప్లే మధ్య డీల్ కుదిరితే డీటీహెచ్ రంగంలో రెండో అతిపెద్ద ఒప్పందంగా నిలవవచ్చు. ఇంతక్రితం 2016లో డిష్ టీవీ, వీడియోకాన్ డీ2హెచ్ విలీనమైన విషయం విదితమే. అయితే ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీంతో స్టార్ ఇండియా, వయాకామ్18 విలీనమయ్యాయి. ఫలితంగా జియోస్టార్ బ్రాండుతో దేశీయంగా అతిపెద్ద మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఆవిర్భవించింది. వీటి సంయుక్త ఆదాయం 2024లో రూ. 26,000 కోట్లుగా నమోదుకావడం గమనార్హం! 2023–24లో భారతీ టెలీమీడియా రూ. 3,045 కోట్ల టర్నోవర్, రూ. 76 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇదే సమయంలో టాటా ప్లే నిర్వహణ ఆదాయం రూ. 4,305 కోట్లను తాకగా.. కన్సాలిడేటెడ్ నష్టం రూ. 354 కోట్లకు చేరింది. కాగా.. ఇంతక్రితం ఐపీవో చేపట్టేందుకు సెబీ నుంచి అనుమతి పొందింది. అయితే సమాచార శాఖ కంపెనీ ఈక్విటీ నిర్మాణంలో సవరణలకు ఆదేశించడంతో లిస్టింగ్ కార్యాచరణను ఆలస్యం చేసింది. కంపెనీ ఆర్వోసీకి దాఖలు చేసిన తాజా సమాచారం ప్రకారం టాటా సన్స్ తదుపరి నెట్వర్క్ డిజిటల్ డి్రస్టిబ్యూషన్ సర్వీసెస్ ఎఫ్జెడ్ ఎల్ఎల్సీ, టీఎస్ ఇన్వెస్ట్మెంట్స్.. విడిగా 20 శాతం వాటాలతో రెండో పెద్ద వాటాదారులుగా నిలుస్తున్నాయి. టాటా ప్లేలో బేట్రీ ఇన్వెస్ట్మెంట్స్(మారిషస్) పీటీఈ సైతం 10 శాతం వాటా కలిగి ఉంది. -
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్ టవర్స్ బిజినెస్ కన్సాలిడేషన్ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ దేశీ బిజినెస్ 25%జంప్చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ యాప్లో బజాజ్ ఫైనాన్స్.. కొత్త క్రెడిట్ కార్డు
ఆర్థిక సేవల కోసం డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించడానికి ఎన్బీఎఫ్సీ కంపెనీ బజాజ్ ఫైనాన్స్, టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఇందులో భాగంగా బజాజ్ ఫైనాన్స్ రుణ సంబంధ ఉత్పత్తులను తొలుత ఎయిర్టెల్ థాంక్స్ యాప్లో అందజేస్తారు. ఆ తరువాత ఎయిర్టెల్ స్టోర్ల ద్వారా ఈ సేవలను విస్తరిస్తారు.ఆర్థిక సేవలు దేశవ్యాప్తంగా విస్తృతం అయ్యేందుకు తమకున్న బలం దోహదం చేస్తుందని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ‘10 లక్షల మందికిపైగా వినియోగదార్లు మమ్మల్ని విశ్వసిస్తున్నారు. కస్టమర్ల అన్ని ఆర్థిక అవసరాల కోసం ఎయిర్టెల్ ఫైనాన్స్ను వన్–స్టాప్ షాప్గా మార్చడమే లక్ష్యం’ అని భారతీ ఎయిర్టెల్ వైస్ ఛైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. డేటా ఆధారిత రుణ పూచీకత్తు, అందరికీ ఆర్థిక సేవలు చేరేందుకు భారత డిజిటల్ పర్యావరణ వ్యవస్థ గుండెకాయగా ఉందని బజాజ్ ఫైనాన్స్ ఎండీ రాజీవ్ జైన్ చెప్పారు.కంపెనీ ప్రకటన ప్రకారం.. ఎయిర్టెల్ కస్టమర్లు ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డును (Airtel-Bajaj Finserv EMI) ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ స్టోర్ల నెట్వర్క్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.“ఎయిర్టెల్-బజాజ్ ఫిన్సర్వ్ ఇన్స్టా ఈఎంఐ కార్డు బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు అందుబాటులో ఉన్న ఆఫర్ల శ్రేణికి యాక్సెస్ను అందిస్తుంది. 4,000 కంటే ఎక్కువ నగరాల్లోని 1.5 లక్షల పార్టనర్ స్టోర్లలో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, కిరాణా సామాగ్రితో సహా వివిధ వస్తువులను కొనుగోలు చేయడానికి సౌకర్యవంతమైన ఈఎంఐ ఎంపికలు, చెల్లింపు ప్లాన్ల నుండి వినియోగదారులు ప్రయోజనం పొందుతారు. అదనంగా కో-బ్రాండెడ్ కార్డ్ బహుళ ప్లాట్ఫారమ్లలో ఈ-కామర్స్ లావాదేవీలకు వర్తిస్తుంది" అని పేర్కొంది. -
రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్
న్యూఢిల్లీ: స్పామ్ కాల్స్ను కట్టడి చేసే దిశగా టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గణనీయంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కృత్రిమ మేధా (ఏఐ) ఆధారిత సొల్యూషన్ను ప్రవేశపెట్టిన రెండున్నర నెలల వ్యవధిలో ఏకంగా 800 కోట్ల స్పామ్ కాల్స్ను, 80 కోట్ల మెసేజీలను గుర్తించినట్లు తెలిపింది. అలాగే ప్రతీ రోజుదాదాపు పది లక్షల మంది స్పామర్లను గుర్తిస్తున్నట్లు వివరించింది. తమ నెట్వర్క్కు సంబంధించి మొత్తం కాల్స్లో ఆరు శాతం, మొత్తం ఎస్ఎంఎస్లలో రెండు శాతం స్పామ్ ఉంటున్నట్లు కంపెనీ పేర్కొంది. ఢిల్లీ వాసులకు అత్యధికంగా ఇలాంటి కాల్స్ వస్తున్నాయి. అలాగే అత్యధిక కాల్స్ కూడా అక్కడి నుంచే జనరేట్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ఇలాంటి కాల్స్ను అందుకుంటున్న కస్టమర్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండగా, పశి్చమ ఉత్తర్ ప్రదేశ్ తర్వాత స్థానంలో ఉంది. ఈ రెండున్నర నెలల్లో సందేహాస్పద కాల్స్, ఎస్ఎంఎస్ల గురించి దాదాపు 25.2 కోట్ల మందిని అప్రమత్తం చేశామని, దీంతో వాటికి స్పందించే వారి సంఖ్య సుమారు 12 శాతం తగ్గిందని ఎయిర్టెల్ వివరించింది. స్పామర్లలో అత్యధికంగా 35 శాతం మంది ల్యాండ్లైన్ ఫోన్లను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు పేర్కొంది. అలాగే, పురుష కస్టమర్లే లక్ష్యంగా 76 శాతం కాల్స్ ఉంటున్నాయని వివరించింది. లావాదేవీలు, సరీ్వస్కి సంబంధించిన కాల్స్ చేసేందుకు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, స్టాక్బ్రోకర్లు, ఇతర ఆర్థిక సంస్థలు, కార్పొరేట్లు, ఎస్ఎంఈలకు ప్రభుత్వం 160 సిరీస్తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్లను కేటాయించినట్లు వివరించింది. డు–నాట్–డిస్టర్బ్ని (డీఎన్డీ) ఎంచుకోని వారికి, ప్రమోషనల్ కాల్స్ను అందుకునేందుకు అంగీకరించిన వారికి యథాప్రకారం 140 సిరీస్తో ప్రారంభమయ్యే 10 అంకెల నంబర్ల నుంచే కాల్స్ వస్తాయని పేర్కొంది. మిగతా వివరాల్లోకి వెళ్తే.. → ఢిల్లీ, ముంబై, కర్ణాటక అత్యధికంగా స్పామ్ కాల్స్ జనరేట్ అవుతున్న ప్రాంతాల్లో వరుసగా టాప్ 3లో ఉన్నాయి. ఎస్ఎంఎస్లపరంగా (టెక్ట్స్ మెసేజీలు) గుజరాత్, కోల్కతా, ఉత్తర్ప్రదేశ్లు ఈ స్థానాల్లో ఉన్నాయి. → 36–60 ఏళ్ల వయసు గల కస్టమర్లు లక్ష్యంగా 48 శాతం కాల్స్ ఉంటున్నాయి. 26 శాతం కాల్స్తో 26–35 ఏళ్ల వారు రెండో స్థానంలో ఉన్నారు. సీనియర్ సిటిజన్లకు ఎనిమిది శాతం స్పామ్ కాల్స్ మాత్రమే వచ్చాయి. → స్పామ్ కాల్స్ ఉదయం 9 గంటలకు మొదలవుతున్నాయి. తర్వాత ఉధృతి క్రమంగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గం.ల సమయానికి తారాస్థాయికి చేరుతుంది. మొత్తం స్పామ్ కాల్స్లో 22 శాతం కాల్స్.. రూ. 15,000–20,000 ధర శ్రేణిలోని మొబైల్స్ కలిగిన కస్టమర్లు లక్ష్యంగా ఉంటున్నాయి. → పనిదినాల్లోనూ, వారాంతాల్లోనూ వచ్చే కాల్స్ పరిమాణంలో వ్యత్యాసం ఉంటోంది. ఆదివారాలు ఇలాంటి కాల్స్ ఏకంగా 40 శాతం తగ్గుతున్నాయి. -
నోకియాకు ఎయిర్టెల్ నుంచి భారీ ఆర్డర్
న్యూఢిల్లీ: టెలికం పరికరాల తయారీలో ఉన్న ఫిన్లాండ్ దిగ్గజం నోకియా తాజాగా భారతీ ఎయిర్టెల్ నుండి భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇందులో భాగంగా భారత్లోని ముఖ్య నగరాలు, రాష్ట్రాలలో నోకియా తయారీ 4జీ, 5జీ పరికరాలను వినియోగంలోకి తెస్తారు. రీఫ్షార్క్ సిస్టమ్ ఆన్ చిప్ టెక్నాలజీ ఆధారిత బేస్ స్టేషన్స్, బేస్బ్యాండ్ యూనిట్స్, మాసివ్ మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ ఔట్పుట్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ను నోకియా అందించనుంది.‘వీటి చేరికతో ఎయిర్టెల్ నెట్వర్క్ను అసాధారణమైన 5జీ సామర్థ్యం, కవరేజీతో మెరుగుపరుస్తాయి. అలాగే నెట్వర్క్ వికాసానికి మద్దతు ఇస్తాయి. ఎయిర్టెల్ యొక్క ప్రస్తుత 4జీ నెట్వర్క్ను మల్టీబ్యాండ్ రేడియోలు, బేస్బ్యాండ్ పరికరాలతో నోకియా ఆధునీకరించనుంది. ఇది 5జీకి కూడా మద్దతు ఇస్తుంది’ అని నోకియా వెల్లడించింది.నోకియాతో ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం సంస్థ నెట్వర్క్ మౌలిక సదుపాయాల సామర్థాన్ని రుజువు చేస్తుందని భారతీ ఎయిర్టెల్ వైస్ చైర్మన్, ఎండీ గోపాల్ విట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. వినియోగదారులకు అసమానమైన అనుభవాన్ని అందిస్తుందని, ఈ నెట్వర్క్ పర్యావరణ అనుకూలమైనదని వివరించారు. ఎయిర్టెల్కు రెండు దశాబ్దాలకుపైగా సేవలు అందిస్తూ 2జీ, 3జీ, 4జీ, 5జీ నెట్వర్క్ ఉపకరణాలను నోకియా సరఫరా చేస్తోంది. -
ఎయిర్టెల్లో భారతీ టెలికం వాటా పెంపు
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లో తాజాగా 1.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఆఫ్ మార్కెట్ లావాదేవీ ద్వారా ఈ వాటాను సొంతం చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ పేర్కొంది.అయితే డీల్ విలువను వెల్లడించనప్పటికీ.. ఎయిర్టెల్ మార్కెట్ విలువ ప్రకా రం వాటా విలువ రూ. 11,680 కోట్లుగా అంచనా. కాగా.. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో భారతీ టెలికం వాటా 40.33 శాతానికి చేరింది. మరోవైపు ఇండియన్ కాంటినెంట్ వాటా 3.31 శాతానికి పరిమితమైంది. భారతీ టెలికంలో సునీల్ భారతీ మిట్టల్ వాటా 50.56 శాతంకాగా.. సింగ్టెల్ 49.44% వాటాను కలిగి ఉంది.ఇదీ చదవండి: అంబానీ, మిట్టల్లకు షాక్.. మస్క్ వైపే కేంద్రం మొగ్గు! -
ఎయిర్టెల్ భారీ వ్యూహం.. టాటాగ్రూప్ కంపెనీపై కన్ను!
ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ తన డిజిటల్ టెలివిజన్ విభాగాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (డీటీహెచ్) సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే (గతంలో టాటాస్కై)ని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఎయిర్టెల్ ప్రస్తుతం టాటా గ్రూప్తో చర్చలు జరుపుతున్నట్లు ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.ఓటీటీ ప్లాట్ఫామ్లు, ఎఫ్టీఏ సేవల ఆవిర్భావం కారణంగా వృద్ధి సమస్యలను ఎదుర్కొంటున్న డిజిటల్ టెలివిజన్ మార్కెట్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగా టాటాప్లేని కొనుగోలు చేయడానికి ఎయిర్టెల్ సన్నద్ధమవుతున్నట్లు సమాచారం. 2017లో టాటా కన్స్యూమర్ మొబిలిటీ వ్యాపారాన్ని భారతీ ఎయిర్టెల్ కొనుగోలు చేసిన తర్వాత రెండు కంపెనీల మధ్య ఇది రెండో ఒప్పందం కానుంది. ఈ ఒప్పదం కుదిరి టాటా ప్లేను ఎయిర్టెల్ కొనుగోలు చేస్తే టాటా తన కంటెంట్, ఎంటర్టైన్మెంట్ కార్యకలాపాల పూర్తిగా వైదొలుగుతుంది.టాటా ప్లే ప్రస్తుతం డీటీహెచ్ విభాగంలో 20.77 మిలియన్ల సబ్స్క్రైబర్లు, 32.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రగామిగా ఉంది. కానీ ఆర్థిక పరంగా నష్టాల్లో నడుస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర నష్టం రూ.353.8 కోట్లుగా ఉంది. టాటా ప్లే కొనుగోలుతో ఎయిర్టెల్ కస్టమర్ బేస్ పెరుగుతుందని, అదే సమయంలో జియో అందిస్తున్న ఆఫర్లతో పోటీపడే సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. -
ఎయిర్టెల్ వింక్ మ్యూజిక్ షట్డౌన్: కారణం ఇదే..
భారతి ఎయిర్టెల్ లిమిటెడ్ తన వింక్ మ్యూజిక్ యాప్ను త్వరలోనే నిలిపివేస్తున్నట్లు సమాచారం. ఇందులో పనిచేసే ఉద్యోగులను బయటకు పంపించేది లేదని, వారందరినీ కంపెనీలోని సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది.ఎయిర్టెల్ కంపెనీ యాపిల్తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వింక్ మ్యూజిక్ నిలిపివేసిన తరువాత ఎయిర్టెల్ యూజర్లు యాపిల్ మ్యూజిక్ ద్వారా సంగీతం వినొచ్చని కంపెనీ వెల్లడించింది. అయితే వింక్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కంపెనీ ఓ స్పెషల్ ఆఫర్ అందించే అవకాశం ఉందని సమాచారం. -
భారతీ హెక్సాకామ్ ఐపీవోకు రెడీ
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్ పబ్లిక్ ఇష్యూ వచ్చే నెల 3న ప్రారంభంకానుంది. వెరసి కొత్త ఆరి్థక సంవత్సరం(2024–25)లో వెలువడిన తొలి పబ్లిక్ ఇష్యూగా నిలవనుంది. ఏప్రిల్ 5న ముగియనున్న ఇష్యూలో భాగంగా టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ 7.5 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఫలితంగా ప్రస్తుత వాటాదారు సంస్థకు ఐపీవో నిధులు అందనున్నాయి. ఇవి కంపెనీ ఈక్విటీలో 15 శాతానికి సమానంకాగా.. గతంలో 10 కోట్ల షేర్లను ఆఫర్ చేయాలని సంకలి్పంచిన సంగతి తెలిసిందే. యాంకర్ ఇన్వెస్టర్లకు 2న షేర్లను కేటాయించనుంది. కంపెనీ లిస్టయ్యేందుకు ఈ నెల రెండోవారంలో క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతిని పొందింది. కంపెనీలో భారతీ ఎయిర్టెల్ వాటా 70 శాతంకాగా.. ప్రభుత్వ రంగ టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా మిగిలిన 30 శాతం వాటాను కలిగి ఉంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకు కొత్త కార్డులు, ఆఫర్ ఏంటంటే!
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ అనుకూల డెబిట్ కార్డ్ను ప్రారంభించింది. పర్యావరణ హితంగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ పొదుపు బ్యాంకు ఖాతాలను కలిగి తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా ఎకో ఫ్రెండ్లీ డెబిట్ కార్డులు ఆవిష్కరించింది. అంతేకాకుండా, మార్కెట్లోని సాంప్రదాయ PVC కార్డులతో పోలిస్తే, తమ 50,000 కార్డుల ప్రతి బ్యాచ్ 350 కిలోగ్రాముల కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్డ్లను తీసుకురానున్నామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. పర్యావరణ అనుకూలమైన ఆర్-పీవీసీ మెటీరియల్తో దీన్ని తయారు చేసినట్లు సంస్థ సీవోవో గణేష్ అనంతనారాయణన్ తెలిపారు. సాంప్రదాయ పీవీసీ కార్డులతో పోలిస్తే వీటి ఉత్పత్తి వల్ల కర్బన ఉద్గారాలు తగ్గగలవని, హైడ్రోకార్బన్ల వినియోగం గణనీయంగా తక్కువ స్థాయిలో ఉంటుందని పేర్కొన్నారు. తొలుత క్లాసిక్ వేరియంట్లో పర్సనలైజ్డ్, ఇన్స్టా కార్డులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన చెప్పారు. వీటితో రూ. 10,000 వరకు విలువ చేసే ప్రయోజనాలను పొందవచ్చని తెలిపారు. -
ఎయిర్టెల్ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం దాదాపు యథాతథంగా రూ. 1,612 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 1,607 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటుకు ముందు నికర లాభం 91 శాతం జంప్చేసి రూ. 2,902 కోట్లుగా నమోదైంది. ఇక మొత్తం ఆదాయం 14 శాతం ఎగసి రూ. 37,440 కోట్లకు చేరింది. దేశీ మొబైల్ సరీ్వసుల ఆదాయం 13 శాతంపైగా పుంజుకుని రూ. 26,375 కోట్లను తాకినట్లు కంపెనీ పేర్కొంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 183 నుంచి రూ. 200కు బలపడింది. రూ. 19,746 కోట్ల నిర్వహణ లాభం(ఇబిటా) ఆర్జించగా.. 52.7 శాతం ఇబిటా మార్జిన్లను సాధించింది. 4జీ యూజర్లు అప్ తాజా సమీక్షా కాలంలో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 56 లక్షల మంది 4జీ వినియోగదారులను జత చేసుకున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. నాణ్యమైన కస్టమర్లపై దృష్టి సారించడం ద్వారా 0.8 మిలియన్ పోస్ట్పెయిడ్ వినియోగదారులను జత కలుపుకున్నట్లు తెలియజేశారు. దీంతో వీరి సంఖ్య దాదాపు 2.05 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఇక మొబైల్ డేటా వినియోగం 22 శాతం ఎగసి ఒక్కో కస్టమర్పై నెలకు 21.1 జీబీకి చేరినట్లు వివరించారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 0.7 శాతం క్షీణించి రూ. 872 వద్ద ముగిసింది. -
వాట్సాప్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు
న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ వాట్సాప్ ద్వారా బ్యాంకు సేవలను ప్రారంభించింది. ఇందుకోసం భారతీ ఎయిర్టెల్తో చేతులు కలిపింది. పలు బ్యాంకు సర్వీసులతోపాటు ఇంటి వద్ద సేవల కోసం వినతి, సమీపంలోని పోస్ట్ ఆఫీస్ శాఖ ఎక్కడ ఉంది వంటివి వాట్సాప్ ద్వారా ఖాతాదారులు తెలుసుకోవచ్చు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్నకు 4.51 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. లైవ్ ఇంటెరాక్టివ్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ను సైతం వాట్సాప్లో పరిచయం చేయనున్నారు. -
500 కేంద్రాల్లో ఎయిర్టెల్ 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మరో 235 నగరాలు, పట్టణాలకు 5జీ సేవలను పరిచయం చేసింది. దీంతో దేశవ్యాప్తంగా కంపెనీ 5జీ సర్వీసులు విస్తరించిన కేంద్రాల సంఖ్య 500లకు చేరింది. ప్రతి రోజు 30–40 కేంద్రాల్లో తదుపరి తరం టెలికం సేవలను జోడిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. 2023 సెప్టెంబర్లోగా అన్ని నగరాలకు విస్తరిస్తామని భారతీ ఎయిర్టెల్ సీటీవో రన్దీప్ సెఖన్ తెలిపారు. రిలయన్స్ జియో 406 నగరాలు, పట్టణాల్లో 5జీ సేవలను అందిస్తోంది. 5జీ నెట్వర్క్ విషయంలో ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. 2023 మార్చి 31 నాటికి 200 కేంద్రాల్లో 5జీని పరిచయం చేయాలని భారత ప్రభుత్వం లక్ష్యం విధించుకుంది. అంచనాలను మించి ప్రస్తుతం ఈ సేవలు విస్తరించడం గమనార్హం. -
వొడాఫోన్ కొత్త ప్లాన్: జియో, ఎయిర్టెల్ తరహాలోనే, ఏది బెటర్?
సాక్షి,ముంబై:వొడాఫోన్ ఇండియా సరికొత్త ప్లాన్ను లాంచ్ చేసింది. దేశీయ వినియోగదారుల కోసం రూ. 296ల కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ని తీసుకొచ్చింది. ఎక్కువ డేటాను వినియోగించే కస్టమర్లు లక్క్ష్యంగా ఈ ప్లాన్ను రూపొందించింది. ముఖ్యంగా ఎయిర్టెల్, జియోకు చెందిన రూ.296 రీచార్జ్ ప్లాన్లకు దీటుగా తాజా బల్క్ డేటా ప్లాన్ను తీసుకొచ్చింది. వొడాఫోన్ రూ.296 ప్లాన్ వాలిడిటీ 30 రోజులు 25 జీబీ బల్క్ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం ఈ ప్రీపెయిడ్ ప్లాన్లో వీఐ మూవీస్, టీవీని ఎంజాయ్ చేయవచ్చు కానీ, వివో అన్లిమిటెడ్ ప్రయోజనాలుండవు. ఎయిర్టెల్ రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్. రోజుకి100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్లో అదనపు ప్రయోజనాలు ఏంటంటే.. అపోలో 24|7 సర్కిల్, ఫాస్ట్ట్యాగ్పై రూ.100 క్యాష్బ్యాక్, ఉచిత హెలోట్యూన్స్ , వింక్ మ్యూజిక్ ఫ్రీ. రిలయన్స్ జియో రూ. 296 ప్లాన్ ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 30 రోజులే 25 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ , రోజుకు 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్లో రిలయన్స్ జియో వినియోగదారులు జియోటీవీ, జియో సినిమా జియో క్లౌడ్,జియో సెక్యూరిటీల అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి -
Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్ల పెంపు
బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది. పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ చెప్పారు. కోటి మందికి ఎయిర్టెల్ 5జీ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్దీప్ సిఖోన్ తెలిపారు. 2022 నవంబర్లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్టెల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లను 5జీ ఎక్స్పీరియెన్స్ జోన్స్గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్, 30రోజులు వాలిడిటీతో
సాక్షి,ముంబై: దేశీయ టెల్కో దిగ్గజం భారతీ ఎయిర్టెల్ యూజర్లకు సరికొత్త ప్లాన్ను అందిస్తోంది. 30 రోజులవాలిడిటీతో రూ.199 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ను తీసుకొచ్చింది. ముఖ్యంగా డేటా పెద్దగా వాడని యూజర్లకోసం ఈ ప్లాన్ను తీసుకొచ్చింది. ఎందుకంటే 30 రోజులకు గాను కస్టమర్లకు అందించే మొత్తం డేటా కేవలం 3జీబీ మాత్రమే. అలాగే అపరిమిత వాయిస్ కాలింగ్, 30 రోజులకు 300 ఎస్ఎంఎస్ లు ఉచితం. అయితే రోజుకు 100 మెసేజ్లకు పరిమితం. ఎయిర్టెల్ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులకు రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ను అందిస్తోంది. -
ఎయిర్టెల్ 5జీ హవా: నెల రోజుల్లోనే రికార్డు
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్వర్క్ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6-9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
నెల రోజుల్లోనే 10 లక్షల 5జీ యూజర్లు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ టెలికం సర్వీసులను ప్రారంభించిన నెల రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది పైగా కస్టమర్ల మైలురాయిని దాటినట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. నెట్వర్క్ను నిర్మించుకునే ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తుండగానే ఇది సాధించగలిగామని సంస్థ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ రణ్దీప్ సెఖోన్ తెలిపారు. యాపిల్ ఐఫోన్లు మినహా 5జీ ఆధారిత స్మార్ట్ఫోన్లు అన్నీ ఈ నెల మధ్య నాటికి తమ సేవలను అందుకోగలవని ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ ఇప్పటికే తెలిపారు. ఐఫోన్ల కోసం యాపిల్ నవంబర్ తొలినాళ్లలో సాఫ్ట్వేర్ అప్డేట్లను విడుదల చేస్తుందని, డిసెంబర్ మధ్య నుంచి అవి కూడా 5జీని సపోర్ట్ చేయవచ్చని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి 4జీ రేట్లకే 5జీ సేవలు అందిస్తున్నామని, వచ్చే 6–9 నెలల్లో ధరలపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. 2024 మార్చి ఆఖరు నాటికి కీలకమైన గ్రామీణ ప్రాంతాలతో పాటు దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ 5జీ సేవలు అందుబాటులోకి తేగలమని పేర్కొన్నారు. భారతి ఎయిర్టెల్ ప్రస్తుతం దశలవారీగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. -
ఎయిర్టెల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 89% జంప్చేసి రూ. 2,145 కోట్లను తాకింది. అనూహ్య రాబడిని మినహాయిస్తే రూ. 2,052 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) క్యూ2లో కేవలం రూ.11,340 కోట్లు ఆర్జించింది. 4జీ లాభదాయకత, వినియోగదారుపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ), డేటా వినియోగం పుంజుకోవడం అధిక లాభాలకు దోహదం చేసింది. మొత్తం ఆదాయం సైతం 22% ఎగసి రూ. 34,527 కోట్లకు చేరింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల కస్టమర్లను అధిగమించడంతోపాటు.. నిలకడైన పటిష్ట పనితీరును చూపగలిగినట్లు కంపెనీ పేర్కొంది. పరిశ్రమలోనే అత్యుత్తమంగా రూ. 190 ఏఆర్పీయూను సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 153 మాత్రమే. 20 జీబీ వినియోగం: 5జీ ప్రారంభించనున్న నేపథ్యంలో మరింత ఉత్తమ సేవలు అందించగలమని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే చౌక ధరల కారణంగా తక్కువ ఆర్వోసీఈని నమోదు చేస్తున్నట్లు తెలియజేశారు. కంపెనీ 8 పట్టణాలలో 5జీ సేవలకు శ్రీకారం చుట్టింది. కాగా ప్రస్తుత సమీక్షా కాలంలో 1.78 కోట్లమంది 4జీ కస్టమర్లు లభించగా.. ఒక్కొక్కరి నెలవారీ సగటు డేటా వినియోగం 20.3 జీబీకి చేరింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2 శాతం లాభపడి రూ. 832 వద్ద ముగిసింది. -
అదరగొట్టిన భారతి ఎయిర్టెల్
సాక్షి, ముంబై: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ ఫలితాల్లో అదరగొట్టింది. క్యూ2 ఫలితాల్లో ఏకంగా 89 శాతం రెట్టింపు లాభాలను సాధించింది. 30 సెప్టెంబర్ 2022తో ముగిసిన త్రైమాసికంలో 2,145 కోట్ల రూపాయల ఏకీకృత నికర లాభాన్ని సాధించింది. (Zomato మరో వివాదంలో జొమాటో: దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు) గత ఏడాది ఇదే సమయానికి కంపెనీ లాభం రూ.1,134కోట్లు మాత్రమే. ఆదాయం వార్షిక ప్రాతిపదికన 21.9 శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.28,326 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు టెల్కో రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం సంవత్సరానికి 21.9శాతం పెరిగి రూ.34,527 కోట్లకు చేరుకుంది, పోర్ట్ఫోలియో అంతటా బలమైన, స్థిరమైన పనితీరు కనబర్చినట్టు కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల కస్టమర్లను దాటినట్టు కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. ప్రతి వినియోగదారుకు సగటు ఆదాయం (ఏఆర్పీయూ) క్యూ1తో 183 రూపాయలతో పోలిస్తే క్యూ2లో రూ. 190కి పెరిగింది. సీక్వెన్షియల్ ప్రాతిపదికన, ఎయిర్టెల్ త్రైమాసికానికి ఏకీకృత నికర లాభంలో 33.5 శాతం పెరుగుదలను నివేదించింది. కాగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, సిలిగురి, నాగ్పూర్ , వారణాసి వంటి ఎనిమిది నగరాల్లో ఎయిర్టెల్ 5 జీ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు ఇటీవల తెలిపిన సంగతివ తెలిసిందే. -
ఎయిర్టెల్ షేర్ల విక్రయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్లో మొత్తం 1.76 శాతం వాటాను సింగపూర్ టెలీకమ్యూనికేషన్స్(సింగ్టెల్) విక్రయించింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా షేరుకి రూ. 686 ధరలో పాస్టెల్ లిమిటెడ్(సింగ్టెల్ సంస్థ) 1.63 శాతం వాటాను విక్రయించింది. ఎన్ఎస్ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం దాదాపు రూ. 6,602 కోట్ల విలువైన ఈ వాటా(9.62 కోట్లకుపైగా షేర్లు)ను ఎయిర్టెల్ ప్రమోటర్ భారతీ టెలికం కొనుగోలు చేసింది. ఈ బాటలో సింగ్టెల్ మరో సంస్థ విరిడియన్ సైతం 0.13 శాతం వాటా(కోటి షేర్లు)ను ఇదే ధరలో విక్రయించినట్లు తెలుస్తోంది. సాధారణ వాటాదారులు 70 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో పబ్లిక్ వాటా 44.74 శాతం నుంచి 44.87 శాతానికి పెరిగినట్లు తెలియజేశాయి. జూన్ చివరికల్లా ఎయిర్టెల్లో భారతీ టెలికం 35.85 శాతం వాటా కలిగి ఉంది. కాగా.. భారతీ టెలికంలో సింగ్టెల్కు 50.56 శాతం, సునీల్ మిట్టల్ కుటుంబానికి 49.44 శాతం చొప్పున వాటా ఉంది. ఈ వార్తల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 1.4 శాతం బలపడి రూ. 379 వద్ద ముగిసింది. -
భారతీ టెలికంకు సింగ్టెల్ వాటా
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్టెల్కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్ సింగపూర్ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుటుంబంతోపాటు, సింగ్టెల్ సైతం ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్టెల్లో సింగ్టెల్ గ్రూప్ వాటా 29.7 శాతానికి చేరనుంది. రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్టెల్లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రం కొనుగోలుకు సంబంధించి ఎయిర్టెల్ ముందస్తు చెల్లింపులు చేసిన కొన్ని గంటల్లోనే సంబంధిత స్పెక్ట్రమ్ను సంస్థకు కేటాయించడం విశేషంగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించినతీరుపై ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసలు కురిపించారు. ఊహించిన దానికంటే ముందుగానే 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగంగో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేశారు ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందిందని ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ సంతోషం ప్రకటించారు. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కేటాయింపు లేఖ చేతికందిందని, ఇచ్చిన హామీ మేరకు స్పెక్ట్రమ్తోపాటు ఇ బ్యాండ్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం ఆశ్చర్యం కలిగించిందనీ, చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తన 30 అనుభవంలో తొలిసారి ఇలా జరిగిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతునన్నారు. ఎలాంటి గందరగోళం, వివరాల ఆరాలు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు ఈ బాదర బందీ ఏమీ లేకుండానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇదంతా టెలికాం శాఖ నాయకత్వ కృషి అని, ఈజీ బిజినెస్కు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఈ మార్పే అవసరమని ఇదే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంధనంగా తోడ్పడు తుందంటూ మిట్టల్ అభిప్రాయపడ్డారు. Ready to lead India into the next generation of connectivity. #Airtel5G pic.twitter.com/deFlNWlZcC — Bharti Airtel (@airtelnews) August 18, 2022 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది, ఎయిర్టెల్ ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలను చెల్లించిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ ప్లాట్ఫారమ్లో పోస్ట్ చేసారు. "5G అప్డేట్: స్పెక్ట్రమ్ అసైన్మెంట్ లెటర్ జారీ చేశాం. 5G లాంచ్కు సిద్ధం కావాలని సర్వీసు ప్రొవైడర్లను అభ్యర్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా 5జీ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికాం కంపెనీలు రూ.17,873 కోట్లకు పైగా చెల్లించాయి. ఇందులో దాదాపు సగం నాలుగేళ్లకు చెందిన ముందస్తు చెల్లింపులు రూ. 8,312.4 కోట్లు భారతీ ఎయిర్టెల్ చెల్లించింది. -
స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్ రూ. 8 వేల కోట్లు చెల్లింపు
న్యూఢిల్లీ: ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన 5జీ స్పెక్ట్రంనకు సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కేంద్రానికి రూ. 8,312.4 కోట్లు చెల్లించింది. నాలుగేళ్లకు సరిపడా వాయిదాల మొత్తాన్ని టెలికం శాఖకు (డట్) ముందస్తుగా చెల్లించినట్లు సంస్థ తెలిపింది. దీనితో తాము ఇక పూర్తిగా 5జీ సేవలను అందుబాటులోకి తేవడంపైనే దృష్టి పెట్టేందుకు వీలవుతుందని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. తగినంత స్పెక్ట్రం, అత్యుత్తమ టెక్నాలజీ, పుష్కలంగా నిధుల ఊతంతో ప్రపంచ స్థాయి 5జీ సేవల అనుభూతిని అందించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్టెల్ రూ. 43,039.63 కోట్ల విలువ చేసే స్పెక్ట్రంను కొనుగోలు చేసింది. ఇందులో ముందుగా రూ. 3,849 కోట్లు, తర్వాత 19 ఏళ్ల పాటు మిగతా మొత్తాన్ని విడతలవారీగా చెల్లించేందుకు ఎయిర్టెల్కు అవకశం ఉంది. -
5000 పట్టణాల్లో ఎయిర్టెల్ 5జీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ నూతన అధ్యాయానికి సిద్ధం అవుతోంది. 5జీ సేవలను ఆగస్ట్లోనే ప్రారంభిస్తున్న ఈ సంస్థ.. 2024 మార్చి నాటికి అన్ని పట్టణాలు, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సర్వీసులను పరిచయం చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ మంగళవారం ప్రకటించారు. ‘5,000 పట్టణాల్లో 5జీ సేవలు అందించేందుకు కావాల్సిన నెట్వర్క్ విస్తరణ ప్రణాళిక పూర్తిగా అమలులో ఉంది. ఇది సంస్థ చరిత్రలో అతిపెద్ద రోల్అవుట్లలో ఒకటి. మొబైల్ సేవల చార్జీలు భారత్లో అతి తక్కువ. టారిఫ్లు మరింతగా పెరగాల్సిన అవసరం ఉంది. ఒక్కో యూజర్ నుంచి కంపెనీకి ఆదాయం రూ.183 వస్తోంది. ఇది త్వరలో రూ.200లకు చేరుతుంది. టారిఫ్ల సవరణతో ఈ ఆదాయం రూ.300లు తాకుతుంది’ అని తెలిపారు. 900 మెగాహెట్జ్, 1,800, 2,100, 3,300 మెగాహెట్జ్, 26 గిగాహెట్జ్ బ్యాండ్స్లో 19,867.8 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను కంపెనీ దక్కించుకుంది. స్పెక్ట్రమ్ కొనుగోలుకై ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు వెచ్చించిన సంగతి తెలిసిందే. టెలికం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్సంగ్తో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 900 మెగాహెట్జ్ ద్వారా.. ‘భారీ మిడ్ బ్యాండ్ 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ పోటీ సంస్థకు లేదు. ఇది మాకు లేనట్టయితే ఖరీదైన 700 మెగాహెట్జ్ కొనుగోలు చేయాల్సి వచ్చేది. ఈ బ్యాండ్లో భారీ రేడియో ఉపకరణాలను ఉపయోగించాలి. ఇవి ఖర్చుతో కూడుకున్నవే కాదు, కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేస్తాయి. 900 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్తో పోలిస్తే 700 మెగాహెట్జ్ అదనపు కవరేజ్ ఏమీ ఇవ్వదు. స్టాండలోన్ 5జీ నెట్వర్క్స్ కంటే నాన్–స్టాండలోన్ (ఎన్ఎస్ఏ) 5జీ నెట్వర్క్స్ ప్రయోజనాలు అధికం. అదనపు ఖర్చు లేకుండానే ప్రస్తుతం ఉన్న 4జీ టెక్నాలజీని ఉపయోగించి నూతన సాంకేతికత అందించవచ్చు. అలాగే వేగంగా కాల్ కనెక్ట్ అవుతుంది’ అని వివరించారు. జూన్ త్రైమాసికంలో భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ నికరలాభం అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అయిదురెట్లకుపైగా పెరిగి రూ.283 కోట్ల నుంచి రూ.1,607 కోట్లకు చేరడం తెలిసిందే. టారిఫ్లు పెరగడమే ఈ స్థాయి వృద్ధికి కారణం. రిలయన్స్ జియో సైతం.. టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో సైతం 5జీలో సత్తా చాటేందుకు రెడీ అయింది. 1,000 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నూతన సాంకేతికత పరిచయం చేసేందుకు ప్రణాళిక పూర్తి చేసినట్టు ప్రకటించింది. ఇందుకు కావాల్సిన పరీక్షలు సైతం జరిపినట్టు వెల్లడించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన టెలికం గేర్స్ను కంపెనీ వాడుతోంది. ఖరీదైన 700 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ను జియో మాత్రమే కొనుగోలు చేసింది. ఈ బ్యాండ్లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. యూజర్ భవనం లోపల ఉన్నా కవరేజ్ ఏమాత్రం తగ్గదు అని ఆయన చెప్పారు. ఇతర బ్యాండ్స్తో పోలిస్తే 700 మెగాహెట్జ్ బ్యాండ్లో కస్టమర్కు మరింత మెరుగైన సేవలు లభిస్తాయని వివరించారు. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
ఆరో రోజూ కొనసాగిన స్పెక్ట్రం వేలం
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రం వేలం కొనసాగుతోంది. ఆరో రోజైన ఆదివారం మరో రూ. 163 కోట్ల బిడ్లు అదనంగా రావడంతో ఇప్పటిదాకా వచ్చిన బిడ్ల విలువ మొత్తం రూ.1,50,130 కోట్లకు చేరినట్లు టెలికం శాఖ వెల్లడించింది. ఉత్తర్ ప్రదేశ్ ఈస్ట్ సర్కిల్కు శనివారం డిమాండ్ కాస్త తగ్గినట్లు కనిపించినా ఆదివారం మళ్లీ పుంజుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో ఏడో రోజైన సోమవారం నాడు కూడా వేలం కొనసాగనుంది. టెలికం సంస్థలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా వేలంలో పాల్గొంటోంది. దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. -
జియో, ఎయిర్టెల్ ఓకే.. వీఐఎల్పైనే సందేహం..
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్కు దేశవ్యాప్తంగా సర్కిల్స్లో 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే సామర్థ్యాలు ఉన్నాయని బీవోఎఫ్ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. అయితే, ఆర్థిక సమస్యల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) కూడా బిడ్డింగ్లో పాల్గొనడంపైనే అనిశ్చితి నెలకొందని పేర్కొంది. ఇప్పటికే 4జీ బ్యాండ్లన్నీ పూర్తి స్థాయిలో వినియోగంలో ఉన్నాయని నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో కొత్తగా స్పెక్ట్రం తీసుకోకుండా ప్రస్తుత 4జీ బ్యాండ్పైనే నిర్దిష్ట సర్కిళ్లలో 5జీ సేవలు అందించడం కష్టసాధ్యంగా ఉంటుందని వివరించింది. ‘స్పెక్ట్రంకు భారీగా ధర నిర్ణయించడంతో కొత్త టెల్కోలు వేలంలో పాల్గొనే అవకాశాలు తక్కువ. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ మాత్రమే దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రంను కొనుగోలు చేసే పరిస్థితిలో ఉన్నాయి. 5జీ బిడ్డింగ్ కోసం వీఐఎల్ నిధులను ఎలా సమకూర్చుకోగలుగుతుందనే అంశంపై స్పష్ట,త లేదు‘ అని పేర్కొంది. ఈ నేపథ్యంలో కీలకమైన కొన్ని సర్కిళ్లపైనే వీఐఎల్ దృష్టి పెట్టవచ్చని, తమకు ప్రధానమైన 3జీ, 4జీ సర్కిల్స్లో మాత్రమే బిడ్ చేయొచ్చని తెలిపింది. అయితే, దేశవ్యాప్తంగా 5జీ స్పెక్ట్రం లేకపోతే వీఐఎల్ మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. 1 లక్ష మెగాహెట్జ్ స్పెక్ట్రంను రూ. 7.5 లక్షల కోట్ల రిజర్వ్ ధరతో (30 ఏళ్లకు కేటాయిస్తే) వేలం వేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. ఈ ఏడాది జూన్ ఆఖర్లో లేదా జూలై తొలినాళ్లలో వేలం నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆగస్టు–సెప్టెంబర్ నాటికి 5జీ సేవలు రావచ్చని అంచనా. స్పెక్ట్రం వేలం ప్రతిపాదనను కేంద్ర టెలికం శాఖ ఈ వారంలో కేంద్ర క్యాబినెట్ తుది ఆమోదముద్ర కోసం పంపనుంది. -
ఎయిర్టెల్, టెక్ మహీంద్రా జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా తాజాగా చేతులు కలిపాయి. 5జీ, ప్రైవేట్ నెట్వర్క్లు, క్లౌడ్ వంటి విభాగాల్లో కంపెనీలకు అవసరమయ్యే డిజిటల్ సొల్యూషన్స్ను సంయుక్తంగా అభివృద్ధి, మార్కెటింగ్ చేసేందుకు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎయిర్టెల్ ఇప్పటికే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. అటు టెక్ మహీంద్రా 5జీ సర్వీసులకు సంబంధించిన అప్లికేషన్స్, ప్లాట్ఫామ్లను రూపొందించింది. ఒప్పందం ప్రకారం భారత్, అంతర్జాతీయ మార్కెట్లలో 5జీ సేవలను మరింతగా వినియోగంలోకి తెచ్చేందుకు ఉపయోగపడే సొల్యూషన్స్ను అభివృద్ధి చేసేందుకు ఇరు సంస్థలు సంయుక్తంగా ఇన్నోవేషన్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తాయి. -
ఇండస్ టవర్స్లో ఎయిర్టెల్కు 4.7% వాటా!
న్యూఢిల్లీ: యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ నుంచి ఇండస్ టవర్స్లో 4.7 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు భారతి ఎయిర్టెల్ మంగళవారం వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 187.88 రేటు చొప్పున తమ అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ 12,71,05,179 షేర్లను కొనుగోలు చేసినట్లు వివరించింది. వొడాఫోన్ గ్రూప్లో యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ భాగంగా ఉంది. ఇండస్ టవర్స్ (గతంలో భారతి ఇన్ఫ్రాటెల్) సంస్థ వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ఆపరేటర్ల కోసం టెలికం టవర్లు మొదలైన మౌలిక సదుపాయాలను నిర్వహిస్తోంది. 22 టెలికం సర్కిళ్లలో 1,84,748 టవర్లతో ఇండస్ టవర్స్ దేశీయంగా అతి పెద్ద టవర్ ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటి. -
విద్యుత్ కోసం...భారతీ ఎయిర్టెల్ భారీ పెట్టుబడులు
ప్రముఖ ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మహరాష్ట్రకు చెందిన ఎలక్ట్రిక్ యూటీలిటీ కంపెనీ అవాదా కేఎన్షోరాపూర్ ప్రైవేట్ లిమిటెడ్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. సొంతంగా విద్యుత్ ఉత్పాదక కంపెనీలను కలిగివుండాలనే నిబంధనలో భాగంగా భారతి ఎయిర్టెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అవాదా కేఎన్షోరాపూర్లో 7 శాతానికిపైగా వాటాను రూ. 1.74 కోట్లతో వాటాలను కొనుగోలు చేసినట్లు భారతి ఎయిర్టెల్ ఆదివారం రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. కొనుగోలు ధర వివరాలను తెలియజేస్తూ...ఒక్కొ ఈక్వీటి షేర్కు రూ. 10 చొప్పున మొత్తం 17,42,650 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయడానికి మొత్తం రూ. 1,74,26,500 చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తన ఫైలింగ్లో పేర్కొంది. సొంత అవసరాల కోసం అవాదా కేఎన్షోరాపూర్ నుంచి విద్యుత్ను తీసుకుంటామని వివరించింది. మల్టీ నేషనల్ కంపెనీలు తమ విద్యుత్ అవసరాల కోసం సొంతంగా క్యాప్టివ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్ చట్టం 2003 ప్రకారం తన సొంత అవసరాల కోసం అవాదా కేఎన్షోరాపూర్ నుంచి విద్యుత్ను కొనుగోలు చేసుకునేలా అందులో పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులను పెట్టడం ద్వారా వచ్చే రిటర్న్స్ను భారతి ఎయిర్టెల్ విద్యుత్ రూపంలో స్వీకరించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. చదవండి: ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
డేటాకు ‘మెటావర్స్’ దన్ను..
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యవస్థ క్రమంగా మెటావర్స్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో డేటా వినియోగం గణనీయంగా పెరగనుంది. 2032 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇది 20 రెట్లు వృద్ధి చెందనుంది. దేశీయంగా కూడా ఇదే ధోరణి కారణంగా.. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్కు గణనీయంగా వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. క్రెడిట్ సూసీ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. వర్చువల్ ప్రపంచంలో ఉన్న అనుభూతి కలిగించే మెటావర్స్ వల్ల యూజర్లు స్క్రీన్ చూడటంపై వెచ్చించే సమయం పెరగనుండటంతో.. డేటా వినియోగానికి గణనీయంగా ఊతం లభిస్తుందని పేర్కొంది. ‘ఇంటర్నెట్ వినియోగంలో 80 శాతం భాగం వీడియోలదే ఉంటోంది. ఇది వార్షికంగా 30 శాతం మేర వృద్ధి చెందుతోంది. మెటావర్స్ను ఒక మోస్తరుగా వినియోగించినా .. దీనివల్ల డేటా యూసేజీ, వచ్చే దశాబ్దకాలంలో ఏటా 37 శాతం చొప్పున వృద్ధి చెంది, ప్రస్తుత స్థాయి కన్నా 20 రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం‘ అని నివేదిక తెలిపింది. మెటావర్స్కి సంబంధించిన ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీల వినియోగం భారీగా పెరగనుందని వివరించింది. బ్రాడ్బ్యాండ్ లభ్యత కీలకం.. మెటావర్స్ పూర్తి సామర్థ్యాలను వినియోగించుకోవడానికి ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ లభ్యత కీలకమని క్రెడిట్ సూసీ తెలిపింది. ప్రజలు రోజూ అత్యధిక సమయం మొబైల్ను వినియోగించే టాప్ దేశాల్లో భారత్ కూడా ఉన్నప్పటికీ.. మిగతా దేశాలతో పోలిస్తే ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ఇక్కడ తక్కువగానే ఉందని వివరించింది. భారత్లో దీని విస్తృతి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతానికి పెరగవచ్చని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో ఇది 6.8 శాతంగా ఉంది. ‘భారతీయ టెల్కోల ఆదాయాలపై మెటావర్స్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇంకా సమయం ఉన్నప్పటికీ .. మెటావర్స్ ప్రేరిత డేటా వినియోగం దన్నుతో ఈ దశాబ్దం ద్వితీయార్ధంలో భారతి ఎయిర్టెల్ (ఆదాయాల్లో బ్రాడ్బ్యాండ్ వాటా 17 శాతం), జియో గణనీయంగా ప్రయోజనం పొందగలవని భావిస్తున్నాం‘ అని క్రెడిట్ సూసీ తెలిపింది. 6జీతో మరింత ఊతం .. మెటావర్స్ వ్యవస్థకు 5జీ టెలికం సర్వీసులు తోడ్పడనున్నప్పటికీ దీన్ని మరిన్ని అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చేందుకు 6జీ మరింత ఉపయోగకరంగా ఉంటుందని నివేదిక తెలిపింది. మిగతా విభాగాలతో పోలిస్తే ఎక్కువగా గేమింగ్ సెగ్మెంట్లో మెటావర్స్ వినియోగం ఉండవచ్చని పేర్కొంది. దేశీయంగా గేమింగ్ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉందని తెలిపింది. అందుబాటు ధరల్లోని స్మార్ట్ఫోన్లు, 4జీ డేటా సర్వీసుల కారణంగా అధిక స్థాయిలో గేమింగ్.. మొబైల్ ఫోన్ల ద్వారానే ఉంటోందని వివరించింది. ‘స్థిరమైన బ్రాడ్బ్యాండ్ లభ్యత తక్కువగా ఉన్నందు వల్ల ఆన్లైన్ వినియోగానికి భారత యూజర్లు.. మొబైల్ ఇంటర్నెట్పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి మొబైల్ గేమింగ్ వాటా భవిష్యత్లో పెరిగే అవకాశాలు ఉన్నాయి‘ అని క్రెడిట్ సూసీ పేర్కొంది. -
ఎలన్మస్క్కు గట్టిపోటీ..! దూకుడు పెంచిన ఎయిర్టెల్..!
స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను భారత్ ప్రవేశపెట్టాలనే ఎలన్మస్క్ ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడింది. దీంతో స్టార్లింక్ సేవలు పూర్గిగా నిలిచిపోయాయి. ఇక స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలకు పోటీగా ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవల విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. 34 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం..! భారతీ ఎయిర్టెల్కు చెందిన వన్వెబ్ ఫ్రెంచ్ గయానాలోని కౌర్ స్పేస్ సెంటర్ నుంచి ఏరియన్స్పేస్ రాకెట్ సహాయంతో 34 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వన్వెబ్ శుక్రవారం ధృవీకరించింది. 2022లో కంపెనీ ప్రారంభించిన తొలి ప్రయోగం ఇది. ఇది 13 వ ప్రయోగం. వన్వెబ్ ఇప్పటివరకు 428 శాటిలైట్లను ప్రయోగించింది. శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ ప్రయోగంలో ఇప్పటివరకు 66 శాతం ఉపగ్రహాలను వన్ వెబ్ విజయవంతంగా పూర్తి చేసింది. మరింత వేగంగా..! వన్ వెబ్ శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ విషయంలో దూకుడును ప్రదర్శిస్తోంది. స్టార్లింక్ సేవలకు పోటీగా శాటిలైట్ బ్రాడ్ బ్యాండ్ సేవల ప్రయోగాలను ముమ్మురం చేసింది. కంపెనీకి భారతీ ఎయిర్టెల్ తోడవడంతో మరింత వేగంగా శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలను తెచ్చేందుకు సిద్దమైంది వన్ వెబ్. ఇటీవల హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్, మార్లింక్ అండ్ ఫీల్డ్ సొల్యూషన్స్ హోల్డింగ్స్తో సహా పలు కంపెనీలతో వన్ వెబ్ గత నెలలో కీలక భాగస్వామ్య ఒప్పందాలపై సంతకం చేసింది. చదవండి: గూగుల్ అనూహ్య నిర్ణయం..! ఆ సేవలు పూర్తిగా షట్డౌన్..! -
ఈ ఏడాదీ మొబైల్ టారిఫ్ల మోత!
న్యూఢిల్లీ: మొబైల్ కాల్ టారిఫ్ల మోత మోగించేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయి. అవసరమైతే రేట్ల పెంపు విషయంలో మిగతా సంస్థల కన్నా ముందుండాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ‘2022లో టారిఫ్లు పెరగవచ్చని అంచనా వేస్తున్నాను. వృద్ధి అవసరాలు, కనెక్షన్ల స్థిరీకరణ వంటి అంశాల కారణంగా వచ్చే 3–4 నెలల్లో ఇది జరగకపోవచ్చు కానీ.. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో రేట్ల పెంపు మాత్రం ఉండవచ్చు. పోటీ సంస్థల పరిస్థితిపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇటీవల చేసినట్లుగా ఈ విషయంలో (రేట్ల పెంపు) అవసరమైతే నేతృత్వం వహించేందుకు మేము సందేహించబోము‘ అని అనలిస్టుల సమావేశంలో భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. 2021 నవంబర్లో టారిఫ్లను అన్నింటికన్నా ముందుగా 18–25 శాతం మేర ఎయిర్టెల్ పెంచింది. ఇటీవల ప్రకటించిన మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకారం యూజర్పై కంపెనీకి వచ్చే సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 163గా ఉంది. వార్షికంగా చూస్తే 2.2 శాతం తగ్గింది. సంస్థ లాభదాయకతను సూచించే ఏఆర్పీయూను రూ. 200కి పెంచుకోవాలని ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందులో భాగంగానే టారిఫ్ల పెంపును పరిశీలిస్తోంది. ‘2022లోనే పరిశ్రమ ఏఆర్పీయూ రూ. 200 స్థాయికి చేరగలదని.. ఆ తర్వాత మరికొన్నేళ్లకు రూ. 300 చేరవచ్చని ఆశిస్తున్నాం. అప్పుడు పెట్టుబడిపై రాబడి దాదాపు 15 శాతంగా ఉండగలదు‘ అని విఠల్ చెప్పారు. నెట్వర్క్లు .. డివైజ్ల అప్గ్రెడేషన్, క్లౌడ్ వ్యాపారాన్ని మెరుగుపర్చుకునేందుకు 300 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,250 కోట్లు) వెచ్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఎయిర్టెల్లో గూగుల్కు చోటు
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా దేశీ టెలికం భారతి ఎయిర్టెల్లో దాదాపు 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇందులో భాగంగా సుమారు 700 మిలియన్ డాలర్లతో 1.28 శాతం వాటాలు కొనుగోలు చేయనుండగా, మిగతా 300 మిలియన్ డాలర్ల మొత్తాన్ని రాబోయే సంవత్సరాల్లో సర్వీసుల విస్తరణపై వెచ్చించనుంది. షేరు ఒక్కింటికి రూ. 734 రేటు చొప్పున గూగుల్ తమ సంస్థలో వాటాలు కొనుగోలు చేస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. దాదాపు రూ. 5,224.3 కోట్ల (సుమారు 700 మిలియన్ డాలర్లు) విలువ చేసే 7,11,76,839 ఈక్విటీ షేర్లను గూగుల్కు కేటాయించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు పేర్కొంది. కొత్త ఉత్పత్తులతో భారత్ డిజిటల్ లక్ష్యాల సాకారానికి రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్లు సిద్ధంగా ఉన్న తమ నెట్వర్క్, డిజిటల్ ప్లాట్ఫాంలు, చెల్లింపుల వ్యవస్థ మొదలైనవి ఇందుకు తోడ్పడగలవని ఆయన వివరించారు. కంపెనీలు డిజిటల్ బాట పట్టడంలో తోడ్పడేందుకు, స్మార్ట్ఫోన్లు.. కనెక్టివిటీని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు ఎయిర్టెల్తో ఒప్పందం దోహదపడగలదని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. వ్యూహాత్మక లక్ష్యాల్లో భాగంగా ఇరు సంస్థలు భారత్ కోసం ప్రత్యేకమైన 5జీ సొల్యూషన్స్ను కనుగొనడంపై కృషి చేయనున్నాయి. ఎయిర్టెల్ తన 5జీ ప్రణాళికలను మరింత దూకుడుగా అమలు చేసేందుకు, మార్కెట్ దిగ్గజం జియోకి దీటుగా పోటీనిచ్చేందుకు గూగుల్ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయి. 1.28 శాతం వాటాల కోసం గూగుల్ చేస్తున్న 700 మిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రకారం ఎయిర్టెల్ విలువ సుమారు రూ. 4.1 లక్షల కోట్లుగా (54.7 బిలియన్ డాలర్లు) ఉండనుంది. ఇప్పటికే జియోలో గూగుల్... దేశీయంగా డిజిటలీకరణ ప్రక్రియపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న గూగుల్ .. రాబోయే 5–7 ఏళ్లలో భారత్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 2020 జూలైలో జియో ప్లాట్ఫామ్స్లో దాదాపు 4.5 బిలియన్ డాలర్లు వెచ్చించి 7.73 శాతం వాటాలు కూడా కొనుగోలు చేసింది. ఈ పెట్టుబడుల ప్రకారం అప్పట్లో జియో ప్లాట్ఫామ్స్ విలువను రూ. 4.36 లక్షల కోట్లుగా (దాదాపు 58.1 బిలియన్ డాలర్లు) లెక్కగట్టారు. శుక్రవారం బీఎస్లో భారతి ఎయిర్టెల్ షేరు 1 శాతం పైగా పెరిగి రూ. 716 వద్ద క్లోజయ్యింది. -
కంపెనీలో వారికి ఆహ్వానం పలకనున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వ్యూహాత్మక పెట్టుబడిదారు సంస్థను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల జారీని చేపట్టనున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొంటున్నాయి. పెట్టుబడుల అంశాన్ని ఈ నెల 28న(శుక్రవారం) నిర్వహించనున్న వాటాదారుల సమావేశంలో బోర్డు చర్చించనున్నట్లు తెలియజేశాయి. రుణ చెల్లింపుల ఒత్తిడి వంటి అంశాలుకాకుండా దీర్ఘకాలిక వ్యాపార ప్రణాళికలకు అనుగుణంగా మాత్ర మే పెట్టుబడిదారు సంస్థకు ఈక్విటీ జారీ యోచనలో ఉన్నట్లు వివరించాయి. వెనువెంటనే పెట్టుబడుల ఆవశ్యకత లేనప్పటికీ భారతీ ఎయిర్టెల్ ప్రిఫరెన్షియల్ ఈక్విటీ జారీ యోచన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నట్లు జెఫరీస్ ఈక్విటీ రీసెర్చ్ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఈ వార్తల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు బీఎస్ఈలో 3.25 శాతం లాభపడి రూ. 712 వద్ద ముగిసింది. -
డిష్ టీవీ ఫర్ సేల్..! పోటీలో ప్రధాన కంపెనీలు..!
లోన్ రికవరీలో భాగంగా డిష్ టీవీలో దక్కిన 25.6 శాతం వాటాలను యస్ బ్యాంకు అమ్మేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకుగాను యస్ బ్యాంకు దిగ్గజ శాటిలైట్ సంస్థలతో సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. పోటీలో టాటా స్కై, భారతి ఎయిర్టెల్..! డిష్ టీవీను దక్కించుకునేందుకు దిగ్గజ శాటిలైట్ సంస్థలు టాటాస్కై, భారతీ ఎయిర్టెల్ ముందున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ వ్యవహారంపై ఇరు కంపెనీలు స్పందించలేదు. డిష్ టీవీ, యస్ బ్యాంకుల మధ్య గత కొద్ది రోజల నుంచి అనిశ్చితి నెలకొంది. కంపెనీపై బాధ్యతలు తమకే ఉంటాయని ఇరు వర్గాలు వాదనలు చేస్తున్నాయి. వారికే బెనిఫిట్..! డిష్ టీవీ వ్యవహారాలను కంపెనీ ప్రమోటర్ సుభాష్ చంద్ర ఫ్యామిలీ కంపెనీ కార్యకలాపాలను చూసుకుంటుంది. వీరికి కంపెనీలో ఆరు శాతం వాటాలు కల్గి ఉన్నారు. ఒకవేళ యస్బ్యాంకు డిష్టీవీ వాటాలను టాటాస్కై, లేదా ఎయిర్టెల్ దక్కించుకుంటే ఆయా శాటిలైట్ టీవీ కంపెనీలు వాటా గణనీయంగా పెరగనుంది. శాటిలైట్ డిష్ టీవీ మార్కెట్లో 88 శాతంతో టాటాస్కై మొదటిస్థానంలో ఉంది. ఎయిర్టెల్, డిష్ టీవీలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో డిష్ టీవీ ఆదాయం రూ.14 కోట్లుగా నమోదైంది. అలాగే రూ.67 కోట్ల నష్టాలను చవిచూసింది. డిష్ టీవీ మార్కెట్ విలువ రూ.8,268 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: 500 కోట్ల పరిహారం అడిగాడు.. ఆపై భార్యతో కలిసి ఫోన్లో బండబూతులు తిట్టాడు! -
ఎయిర్టెల్ బాదుడు షురూ!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా భారీ స్థాయిలో ప్రీపెయిడ్ ప్లాన్ల టారిఫ్లు పెంచింది. వాయిస్ ప్లాన్లు, అన్లిమిటెడ్ వాయిస్ బండిల్స్, డేటా టాప్–అప్లపై ఇది ఏకంగా 20–25 శాతం దాకా ఉంది. కొత్త రేట్లు నవంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తెలిపింది. ఎంట్రీ స్థాయి వాయిస్ ప్లాన్ రేటు 25 శాతం పెరగ్గా, మిగతా చాలా మటుకు అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో పెంపు సుమారు 20 శాతంగా ఉంది. డేటా టాప్–అప్ ప్లాన్ల టారిఫ్ల పెంపు 20–21 శాతంగా ఉంది. పెట్టుబడులపై సముచిత రాబడులు వచ్చి, వ్యాపార నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రతి మొబైల్ యూజర్పై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం రూ. 200 స్థాయిలో, అంతిమంగా రూ. 300 స్థాయిలో ఉండాలని ముందు నుంచి తాము చెబుతున్నామని ఎయిర్టెల్ పేర్కొంది. ఆ దిశగానే చర్యలు తీసుకుంటున్నామని వివరించింది. ‘ఏఆర్పీయూ మేము భావిస్తున్న స్థాయిలో ఉంటే నెట్వర్క్లు, స్పెక్ట్రంపై గణనీయంగా పెట్టుబడులు పెట్టేందుకు వీలవుతుంది. అలాగే దేశీయంగా 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కూడా సాధ్యమవుతుంది‘ అని ఎయిర్టెల్ వివరించింది. ఏఆర్పీయూ పెరగాల్సిన అవసరం ఉందని చాన్నాళ్లుగా చెబుతున్నప్పటికీ.. ఎయిర్టెల్ ఈ స్థాయిలో టారిఫ్లు పెంచడం ఇదే ప్రథమం. ఈ ఏడాది జూలైలోనే కంపెనీ కొంత మేర పెంచింది. అప్పట్లో రూ. 49 ప్రీపెయిడ్ రీచార్జ్ని తొలగించింది. ఈసారి మాత్రం పెంపు భారీగానే ఉంది. రూ. 79 ప్లాన్.. ఇకపై రూ. 99.. ► టారిఫ్డ్ వాయిస్ ప్లాన్లకు సంబంధించి ప్రస్తుతం రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు ఇకపై రూ. 99గా ఉండనుంది (దాదాపు 25.3 శాతం పెంపు). ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్టైమ్ (50 శాతం అధికంగా), 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది. ► అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెరుగుతుంది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారుతుంది. ► డేటా టాప్ అప్ల విషయంలో రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారుతుంది. ► రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) మారుతుంది. జియో, వొడాఐడియాపై దృష్టి.. ఎయిర్టెల్ టారిఫ్లు పెంచిన నేపథ్యంలో పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. టెలికం రంగం కోలుకోవాలంటే టారిఫ్ల పెంపు కీలకమంటూ వొడాఫోన్ ఐడియా సీఈవో రవీందర టక్కర్ ఇటీవలే వ్యాఖ్యానించడం గమనార్హం. తమ కంపెనీ మొబైల్ టారిఫ్ల పెంపుపై కసరత్తు చేస్తోందని, త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. -
ఎయిర్టెల్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) రెండో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 1,134 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మెరుగుపడ్డ బిజినెస్ వాతావరణం, 4జీ కస్టమర్లలో వృద్ధి, బలపడిన మొబైల్ ఏఆర్పీయూ వంటి అంశాలు పటిష్ట ఫలితాల సాధనకు సహకరించాయి. క్యూ2లో మొత్తం ఆదాయం 19% పుంజుకుని రూ. 28,326 కోట్లను అధిగమించింది. పెట్టుబడి వ్యయాలు రూ. 6,972 కోట్లుగా నమోదయ్యాయి. 16 దేశాలలో ఎయిర్టెల్ 16 దేశాలలో కార్యకలాపాలు విస్తరించింది. కస్టమర్ల సంఖ్య 48 కోట్లకు చేరింది. టెలికం రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉపశమన ప్యాకేజీలో భాగంగా ఏజీఆర్ బకాయిలు, స్పెక్ట్రమ్ చెల్లింపులకు ఎయిర్టెల్కు నాలుగేళ్ల గడువు లభించింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, డేటా సెంటర్లు, డిజిటల్ సర్వీసుల ఆదాయం పుంజుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. క్యూ2లో దేశీ ఆదాయం 18 శాతంపైగా వృద్ధితో రూ. 20,987 కోట్లను తాకింది. కస్టమర్ల సంఖ్య 35.5 కోట్లకు చేరింది. ఒక్కో కస్టమర్పై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 10 బలపడి రూ. 153కు చేరింది. 4జీ వినియోగదారుల సంఖ్య 26 శాతం ఎగసి 19.25 కోట్లను తాకింది. ఒక్కో యూజర్ సగటు నెల రోజుల డేటా వినియోగం 18.6 జీబీగా నమోదైంది. 3,500 టవర్లను అదనంగా ఏర్పాటు చేసుకుంది. ‘కేంద్రం ప్రకటించిన సంస్కరణలు టెలికం పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులకు దారిచూపనున్నాయి. దీంతో దేశీయంగా డిజిటల్ విస్తరణకు ఊతం లభించనుంది. సంస్కరణలు కొనసాగుతాయని, దీర్ఘకాలంగా పరిశ్రమను దెబ్బతీస్తున్న అంశాలకు పరిష్కారాలు లభించవచ్చని భావిస్తున్నాం. 5జీ నెట్వర్క్ ద్వారా మరింత పటిష్టపడనున్నాం’ అని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (దక్షిణాసియా)గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు యథాతథంగా రూ. 713 వద్ద ముగిసింది. -
స్మార్ట్ఫోన్ కొంటే రూ.6,000 క్యాష్బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగంలో ఉన్న భారతి ఎయిర్టెల్ క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ద్వారా రూ.12,000 వరకు ధర గల స్మార్ట్ఫోన్ కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.6,000 క్యాష్బ్యాక్ అందుకోవచ్చు. శామ్సంగ్, షావొమీ, వివో, ఒప్పో, రియల్మీ, నోకియా, ఐటెల్, లావా, ఇన్ఫినిక్స్, టెక్నో, లెనోవో, మోటరోలా బ్రాండ్ల ఫోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. 150కిపైగా మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. రూ.249 ఆపైన ధర గల ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్ను 36 నెలలపాటు రిచార్జ్ చేయాల్సి ఉంటుంది. 18 నెలల తర్వాత రూ.2,000, మిగిలిన రూ.4,000లను 36 నెలలు పూర్తి అయ్యాక చెల్లిస్తారు. అలాగే స్క్రీన్ పాడైతే ఒకసారి ఉచితంగా మారుస్తారు. బేసిక్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్ వైపు వినియోగదార్లను అప్గ్రేడ్ చేసేందుకే ఈ చొరవ తీసుకున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త!
ఐపీఎల్ ప్రియులకు భారతీ ఎయిర్టెల్ శుభవార్త తెలిపింది. ఐపీఎల్ 2021 సెప్టెంబర్19న తిరిగి ప్రారంభంకాబోతున్న మనకు సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రియుల కోసం భారతీ ఎయిర్టెల్ డిస్నీ+ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్లను అందించే మూడు కొత్త రీఛార్జ్ ప్యాక్ లను విడుదల చేసింది. దీంతో వినియోగదారులు తమ మొబైల్ ద్వారానే టోర్నమెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించవచ్చు. ఈ మూడు కొత్త ప్యాక్(రూ.499, రూ.699, రూ.2798)లను రీఛార్జ్ చేసుకుంటే హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సదుపాయంతో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయి.(చదవండి: ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు) ఎయిర్టెల్ రూ.499 ప్లాన్ రూ.499 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో రోజుకు 3జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ రూ.699 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 56 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. ఎయిర్ టెల్ రూ.2798 ప్లాన్ రూ.2798 డిస్నీ+ హాట్ స్టార్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వాలిడిటీతో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ సర్వీస్ వంటి ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, అమెజాన్ ప్రైమ్ వీడియోలను ఉచితంగా వీక్షించవచ్చు. ఇక రోజుకు ఉచిత 100 ఎస్ఎమ్ఎస్ కూడా పొందుతారు. ఇంకా, ఇతర సదుపాయాలు కూడా లభిస్తాయి. -
టారిఫ్లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్వర్క్లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
ఇక ఎయిర్టెల్లో గూగుల్ రింగ్!
న్యూఢిల్లీ: బూమింగ్లో ఉన్న దేశీ మొబైల్ టెలికం రంగంపై ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ కన్నేసింది. గతేడాది రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో వాటా కొనుగోలు చేసిన గూగుల్ భారతీ ఎయిర్టెల్పైనా దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఎయిర్టెల్లోనూ భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు వీలుగా ఎయిర్టెల్తో జరుపుతున్న చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. వెరసి ఎయిర్టెల్లోనూ ప్రస్తావించదగ్గ స్థాయిలో వాటా కొనుగోలు చేయనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో దేశీయంగా పోటీ సంస్థలైన రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ రెండింటిలోనూ గూగుల్ వాటాలు సొంతం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జియో ప్లాట్ఫామ్స్లో 7.73 శాతం వాటాను గూగుల్ కైవసం చేసుకుంది. ఇందుకు రూ. 33,737 కోట్లు వెచ్చించింది. గూగుల్తో డీల్ కుదిరితే ఎయిర్టెల్కు నిధుల రీత్యా బూస్ట్ లభిస్తుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. -
జియో నుంచి ఎయిర్టెల్కు రూ.1,005 కోట్లు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్తో ఒప్పందం పూర్తి చేసుకున్నట్టు ఎయిర్టెల్ ప్రకటించింది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఈ ఒప్పందంలో భాగంగా మూడు సర్కిళ్లలో ఎయిర్టెల్ ఆధీనంలో ఉన్న 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను వినియోగించుకునే హక్కులు రిలయన్స్ జియోకు లభించినట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకు సంబంధించి రూ.1,005 కోట్లను అందుకున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ స్పెక్ట్రమ్కు సంబంధించి భవిష్యత్తులో రూ.469 కోట్ల చెల్లింపుల బాధ్యత కూడా జియోపై ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో జియోకు ఎయిర్టెల్ స్పెక్ట్రమ్ను వినియోగించుకునే అవకాశం లభించినట్టయింది. ఈ రెండు సంస్థలు ఈ ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్లో ప్రకటించడం గమనార్హం. 800 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ వల్ల జియో నెట్వర్క్ యూజర్లకు ఇండోర్ (భవనాల్లోపల) కవరేజీ మెరుగుపడనుంది. -
లాభాల్లో ఎయిర్టెల్, 15శాతం పెరిగిన ఆదాయం
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్లో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్–జూన్)లో రూ. 284 కోట్ల నికర లాభం ఆర్జించింది. దీనిలో గ్రూప్లోని ఒక అనుబంధ సంస్థకు చెందిన టెలికం టవర్ల విక్రయం ద్వారా లభించిన రూ. 30.5 కోట్లు కలసి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 15,933 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గత క్యూ1లో ఏజీఆర్ బకాయిల ప్రొవిజనింగ్ చేపట్టడం ప్రభావం చూపింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం సైతం 15 శాతంపైగా ఎగసి రూ. 26,854 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 146కు మెరుగుపడింది. గత క్యూ1లో రూ. 138గా నమోదైంది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 48.9 శాతం నుంచి 49.1 శాతానికి బలపడ్డాయి. దేశీయంగా..: క్యూ1లో భారతీ ఎయిర్టెల్ దేశీ టర్నోవర్ 19 శాతం ఎగసి రూ. 18,828 కోట్లుగా నమోదైంది. మొబైల్ ఆదాయం 22 శాతం పుంజుకున్నట్లు కంపెనీ తెలియజేసింది. 51 లక్షల మంది 4జీ కస్టమర్లు కొత్తగా జత కలసినట్లు వెల్లడించింది. హోమ్ బిజినెస్లో కొత్తగా 2.85 లక్షల మంది కస్టమర్లు జత కలసినట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తం గా కస్టమర్ల సంఖ్య దాదాపు 47.4 కోట్లకు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 2.3 శాతం లాభపడి రూ. 578 వద్ద ముగిసింది. -
టెలికం కంపెనీలకు ‘సుప్రీం’ నిరాశ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి తాము చెల్లించాల్సిన సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిల లెక్కల్లో తప్పులు దొర్లాయని, సవరించడానికి అనుమతించాలని వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్, టాటా టెలీ సర్వీసెస్లు దాఖలు చేసుకున్న పిటిషన్లను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తులు ఎల్ నాగేశ్వరరావు, ఎస్ఏ నజీర్, ఎంఆర్ షాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విషయంలో గతంలో వేసిన లెక్కలే చివరివనీ, వీటిలో ఎటువంటి మార్పూ ఉండబోదని స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే... ► దాదాపు రూ.1.4 లక్షల కోట్ల ఏజీఆర్ను టెలికం శాఖ డిమాండ్ చేసింది. టెలికంకు అనుకూలం గా 2019 అక్టోబర్లో సుప్రీం తీర్పు నిచ్చింది. ► అయితే గత ఏడాది సెప్టెంబర్లో బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీం కొంత ఊరటనిచ్చింది. టెలికం డిమాండ్ చేసిన ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీలోపు చెల్లించాలని టెలికం కంపెనీలకు గత ఏడాది సెప్టెంబర్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన మొత్తాలను 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2031 మర్చి 31వ తేదీ లోపు వార్షిక వాయిదాల్లో చెల్లించాలని సూచించింది. ఆయా అంశాలపై ఇదే తుది నిర్ణయమని కూడా స్పష్టం చేసింది. ► భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాసహా ఆపరేటర్లు ఏజీఆర్ బకాయిల్లో 10 శాతాన్ని 2021 మార్చి 31వ తేదీ నాటికి చెల్లించాయి. ► వేర్వేరుగా చూస్తే, భారతీ ఎయిర్టెల్ రూ.43,980 కోట్లు, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రూ.58,254 కోట్లు, టాటా గ్రూప్ రూ.16,798 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ.5,835.85 కోట్లు, ఎంటీఎన్ఎల్ రూ.4,352.09 కోట్లు చెల్లించాల్సి ఉంది. ► ఇందులో భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే రూ.18,004 కోట్లు చెల్లించింది. వొడాఫోన్ ఐడియా రూ.7,854 కోట్లు, టాటాలు రూ.4,197 కోట్లు, రిలయన్స్ జియో రూ.194.79 కోట్లు చెల్లించాయి. ► అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ రూ.25,194.58 కోట్లు, ఎయిర్సెల్ రూ.12,389 కోట్లు, వీడియోకాన్ కమ్యూనికేషన్స్ రూ.1,376 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇవి దివాలా ప్రక్రియలో ఉన్నాయి. ► ప్రభుత్వానికి రూ.604 కోట్లు బకాయిపడ్డ లూప్ టెలికం, ఎటిసలాట్ డీబీ, ఎస్ టెల్ భారత్లో తమ కార్యకలాపాలను మూసివేశాయి. ► ఇదిలావుండగా, తమ ఆస్తులలో భాగంగా ఎయిర్ వేవ్స్ లేదా స్పెక్ట్రంను టెలికం కంపెనీలు బదిలీ చేయవచ్చా లేదా విక్రయించవచ్చా అనే ప్రశ్నపై దాఖలైన ఇతర పిటిషన్ల విచారణ ప్రస్తుతం సుప్రీం ధర్మాసనం ముందు ఉంది. షేర్ల ధరలు ఇలా... సుప్రీం తీర్పు నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా షేర్ ధర శుక్రవారం ఎన్ఎస్ఈలో దాదాపు 10 శాతం పడి, రూ.8.35 వద్ద ముగిసింది. ఇక ఇండస్ టవర్స్ షేర్ ధర 5 శాతం తగ్గి రూ.220.50 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ షేర్ ధర మాత్రం స్వల్పంగా (0.29 శాతం) పెరిగి రూ.548.30 వద్ద ముగిసింది. టాటా టెలిసర్వీసెస్ కూడా 5 శాతం నష్టపోయి రూ. 37.75 వద్ద ముగిసింది. వీఐఎల్కు ఇబ్బందే: విశ్లేషణలు సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు టెలికం కంపెనీలకు ప్రత్యేకంగా రుణ భారాలను మోస్తున్న వొడాఫోన్ ఐడియాకు తీవ్ర ఇబ్బందికర పరిణామమని విశ్లేషణా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ తీర్పు ప్రతికూలతను పరోక్షంగా ఎదుర్కొనే సంస్థల్లో తరువాత ఇండస్ టవర్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. ఫైనాన్షియల్ సేవల సంస్థ... సిటీ దీనిపై విశ్లేషిస్తూ, వొడాఫోన్ ఐడియా దాదాపు రూ.25,000 కోట్ల సమీకరణ ప్రణాళికలపై తాజా పరిణామం ప్రభా వం పడుతుందని పేర్కొంది. అయితే భారతీ ఎయిర్టెల్ పరిస్థితి అంత ఇబ్బందికరంగా ఉండబోదని విశ్లేషించింది. ఎడిల్వీస్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. -
5జీ టెక్నాలజీ చాలా సేఫ్: సీఓఏఐ
5జీ టెక్నాలజీ వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అనే వార్తలను టెలికాం సంస్థల సంఘం సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) కొట్టి పారేసింది. 5జీ టెక్నాలజీ పూర్తిగా సురక్షితమని సీఓఏఐ స్పష్టం చేసింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాలన్ని తరువాతి తరం 5జీ టెక్నాలజీ సురక్షితమచి చెబుతున్నట్టు పేర్కొంది. 5జీ టెక్నాలజీ "గేమ్ ఛేంజర్" అని రుజువు చేస్తుందని తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ప్రయోజనం కలుగుతుందని నొక్కి చెప్పింది ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్కు ఈ సంఘం ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీ విషయమై వేసిన కేసులో బాలీవుడ్ నటి జుహీ చావ్లాకు చుక్కెదురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఓఏఐ ఈ ప్రకటన జారీ చేసింది. టెలికాం టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్కు సంబంధించి ప్రపంచంలో ఆమోదం పొందిన ప్రమాణాల కంటే మన దేశంలో విధించిన నిబందనలు చాలా కఠినమైనవని పేర్కొంది. "భారతదేశంలో అనుమతించిన రేడియేషన్ ప్రపంచవ్యాప్తంగా అంగీకరించిన వాటిలో పదోవంతు కాబట్టి రేడియేషన్ వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందన్న భయాలు అనవసరం. క్రొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పుడల్లా ఇలా జరుగుతుంది" అని సీఓఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచ్చర్ పీటీఐకి చెప్పారు. దేశంలో 5జీ వైర్లెస్ నెట్వర్క్లను ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ నటి జూహి చావ్లా ఢిల్లీ హైకోర్టులో దావా వేసిన సంగతి తెలిసిందే. విచారణ సమయంలో హైకోర్టు నటిపై, ఇతర పిటిషనర్లపై రూ.20 లక్షల జరిమానా విధించింది. ఈ వ్యాజ్యం లోపభూయిష్టమైనదని, న్యాయప్రక్రియ దుర్వినియోగమైందని, కేవలం ప్రచారం పొందేందుకే ఈ కేసు పెట్టినట్టుగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చదవండి: బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ -
డిజిటల్పై ఎయిర్టెల్ దృష్టి
న్యూఢిల్లీ: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్కి చెందిన జియో ప్లాట్ఫామ్స్ బాటలోనే డిజిటల్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా కార్పొరేట్ స్వరూపాన్ని పునర్వ్యవస్థీకరించింది. డిజిటల్, ఇండియా, ఇంటర్నేషనల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ నాలుగు ప్రధాన విభాగాలపై దృష్టి పెట్టనున్నట్లు కంపెనీ వివరించింది. కొత్త మార్పుల ప్రకారం ఎయిర్టెల్ డిజిటల్ లిమిటెడ్ ఇకపై లిస్టెడ్ సంస్థ భారతి ఎయిర్టెల్లో భాగంగా ఉంటుంది. వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ స్ట్రీమ్, మిత్రా పేమమెంట్స్ ప్లాట్ఫాం మొదలైన వాటితో పాటు భవిష్యత్లో ప్రవేశపెట్టే డిజిటల్ ఉత్పత్తులు, సర్వీసులు కూడా దీని కిందే ఉంటాయి. ఇక టెలికం వ్యాపార కార్యకలాపాలన్నీ కొత్తగా ఏర్పాటు చేసిన ఎయిర్టెల్ లిమిటెడ్ సంస్థ పరిధిలో ఉంటాయి. డీటీహెచ్ సేవలకు సంబంధించిన భారతి టెలీమీడియా ప్రస్తుతానికి విడిగానే ఉంటుందని, ఈ వ్యాపారాన్ని అంతిమంగా ఎయిర్టెల్ లిమిటెడ్లోకి చేర్చే ఉద్దేశం ఉందని కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ .. భారతి ఎయిర్టెల్లోనే ప్రత్యేక సంస్థగా కొనసాగుతుంది. మరోవైపు ఎన్ఎక్స్ట్రా, ఇండస్ టవర్స్ వంటి ఇన్ఫ్రా వ్యాపార సంస్థలు ప్రస్తుతానికి వేర్వేరు సంస్థలుగానే కొనసాగుతాయి. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాటాదారులకు అధిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ఈ మార్పులన్నీ దోహదపడగలవని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ఎయిర్టెల్ పోటీ సంస్థ జియో ప్లాట్ఫామ్స్ గతేడాది ఏకంగా రూ. 1,52,056 కోట్ల పెట్టుబడులు సమీకరించిన సంగతి తెలిసిందే. -
స్పెక్ట్రం వేలం షురూ
న్యూఢిల్లీ: దాదాపు రూ. 3.92 లక్షల కోట్ల విలువ చేసే టెలికం స్పెక్ట్రం వేలం సోమవారం ప్రారంభమైంది. తొలి రోజున రూ. 77,146 కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చాయని టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బిడ్డింగ్కు స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గానే ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రీమియం బ్యాండ్స్ అయిన 700, 2500 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్ చేయలేదని చెప్పారు. మంగళవారం కూడా వేలం కొనసాగించి, ముగించనున్నామని వివరించారు. ‘సోమవారం సాయంత్రం 6 గం.ల దాకా రూ. 77,146 కోట్ల బిడ్లు వచ్చాయి. కేవలం మూడు సంస్థలే పోటీపడుతున్నాయి.. అది కూడా గత స్పెక్ట్రంనే రెన్యూ చేసుకోనున్నాయి కాబట్టి బిడ్లు మహా అయితే రూ. 45,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని మేం అంచనా వేశాం. అయితే దానికి మించి బిడ్లు వచ్చాయి’ అని ప్రసాద్ తెలిపారు. బిడ్డర్ల వారీగా వివరాలు వెల్లడి కానప్పటికీ దాదాపు 849.20 మెగాహెట్జ్ పరిమాణానికి బిడ్లు వచ్చినట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. మొదటి రోజున నాలుగు రౌండ్లు జరిగాయి. 700 మెగాహెట్జ్కు దూరం.. ‘మొత్తం వేలానికి ఉంచిన స్పెక్ట్రం విలువ దాదాపు రూ. 4 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 700 మెగాహెట్జ్ బ్యాండ్.. అత్యంత ఖరీదైనది. దీని విలువే ఏకంగా రూ. 1.97 లక్షల కోట్లు ఉంటుంది’ అని ప్రసాద్ తెలిపారు. 5జీ సేవలకు ఉపయోగపడే 700 మెగాహెట్జ్ బ్యాండ్కు 2016లో నిర్వహించిన వేలంలో కూడా స్పందన లభించలేదు. ఒకవేళ రేటు కారణంగా ప్రస్తుత వేలంలోనూ అమ్ముడు కాకపోయిన పక్షంలో దీనిపై ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. కరోనా వైరస్ పరిణామాలతో ఎకానమీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో వేలం జరుగుతున్నప్పటికీ.. ప్రోత్సాహకరమైన ఫలితాలు కనిపిస్తుండటం సానుకూలాంశమని ప్రసాద్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5జీ స్పెక్ట్రం వేలం జరిగే అవకాశం ఉందని టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ చెప్పారు. దూకుడుగా జియో.. వేలంలో పాల్గొంటున్న మూడు ప్రైవేట్ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కలిపి రూ.13,475 కోట్లు ముందస్తు డిపాజిట్ (ఈఎండీ) చేశాయి. దాదాపు రూ. 1.79 లక్షల కోట్ల విలువ చేసే జియో సంస్థ అత్యధికంగా రూ. 10,000 కోట్లు బయానాగా చెల్లించింది. ఇక రూ. 71,703 కోట్ల విలువ గల భారతి ఎయిర్టెల్ రూ. 3,000 కోట్లు, రూ. 43,474 కోట్ల నెగటివ్ విలువ గల వొడాఫోన్ ఐడియా రూ. 475 కోట్ల ఈఎండీ చెల్లించాయి. జియో చెల్లించిన బయానా బట్టి చూస్తే .. సబ్స్క్రయిబర్స్ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గణనీయంగా స్పెక్ట్రం తీసుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోందని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఖజానాకు రూ. 13,000 కోట్లు స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఆర్థిక సంవత్సరం సుమారు రూ.12,000–13,000 కోట్లు రావచ్చని అంచనా. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా దాదాపు ఇదే స్థాయిలో అందవచ్చు. ప్రస్తుత వేలంలో .. ఏడు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో (700 మెగాహెట్జ్, 800, 900, 1800, 2100, 2300, 2500 మెగాహెట్జ్) మొత్తం 2,308.80 మెగాహెట్జ్ (ఎంహెచ్జెడ్) స్పెక్ట్రంను ప్రభుత్వం విక్రయిస్తోంది. ఇందులో 5జీ కోసం ఉద్దేశించిన 3,300–3,600 మెగాహెట్జ్ బ్యాండ్లను చేర్చలేదని, వీటిని తర్వాత వేలం వేయవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
మళ్లీ ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: టెలికం రంగ మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఈ ఆర్థిక సంవత్సరం(2020–21) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో రూ. 854 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది క్యూ3లో రూ. 1,035 కోట్ల నికర నష్టం ప్రకటించింది. వెరసి ఆరు క్వార్టర్ల తదుపరి టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. కాగా.. ప్రస్తుత సమీక్షా కాలంలో మొత్తం ఆదాయం 24 శాతం ఎగసి రూ. 26,518 కోట్లను తాకింది. తద్వారా మూడు నెలల కాలానికి కంపెనీ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని అందుకుంది. ఇందుకు మొబైల్ టారిఫ్లు మెరుగుపడటం, కస్టమర్ల సంఖ్య పుంజుకోవడం వంటి అంశాలు దోహదపడ్డాయి. క్యూ3లో దేశీ బిజినెస్ టర్నోవర్ సైతం 25 శాతం జంప్చేసి రూ. 19,007 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) రూ. 135 నుంచి రూ. 166కు ఎగసింది. క్యూ3లో ఆఫ్రికా నుంచి ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 7,644 కోట్లను అధిగమించింది. యూజర్లు 45.79 కోట్లకు... కంపెనీ కస్టమర్ల సంఖ్య 9.4 శాతం పెరిగి 45.79 కోట్లకు చేరింది. దేశీయంగా ఈ సంఖ్య 30.87 కోట్ల నుంచి 33.62 కోట్లకు ఎగసింది. ఆఫ్రికాలో వినియోగదారుల సంఖ్య 11% వృద్ధితో 11.89 కోట్లను తాకింది. డిసెంబర్కల్లా కంపెనీ రుణ భారం రూ. 1,47,438 కోట్లుగా ఉంది. డిబెంచర్లు, బాండ్లు తదితర మార్గాలలో నిధుల సమీకరణకు బోర్డు అనుమతించినట్లు ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది. ఒకేసారి లేదా దశలవారీగా రూ. 7,500 కోట్లవరకూ సమీకరించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. అనిశ్చితి ఉన్నా ఏడాది పొడవునా అనిశ్చిత వాతావరణం ఉన్నప్పటికీ మరోసారి పటిష్ట పనితీరును చూపగలిగినట్లు భారతీ ఎయిర్టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ పేర్కొన్నారు. పోర్ట్ఫోలియోలోని ప్రతీ విభాగంలోనూ స్థిరమైన వృద్ధిని సాధించినట్లు తెలియజేశారు. పెరిగిన మార్కెట్ వాటా ద్వారా ఇది ప్రతిఫలిస్తున్నట్లు చెప్పారు. క్యూ3లో ప్రధానంగా 13 మిలియన్ల 4జీ కస్టమర్లు కొత్తగా జత కలిసినట్లు పేర్కొన్నారు. తద్వారా ఈ సంఖ్య 165.6 మిలియన్లకు చేరినట్లు తెలియజేశారు. దేశంలోనే తొలిసారిగా హైదరబాద్ నగరంలో ఒక వాణిజ్య నెట్వర్క్పై 5జీ లైవ్ను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేరు ఎన్ఎస్ఈలో 2 శాతం లాభపడి రూ. 612 వద్ద ముగిసింది. -
సెకన్ల వ్యవధిలోనే సినిమా మొత్తం డౌన్లోడ్!
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులకు తమ నెట్వర్క్ సర్వం సిద్ధంగా ఉందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తెలిపింది. హైదరాబాద్ నగరంలో లైవ్గా 5జీ నెట్వర్క్ను ప్రయోగాత్మకంగా పరీక్షించినట్లు వెల్లడించింది. యూజర్లు పూర్తి నిడివి సినిమాను 5జీ ఫోన్లో కేవలం సెకన్ల వ్యవధిలోనే డౌన్లోడ్ చేసుకోగలిగినట్లు పేర్కొంది. తగినంత స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక, ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించిన తర్వాత పూర్తి స్థాయి సేవల అనుభూతిని కస్టమర్లకు అందించవచ్చని సంస్థ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీతో పోలిస్తే ఎయిర్టెల్ 5జీ ఏకంగా పది రెట్లు వేగవంతమైన సేవలు అందించగలదని పేర్కొన్నారు. మరోవైపు, 5జీకి సంబంధించిన కీలక నెట్వర్క్ అంతా దేశీయమైనదే కావవాలని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్వీసెస్ (ఎన్ఐసీఎస్ఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 2జీ, 3జీ, 4జీలో వెనుకబడినప్పటికీ 5జీ విషయంలో మాత్రం మిగతా దేశాల కన్నా భారత్ వేగంగా కొత్త టెక్నాలజీని అమలు చేయగలదని పేర్కొన్నారు. నవంబర్లో 43.7 లక్షల కొత్త యూజర్లు.. సబ్స్క్రైబర్ బేస్ను పెంచుకునే విషయంలో దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోమారు దుమ్మురేపింది. గతేడాది నవంబర్లో 43.7 లక్షల మంది కొత్త యూజర్లను సొంతం చేసుకున్న ట్రాయ్ గణాంకాలు తెలిపాయి. ఫలితంగా మొత్తం యూజర్ల సంఖ్య 33.46 కోట్లకు పెరిగింది. ఇదే నవంబర్లో తన సమీప ప్రత్యర్థి రిలయన్స్ జియో కూడా 19.36 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్లను దక్కించుకుంది. తద్వారా జియో మొత్తం యూజర్ల సంఖ్య 40.82 కోట్లకు పెరిగింది. నవంబర్లోనే 28.9 లక్షల మంది యూజర్లు వోడాఫోన్ ఐడియాకు గుడ్బై చెప్పడంతో కంపెనీ యూజర్ల బేస్ 28.99 కోట్లకు తగ్గింది. దేశవ్యాప్తంగా టెలిఫోన్ సబ్స్క్రైబర్లు నవంబర్ నాటికి 1,175.27 మిలియన్లకు చేరుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. -
మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రత్యేకంగా ప్రైమ్ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. కేవలం మొబైల్ యూజర్ల కోసమే అమెజాన్ ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఒక్క యూజర్కి మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్లో స్టాండర్డ్ డెఫినిషన్ నాణ్యతతో ప్రసారాలు పొందవచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ గౌరవ్ గాంధీ తెలిపారు. బహుళ యూజర్ల యాక్సెస్, హెచ్డీ/అల్ట్రా హెచ్డీ కంటెంట్, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్డాట్ఇన్ ద్వారా ఆర్డర్ల వేగవంతమైన డెలివరీ తదితర సర్వీసుల కోసం 30 రోజుల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రూ. 131తో పొందవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్తో పాటు దేశవ్యాప్తంగా పలు రీచార్జ్ పాయింట్లలో దీన్ని రీచార్జ్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ. 129, వార్షికంగా రూ. 999 చార్జితో అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఆఫర్ కూడా యథాప్రకారం అందుబాటులో ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్లో డిస్నీప్లస్హాట్స్టార్, జీ5, నెట్ఫ్లిక్స్ తదితర సంస్థలతో కంపెనీ పోటీపడుతోంది. నెట్ఫ్లిక్స్ గతేడాదే మొబైల్ యూజర్ల కోసం రూ. 199 సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. -
Q2తో ఎయిర్టెల్ లాభాల ట్యూన్స్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్కు భారీ డిమాండ్ నెలకొంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ తొలుత దాదాపు 13 శాతం దూసుకెళ్లింది. రూ. 488కు చేరింది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 9 శాతం జంప్చేసి రూ. 471 వద్ద ట్రేడవుతోంది. ప్రధానంగా ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) భారీగా మెరుగుపడటంతో ఎయిర్టెల్ కౌంటర్కు జోష వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం.. రూ. 162కు క్యూ2లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఎయిర్టెల్ రూ. 763 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ2లో నమోదైన రూ. 23,045 కోట్లతో పోలిస్తే నష్టం 97 శాతం తగ్గడం గమనార్హం! కాగా.. కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఈ క్యూ2లో రూ. 25,785 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది 22 శాతం అధికంకాగా.. డేటా వినియోగం 58 శాతం పెరిగినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. దేశీయంగా ఆదాయం 22 శాతం పుంజుకుని రూ. 18,747 కోట్లను తాకింది. ప్రధానంగా ఏఆర్పీయూ రూ. 128 నుంచి రూ. 162కు ఎగసింది. క్యూ1లో సాధించిన రూ. 157తో పోల్చినా ఇది అధికమే. ఈ కాలంలో 4జీ డేటా కస్టమర్ల సంఖ్య 15.27 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. 1.44 కోట్ల మంది కొత్తగా జమ అయినట్లు తెలియజేసింది. -
భారత్లో టిక్టాక్పై సాఫ్ట్బ్యాంక్ కన్ను?
న్యూఢిల్లీ: వీడియో షేరింగ్ యాప్ టిక్టాక్ భారత వ్యాపార విభాగాన్ని కొనుగోలు చేయడంపై జపాన్కి చెందిన ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. ఇందుకోసం దేశీ సంస్థలతో జట్టు కట్టడంపై కసరత్తు చేస్తోంది. చైనాకు చెందిన టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్లో కూడా పెట్టుబడులు ఉన్న సాఫ్ట్బ్యాంక్.. గత నెల రోజులుగా దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, భారతి ఎయిర్టెల్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇవి పెద్దగా ఫలవంతం కాకపోయినప్పటికీ.. సాఫ్ట్బ్యాంక్ ప్రత్యామ్నాయ అవకాశాలను ఇంకా అన్వేషిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సాఫ్ట్బ్యాంక్, బైట్డ్యాన్స్, రిలయన్స్, భారతి ఎయిర్టెల్ సంస్థలు ఈ వార్తలపై స్పందించలేదు. పలు దేశాల్లో టిక్టాక్ బంద్.. కీలకమైన యూజర్ల డేటా అంతా చైనా చేతికి చేరిపోతోందనే ఆందోళనతో భద్రతా కారణాలరీత్యా పలు దేశాలు టిక్టాక్ను నిషేధిస్తున్న సంగతి తెలిసిందే. చైనాతో సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో భారత్ కూడా దీనితో పాటు పలు చైనా యాప్లను నిషేధించింది. దాదాపు 20 కోట్ల మంది పైగా యూజర్లతో టిక్టాక్కు భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంటోంది. వ్యాపారాన్ని అమ్మేసుకుని వెళ్లిపోకపోతే, తమ దేశంలోనూ టిక్టాక్ను నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిణామాలతో ఆయా దేశాల్లోని కార్యకలాపాలను అక్కడి సంస్థలకే విక్రయించి, వైదొలిగేందుకు టిక్టాక్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ ప్రయత్నిస్తోంది. బైట్డ్యాన్స్లో స్వల్ప వాటాలే ఉన్నప్పటికీ.. టిక్టాక్ విక్రయ ప్రయత్నాల్లో సాఫ్ట్బ్యాంక్ కీలక పాత్రే పోషిస్తోంది. అమెరికా విషయానికొస్తే.. రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ ప్రధాన ఇన్వెస్టరుగా ఒక గ్రూప్ను తయారు చేసింది. ఇందులో టెక్ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వంటి సంస్థలను కూడా భాగం చేసింది. అయితే, ఈ కన్సార్షియం ఏర్పాటు ప్రయత్నాలు పూర్తిగా కుదరలేదు. టిక్టాక్పై తనకు ఆసక్తి లేదంటూ గూగుల్ తప్పుకోగా, మరో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వేస్తున్న బిడ్లో వాల్మార్ట్ కూడా చేరింది. ప్రస్తుతం సాఫ్ట్బ్యాంక్ ఏ గ్రూప్తో కలిసి పనిచేస్తోందన్న దానిపై స్పష్టత లేదు. భారత్తో సాఫ్ట్బ్యాంక్ బంధం.. సాఫ్ట్బ్యాంక్ మసయోషి సన్ భారత్లోని అనేక స్టార్టప్లు, కంపెనీల్లో దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దేశీ వ్యాపార సంస్థలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో ఈ–కామర్స్ సంస్థ స్నాప్డీల్డాట్కామ్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలా క్యాబ్స్, హోటల్ బుకింగ్ యాప్ ఓయో రూమ్స్ మొదలైనవి ప్రధానంగా ఉన్నాయి. గతేడాది డిసెంబర్లో కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్కార్ట్లో ఏకంగా 275 మిలియన్ డాలర్లు సాఫ్ట్బ్యాంక్ ఇన్వెస్ట్ చేసింది. భారతి ఎంటర్ప్రైజెస్, తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ టెక్నాలజీ సంస్థలతో కలిసి సోలార్ పవర్ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసింది. -
నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే!
సాక్షి, ముంబై: రానున్న కాలంలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. (చదవండి : క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్) నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు. మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ఏఆర్పీయూ 60శాతం పెరిగితే మంచిది. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు చెల్లిస్తున్న వారు రెట్టింపు కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలి. కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం. -
స్వల్ప లాభాలతో సరి
స్టాక్ మార్కెట్ బుధవారం ఆరంభ లాభాలన్నింటినీ కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కింది. కరోనా వ్యాక్సిన్పై ఆశలతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా ఆరంభంలో భారీగా లాభపడింది. మధ్యాహ్నం తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఇంట్రాడేలో 777 పాయింట్ల మేర లాభపడిన సెన్సెక్స్ చివరకు 19 పాయింట్ల లాభంతో 36,052 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 11 పాయింట్లు పెరిగి 10,618 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్తో రూపాయి మారకం విలువ 27 పైసలు పెరిగి 75.15కు చేరడం ఒకింత సానుకూల ప్రభావం చూపినా, కరోనా కేసులు పెరుగుతుండటం.. ప్రతికూల ప్రభావం చూపింది. ► ఇంట్రాడేలో ఆల్టైమ్ హై, రూ.1,978ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 4 శాతం నష్టంతో రూ.1,846 వద్ద ముగిసింది. ఈ కంపెనీ 43వ ఏజీఎమ్ ఆరంభం వరకూ లాభపడిన ఈషేర్లో ఆ తర్వాత లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఏజీఎమ్ నిర్ణయాలు ఉండటమే దీనికి కారణం. సెన్సెక్స్ లాభాలను కోల్పోవడానికి ఈ షేరే కారణం. ► ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో విప్రో షేర్ 17 శాతం ఎగసి రూ.263 వద్ద ముగిసింది. ఈ షేర్తో పాలు ఐటీ షేర్లు కూడా లాభపడ్డాయి. మూడు ఐటీ షేర్లు–ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్లు ఆల్టైమ్ హైలను తాకాయి. దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. -
జియోమీట్కు పోటీ : ఎయిర్టెల్ త్వరలోనే
సాక్షి, ముంబై: కరోనా, లాక్డౌన్ సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇటీవలే టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో తన వీడియో కాలింగ్ ప్లాట్ఫామ్ను జియో మీట్ను ప్రవేశపెట్టగా, తాజాగా జియో ప్రత్యర్థి, ప్రముఖ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ కూడా ఈ సేవల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒక కొత్త వీడియో-కాన్ఫరెన్సింగ్ యాప్ ను ఎయిర్టెల్ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. యూనిఫైడ్ వీడియో కాన్ఫరెన్సింగ టూల్తో పాటు మరికొన్నింటిని లాంచ్ చేయనున్నట్టు సమాచారం. తన వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలను ప్రారంభంలో కంపెనీలకు మాత్రమే అందించనుంది. అలాగే మొబైల్, డెస్క్టాప్లో వీడియో-కాన్ఫరెన్సింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రధానంగా సరికొత్త ఏఈఎస్ 256 ఎన్క్రిప్షన్, వివిధ దశల్లో సెక్యూరిటీ రక్షణకు ప్రాధాన్యత ఇవ్వనుందని తెలుస్తోంది. తర్వాత సాధారణ వినియోగదారులకు ఈ యాప్ను అందించనుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. సైబర్ భద్రతపై పెరుగుతున్న ఆందోళనల మధ్య డేటా, భద్రతకు ఎయిర్టెల్ ప్రాధాన్యత ఇస్తుందని నివేదిక తెలిపింది. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, గూగుల్ హ్యాంగ్అవుట్ల వంటి ప్రస్తుత సేవలకు భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తోందట. అయితే ఈ అంచనాలపై ఎయిర్టెల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ టెలికాం విభాగం రిలయన్స్ జియో ఇటీవల లాంచ్ చేసిన జియోమీట్తోపాటు, మార్కెట్లోని ఇతర సంస్థలకు గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
అమెజాన్ కార్ట్లో ఎయిర్టెల్!!
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్లో వాటాలు కొనుగోలు చేసే దిశగా అమెరికా ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. సుమారు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ డీల్ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని వివరించాయి. రిలయన్స్ జియోకు దీటైన పోటీ ఇవ్వడానికి ఎయిర్టెల్కు ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మొబైల్ ఆపరేటర్ కార్యకలాపాల నుంచి డిజిటల్ టెక్నాలజీ దిగ్గజంగా జియో రూపాంతరం చెందిందని, ఎయిర్టెల్ కూడా అదే విధంగా వృద్ధి చెందవచ్చని తెలిపాయి. 8–10% దాకా వాటాలపై దృష్టి.. ఎయిర్టెల్లో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ పలు అవకాశాలు పరిశీలిస్తోంది. సుమారు 8–10 దాకా కూడా వాటాలు కొనే అంశం కూడా ఇందులో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికైతే రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, డీల్ నిబంధనలు మారొచ్చని, ఒప్పందం కుదరవచ్చని లేదా కుదరకపోనూ వచ్చని వివరించాయి. ఒకవేళ వాటాల కొనుగోలు ప్రతిపాదన విఫలమైనా ఇరు కంపెనీలు కలిసి పనిచేసేందుకు ఇతరత్రా మార్గాలు కూడా పరిశీలించవచ్చని పేర్కొన్నాయి. అమెజాన్ ఉత్పత్తులను భారతి కస్టమర్లకు చౌకగా అందించే విధమైన డీల్ సైతం వీటిలో ఉండవచ్చని వివరించాయి. దేశీ టెల్కోలపై టెక్ దిగ్గజాల దృష్టి.. గడిచిన కొన్నాళ్లుగా దేశీ టెలికం కంపెనీలపై అంతర్జాతీయ టెక్ దిగ్గజాల ఆసక్తి గణనీయంగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ వ్యాపార విభాగమైన జియో ప్లాట్ఫామ్స్తో ఫేస్బుక్ తదితర దిగ్గజ సంస్థలు గత ఆరు వారాల్లో సుమారు 10 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశాయి. టెలికం సేవల సంస్థ జియో ఇందులో భాగంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరో టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని టెక్నాలజీ దిగ్గజం గూగుల్ పరిశీలిస్తోందంటూ కూడా వార్తలు వచ్చాయి. దేశీ టెలికం రంగంలో జియో అగ్రస్థానంలో ఉండగా, వొడాఫోన్ ఐడియా రెండో స్థానంలో ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న ఎయిర్టెల్లో తాజాగా అమెజాన్ ఇన్వెస్ట్ చేయనుండటం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాపార విస్తరణకు ఊతం.. భారత మార్కెట్ను అమెజాన్ కీలకమైనదిగా భావిస్తోంది. ఈ–కామర్స్ వ్యాపార కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు 6.5 బిలియన్ డాలర్లు పైగా ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే వాయిస్–యాక్టివేటెడ్ స్పీకర్లు, వీడియో స్ట్రీమింగ్, క్లౌడ్ స్టోరేజీ మొదలైన సొంత ఉత్పత్తులు, సేవలు అందిస్తోంది. భారతి ఎయిర్టెల్తో డీల్ కుదిరిన పక్షంలో ఆ సంస్థ నెట్వర్క్ ద్వారా కూడా అమెజాన్ తన వ్యాపార కార్యకలాపాలు విస్తరించుకోవడానికి వీలు పడుతుంది. భారతికి ఉన్న విస్తృతమైన టెలికం ఫైబర్ నెట్వర్క్ ఊతం లభిస్తే తక్కువ ఖర్చుల్లోనే క్లౌడ్ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. రిలయన్స్ జియో ఇదే తరహాలో అజూర్ క్లౌడ్ ప్లాట్ఫాంను ఉపయోగించుకునేందుకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం. ఆఫ్లైన్ రిటైల్లో పాగా... ‘మా కస్టమర్లకు మరిన్ని కొత్త ఉత్పత్తులు, కంటెంట్, సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు వివిధ డిజిటల్, ఓటీటీ సంస్థలతో సాధారణంగానే సంప్రతింపులు జరుపుతుంటాం. అంతకుమించి ఇతరత్రా చర్చలేమీ జరపడం లేదు‘ అంటూ ఎయిర్టెల్ ప్రతినిధి స్పందించారు. అటు భవిష్యత్ ప్రణాళికల గురించి ఊహాగానాలపై తాము స్పందించబోమని అమెజాన్ ఇండియా ప్రతినిధి తెలిపారు. 2017లో అమెజాన్ నుంచి షాపర్స్ స్టాప్ రూ. 179 కోట్లు సమీకరించింది. ఇక 2018 సెప్టెంబర్లో ఆదిత్య బిర్లా రిటైల్కి చెందిన మోర్ స్టోర్స్లో విట్జిగ్ అడ్వైజరీ సర్వీసెస్ ద్వారా అమెజాన్ ఇన్వెస్ట్ చేసింది. గతేడాది ఫ్యూచర్ రిటైల్లో కూడా వాటాలు కొనుగోలు చేసింది. -
ఎయిర్టెల్తో అమెజాన్ జోడీ?
ముంబై: వ్యాపార సామ్రాజ్యంలో చరిత్ర సృష్టించిన రెండు దిగ్గజ కంపెనీలు త్వరలో జోడీ కట్టనున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ త్వరలోనే టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్లో రూ. 200కోట్ల డాలర్ల వాటాను విక్రయించనుంది. వీటికి సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారతి ఎయిర్టెల్ దేశంలో రూ. 30కోట్ల వినియోగదారులతో మూడో టెలికాం సంస్థగా పేరొందిన విషయం తెలిసిందే. కాగా అమెజాన్, ఎయిర్టెల్ సంస్థలు తమ ఒప్పందాలకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. అయితే ఒప్పందాలకు సంబంధించిన ఊహాగానాలను కొందరు సంస్థ ప్రతినిధులు కొట్టిపారేశారు. మరోవైపు అమెజాన్, ఎయిర్టెల్కు సంబంధించిన ఒప్పందాలపై సంస్థ ఉన్నతాధికారులను ప్రశ్నించగా.. భవిష్యత్తులో జరిగే ఒప్పందాలపై తామిప్పుడే స్పందించలేమని తెలిపారు. కాగా ఒప్పందాల అంశంలో సంస్థ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడంతో.. సరియైన సమాచారం కోసం మరికొంత సమయం వేచిచూడాల్సిందేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఎయిర్టెల్ పోటీ సంస్థ జియో పెట్టుబడులను ఆకర్శించడంలో దూసుకెళ్తుంది. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్లో అబుదాబికి చెందిన ముబాదాలా ఇన్వెస్ట్మెంట్ సంస్థ బిలియన్ (100 కోట్ల )డాలర్ల మెగా డీల్కు సానుకూలత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మొబైల్ రంగంలో రిలయన్స్, ఎయిర్టెల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అమెజాన్తో కలవడం వల్ల సంస్థ వృద్ధి మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: జియో దెబ్బ : భారీగా ఎగిసిన ఎయిర్టెల్ సంపద -
ప్రోజోన్ ఇంటూ- జేఎస్డబ్ల్యూ స్టీల్ జోరు
హుషారుగా కదులుతున్న దేశీ స్టాక్ మార్కెట్లలో విభిన్న వార్తల కారణంగా రియల్టీ రంగ కంపెనీ ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ కౌంటర్కు డిమాండ్ పుట్టగా.. మొబైల్ రంగ దేశీ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రోజోన్ ఇంటూ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. భారతీ ఎయిర్టెల్ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. ప్రోజోన్ ఇంటూ ప్రాపర్టీస్ రియల్టీ కంపెనీ ప్రోజోన్ ఇంటూలో డీమార్ట్ స్టోర్ల ప్రమోటర్ రాధాకిషన్ దమానీ 1.26 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గతేడాది చివరి క్వార్టర్(జనవరి-మార్చి)లో ప్రోజోన్కు చెందిన 19.25 లక్షల ఈక్విటీ షేర్లను దమానీ కొనుగోలు చేశారు. కాగా.. ప్రోజోన్ ఇంటూలో ఇప్పటికే సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా 2.06 శాతం వాటాను కలిగి ఉన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్ను తాకింది. అమ్మేవాళ్లు కరువై కొనుగోలుదారులు అధికంకావడంతో రూ. 18.20 వద్ద ఫ్రీజయ్యింది. కాగా.. గత ఏడాది కాలంలో ప్రోజోన్ ఇంటూ షేరు 39 శాతం క్షీణించగా.. ఈ నెల 7 నుంచీ 70 శాతం దూసుకెళ్లడం విశేషం! భారతీ ఎయిర్టెల్ ఓపెన్ మార్కెట్లో ప్రమోటర్లు భారతీ టెలికాం.. 2.75 శాతం వాటాను విక్రయించనున్న వార్తల నేపథ్యంలో మొబైల్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 4.5 శాతం పతనమై రూ. 567 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం ముగింపు రూ. 593తో పోలిస్తే 6 శాతం డిస్కౌంట్లో ప్రమోటర్లు వాటాను విక్రయించనున్నట్లు తెలుస్తోంది. బ్లాక్డీల్స్ ద్వారా రూ. 558 ధరలో మైనారిటీ వాటాను విక్రయించడం ద్వారా రూ. 7500 కోట్లు(బిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్టెల్లో భారతీ టెలికం 38.79 శాతం వాటాను కలిగి ఉంది. జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ నెలలో ఉత్పాదక సామర్ధ్యాన్ని 85 శాతంవరకూ వినియోగంచుకుంటున్నట్లు వెల్లడించడంతో ప్రయివేట్ రంగ దిగ్గజం జేఎస్డబ్ల్యూ స్టీల్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్చేసి రూ. 177 వద్ద ట్రేడవుతోంది. కాగా.. గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జేఎస్డబ్ల్యూ స్టీల్ నిరుత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం 87 శాతం క్షీణించి 188 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం రూ. 22421 కోట్ల నుంచి రూ. 18009 కోట్లకు క్షీణించింది. అయితే ఈ కౌంటర్కు విదేశీ బ్రోకరేజీ సంస్థ సీఎల్ఎస్ఏ టార్గెట్ ధరను పెంచగా., క్రెడిట్ స్వీస్ ఔట్పెర్ఫార్మ్ రేటింగ్ను ప్రకటించడం గమనార్హం! -
3.5 శాతం పతనమైన ఎయిర్టెల్ షేరు
టెలికం దిగ్గజం భారతీఎయిర్టెల్ షేరు మంగళవారం దాదాపు 3.55 శాతం పతనమైంది. రూ.572 వద్ద ట్రేడింగ్ను ఆరంభించి రూ. 568, రూ. 576 మధ్య కదలాడి ప్రస్తుతం రూ. 572.15(ఉదయం 10.38కి) వద్ద ట్రేడవుతోంది. కంపెనీలో 2.75 శాతం వాటాకు సమానమైన, వంద కోట్ల డాలర్ల విలువైన షేర్లను ప్రమోటర్ భారతీ టెలికం విక్రయిస్తుందన్న వార్తలు ఎయిర్టెల్ షేరుపై ప్రభావం చూపాయి. రూ. 558 వద్ద బ్లాక్డీల్లో ఈ విక్రయం జరుగతుందని సోమవారం వార్తలు వచ్చాయి. ఇది శుక్రవారం ముగింపు రేటుకు దాదాపు 6 శాతం తక్కువ. విక్రయంలో భాగంగా దాదాపు 15 కోట్ల షేర్లు చేతులు మారుతున్నాయని తెలిసింది. ఈ వార్తలను ఎయిర్టెల్ నిర్ధారించలేదు. పలు ఎంఎఫ్లు, విదేశీ మదుపరులకు ఈ షేర్లు అమ్ముతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎయిర్టెల్లో భారతీ టెలికంకు 38.79 శాతం వాటా ఉంది, అమ్మకానంతరం ఈ వాటా 26 శాతానికి దిగిరానుంది. కంపెనీలో ప్రమోటర్లందరికీ కలిపి 59 శాతం వాటా ఉంది. భారతీ టెలికంలో భారతీ ఎంటర్ప్రైజెస్, సింగ్టెల్కు మెజార్టీ వాటాలున్నాయి. -
ఎయిర్టెల్లో ప్రమోటర్ల వాటా విక్రయం!
భారతీ ఎయిర్టెల్ ప్రమోటరైన భారతీ టెలిమీడియా మంగళవారం బ్లాక్డీల్ ద్వారా దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన ఎయిర్టెల్ షేర్లను విక్రయించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్లాక్డీల్లో భాగంగా 2.75 శాతం వాటాను టెలిమీడియా విక్రయించనుంది. ఈ డీల్కు జేపీమోర్గాన్ బ్యాంకర్గా వ్యవహరించనుందని, డీల్లో భాగంగా ఒక్కో షేరును రూ. 558 చొప్పున విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ ధర శుక్రవారం ముగింపు ధర కన్నా దాదాపు 6 శాతం తక్కువ. డీల్లో భాగంగా సుమారు 15కోట్ల షేర్లు చేతులు మారతాయి. విక్రయానంతరం ప్రమోటర్లకు 90 రోజుల లాక్ఇన్ వర్తించనుంది. విక్రయం ద్వారా వచ్చిన నిధులను అమ్ములు తీర్చేందుకు వినియోగిస్తారని సదరు వర్గాలు తెలిపాయి. డీల్ పూర్తయితే ఎయిర్టెల్లో ప్రమోటర్లైన భారతీ టెలికం, ఇండియన్ కాంటినెంట్ ఇన్వెస్ట్మెంట్, వృందావన్, పాస్టెల్ కంపెనీల వాటా 58.98 శాతం నుంచి 56.23 శాతానికి తగ్గనుంది. గత మూడేళ్లుగా ఎయిర్టెల్ వివిధ మార్గాలు వేగంగా నిధుల సమీకరణలు జరిపింది. అనంతరం ఏజీఆర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలినా, టారిఫ్లు పెంచడం ద్వారా నిలదొక్కుకుంది. దీంతో ఇటీవల కాలంలో షేరు మంచి ర్యాలీ జరిపింది. -
ఎయిర్టెల్కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్లోటెలికం సేవల ధరలను పెంచింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్తో నోకియా రూ. 7,500 కోట్ల డీల్
న్యూఢిల్లీ: దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తాజాగా 5జీ నెట్వర్క్ ఏర్పాటు కోసం ఫిన్లాండ్కి చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ నోకియాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 7,500 కోట్లుగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర, గుజరాత్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది సర్వీస్ ఏరియాల్లో ఎయిర్టెల్ కోసం నోకియా 5జీ రెడీ నెట్వర్క్ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో భాగంగా ప్రస్తుత అవసరాల కోసం 4జీ సేవలకు ఉపయోగపడే 3 లక్షల పైచిలుకు బేస్ స్టేషన్లను నోకియా ఏర్పాటు చేస్తుంది. స్పెక్ట్రం అందుబాటులోకి వచ్చాక 5జీ నెట్వర్క్కు అప్గ్రేడ్ చేసుకోవడానికి అనువుగా ఇవి ఉంటాయి. ఈ ప్రాజెక్టుతో ఎయిర్టెల్ నెట్వర్క్ సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని, అలాగే భవిష్యత్లో 5జీ సేవలకు కూడా పునాదిరాయిగా ఉపయోగపడుతుందని నోకియా ప్రెసిడెంట్ రాజీవ్ సూరి పేర్కొన్నారు. అంతర్జాతీయ టెలికం సంస్థల సమాఖ్య జీఎస్ఎంఏ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం మార్కెట్గా భారత్ ఉంది. 2025 నాటికి 8.8 కోట్ల దాకా 5జీ కనెక్షన్లు ఉంటాయని అంచనా. చదవండి: యాక్సిస్ బ్యాంక్ నష్టాలు రూ.1,388 కోట్లు -
నోకియా దూకుడు : భారీ డీల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్ తయారీదారు నోకియా దూకుడు పెంచింది. భారతదేశపు అతిపెద్ద మొబైల్ ఆపరేటర్లలో ఒకటైన భారతి ఎయిర్టెల్ తో భారీ ఒప్పందాన్ని చేసుకుంది.1 బిలియన్ డాలర్ల (రూ.7,636 కోట్లు) విలువైన ఒప్పందాన్ని ఫిన్లాండ్కు చెందిన నోకియా మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ కంపెనీతో బహుళ సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ డీల్ ద్వారా దేశంలో వినియోగదారులకు నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు, 5జీ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2022 వరకు భారత్లో 3 లక్షల కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా నోకియా, ఎయిర్టెల్లు కలిసి పనిచేయనున్నాయని నోకియా ఒక ప్రకటనలో తెలిపింది. 4జీ నెట్వర్క్ను బలోపేతం చేయడంతో పాటు, 5జీ సామర్థ్యాలనుపెంచే ప్రయత్నంలో ఎయిర్టెల్ కు చెందిన దేశంలోని తొమ్మిది సర్కిల్లలో ఈడీల్ చేసుకుంది. అతిపెద్ద టెలికాం మార్కెట్లలోకనెక్టివిటీ భవిష్యత్తుకు ఇది చాలా ముఖ్యమైన ఒప్పందమని, భారతదేశంలో తన స్థానాన్ని ఇది మరింత పటిష్టం చేస్తుందని నోకియా సీఈవో రాజీవ్ సూరి అన్నారు. 1.3 బిలియన్ల జనాభాతో, ప్రపంచంలో రెండవ అతిపెద్ద టెలికాం మార్కెట్ భారతదేశంలో ఆన్లైన్ డిమాండ్ పెరిగేకొద్దీ రానున్న ఐదేళ్లలో మొబైల్ వినియగదారుల సంఖ్య 920 మిలియన్లకు పెరుగుతుందని నోకియా అంచనా వేస్తోంది. అంతేకాదు హువావే, ఎరిక్సన్ లాంటి కంపెనీల నుండి తీవ్రమైన పోటీ నేపథ్యంలో 5జీ మొబైల్స్ మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నాలు విఫలమై, గత అక్టోబర్లో 2020 ఆదాయ అంచనాను తగ్గించిన ఆరు నెలల శిక్ష విధించిన తరువాత ఈ ఒప్పందం చేసుకోవడం విశేషం. మరోవైపు సీఈవో మార్పును ఇటీవల ప్రకటించింది. దీనికి ముందు ప్రకటించిన ఫలితాల్లో నోకియా 2015 తరువాత 2019 ఏడాదిలో మొదటిసారి లాభాలను నమోదు చేసింది. 7 మిలియన్ యూరోల లాభంతో అంచనాలను అధిగమించింది. కాగా 25 ఏళ్ల పాటు సేవలందించిన నోకియా ప్రెసిడెంట్, సీఈవో పదవికి భారత సంతతికి చెందిన రాజీవ్ సూరి రాజీనామా చేశారు. ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీతో ఆయన పదవీ కాలం ముగియనుంది. రాజీవ్ సూరి స్థానంలో పెక్కా లుండామర్క్ పేరును కంపెనీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. (ఎకానమీని కాపాడే అత్యవసర చర్యలు కావాలి) -
మొబైల్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
సాక్షి,ముంబై: భారతీయ మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మొబైల్ బిల్లుల మోత మోగనుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే చౌకైన మొబైల్ డేటాను అనుభవిస్తున్న కస్టమర్లు దాదాపు 10 రెట్ల మేర భారాన్ని భరించాల్సి వుంటుంది. టెలికాం ఆపరేటర్లు కోరిన విధంగా రేట్ల(కనీస రేట్లు)ను నిర్ణయించినట్టయితే ప్రస్తుత స్థాయి నుంచి మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరుగుతాయి. ఇది నిజంగా మొబైల్ వినియోగారుదారులకు షాకింగ్ న్యూసే. ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ చందాదారులు ఒక జీబీ కి రూ. 3.5ల చొప్పున 4జీ డేటా ను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే టెలికాం కంపెనీలు కోరినట్లు ట్రాయ్ నిర్ణయం తీసుకుంటే మొబైల్ ఇంటర్నెట్ ధరలు 5-10 రెట్లు పెరిగే అవకాశముంది. కనీసం 1 జీబీ ధరను రూ.35 గా నిర్ణయించాలని వోడాఫోన్ ఐడియా, రూ. 30లుగా ఉండాలని, ఎయిర్టెల్, రూ. 20ల కనీస చార్జీగా వుండాలని రిలయన్స్ జియో ఇప్పటికే ట్రాయ్ కి ప్రతిపాదించాయి. తాజాగా ఈప్రతిపాదనలకు నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సానుకూలంగా స్పందించారు. ఇటీవలి ఏజీఆర్ సంక్షోభం,టెలికాం రంగానికి భారీగా అప్పులు రావడం, ధరలు నిలకడగా తగ్గడం వల్ల ఇంతకుమించి వేరే మార్గం లేదని,అయితే ఇది దీర్ఘకాలిక పరిష్కారం కాదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. పరిశ్రమ నుండి వచ్చిన అభ్యర్థన తరువాత కాల్, డేటా సేవలకు కనీస ధరను నిర్ణయించడంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు కనీస ధరలను పెంచడం వాంఛనీయం కాదని , తిరోగమన దశ అని, ఇది మార్కెట్ పోటీపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పేర్కొంది. వినియోగదారుల జేబుకు చిల్లు రోజుకు 2 జీబీ 4జీ డేటా అందించే రూ .599 (84 రోజుల వాలిడిటీ) ప్లాన్లో (జీబీకి రూ .3.5 రేటు) జీబీకి రూ .20-35 పరిధిలో డేటా ధర నిర్ణయిస్తే ఇదే ప్లాన్కు రూ .3,360 రూ. 5,880 మధ్య బాదుడు తప్పదు. -
వోడాఫోన్ ఐడియా చెల్లింపులు, షేరు జూమ్
సాక్షి, న్యూఢిల్లీ: వోడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల చెల్లింపుల్లో భాగంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డాట్)కు గురువారం మరో రూ.1000 కోట్లు చెల్లించింది. ఏజీఆర్ బాకీలకు సంబంధించి సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో సోమవారం వోడాఫోన్ ఐడియా డీఓటీకు రూ.2500 కోట్లను చెల్లించిన సంస్థ తాజాగా మరో దఫా చెల్లింపులు చేసింది. డీఓటీ గణాంకాల బట్టి సవరించి స్థూల ఆదాయం లెక్కల ప్రకారం టెల్కో నుంచి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ ఛార్జీల బాకీల కింద వోడాఫోన్ ఐడియా రూ.53వేల కోట్లను చెల్లించాల్సి ఉంది. ఏజీఆర్ బకాయిలకు సంబంధించి మరో దిగ్గజ టెల్కో భారతి ఎయిర్టెల్ రూ.10వేల కోట్లన ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. అలాగే టాటా టెలిసర్వీసెస్ మొత్తం రూ.14వే కోట్లు చెల్లించాల్సి ఉండగా, సోమవారం రూ.2,197 కోట్లను చెల్లించింది. మరోవైపు ఒకటి లేదా రెండు రోజుల్లో పూర్తి బకాయిల రికవరీ కోసం టాటా టెలిసర్వీస్కు నోటీసులు కూడా పంపుతామని డిఓటి వర్గాలు తెలిపాయని పీటీఐ తెలిపింది. మరోవైపు వొడాఫోన్ ఐడియా షేర్లు 18.85 శాతం పెరిగి బిఎస్ఇలో రూ .4.98 ను తాకింది. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం -
ఏజీఆర్ : వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: ఏజీఆర్ వివాదంలో చిక్కుకున్న టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా కీలక నిర్ణయం తీసుకుంది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) సంబంధిత బకాయిలను రాబోయే కొద్ది రోజుల్లో టెలీకమ్యూనికేషన్ విభాగానికి (డాట్) జమ చేయనున్నట్లు వోడాఫోన్ ఐడియా శనివారం తెలిపింది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్కు సమాచారాన్ని అందించింది. ఏజీఆర్ బకాయిల చెల్లింపుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, డాట్ విధించిన డెడ్లైన్ నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా ఈ నిర్ణయం తీసుకుంది. ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై ఏర్పడ్డ సంక్షోభం నేపథ్యంలో కంపెనీ బోర్డు ప్రత్యేకంగా సమావేశ మైంది. డాంట్ అంచనాల ప్రకారం, వోడాఫోన్ ఐడియా బకాయిలు మొత్తం రూ .53,038 కోట్లు. వీటిలో రూ.24,729 కోట్ల స్పెక్ట్రం వినియోగ ఛార్జీలు కాగా, లైసెన్స్ ఫీజు రూ.28,309 కోట్లు. మరోవైపు శుక్రవారం అర్థరాత్రిలోపు బకాయిలు చెల్లించాలని డాట్ విధించిన గడువుపై తక్షణమే స్పందించిన మరో దిగ్గజ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఫిబ్రవరి 20న రూ. 10వేల కోట్లు, కోర్టువిచారణ లోపు మిగిలిన మొత్తం చెల్లిస్తామని ప్రకటించింది. కాగా టెలికాం రంగంలో తీవ్ర పోటీ నేపథ్యంలో విలీనం తరువాత అతిపెద్ద సంస్థగా అవతరించిన వోడాఫోన్ ఇండియా భారీ అప్పుల్లో కూరుకుపోయింది. దీనికితోడు కస్టమర్ల సంఖ్య కూడా క్రమేపీ క్షీణిస్తోంది. దీనికి ఏజీఆర్ బకాయిల అంశం అగ్నికి ఆజ్యంలా తోడైంది. ఈ నేపథ్యంలోనే తమకు ఉపశమనం కల్పించకపోతే కంపెనీనీ మూసుకోవాల్సి వస్తుందని ఇటీవల వ్యాఖ్యానించింది. ఇది ఇలా వుండగా తాజాగా వరుసగా ఆరవ త్రైమాసికంలో కూడా కంపెనీ నష్టాలనే ప్రకటించింది. 2019 డిసెంబర్ 31తో ముగిసిన మూడవ త్రైమాసికంలో, రూ .6,439 కోట్ల నికర నష్టాన్ని మూట గట్టుకుంది. అటు స్టాక్మార్కెట్లో కంపనీ షేరు భారీగా పతనమైంది. ఏజీఆర్ సంక్షోభంతో కంపెనీ దివాలా ప్రకటిస్తుందా అనే అనుమానాలు కూడా వ్యాపించాయి. మొండిపద్దుల గుదిబండ తమ మెడకుచుట్టుకుంటుందనే ఆందోలన అటు బ్యాంకింగ్ రంగంలో కూడా నెలకొంది. టెలికాం కంపెనీలు రూ 1.47 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏదైనా కంపెనీ దివాలా ప్రకటిస్తే.. దానికి బ్యాంకులు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తాజా ప్రకటనతో ఈ అంచనాలకు తెరపడింది. ఏజీఆర్ పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు మార్చి 17వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్ రూ.10 వేల కోట్లు కడతాం టెల్కోలపై సుప్రీం కన్నెర్ర! -
టెల్కోలపై సుప్రీం కన్నెర్ర!
న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల షెడ్యూల్పై ఊరట లభిస్తుందని ఆశిస్తున్న టెలికం సంస్థలకు శుక్రవారం షాకుల మీద షాకులు తగిలాయి. బాకీలు కట్టేందుకు మరికాస్త వ్యవధి లభించేలా గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలంటూ టెల్కోలు వేసిన పిటీషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. పైగా రూ.1.47 లక్షల కోట్లు కట్టాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్దేశించిన విధంగా బాకీలు చెల్లించకపోతే టెలికం సంస్థల అధినేతలు కోర్టు ధిక్కరణ చర్యలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది. అటు టెలికం శాఖ (డాట్)కూ మొట్టికాయలు వేసింది. గత ఉత్తర్వులను పక్కన పెడుతూ బాకీల వసూలు విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దని లిఖితపూర్వక ఆదేశాలిచ్చిన డాట్ డెస్క్ ఆఫీసర్ ’తెంపరితనం’తో వ్యవహరించారని ఈ సందర్భంగా ఆక్షేపించింది. ఆ ఉత్తర్వులను తక్షణం ఉపసంహరించకపోతే సదరు అధికారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించింది. తదుపరి విచారణ తేదీ మార్చి 17లోగా బాకీలు కట్టేయాలంటూ టెలికం సంస్థలను ఆదేశించింది. గత ఆదేశాల ఉల్లంఘనకు గాను కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోరాదో ఆయా టెల్కోల టాప్ ఎగ్జిక్యూటివ్లు, డాట్ డెస్క్ అధికారి వివరణ ఇవ్వాలని సూచించింది. నిర్దేశిత గడువులోగా బకాయిలు కట్టని పక్షంలో .. ఆయా టెల్కోల ఎండీలు/డైరెక్టర్లతో పాటు డెస్క్ ఆఫీసర్ కూడా మార్చి 17న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఏజీఆర్ సంబంధిత బాకీల చెల్లింపునకు మరింత సమయం ఇవ్వాలంటూ వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, టాటా టెలీసర్వీసెస్ దాఖలు చేసిన పిటీషన్పై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. రూ. 2.65 లక్షల కోట్లు కట్టాలన్న డాట్ నోటీసులపై తగు కోర్టులను ఆశ్రయించాలంటూ గెయిల్ తదితర టెలికంయేతర సంస్థలకు సూచించడంతో అవి తమ పిటిషన్లను ఉపసంహరించుకున్నాయి. సుప్రీం కోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో దాదాపు రూ. 35,586 కోట్ల బకాయిల్లో సుమారు రూ.10,000 కోట్లు.. వారం రోజుల్లో డిపాజిట్ చేస్తామంటూ ఎయిర్టెల్ వెల్లడించింది. చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా.. దేశంలో చట్టాల అమలు జరిగే పరిస్థితే లేదా? అంటూ అత్యున్నత న్యాయస్థానం విచారణ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేసింది. ఏజీఆర్కి సంబంధించి తమ ఉత్తర్వులను నిలుపుదల చేసేలా డెస్క్ ఆఫీసర్ స్థాయి అధికారి ఆదేశాలివ్వడమేంటని కోర్టు ఆక్షేపించింది. సదరు అధికారికి నోటీసులు జారీ చేసింది. ‘సుప్రీం కోర్టు ఆదేశాలను నిలుపుదల చేసేలా ఒక డెస్క్ ఆఫీసరు.. ఏకంగా అకౌంటెంట్ జనరల్కు రాస్తారా? ఇది ధనబలం కాకపోతే మరేంటి? న్యాయస్థానాలతో వ్యవహరించే తీరు ఇదేనా? దేశంలో చట్టాలు అమలయ్యే పరిస్థితే లేదా? ఇవన్నీ చూస్తుంటే తీవ్ర ఆవేదన కలుగుతోంది. ఈ కోర్టులోనూ, ఈ వ్యవస్థలోనూ పనిచేయాలనిపించడం లేదు. నాకు చాలా ఆవేదనగా ఉంది. సాధారణంగా నేను కోపగించుకోను.. కానీ ఈ వ్యవస్థ, ఈ దేశంలో జరుగుతున్నవి చూస్తుంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు‘ అని జస్టిస్ అరుణ్ మిశ్రా ఆవేదన వ్యక్తం చేశారు. డెస్క్ ఆఫీసర్ తీరుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలిపారు. అయితే, ‘ఇలాంటి ధోరణులు ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక డెస్క్ అధికారి.. ఇంత తెంపరితనంతో వ్యవహరించారంటే సుప్రీం కోర్టును మూసేద్దామా? అసలు అతనిపైనా, ఈ కంపెనీలపైనా కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదు? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? టెల్కోల రివ్యూ పిటీషన్ను డిస్మిస్ చేశాం. అయినా ఇప్పటిదాకా అవి పైసా కట్టలేదు. న్యాయవ్యవస్థ, దేశం ఏమై పోతుందా అని ఆందోళన కలుగుతోంది‘ అని మిశ్రా వ్యాఖ్యానించారు. మిగిలేవి రెండు సంస్థలే..: విశ్లేషకులు టెల్కోల బకాయిలపై అత్యున్నత న్యాయస్థానం గట్టి చర్యలకు ఆదేశించిన నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా పరిస్థితి అగమ్యగోచరంగా మారనుందని విశ్లేషకులు పేర్కొన్నారు. దీనివల్ల టెలికం రంగంలో ఇక రెండే సంస్థల ఆధిపత్యం ఉండే అవకాశాలు గతంలో కన్నా మరింత పెరిగాయని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీం కోర్టు తీర్పు.. నిస్సందేహంగా టెలికం పరిశ్రమకు దుర్వార్తే. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా పరిస్థితి గతంలో కన్నా దారుణంగా మారనుంది‘ అని కన్సల్టింగ్ సంస్థ కామ్ ఫస్ట్ డైరెక్టర్ మహేష్ ఉప్పల్ తెలిపారు. లైసెన్సు ఒప్పందం ప్రకారం బాకీలు కట్టాల్సిన బాధ్యత టెల్కోలపై ఉందంటూ గడిచిన రెండు, మూడు పర్యాయాలు సుప్రీం కోర్టు చెప్పినందున .. శుక్రవారం వచ్చిన ఆదేశాలు అనూహ్యమైనవేమీ కావని ఆయన చెప్పారు. అర్ధరాత్రిలోగా కట్టండి: టెలికం శాఖ సుప్రీం కోర్టు అక్షింతలు వేయడంతో టెలికం శాఖ కదిలింది. బకాయిల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవొద్దంటూ జనవరి 23న ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలు దిశగా సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించింది. దీనికి అనుగుణంగా.. శుక్రవారం అర్ధరాత్రిలోగా బకాయీలన్నీ కట్టేయాలంటూ భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా తదితర సంస్థలను ఆదేశించింది. వివాదం ఏంటంటే... లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల లెక్కింపునకు టెల్కోల టెలికంయేతర ఆదాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చంటూ ప్రభుత్వానికి అనుకూలంగా గతేడాది అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీన్ని సమీక్షించాలంటూ టెల్కోలు వేసిన రివ్యూ పిటిషన్లను జనవరి 16న కొట్టి వేసింది. జనవరి 23లోగా బాకీలు కట్టేయాలంటూ సూచించింది. దీనిపై టెల్కోలు పునఃసమీక్షకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇది తేలేలోగా బాకీల విషయంలో టెల్కోలపై ఒత్తిడి తేవద్దంటూ డాట్ డెస్క్ అధికారి ఆదేశాలు ఇవ్వడం వివాదాస్పదమైంది. డాట్ లెక్కల ప్రకారం మొత్తం 15 సంస్థలు.. కేంద్రానికి రూ. 1.47 లక్షల కోట్ల బాకీలు కట్టాల్సి ఉంది. వొడా–ఐడియా షేరు భారీ పతనం సుప్రీం కోర్టు ఆదేశాలతో వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) షేరు ఏకంగా 23 శాతం పతనమైంది. బీఎస్ఈలో రూ. 3.44 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 27 శాతం క్షీణించి రూ. 3.25 స్థాయిని కూడా తాకింది. దీంతో కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ రూ.2,988 కోట్లు తగ్గి రూ. 9,885 కోట్లకు పడిపోయింది. అటు టెలికం రంగానికి భారీగా రుణాలిచ్చిన బ్యాంకుల షేర్లపై కూడా ఈ తీర్పు ప్రతికూల ప్రభావం పడింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38%, ఎస్బీఐ 2.41%, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.77%, యాక్సిస్ బ్యాంక్ 1.5% క్షీణించాయి. క్యూ3 ఆర్థిక ఫలితాల్లో వొడాఫోన్ ఐడియా రూ. 6,439 కోట్ల నష్టాలు ప్రకటించడం తెలిసిందే. -
రూ.10 వేల కోట్లు కడతాం
సాక్షి,న్యూఢిల్లీ: సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్) బకాయిల చెల్లింపులపై డాట్ తాజా ఆదేశాలపై ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్ స్పందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ నాటికి రూ.10వేల కోట్ల చెల్లిస్తామని తెలిపింది. మిగిలిన బకాయిలను తదుపరి విచారణ సమయాని కంటే ముందే సర్దుబాటు చేస్తామని వివరించింది. గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పు , అనంతరం టెలికాం విభాగం ఆదేశాలకు అనుగుణంగా, భారతి గ్రూప్ కంపెనీల తరపున 2020 ఫిబ్రవరి 20 నాటికి రూ .10,000 కోట్లు (ఖాతాలో) జమ చేస్తామని ఎయిర్టెల్ తెలిపింది. ఈ మేరకు డాట్ ప్రతినిధి( (ఫైనాన్స్) ఒక లేఖ రాసింది. లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీతో సహా దాదాపు రూ .35,586 కోట్లను ఎయిర్టెల్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. చదవండి : టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్ -
టెల్కోలకు మరోషాక్: డాట్ డెడ్లైన్
సాక్షి, న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, తాజాగా టెలికాం విభాగం (డాట్) మరోషాక్ ఇచ్చింది. రాత్రి 11. 59 నిమిషాల్లోపు బకాయిలు చెల్లించాలని భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు టెలికాం విభాగం గడువు విధించింది. శుక్రవారం అర్థరాత్రి లోపు మొత్తం బకాయిలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వారికి డిమాండ్ నోటీసులు జారీ చేసింది. బకాయిల వసూళ్లపై సుప్రీంకోర్టు డాట్పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. దీంతో తమకు ఉపశమనం లభిస్తుందని ఎదురు చూస్తున్న టెల్కోలకు ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా వోడాఫోన్ఐడియాకు ఈ సమయంలో బకాయిలు చెల్లించడం తలకుమించిన భారమే. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వోడాఫోన్ ఐడియా షేరు భారీగా నష్టపోయింది. కాగా ఏజీఆర్ బకాయిల విషయంలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారంటూ టెలికం కంపెనీలపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బకాయిలను చెల్లించమని ఆదేశాలు జారీచేసినప్పటికీ పెడచెవిన పెట్టడంతో కోర్టు ధిక్కరణకింద భావిస్తున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. దీంతో వచ్చే నెల 16న చేపట్టనున్న తదుపరి విచారణకు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల ఎండీలతోపాటు డైరెక్టర్లను హాజరుకావలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. రూ .1.47 లక్షల కోట్లు టెలికాం శాఖకు చెల్లించాలన్న ఆదేశాన్ని పాటించనందుకు వారిపై ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరించాలని సుప్రీం టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ అంశంలో సంబంధిత టెలికం శాఖ(డాట్) అధికారిని సైతం కోర్టు తప్పుపట్టింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొత్తం టెలికాం విభాగానికి రూ .88,624 కోట్లు చెల్లించాల్సివుంది. రిలయన్స్ జియో రూ.177 కోట్లను ఇప్పటికే చెల్లించిన సంగతి తెలిసిందే. చదవండి : రూ.10 వేల కోట్లు కడతాం -
రిలయన్స్ జియో... వై–ఫై కాలింగ్ సేవలు
న్యూఢిల్లీ: వై–ఫై ద్వారా కూడా వాయిస్, వీడియో కాలింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. దీనితో ఇళ్లలో లేదా ఆఫీసుల్లో కాల్స్ చేసేటప్పుడు నిరాటంకంగా ఎల్టీఈ నుంచి వై–ఫైకి మారవచ్చ ని పేర్కొంది. జనవరి 16లోగా దీన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు జియో వివరించింది. పోటీ సంస్థ భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే ఈ తరహా సర్వీసులను ఢిల్లీ–నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో జియో ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఇప్పటికీ భారత్లోనే ఇంటర్నెట్ చౌక..
న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం మీద భారత్లోనే మొబైల్ డేటా రేట్లు అత్యంత తక్కువని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. బ్రిటన్కు చెందిన కేబుల్.కో.యూకే అధ్యయనంలో ఇది వెల్లడైందని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చార్టును పోస్ట్ చేశారు. దీని ప్రకారం.. ఒక గిగాబైట్ (జీబీ) డేటా సగటు ధర భారత్లో 0.26 డాలర్లుగా ఉండగా.. బ్రిటన్లో 6.66 డాలర్లు, అమెరికాలో 12.37 డాలర్లుగా ఉంది. ప్రపంచ సగటు 8.53 డాలర్లుగా ఉంది. దేశీ టెల్కోలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో .. ఏకంగా 50%దాకా టారిఫ్లను పెంచు తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘ఈ మొబైల్ చార్జీల సమస్యంతా.. కుంభకోణాలతో అప్రతిష్ట పాలైన యూపీఏ ప్రభుత్వ ఘనతే. దాన్ని మేం సరిచేశాం. అధిక మొబైల్ ఇంటర్నెట్ చార్జీలు.. యూపీఏ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చాయి. ట్రాయ్ గణాంకాల ప్రకారం 2014లో ఒక్క జీబీకి చార్జీ రూ. 268.97గా ఉండేది. ప్రస్తుతం ఇది రూ. 11.78కి తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్/ఎంటీఎన్ఎల్ను కూడా ప్రొఫెషనల్గా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని మంత్రి పేర్కొన్నారు. -
ఆర్కామ్ ఆస్తుల రేసులో ఎయిర్టెల్, జియో
న్యూఢిల్లీ: రుణభారంతో దివాలా పరిష్కార ప్రక్రియ ఎదుర్కొంటున్న టెలికం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు 11 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. పోటీ కంపెనీలైన భారతి ఎయిర్టెల్, రిలయన్స్ జియో కూడా వీటిలో ఉన్నాయి. ‘ మూడు సంస్థల (ఆర్కామ్, రిలయన్స్ టెలికం, రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్) అసెట్స్ను కొనుగోలు చేసేందుకు మొత్తం 11 బిడ్స్ వచ్చాయి. వీటిలో వర్డే క్యాపిటల్, యూవీ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మొదలైన సంస్థల బిడ్స్ కూడా ఉన్నాయి‘ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్కామ్ డేటా సెంటర్, ఆప్టికల్ ఫైబర్ వ్యాపారాన్ని కచ్చితంగా కొనుగోలు చేస్తుందని భావించిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ సంస్థ.. అసలు బిడ్ దాఖలు చేయలేదని వివరించాయి. బిడ్లను సోమవారమే ఖరారు చేయాల్సి ఉన్నప్పటికీ.. రుణదాతల కమిటీ (సీవోసీ) దీన్ని శుక్రవారానికి వాయిదా వేసినట్లు పేర్కొన్నాయి. ఆర్కామ్ సెక్యూర్డ్ రుణాలు దాదాపు రూ. 33,000 కోట్ల మేర ఉండగా.. దాదాపు రూ. 49,000 కోట్ల బాకీలు రావాల్సి ఉందని రుణదాతలు ఆగస్టులో క్లెయిమ్ చేశారు. బాకీల చెల్లింపు కోసం అసెట్స్ను విక్రయించేందుకు గతంలో కూడా ఆర్కామ్ ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. స్పెక్ట్రం చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీల కోసం ప్రొవిజనింగ్ చేయడంతో జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ. 30,142 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అటు కంపెనీ చైర్మన్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా చేసినప్పటికీ.. రుణదాతలు ఆమోదముద్ర వేయలేదు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్కు (ఎన్సీఎల్టీ) ఆర్కామ్ వ్యవహారం చేరింది. ఎన్సీఎల్టీ ఆదేశాల ప్రకారం పరిష్కార నిపుణుడు (ఆర్పీ) 2020 జనవరి 10లోగా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుంది. స్టాక్ .. అప్పర్ సర్క్యూట్.. బిడ్డింగ్ వార్తలతో సోమవారం ఆర్కామ్ షేర్లు అప్పర్ సర్క్యూట్ను తాకాయి. ఆరు శాతం ఎగిశాయి. బీఎస్ఈలో ఆర్కామ్ షేరు 69 పైసలు పెరిగి రూ. 4.55 వద్ద ముగిసింది. -
మొబైల్ చార్జీల మోత ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మూడు దిగ్గజ మొబైల్ నెట్వర్క్ ప్రొపైడర్లయిన వొడాఫోన్ ఐడియా, రిలయెన్స్ జియో, భారతి ఎయిర్టెల్ కంపెనీలు డిసెంబర్లో టారిఫ్లు పెంచుతామని ప్రకటించడంతో వినియోగదారుల గుండెల్లో కాస్త గుబులు మొదలయింది. డిసెంబర్ ఒకటవ తేదీ నుంచి పెంచుతామని వొడాఫోన్ ఐడియా ప్రకటించగా, తేదీ చెప్పకుండా డిసెంబర్లో పెంచుతామని భారతి ఎయిర్టెల్ కంపెనీ ప్రకటించాయి. తామూ టారిఫ్లను సముచితంగా కొన్ని వారాల్లో పెంచుతామని రిలయెన్స్ జియో ప్రకటించింది. లైసెన్స్ ఫీజులు, వడ్డీలు కలుపుకొని వొడాఫోన్ 28 వేలు, భారతి ఎయిర్టెల్ 12 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాలంటూ 16 ఏళ్ల వివాదానికి తెరదించుతూ సుప్రీం కోర్టు ఇటీవలనే తీర్పు చెప్పింది. ఈ రెండు కంపెనీలు గత సెప్టెంబర్లో విడుదల చేసిన త్రైమాసిక ఫలితాల ప్రకారం వీటికి ఉమ్మడిగా 73 వేల కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా అమలు చేయాలంటే మొత్తం లక్ష కోట్ల రూపాయలు దాటుతుంది. మొబైల్ టారిఫ్లను ఎంత పెంచితే ఈ కంపెనీలు నష్టాల నుంచి గట్టెక్కుతాయి? ఈ నేపథ్యంలో మొబైల్ చార్జీల మోత మోగుతుందని మొబైల్ యూజర్లు ఆందోళన చెందుతున్నారు. చదవండి: మొ‘బిల్’ మోతే..! బ్రిటన్కు చెందిన వొడాఫోన్ కంపెనీ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో భారత్లోని తన యూనిట్ను మూసివేస్తుందని వదంతులు రావడంతో ఆ 40 వేల కోట్లను ఇప్పుడే చెల్లించాల్సిన అవసరం లేదని, మెల్లగా చెల్లించవచ్చంటూ కేంద్రం రాయితీ ఇవ్వడంతో ఈ రెండు కంపెనీలు ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాయి. రిలయెన్స్ జియోకు ఇలాంటి బాధలు లేవు. భారతి ఎయిర్టెల్ భారత కంపెనీయే అయినప్పటికీ ఇప్పటికీ నష్టాల్లోనే ఉంది. వ్యాపారం రీత్యా వొడాఫోన్ దేశంలో మొదటి స్థానంలో ఉండగా రిలయెన్స్ రెండో స్థానంలో, ఎయిర్టెల్ మూడో స్థానంలో కొనసాగుతోంది. రిలయెన్స్ జియో లాభాలు కూడా ఈ ఏడాది దాదాపు 600 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలకు చేరుకుంది. రిలయెన్స్ కంపెనీ 2016లో జియోను తీసుకరావడం, దాదాపు ఏడాది పాటు ఉచిత సేవలు అందించడంతో వొడాఫోన్, ఎయిర్టెల్ కంపెనీలు పోటీకి పోయి బాగా నష్టపోయాయి. అతి తక్కువ టారిఫ్లకు రిలయెన్స్కు లాభాలు రావడమేమిటీ? వొడాఫోన్ లాంటి కంపెనీలను నష్టాలు రావడం ఏమిటీ అన్న సందేహం ఎవరికైనా రావచ్చు. కేంద్ర ప్రభుత్వం నుంచి రిలయెన్స్ జియోకు చాలా రాయితీలు ఉన్నాయి. విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే అన్ని టెలికమ్ పరికరాలపై దిగుమతి సుంకాన్ని కేంద్రం గతేడాదే రెట్టింపు చేసింది. భారతీయ కంపెనీగా రిలయెన్స్ జియోకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. వాస్తవానికి రిలయెన్స్ జియో తన టారిఫ్లను ఇప్పుడే పెంచాల్సిన అవసరం లేదు. పెంచుతున్నట్లు ప్రకటించడం వల్ల స్టాక్ మార్కెట్లో జియో వ్యాపారం 9.5 లక్షల కోట్ల నుంచి 9.9 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. పది లక్షల కోట్లకు తీసుకెళ్లడం కంపెనీ లక్ష్యంగా కనిపిస్తోంది. వొడాఫోన్ ఐడియా అన్ని టారిఫ్లను పది శాతం పెంచుతున్నట్లు, ఆ టారిఫ్లను చూసిన తర్వాత అంతకన్నా కొంచెం తక్కువగా టారిఫ్లను పెంచాలని ఎయిర్టెల్ చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. వాటికంటే జియో టారిఫ్లు తక్కువగానే పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే రిలయన్స్ జియో చార్జీల పెంపు -
దలాల్ స్ట్రీట్లో టెలికాం షేర్ల లాభాల రింగింగ్
సాక్షి, ముంబై: భారీ నష్టాలతో కుదేలైన భారత టెలికాం కంపెనీలకు ఏజీఆర్ చార్జీలు వడ్డన లాంటి తాజా పరిణామాల నేపథ్యంలో టారిఫ్లను సమీక్షించుకుంటున్నాయి. టెలికాం దిగ్గజ కంపెనీలైనా వొడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ 1 నుంచి కాల్చార్జీలను పెంచాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా షేర్లు మంగళవారం సెషన్లో 52 వారాలా గరిష్టాన్ని తాకి జోరుగా సాగుతున్నాయి. భారతీ ఎయిర్టెల్ 5 శాతం లాభంతో కొనసాగుతోంది. గత మూడు రోజుల్లో ఎయిర్టెల్ షేరు 20 శాతం ఎగిసింది. వొడాఫోన్-ఐడియా షేర్లు కూడా ఇదే బాటలో మంగళవారం సెషన్లో ర్యాలీ చేస్తున్నాయి. 25 శాతం లాభంతో కొనసాగుతోంది. కాగా మూడు సెషన్లుగా 80 శాతం లాభపడింది. దీంతో బ్రోకరేజ్ సంస్థలు ‘హోల్డ్’కు రేటింగ్ను ఇస్తున్నారు. మోర్గాన్ స్టాన్లీ భారతి ఎయిర్టెల్ టార్గెట్ ధరను అంతకుముందు 360 రూపాయల నుండి రూ. 410కు పెంచింది. కాగా క్యూ 2 లో భారతి ఎయిర్టెల్, వొడాఫోన ఐడియా రెండూ అత్యధిక త్రైమాసిక నష్టాన్ని నివేదించాయి. వొడాఫోన్ ఐడియా క్యూ 2లో రూ.50921 కోట్ల నికర నష్టాన్ని, భారతి ఎయిర్టెల్ త్రైమాసిక నష్టం రూ. 28,450 కోట్లు నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
మొ‘బిల్’ మోతే..!
న్యూఢిల్లీ: భారీ నష్టాలు, పేరుకుపోయిన రుణాలు... వాటికి తోడు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో కేంద్రానికి వేల కోట్లు చెల్లించాల్సి రావటం... ఈ సంక్షోభం నుంచి కొంతైనా గట్టెక్కాలంటే వినియోగదారులపై భారం మోపాల్సిందేనని టెలికం కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కాల్ చార్జీలను పెంచబోతున్నాయి. డిసెంబర్ 1 నుంచి కాల్ చార్జీలను పెంచనున్నట్లు టెలికం దిగ్గజాలు వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్టెల్ ప్రకటించాయి. అయితే, చార్జీల పెంపు ఎంత మేర ఉంటుందనేది మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. ‘కస్టమర్లకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్ సేవలు అందించడాన్ని కొనసాగించే క్రమంలో.. డిసెంబర్ 1 నుంచి సముచిత స్థాయిలో టారిఫ్లు పెంచబోతున్నాం’ అని వొడాఫోన్ ఐడియా సోమవారం ప్రకటించింది. ఆ తరువాత కొద్ది సేపటికే భారతీ ఎయిర్టెల్ కూడా తమ రేట్ల పెంపు ప్రతిపాదనలు వెల్లడించింది. ‘అతి వేగంగా మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టు టెలికం రంగంలో భారీ పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. డిజిటల్ ఇండియా కల సాకారం కావాలంటే టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండటం ముఖ్యం. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నుంచి చార్జీలను తగు రీతిలో పెంచనున్నాం‘ అని ఎయిర్టెల్ పేర్కొంది. రిలయన్స్ జియో రాకతో టెల్కోల మధ్య అత్యంత చౌక చార్జీల పోరాటాలు ఆరంభమైన సంగతి తెలిసిందే. దీనికి తెరదించేలా అందరికీ కనీస చార్జీలను నిర్దేశించాలని కేంద్రం యోచిస్తున్న పరిస్థితుల్లో వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా నెలవారీ మొబైల్ సేవల ప్లాన్లు డేటా లేకుండా కనిష్టంగా రూ.24 నుంచి, డేటాతో కలిసి ఉన్నట్లయితే రూ.33 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఏజీఆర్తో నెత్తిన పిడుగు...! అసలే భారీ రుణాలు, నష్టాల్లో కూరుకుపోయి ఉన్న టెలికం పరిశ్రమపై ఇటీవలి సుప్రీంకోర్టు తీర్పుతో సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) పిడుగు పడటం తెలిసిందే. ఈ తీర్పుతో కేంద్రానికి లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద ఏకంగా రూ.1.4 లక్షల కోట్ల దాకా టెలికం సంస్థలు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తంలో ఛార్జీలతో పాటు వాటిపై వడ్డీలు, పెనాల్టీలు, పెనాల్టీలపై వడ్డీలు కూడా కలిసి ఉన్నాయి. తీర్పు నేపథ్యంలో... మూడు నెలల్లో బకాయిలు చెల్లించాల్సిందేనంటూ టెలికం విభాగం (డాట్) ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆ మొత్తానికి కేటాయింపులు జరిపాయి. ఫలితంగా వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ రెండూ కలిసి ఏకంగా సుమారు రూ.74,000 కోట్ల నష్టాలు ప్రకటించాయి. దివాలా తీసిన అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్ కూడా కేటాయింపులతో కలిసి రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంటే ఈ మూడు సంస్థల మొత్తమే రూ.లక్ష కోట్లు దాటేసింది. ఇందులో ఒక్క ఐడియా వాటాయే రూ.50,921 కోట్లు. దేశీయంగా ఓ కార్పొరేట్ కంపెనీ ఈ స్థాయి నష్టాలు ప్రకటించడం ఇదే రికార్డు. అసలేంటీ ఏఈఆర్ గొడవ? ఇది దాదాపు 16 ఏళ్లుగా సాగుతున్న వివాదం. టెలికం సేవల కోసం లైసెన్సులు పొందిన టెల్కోలు తమకు వచ్చే రెవెన్యూలో నిర్దిష్ట శాతాన్ని లైసెన్సు ఫీజు కింద, స్పెక్ట్రం యూసేజి చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. అయితే ‘రెవెన్యూ’ను లెక్కించే విషయంలో మాత్రం టెల్కోలు, కేంద్ర టెలికాం విభాగం మధ్య వివాదం సాగుతోంది. టెలికంయేతర కార్యకలాపాల ద్వారా వచ్చే నిధులు కూడా టెల్కోలకు రెవెన్యూయేనని కేంద్రం వాదన. దానికి తగ్గట్లుగా సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు.. లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాలని నిర్దేశించింది. కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ టెల్కోలు న్యాయపోరాటానికి దిగాయి. తాజాగా వాటికి ఎదురుదెబ్బ తగిలింది. ఏజీఆర్ లెక్కింపుపై కేంద్రం ఫార్ములాను సమరి్థస్తూ అక్టోబర్ 24న సుప్రీం కోర్టు ఉత్తర్వులిచ్చింది. బకాయిల్ని పెనాల్టీలను వడ్డీతో సహా మూడు నెలల్లోగా కట్టేయాలంటూ ఆదేశించింది. దీంతో టెలికం కంపెనీలు రూ.1.4 లక్షల కోట్లు చెల్లించాల్సి రావచ్చని అంచనా. టెల్కోలపై బాకీల భారం అటు వాటికి రుణాలిచి్చన బ్యాంకులనూ ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు, పరిస్థితులను గాడినపెట్టేందుకు తగు చర్యల్ని సూచిం చేందుకు కేంద్రం అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ గట్టున జియో... ఆ గట్టున మిగతావి!! పోటాపోటీగా చార్జీలు తగ్గించాల్సి రావడం, కార్యకలాపాల విస్తరణకు భారీగా రుణాలు తీసుకోవడం వల్ల టెలికం సంస్థలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. జూన్ ఆఖరు నాటి గణాంకాల ప్రకారం వొడాఫోన్ ఐడియా రుణభారం రూ.99,000 కోట్లపైనే ఉంది. ఇక ఎయిర్టెల్కు రూ.1.16 లక్షలపైన రుణాలున్నాయి. ఈ నేపథ్యంలో టెలికం రంగానికి సహాయక ప్యాకేజీ ఇవ్వాలంటూ పాత తరం టెల్కోలు కేంద్రాన్ని కోరుతున్నాయి. అయితే, ప్యాకేజీల్లాంటివేమీ అవసరం లేదని ముకేశ్ అంబానీ సంస్థ జియో వాదిస్తోంది. ఏజీఆర్ విషయంలో కూడా రిలయన్స్ జియో చెల్లించాల్సిన మొత్తం రూ.41 కోట్లు మాత్రమేనని విశ్లేషణలు వస్తున్నాయి. ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జీల (ఐయూసీ) విషయంలో కూడా వీటిని తొలగించాలని జియో వాదిస్తుండగా... ఎయిర్టెల్, ఐడియా మాత్రం ఉంచాలని కోరుతున్నాయి. అంటే... ఒక నెట్వర్క్ నుంచి మరో నెట్వర్క్కు కాల్ చేసినపుడు... కాల్ అందుకున్న నెట్వర్క్కు, కాల్ చేసిన నెట్వర్క్ నిమిషానికి 6 పైసలు చెల్లించాలి. దీనివల్ల జియో నికరంగా ఇతర టెల్కోలకు కొంత మొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో వీటిని తొలగించాలని మొదటి నుంచీ వాదిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి తొలగించడానికి కూడా గతంలో కేంద్రం సమ్మతించింది. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని తొలగించకూడదని ఐడియా, ఎయిర్టెల్ మరింత గట్టిగా గళమెత్తేసరికి... త్వరలో కొత్త విధానం తెస్తామని ట్రాయ్ ప్రకటించింది. మూడేళ్లు మారటోరియం కావాలి: సీవోఏఐ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భారీగా బకాయిలు కట్టాల్సి రానున్న టెలికం కంపెనీలు.. కొంత వెసులుబాటు కల్పించాలంటూ కేంద్రాన్ని పదే పదే అభ్యర్థిస్తున్నాయి. చెల్లింపులపై మూడేళ్ల మారటోరియం ఇవ్వాలని, మొత్తం బాకీలన్నీ కట్టేందుకు గడువు మరింత పొడిగించాలని, వడ్డీ రేటు తక్కువ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తీవ్ర సంక్షోభంలో కొట్టుకుంటున్న టెలికం ఆపరేటర్లకు కాస్త ’ప్రాణవాయువు’ అందించాలని అభ్యర్థించారు. అలాగే, టెలికం కంపెనీల రుణాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కూడా కేంద్రం దృష్టి సారించాలని కోరారాయన. 4జీ టెలికం సేవలకు సంబంధించి టెల్కోలు తీసుకున్న లైసెన్సుల గడువు మరో 11 ఏళ్ల పాటు ఉన్నందున.. బకాయిలను ఇప్పటికిప్పుడు కాకుండా.. పదేళ్లలో నెమ్మదిగా చెల్లించేందుకు ఆపరేటర్లకు వెసులుబాటు కల్పించాలని కోరారు. భవిష్యత్లో మారబోయే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏజీఆర్ను పునర్నిర్వచించాలని కూడా సూచించారు. మారటోరియం అంటే... సాధారణంగా రుణం తీసుకున్న మరుసటి నెల నుంచే ఈఎంఐలు మొదలవుతాయి. అయితే కొన్నాళ్లపాటు కట్టకుండా వెసులుబాటు కల్పించడాన్ని మారటోరియంగా వ్యవహరిస్తారు. అయితే, ఈ మారటోరియం కాలానికి కూడా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చదువుకోవటానికి రుణం తీసుకున్నవారు... చదువు పూర్తయ్యాక ఈఎంఐలు చెల్లించటం మొదలుపెడతారు కనక... విద్యా రుణాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. -
మొబైల్ చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై రిలయన్స్ జియో చార్జీలు అమలు చేస్తున్న నేపథ్యంలో మిగతా టెలికం సంస్థలు కూడా చార్జీల పెంపు రాగాన్ని అందుకుంటున్నాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న రేట్లతో నిలదొక్కుకోవడం కష్టమేనంటూ తాజాగా భారతీ ఎయిర్టెల్ వ్యాఖ్యానించింది. టారిఫ్లు పెరగాల్సిన అవసరం ఉందని ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాసియా విభాగం) గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ‘ఈ టారిఫ్లతో నిలదొక్కుకోవడం కష్టమని మా నమ్మకం. టారిఫ్లు పెరగాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. మేం ఎప్పుడూ ఇదే మాట మీద ఉన్నాం‘ అని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో (ఐఎంసీ) పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మరోవైపు, ఇంటర్కనెక్షన్ యూసేజ్ చార్జీలంటూ (ఐయూసీ) యూజర్లపై జియో నిమిషానికి 6 పైసల చార్జీలు వసూలు చేస్తుండటాన్ని ఆయన ఖండించారు. ‘టారిఫ్కి ఐయూసీకి సంబంధం లేదు. టెలికం కంపెనీల స్థాయిలో జరిగే లావాదేవీ అది‘ అని విఠల్ పేర్కొన్నారు. మరోవైపు, తదుపరి 5జీ స్పెక్ట్రం వేలానికి ప్రతిపాదించిన ధర చాలా అధికమని, దీనివల్ల 5జీ సేవలు ఖరీదైన వ్యవహారంగా మారతాయని చెప్పారు. టెలికం రంగంలోకి పెట్టుబడులు వస్తేనే డిజిటల్ ఇండియా కల సాకారం కాగలదని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంటేనే ఇన్వెస్టర్లు ముందుకొస్తారని విఠల్ చెప్పారు. ట్రాయ్పై జియో విమర్శలు.. ఐయూసీ చార్జీల విధింపు గడువు పెంపు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్పై రిలయన్స్ జియో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఇది తిరోగమన చర్యగా అభివర్ణించింది. ఎయిర్టెల్ లాంటి పాత ఆపరేటర్లకు ఇది అనూహ్య లాభాలు తెచ్చిపెడుతుందని పేర్కొంది. ఐయూసీని పూర్తిగా ఎత్తేయడానికి బదులు.. గడువును పొడిగించడం వల్ల సమర్ధంగా వ్యవహరిస్తున్న టెలికం ఆపరేటర్లను శిక్షించినట్లవుతుందని, వినియోగదారుల ప్రయోజనాలనూ దెబ్బతీసినట్లవుతుందని వ్యాఖ్యానించింది. ఇతర నెట్వర్క్ల యూజర్ల నుంచి వచ్చే కాల్స్ను స్వీకరించినందుకు గాను.. టెల్కోలు పరస్పరం విధించుకునే చార్జీలను ఐయూసీగా వ్యవహరిస్తారు. ఐయూసీని 2020 జనవరి 1 నుంచి పూర్తిగా ఎత్తివేయాలని గతంలో ప్రతిపాదించినప్పటికీ.. దీన్ని పొడిగించే అవకాశాలపై ట్రాయ్ చర్చాపత్రాన్ని విడుదల చేయడం వివాదాస్పదమైంది. దీంతో ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్పై నిమిషానికి 6 పైసల ఐయూసీ చార్జీలను జియో విధించింది. ఇతర టెల్కోలు దాచిపెడుతున్నాయ్.. ఇతర టెల్కోలు కూడా ఐయూసీ చార్జీలను విధిస్తున్నప్పటికీ.. యూజర్లకు ఆ విషయం చెప్పకుండా దాచిపెడుతున్నాయని ఆరోపించింది. పోటీ సంస్థలు పారదర్శకత పాటించడం లేదని జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ ఆరోపించారు. -
ఎయిర్టెల్ నష్టాలు 2,856 కోట్లు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్కు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.2,866 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత తమకు వచ్చిన తొలి నష్టం ఇదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. గత క్యూ1లో రూ.97 కోట్ల నికర లాభం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.107 కోట్లు చొప్పున నికర లాభాలు వచ్చాయని పేర్కొంది. రిలయన్స్ జియోతో తీవ్రమైన పోటీ, 3జీ నెట్వర్క్ తరుగుదల వ్యయాలు, భారీగా పన్ను వంటి అసాధారణ అంశాలతో ఈ క్యూ1లో ఈ స్థాయి లో నష్టాలు వచ్చాయని వివరించింది. మొత్తం ఆదాయం రూ.19,799 కోట్ల నుంచి 5% వృద్ధితో రూ.20,738 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత్లో ఆదాయం 3%, ఆఫ్రికాలో ఆదాయం 10% చొప్పున పెరిగాయని వివరించింది. 94 శాతం పెరిగిన డేటా ట్రాఫిక్.. మొబైల్ కంపెనీల కీలక పనితీరు అంశాల్లో ఒకటైన ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్పీయూ–యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) స్వల్పంగా పెరిగింది. గత క్యూ1లో రూ.123 గా ఉన్న ఏఆర్పీయూ ఈ క్యూ1లో రూ.129కు పెరిగిందని ఎయిర్టెల్ పేర్కొంది. మొబైల్ డేటా ట్రాఫిక్ 94 శాతం పెరిగిందని తెలిపింది. రూ. 8,493 కోట్ల నిర్వహణ లాభం సాధించామని, నిర్వహణ మార్జిన్ 6 శాతం పెరిగి 41 శాతానికి చేరిందని పేర్కొంది. ఈ క్యూ1 ఫలితాలు ఆరోగ్యకరంగా ఉన్నాయని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా అండ్ సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. అన్ని వ్యాపారాల్లో సమ వృద్ధి సాధించామని తెలిపారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో ఎయిర్టెల్ షేర్ 4 శాతం నష్టంతో రూ.324 వద్ద ముగిసింది. -
హ్యూస్, ఎయిర్టెల్ జట్టు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్, హ్యూస్ కమ్యూనికేషన్స్ ఇండియా (హెచ్సీఐఎల్) సంస్థలు దేశీయంగా తమ తమ వీశాట్ శాటిలైట్ కార్యకలాపాలను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. విలీన సంస్థలో హ్యూస్కు మెజారిటీ యాజమాన్య అధికారాలు ఉండనుండగా.. ఎయిర్టెల్కు గణనీయంగా వాటాలు ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. బ్రాడ్బ్యాండ్ శాటిలైట్ నెట్వర్క్స్, సర్వీసుల సంస్థ హ్యూస్ నెట్వర్క్ సిస్టమ్స్కు హెచ్సీఐఎల్ అనుబంధ సంస్థ. ఇది దేశీయంగా వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలకు బ్రాడ్బ్యాండ్ నెట్వర్కింగ్ టెక్నాలజీలు, సర్వీసులు అందిస్తోంది. కంపెనీలకు, వ్యక్తులకు శాటిలైట్ ఆధారిత టెలికం, ఇంటర్నెట్ సేవలు అందించేందుకు వీశాట్ ఉపయోగపడుతుంది. -
ఎయిర్టెల్ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19) జనవరి–మార్చి క్వార్టర్లో 29 శాతం ఎగసి రూ.107 కోట్లకు చేరింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) ఇదే క్వార్టర్లో ఈ కంపెనీకి రూ.83 కోట్ల నికర లాభం వచ్చింది. నష్టాలను ప్రకటించగలదన్న విశ్లేషకుల అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ కంపెనీ లాభాన్ని ప్రకటించడం విశేషం. భారత మొబైల్ సర్వీసుల వ్యాపారంలో నష్టాలు వచ్చినా, ఆఫ్రికా వ్యాపారం పుంజుకోవడం, అసాధారణ ఆదాయ లాభాల కారణంగా ఈ స్థాయి నికర లాభాన్ని ఈ కంపెనీ సాధించింది. చాలా క్వార్టర్ల తర్వాత నికర లాభంలో పెరుగుదల నమోదు కావడం ఇదే మొదటిసారి. సీక్వెన్షియల్గా చూస్తే, నికర లాభం 24 శాతం ఎగసింది. ఇక ఆదాయం 6 శాతం ఎగసి రూ.20,602 కోట్లకు పెరిగింది. గత క్యూ4లో రూ.2,022 కోట్ల మేర అసాధారణ ఆదాయ లాభాలు (నెట్వర్క్ రీ–ఫార్మింగ్, అప్గ్రెడేషన్ ప్రోగ్రామ్కు సంబంధించిన చార్జీలు, లెవీల పున:మదింపుకు సంబంధించిన మొత్తం) వచ్చాయని కంపెనీ పేర్కొంది. రూ.25,000 కోట్ల రైట్స్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. ఈ నెల 17న ఈ రైట్స్ ఇష్యూ ముగియనున్నది. రెట్టింపైన ‘భారత’ నష్టాలు... ఈ కంపెనీ భారత వ్యాపారంలో అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో రూ.482 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇక గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో ఈ నష్టాలు దాదాపు రెట్టింపై రూ.1,378 కోట్లకు పెరిగాయి. ఇదే కాలంలో ఆఫ్రికా మొబైల్ సర్వీసుల్లో లాభం రూ.1,129 కోట్ల నుంచి 1,317 కోట్లకు పెరిగింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18 ఆర్థిక సంవత్సరంలో రూ.1,099 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు సగం తగ్గి రూ.410 కోట్లకు పడిపోయింది. ఆదాయం కూడా రూ.82,639 కోట్ల నుంచి 2 శాతం తగ్గి రూ.80,780 కోట్లకు తగ్గింది. ముకేష్ అంబానీ రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీ తట్టుకోవడానికి టెలికం కంపెనీలు టారిఫ్లను భారీగా తగ్గించాయి. ఫలితంగా ఆ కంపెనీల లాభదాయకతపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. వాయిస్, డేటా వినియోగం రికార్డ్ స్థాయిల్లో ఉన్నా, టెలికం కంపెనీలకు పెద్దగా లాభాలు రావడం లేదని మరోసారి ఎయిర్టెల్ ఫలితాలు రుజువు చేశాయని నిపుణులంటున్నారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఎయిర్టెల్ ఫలితాలు వెలువడ్డాయి. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.333 వద్ద ముగిసింది. -
ఎయిర్టెల్ లాభం 72 శాతం డౌన్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలానికి 72% తగ్గింది. గత క్యూ3లో రూ.306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.86 కోట్లుగా నమోదైందని ఎయిర్టెల్ తెలిపింది. భారత్లో టెలికం వ్యాపారంలో తీవ్రమైన పోటీ ఉండటమే ఈ భారీ క్షీణతకు కారణమని కంపెనీ ఎమ్డీ, సీఈఓ(ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విఠల్ తెలిపారు. ఆదాయం రూ.20,319 కోట్ల నుంచి 1 శాతం పెరిగి రూ.20,519 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఎబిటా 17 శాతం తగ్గి రూ.6,307 కోట్లకు చేరిందని వివరించారు. గత క్యూ3లో రూ.123గా ఉన్న ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ)ఈ క్యూ3లో 16 శాతం తగ్గి రూ.104కు చేరిందని తెలిపారు. గత క్యూ3లో రూ.1.13 లక్షల కోట్లుగా ఉన్న నికర రుణభారం ఈ క్యూ3లో రూ.6,837 కోట్లు క్షీణించి రూ.1.06 లక్షల కోట్లకు తగ్గిందని వివరించారు. ఎయిర్టెల్ ఆఫ్రికాకే లాభాలు... ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కారణంగా రూ.1,017 కోట్ల అసాధారణ లాభం వచ్చిందని విఠల్ తెలిపారు.. దీనిని పరిగణనలోకి తీసుకోకపోతే, భారత కార్యకలాపాల నికర నష్టాలు ఈ క్యూ3లో రూ.972 కోట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని టెలికం వ్యాపారాల్లో ఒక్క ఎయిర్టెల్ ఆఫ్రికా టెలికం వ్యాపారంలో మాత్రమే నికర లాభం వృద్ధి చెందిందని తెలిపారు. గత క్యూ3లో రూ.394 కోట్లుగా ఉన్న ఎయిర్టెల్ ఆఫ్రికా నికరలాభం ఈ క్యూ3లో 40 శాతం ఎగసి రూ.552 కోట్లకు పెరిగిందని వివరించారు. ఈ విభాగం మొత్తం ఆదాయం రూ.5,284 కోట్ల నుంచి 11% పెరిగి రూ.5,904 కోట్లకు చేరిందని పేర్కొన్నారు. డేటా వృద్ధి జోరుగా ఉండటం, ఎయిర్టెల్మనీ లావాదేవీల విలువ పెరగడం వల్ల ఆదాయం ఈ స్థాయిలో పెరిగిందని వివరించింది. 40.4 కోట్లకు ఖాతాదారులు.... గత క్యూ3లో 39.4 కోట్లుగా ఉన్న మొత్తం ఖాతాదారుల సంఖ్య ఈ క్యూ3లో 40.4 కోట్లకు పెరిగిందని విఠల్ పేర్కొన్నారు. ఆఫ్రికా, దక్షిణాసియాల్లో నికర వినియోగదారుల సంఖ్య పెరగడమే దీనికి ప్రధాన కారణమని వివరించారు. భారత కార్యకలాపాల ఆదాయం 2 శాతం తగ్గి రూ.14,768 కోట్లకు చేరిందని, తీవ్రమైన పోటీ కారణంగా భారత మొబైల్ వ్యాపారం 4 శాతం క్షీణించిందని వివరించారు. కాగా, ట్రాయ్ గణాంకాల ప్రకారం నవంబర్లో దేశీయంగా ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 34.1 కోట్లు. కంపెనీ వెల్లడించిన సమాచారం ప్రకారం డిసెంబర్లో వినియోగదారుల సంఖ్య 28.42 కోట్లు. అంటే ఒక నెలలో ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 5.7 కోట్లు తగ్గింది. మూడు రెట్లు పెరిగిన డేటా..: భారత్లో వినియోగదారుల సంఖ్య తగ్గినా, డేటా వినియోగం మాత్రం జోరుగా ఉందని విఠల్ వివరించారు.. గత క్యూ3లో 1,106 బిలియన్ ఎమ్బీగా ఉన్న డేటా వినియోగం ఈ క్యూ3లో దాదాపు మూడు రెట్ల వృద్ధితో 3,217 బిలియన్ ఎమ్బీలకు పెరిగిందని పేర్కొన్నారు. మొబైల్ 4జీ డేటా వినియోగదారులు 112 శాతం వృద్ధితో 7.71 కోట్లకు పెరిగారని వివరించింది. -
ఎయిర్టెల్ యూజర్లకు 3 నెలలు నెట్ఫ్లిక్స్ ఫ్రీ
న్యూఢిల్లీ: వీడియో స్ట్రీమింగ్ సర్వీసులందించే అమెరికన్ సంస్థ నెట్ఫ్లిక్స్తో దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని కింద తమ పోస్ట్పెయిడ్, వి–ఫైబర్ హోమ్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రయిబర్స్ మూడు నెలల పాటు ఉచితంగా నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. ఆ వ్యవధి దాటిన తర్వాత నుంచి ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ లేదా హోమ్ బ్రాడ్బ్యాండ్ బిల్లులోనే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ చెల్లించవచ్చని పేర్కొంది. ఎయిర్టెల్ టీవీ యాప్లో ప్రత్యేకంగా నెట్ఫ్లిక్స్ కంటెంట్ను కూడా పొందవచ్చునని భారతీ ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ తెలిపారు. గౌల్, స్ట్రేంజర్ థింగ్స్, సేక్రెడ్ గేమ్స్ వంటి తమ కంటెంట్ను మొబైల్ ఫోన్లపై వీక్షించే వారి సంఖ్య పెరుగుతోందని, ఇవన్నీ కూడా ఎయిర్టెల్ మొబైల్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లపై అందించనున్నట్లు నెట్ఫ్లిక్స్ గ్లోబల్ హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ బిల్ హోమ్స్ వివరించారు. ఎయిర్టెల్ టీవీ ఇప్పటికే 10,000 పైచిలుకు సినిమాలు, టీవీ షోలతో పాటు 375 పైగా లైవ్ టీవీ చానల్స్ను అందిస్తోంది. -
మళ్లీ నిరాశ పరిచిన భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: జియో రంగ ప్రవేశం తర్వాత ఆదాయం, లాభాలను కోల్పోతూ వస్తున్న టెలికం రంగ కంపెనీ భారతీ ఎయిర్టెల్ జూన్ త్రైమాసికంలోనూ కుదుటపడలేదు. మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభం ఏకంగా 73% తగ్గిపోయి రూ.97 కోట్లకు పరిమితమైంది. ఆదాయం సైతం 9% తగ్గి రూ.20,080 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.367 కోట్లు, ఆదాయం రూ.21,958 కోట్లుగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో భారత మార్కెట్ పరంగా చూస్తే ఆదాయం 7 శాతం తగ్గి రూ.14,930 కోట్లుగా ఉంది. మార్కెట్లో ధరలు ఇప్పటికీ అనుకూలంగా లేవని కంపెనీ ఎండీ సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. అయినప్పటికీ బండిల్ పథకాలు, కంటెంట్ భాగస్వామ్యం, హ్యాండ్సెట్ అప్గ్రేడ్ పథకాలతో మొబైల్డేటా ట్రాఫిక్ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 355 శాతం పెరిగినట్టు ఆయన చెప్పారు. -
అగ్రస్థానం మా లక్ష్యం కాదు: ఎయిర్టెల్
న్యూఢిల్లీ: నంబర్ 1 మొబైల్ సర్వీస్ ప్రొవైడర్గా ఉండాలని లక్ష్యం నిర్దేశించుకోలేదని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మార్కెట్లో చివరికి మూడు పెద్ద ప్రైవేట్ కంపెనీలే నిలుస్తాయని పేర్కొంది. టాప్ టెలికం సంస్థగా ఉన్న ఎయిర్టెల్.. వొడాఫోన్–ఐడియా విలీనం తర్వాత రెండో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుంది. అప్పుడు వొడాఫోన్–ఐడియా విలీన కంపెనీ అగ్రస్థానంలో ఉంటుంది. దీనికంతటికీ రిలయన్స్ జియోను కారణంగా చెప్పుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (ఇండియా, దక్షిణాసియా) గోపాల్ విట్టల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. టెలికంలో తీవ్రమైన పోటీ వల్ల ఒక యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) తగ్గిపోయిందని తెలిపారు. అయితే పరిస్థితులు త్వరలో కొలిక్కి వస్తాయన్నారు. ‘‘ఒక చక్రాన్ని తీసుకుంటే అందులో మేం కింది భాగంలో ఉన్నాం. ఇక ఇంతకన్నా దిగువకు వెళ్లలేం. ఇక్కడి నుంచి ధరలు, ఏఆర్పీయూ పైకి కదలడం మొదలవుతుంది’’ అని పేర్కొన్నారు. ‘‘అగ్రస్థానంలో ఉండటం మా లక్ష్యం కాదు. కస్టమర్లకు ఉత్తమ సేవలు అందించడం గురించే ఆలోచిస్తాం. చివరకు మూడు పెద్ద కంపెనీలు మాత్రమే ఉంటాయి. ఇందులో ఒకరు కొద్దిగా ఎక్కువగా మార్కెట్ వాటాను కలిగి ఉండొచ్చు. మరొకరు కొంచెం తక్కువ వాటా కలిగి ఉంటారు. అలాగే మార్కెట్ వాటా ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని చెప్పలేం’’ అని వివరించారు. భారత్లో ఒకానొక సమయంలో 12 ప్రైవేట్ టెలికం కంపెనీలు ఉండేవి. ప్రస్తుతం వీటి సంఖ్య మూడుకు తగ్గింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ సహా ప్రైవేట్ రంగానికి చెందిన ఎయిర్టెల్, వోడాఫోన్–ఐడియా, రిలయన్స్ జియో కంపెనీలు మాత్రమే ఉంటాయి. -
ఎయిర్టెల్ లాభం 78% డౌన్
న్యూఢిల్లీ: మొబైల్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో భారీగా తగ్గింది. టారిఫ్ల యుద్ధం తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీల్లో కోత కారణంగా గత క్యూ4లో నికర లాభం 78 శాతం తగ్గినట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లుగా (ఒక్కో షేర్కు 93 పైసలు) ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.83 కోట్లకు (ఒక్కో షేర్కు 21 పైసలు) తగ్గిందని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ తెలిపారు. మొత్తం ఆదాయం రూ.21,935 కోట్ల నుంచి 11 శాతం తగ్గి రూ.19,634 కోట్లకు చేరింది. భారత ఆదాయం 8 శాతం తగ్గి రూ.14,796 కోట్లకు చేరిందని, ఆఫ్రికా ఆదాయం మాత్రం 11 శాతం ఎగసిందని గోపాల్ తెలియజేశారు. మొబైల్ డేటా ట్రాఫిక్ 505 శాతం వృద్ధితో 1,616 బిలియన్ మెగాబైట్లకు పెరిగింది. నికర రుణ భారం రూ.91,714 కోట్ల నుంచి రూ.95,228 కోట్లకు పెరిగింది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ (ఆర్ఓసీఈ) 6.5 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గిందని, ఇబిటా తక్కువగా ఉండటం, స్పెక్ట్రమ్ వ్యయాలు పెరగడం, భారత్లో పెట్టుబడులు కొనసాగడం, తదితర అంశాలు దీనికి కారణాలని గోపాల్ విట్టల్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్గా రూ.2.5ను ఇవ్వనున్నామని, గతంలో ప్రకటించిన మధ్యంతర డివిడెండ్ రూ.2.84 కలుపుకుంటే, మొత్తం డివిడెండ్ గత ఆర్థిక సంవత్సరానికి రూ.5.34గా ఉంటుందని తెలియజేశారు. రూ. 24,000 కోట్ల పెట్టుబడులు... ఇంత తక్కువ నికర లాభం సాధించడం 14 ఏళ్లలో కంపెనీకి ఇదే తొలిసారి. 2004, ఏప్రిల్–జూన్ క్వార్టర్ తర్వాత అతి తక్కువ లాభం వచ్చిన క్వార్టర్ ఇదే. నికర లాభం తగ్గడం ఇది వరుసగా ఎనిమిదో క్వార్టర్. కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించిన రిలయన్స్ జియో ఉచితవాయిస్ కాల్స్ను, కారు చౌకగా డేటా ఆఫర్లను ఇస్తుండటంతో ఈ కంపెనీ లాభాలు హరించుకుపోయాయి. కృత్రిమంగా తగ్గిస్తున్న ధరలతో టెలికం పరిశ్రమపై వ్యయాల భారం కొనసాగుతోందని గోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ టెర్మినేషన్ చార్జీల తగ్గింపు వల్ల పరిశ్రమ ఆదాయం భారీగా తగ్గిందన్నారు. నేరుగా రిలయన్స్ జియోను ప్రస్తావించకుండా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.3,800 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 71% తగ్గి రూ.1,099 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం 12% తగ్గి రూ.83,688 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.24,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే స్థాయిలో పెట్టుబడులు పెడతామని పేర్కొన్నారు. కొనసాగిన అగ్రస్థానం... టెలికం పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో అగ్రస్థానాన్ని కొనసాగించామని గోపాల్ పేర్కొన్నారు. గత క్యూ4లో కోటిన్నర మంది కొత్తగా ఎయిర్టెల్ వినియోగదారులయ్యారని, డేటా సామర్థ్యం పెంపునకు సంబంధించి వ్యూహాత్మక పెట్టుబడులు, ఎయిర్టెల్ టీవీ ద్వారా వినూత్నమైన డిజిటల్ కంటెంట్ను అందివ్వడం, వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఆఫర్లనందించడం, తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో కొత్త వినియోగదారులు లభించారని వివరించారు. ప్రస్తుతం తమకు 16 దేశాల్లో 41.38 కోట్ల మంది వినియోగదారులున్నారని, వినియోగదారుల సంఖ్య 12 శాతం వృద్ధి చెందిందని వివరించారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 0.6 శాతం లాభంతో రూ.406 వద్ద ముగిసింది. -
అంతర్జాతీయ ఐపీవోకి భారతి ఎయిర్టెల్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తమ ఆఫ్రికా విభాగాన్ని అంతర్జాతీయ స్టాక్ ఎక్సే్చంజీలో లిస్టింగ్ చేయాలని యోచిస్తోంది. నెదర్లాండ్స్ కేంద్రంగా ఆఫ్రికా కార్యకలాపాలను పర్యవేక్షించే భారతి ఎయిర్టెల్ ఇంటర్నేషనల్ (బెయిన్ బీవీ) ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్చంజీలో షేర్ల లిస్టింగ్కు సంబంధించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేలా వివిధ బ్యాంకులు, మధ్యవర్తిత్వ సంస్థలతో సంస్థ యాజమాన్యం చర్చలు జరిపేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆఫ్రికాలోని 14 దేశాల్లో భారతి ఎయిర్టెల్ టెలికం కార్యకలాపాలు సాగిస్తోంది. మొత్తం 14 దేశాల్లో 3జీ సర్వీసులు, ఎయిర్టెల్ మనీ సేవలు అందిస్తోంది. -
రూ . 500కే 4జీ స్మార్ట్ ఫోన్
సాక్షి, ముంబయి : మొబైల్ ఫోన్ యూజర్లకు అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. నెలకు కేవలం రూ 60 రూపాయలకే వాయిస్, డేటా ప్లాన్స్తో రూ 500కన్నా తక్కువ ధరలో 4జీ స్మార్ట్ ఫోన్ల తయారీ కోసం టాప్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు హ్యాండ్సెట్ కంపెనీలతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిలయన్స్ జియో వంటి ఆపరేటర్లు ఆఫర్ చేస్తున్న వాయిస్, డేటా ప్లాన్స్తో లోకాస్ట్ స్మార్ట్ఫోన్ల వైపు మళ్లుతున్న యూజర్లకు అడ్డుకట్ట వేసేందుకు ఈ తరహా స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు టాప్ 3 టెలికాం ఆపరేటర్లు సన్నాహాలు చేస్తున్నాయి. స్మార్ట్ఫోన్ ధరలు తగ్గుముఖం పడుతున్నందున హ్యాండ్సెట్ కంపెనీలతో ఒప్పందాల ద్వారా అత్యంత చౌకైన డేటా, వాయిస్ ప్లాన్లను అందిస్తామని టెలికాం కంపెనీల ప్రతినిధి పేర్కొన్నారు. ఫీచర్ ఫోన్ల తరహాలో స్మార్ట్ఫోన్ల ధరలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని చెప్పారు. రిలయన్స జియో నుంచి విపరీతమైన పోటీని తట్టుకుని యూజర్లను నిలుపుకునేందుకే భారతి ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. -
వార్బర్గ్ చేతికి ఎయిర్టెల్ డీటీహెచ్లో 20 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ డీటీహెచ్(డైరెక్ట్ టు హోమ్) విభాగంలో 20% వాటాను ప్రైవేట్ ఈక్విటీ సంస్థ, వార్బర్గ్ పిన్కస్ కొనుగోలు చేయనుంది. డీటీహెచ్ విభాగమైన భారతీ టెలీమీడియాలో 20% వాటాను వార్బర్గ్ అనుబంధ సంస్థ కొనుగోలు చేయనున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. ఈ డీల్ విలువ రూ.2,310 కోట్లు(35 కోట్ల డాలర్లు) అని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. వార్బర్గ్ పిన్కస్ తమ నుంచి 15% వాటాను, మరో అనుబంధ సంస్థ నుంచి 5% వాటాను కొనుగోలు చేస్తుందన్నారు. గతంలో ఇరు సంస్థల మధ్య విజయవంతమైన భాగస్వామ్యం నెలకొందని, మరొక్కసారి వార్బర్గ్తో జట్టు కట్టడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. భారత డిజిటల్ టీవీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోందని, ఎయిర్టెల్ డీటీహెచ్ విభాగం మంచి వృద్ధిని సాధించగలదన్న అంచనాలున్నాయని వార్బర్గ్ పిన్కస్ ఇండియా ఎండీ, విశాల్ మహాదేవ చెప్పారు. -
5జీ.. హడావుడి మొదలైంది!
అత్యంత వేగవంతమైన 5జీ సర్వీసులను ప్రవేశపెట్టేందుకు దేశవిదేశాల్లోని టెక్నాలజీ సంస్థలు, టెల్కోలు వేంగా ముందుకెళుతున్నాయి. తాజాగా దేశీ టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్తో స్వీడన్ టెలికం పరికరాల దిగ్గజం ఎరిక్సన్ 5జీ టెక్నాలజీపై ఒప్పందం చేసుకుంది. మరో టెలికం పరికరాల సంస్థ నోకియా ఇదివరకే దేశీయంగా 5జీ నెట్వర్క్ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్తోను, భారతి ఎయిర్టెల్తోను జట్టుకట్టింది. ఇప్పటికే బెంగళూరులో 5జీ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ల్యాబ్ ఏర్పాటు చేసిన నోకియా.. కొత్త తరం సాంకేతికతను మరింతగా వినియోగంలోకి తెచ్చే అంశాలపై దృష్టి పెడుతోంది. 5జీకి సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలను 2019లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ లోగానే వెరిజోన్, కొరియా టెలికం, చైనా టెలికం, ఎన్టీటీ డొకొమో, వొడాఫోన్, ఎరిక్సన్, శాంసంగ్, స్ప్రింట్ మొదలైన దిగ్గజ టెల్కోలు ఈ నెట్వర్క్కు మళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. దక్షిణ కొరియాలోని ప్యోంగ్చాంగ్లో వచ్చే ఏడాది జరగబోయే వింటర్ ఒలింపిక్స్లో 5జీ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు అక్కడి మొబైల్ ఆపరేటర్ కేటీ సన్నాహాలు చేస్తోంది. చైనాలోని టెల్కోలు 2020 నాటికల్లా 5జీ సాంకేతికతకు సంబంధించి వాణిజ్య సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయి. 2025 నాటికల్లా ప్రపంచంలోనే అతి పెద్ద 5జీ మార్కెట్గా నిలిపేందుకు కసరత్తు చేస్తున్నాయి. అటు దక్షిణ కొరియా, చైనా, జపాన్, బ్రిటన్, అమెరికా కూడా 2020 కల్లా 5జీని ప్రవేశపెట్టే అవకాశముంది. పొరుగున ఉన్న పాకిస్తాన్ కూడా త్వరలోనే 5జీ నెట్వర్క్ను ప్రవేశపెట్టబోతున్నామంటూ కొనాళ్ల క్రితమే ప్రకటించింది. రూ. 500 కోట్ల కేంద్ర నిధి... కేంద్ర ప్రభుత్వం 5జీ అభివృద్ధి కోసం రూ.500 కోట్ల నిధిని ఏర్పాటు చేయనుంది. 2020కల్లా 5జీ నెట్వర్క్ను ప్రవేశపెట్టే దిశగా తగిన మార్గదర్శక ప్రణాళికను రూపకల్పన చేసేందుకు టెలికం విభాగం కార్యదర్శి సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. నియంత్రణ సంస్థ ట్రాయ్ కూడా 5జీ స్పెక్ట్రం వేలం ప్రక్రియపై దృష్టి పెడుతోంది. పదేళ్లకోసారి కొత్త మార్పులు.. దాదాపు ప్రతి పదేళ్లకు టెలికం రంగంలో కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి. 1981లో తొలిసారిగా 1జీ సాంకేతికత తెరపైకి రాగా .. 1990లలో టెక్స్ట్ మెసేజీలకు కూడా ఉపయోగపడే 2జీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఇక యూజర్లు తమ ఫోన్లలోనే ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేసుకునే వీలు కల్పించే సదుపాయాన్ని 3జీ టెక్నాలజీ తొలిసారి 2001లో అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యకలాపాల్ని మరింత మెరుగుపర్చి.. వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్స్ను ప్రస్తుత 4జీ టెక్నాలజీ అందుబాటులోకి తెచ్చింది. తాజాగా రాబోయే 5జీ టెక్నాలజీ ఈ వేగాన్ని మరింతగా పెంచనుంది. సవాళ్లు కూడా ఉన్నాయ్... 4జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ స్మార్ట్ఫోన్లో మధ్య మధ్యలో అవాంతరాలు లేకుండా కాల్ గానీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ గానీ సాధ్యపడటం లేదు. ఇక వాహనాల్లో తిరుగుతున్నప్పుడు.. గ్రామీణ ప్రాంతాల్లోను ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటోంది. 4జీ ప్రవేశపెట్టినప్పటికీ.. అందుకు సరిపడేంతగా బేస్ స్టేషన్లు, టవర్లు లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం. ఇలాంటి పరిస్థితుల్లో 5జీ టెక్నాలజీ కోసం మరింత కసరత్తు చేయాల్సి ఉంటుంది. మెరుపు వేగం.... ప్రస్తుత విధానంలో సెకనుకు ఒక గిగాబిట్ (జీబీ) డేటా ట్రాన్స్ఫర్కి వీలుండగా.. 5జీలో ఇది ఏకంగా పది గిగాబిట్స్ స్థాయిలో ఉంటుంది. హై డెఫినిషన్ సినిమాలను కూడా సెకన్ల వ్యవధిలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 5జీలో రెండు గంటల నిడివి ఉండే సినిమాను 3 సెకన్ల వ్యవధిలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. భారీ స్థాయిలో కనెక్షన్లను కూడా ఈ నెట్వర్క్ సపోర్ట్ చేయగలదు. 4జీ ప్రస్తుతం ప్రధానంగా యూజర్ల మధ్య కమ్యూనికేషన్కి ఎక్కువగా ఉపయోగపడుతుండగా.. 5జీ దీనికి తోడుగా ఐవోటీ అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. అంటే కార్ల నుంచి ఫ్రిజ్లు, టీవీలు మొదలైన వాటి దాకా చాలా మటుకు ఉత్పత్తులను ఇంటర్నెట్ ద్వారా ఆపరేట్ చేసుకునే వీలుంటుంది. అలాగే, స్మార్ట్ లైటింగ్, స్మార్ట్ పార్కింగ్ వంటి వాటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో టెలి–హెల్త్, టెలి–ఎడ్యుకేషన్ సేవలు అందించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రీసెర్చ్ సంస్థ గార్ట్నర్ అంచనాలమేరకు 2020కి 20.8 బిలియన్ కనెక్టెడ్ డివైజ్లుంటాయి. ప్రస్తుత నెట్వర్క్లు ఇంత భారీ స్థాయి కనెక్టివిటీని సపోర్ట్ చేయలేవు. వివిధ రంగాలకు ఊతం.. 5జీ టెక్నాలజీతో పలు రంగాలకు ఊతం లభించనుంది. ఐటీ, ఆటోమోటివ్, వినోదం, వ్యవసాయం, తయారీ వంటి అనేక రంగాల వృద్ధికి తోడ్పడగలదనే అంచనాలున్నాయి. 5జీ వినియోగంలోకి వచ్చే కొద్దీ భద్రతాపరమైన, వ్యాపారాలపరమైన కీలక అప్లికేషన్స్ అన్నీ కూడా వైర్లైస్ నెట్వర్క్లపైనే నడుస్తాయని నోకియా చెబుతోంది. 5జీ సాంకేతికతతో 2035 నాటికి ప్రపంచ దేశాల ఆదాయాలు 3.5 లక్షల కోట్ల డాలర్ల మేర పెరుగుతుందని, 2.2 కోట్ల పైగా ఉద్యోగాల కల్పనకు ఇది ఉపయోగపడుతుందని క్వాల్కామ్ సీఈవో స్టీవ్ మాలెన్కాఫ్ పేర్కొన్నారు. ఎరిక్సన్ అంచనాల ప్రకారం 2026 నాటికి దేశీ టెలికం ఆపరేటర్లకు 5జీ టెక్నాలజీతో 27.3 బిలియన్ డాలర్ల మేర ఆదాయ అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంప్రదాయ సర్వీసులతో వస్తున్న ఆదాయానికి ఇది అదనం. – (సాక్షి, బిజినెస్ విభాగం) -
రూ.7777 చెల్లిస్తే..ఐ ఫోన్ 7 మీ సొంతం
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ వినియోగదారులను ఆకర్షించటానికి దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ ఐ ఫోన్ 7 పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్లో భాగంగా లాంచ్ చేసిన ఆన్లైన్ స్టోర్ ద్వారా ఐ ఫోన్పై ఆకర్షణీయ మైన ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. ఇనాగరల్ ఆఫర్లో భాగంగా ఆపిల్ ఐఫోన్ 7 ను ఆకర్షణీయమైన డౌన్ చెల్లింపుల్లో అందిస్తోంది. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్లను త్వరలోనే జోడించాలని సంస్థ యోచిస్తోంది. జియోనుంచి గట్టిపోటీని ఎదుర్కొంటూ, దూకుడు ధరలను ఆఫర్ చేస్తున్న సంస్థ ఆన్లైన్ స్టోర్ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లపై సరసమైన డౌన్ పేమెంట్స్, తక్షణ క్రెడిట్ వెరిఫికేషన్, ఫైనాన్సింగ్, నెలసరి ప్రణాళికలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో సోమవారం ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఆపిల్ ఐఫోన్ 7 , ఐఫోన్ 7 ప్లస్ వేరియంట్లను జోడించింది. కేవలం రూ. 7,777 ల డౌన్ పేమెంట్తో 32 జీబీ ఐఫోన్ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. మిగిలిన సొమ్మును 24 నెలవారీ వాయిదాలలో రూ. 2,499 ( పోస్ట్ పెయిడ్ ప్లాన్తో కలిపి) చెల్లించే సౌలభ్యాన్ని అందిస్తోంది. అంతేకాదు దీంతోపాటు, నెలవారీ వాయిదాలలో 30 జీబి డేటా, అపరిమిత కాలింగ్ (స్థానిక, ఎస్టీడీ, జాతీయ రోమింగ్) తోపాటు సైబర్ ప్రొటెక్షనతో పాటు ఫోన్ డ్యామేజ్ కవర్ చేసే ఎయిర్టెల్ సెక్యూర్ ప్యాకేజీ అందించే ప్రత్యేకమైన పోస్ట్ పెయిడ్ పధకాన్ని కూడా అందిస్తోంది. ఐఫోన్7 128 జీబీ వేరియెంట్కు రూ.16,300 డౌన్పేమెంట్ చెల్లించాలి. అలాగే ఐఫోన్ 7 ప్లస్ 32 జీబీ వేరియంట్కు రూ.17,300, 128 జీబీ వేరియంట్కు రూ.26వేల డౌన్పేమెంట్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మిగిలిన మొత్తాన్ని నెలకు రూ.2,499 చొప్పున 24 నెలలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం www.airtel.in/onlinestore కు లాగిన్ అయ్యి మొబైల్ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం మన ఎలిజిబిలిటీ, రుణ సదుపాయం తదితర అంశాలను పరిశీలించుకోవాలి. చివరగా మనం ఎంపిక చేసుకున్న మొబైల్కు సంబంధించిన డౌన్ పేమెంట్ చెల్లించాలి. లావాదేవీ సక్రమంగా పూర్తయితే సంబంధిత చిరునామాకు మొబైల్ చేరుతుంది. లక్షలాది మంది వినియోగదారులని ఆహ్లాదపరిచేందుకు ఎయిర్టెల్ మరో ఉత్తేజకరమైన డిజిటల్ ఆవిష్కరణను తీసుకొచ్చినట్టు హర్మీన్ మెహతా భారతి ఎయిర్టెల్ గ్లోబల్ డైరెక్టర్ తెలిపారు. కస్టమర్లు ఎల్లప్పుడూ కోరుకునే పరికరాలకు అప్గ్రేడ్ చేయడమే కాదు, డిజిటల్ టెక్నాలజీల ద్వారా అధునాతనమైన, సరళమైన ప్రక్రియతో వారి కలను సాకారం చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు తమ భాగస్వాములకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ సేవలు భారతదేశంలోని 21 నగరాల్లో ప్రస్తుతం వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఆపిల్ ఇంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, క్లిక్స్ కాపిటల్, సెయిన్స్ టెక్నాలజీస్, బ్రైట్ స్టార్ టెలికమ్యూనికేషన్స్ , వుల్కాన్ ఎక్స్ప్రెస్ సంస్థలతో భాగస్వామ్యంను కలిగి ఉంది. -
టాటా టెలీ ఎయిర్టెల్ చేతికి
న్యూఢిల్లీ: టెలికం రంగంలో మరింతగా కన్సాలిడేషన్ని సూచిస్తూ భారతీ ఎయిర్టెల్ మరో భారీ డీల్కు తెరతీసింది. రుణభారంతో కుంగుతున్న టాటా టెలీసర్వీసెస్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలను విలీనం చేసుకోనున్నట్లు వెల్లడించింది. తద్వారా.. నవంబర్ 1 నుంచి టాటా టెలీసర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీ మహారాష్ట్ర (టీటీఎంఎల్) సంస్థలకు 19 టెలికం సర్కిళ్లలో ఉన్న 4 కోట్ల మందికి పైగా కస్టమర్లు టాటా టెలీ నుంచి ఎయిర్టెల్కి బదిలీ అవుతారు. అయితే ఈ సంస్థల కొనుగోలు కోసం ఎయిర్టెల్ ఎలాంటి నగదూ చెల్లించటం లేదు. పైపెచ్చు తన కంపెనీలో వాటాలనూ ఇవ్వటం లేదు. టాటా టెలీ సంస్థలకు ఉన్న భారీ రుణాలను కూడా ఎయిర్టెల్ తీర్చదు. వాటిని టాటా గ్రూపే తీరుస్తుంది. కాకపోతే స్పెక్ట్రమ్ కోసం టెలికం విభాగానికి టాటా సంస్థలు చెల్లించాల్సిన మొత్తాలను విడతల వారీగా ఎయిర్టెల్ చెల్లిస్తుంది. ఎందుకంటే ఇకపై సదరు స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ వాడుతుంది కాబట్టి!!. ‘‘ఇది పూర్తిగా రుణ రహిత, నగదురహిత డీల్గా ఉంటుంది’’ అని ఇరు సంస్థలు వేర్వేరుగా ఇచ్చిన ప్రకటనల్లో వెల్లడించాయి. ఇక 19 సర్కిళ్లలో కన్జూమర్ మొబైల్ వ్యాపార విభాగంలో పనిచేస్తున్న టీటీఎస్ఎల్, టీటీఎంఎల్ ఉద్యోగులందరినీ ఎయిర్టెల్కి బదలాయిస్తారు. వీరితో పాటు 800, 1800, 2100 మెగాహెట్జ్ (3జీ, 4జీ) బ్యాండ్స్లో టాటాలకున్న 178.5 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ కూడా దక్కించుకుంటుంది. డీల్ స్వరూపం ప్రకారం టాటా టెలీ రుణాలేవీ ఎయిర్టెల్ స్వీకరించదు. అయితే, ఆ సంస్థ స్పెక్ట్రమ్కోసం టెలికం శాఖకు చెల్లించాల్సిన రూ.10,000 కోట్లలో దాదాపు 20% (సుమారు రూ.1,500–2,000 కోట్లు) బాధ్యత మాత్రమే ఎయిర్టెల్ తీసుకుంటుంది. సుమారు రూ. 31,000 కోట్ల పైచిలుకు పేరుకుపోయిన టాటా టెలీ రుణాలను టాటా సన్స్ తీరుస్తుంది. ‘దేశీ టెలికం రంగంలో కన్సాలిడేషన్ దిశగా ఇది మరో కీలక పరిణామం. అత్యుత్తమ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి సర్వీసులను చౌకగా అందించడం ద్వారా దేశీయంగా డిజిటల్ విప్లవానికి సారథ్యం వహించడంలో మా నిబద్ధతను ఇది సూచిస్తుంది‘ అని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ‘టాటా గ్రూప్, దాని వాటాదారులకు ఈ ఒప్పందం అత్యుత్తమమైనదని భావిస్తున్నాము. అనేక ప్రత్యామ్నాయ అవకాశాలన్నీ పరిశీలించిన మీదట భారతి ఎయిర్టెల్తో ఈ ఒప్పందం కుదుర్చుకున్నాం‘ అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. 32 కోట్లకు ఎయిర్టెల్ యూజర్లు .. లావాదేవీ పూర్తయ్యేదాకా టీటీఎస్ఎల్, టీటీఎంఎల్ కన్జూమర్ మొబైల్ వ్యాపార కార్యకలాపాలు, సేవలు యథాప్రకారం కొనసాగుతాయి. ప్రస్తుత ఒప్పందంతో టాటా ఫైబర్ నెట్వర్క్ను ఉపయోగించుకునేందుకు ఎయిర్టెల్కు వెసులుబాటు లభిస్తుంది. ఈ డీల్తో ఎయిర్టెల్ గడిచిన అయిదేళ్లలో ఏడు సంస్థలను దక్కించుకున్నట్లవుతుంది. ఇటీవలే ఫిబ్రవరిలో మరో టెల్కో టెలినార్కి ఆంధ్రప్రదేశ్ సహా ఏడు సర్కిళ్లలో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కూడా టాటా టెలీ తరహాలోనే నగదురహిత డీల్లో ఎయిర్టెల్ కొనుగోలు చేసింది. తాజా ఒప్పందంతో ఎయిర్టెల్ కస్టమర్ల సంఖ్య 32 కోట్లకు చేరనుంది. అయితే, ప్రతిపాదిత వొడాఫోన్–ఐడియా విలీనానంతరం ఏర్పడే కంపెనీకి ఉండే 40 కోట్ల మంది యూజర్ల కన్నా ఇది తక్కువే కావడం గమనార్హం. గతేడాది సెప్టెంబర్లో రిలయన్స్ జియో అడుగుపెట్టినప్పట్నుంచీ భారత టెలికం రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. టారిఫ్లు మరింతగా తగ్గడం నుంచి టెల్కోల విలీనాలతో ఈ రంగంలో కన్సాలిడేషన్ ఊపందుకుంది. గురువారం బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేరు 1 శాతం క్షీణించి రూ. 398.70 వద్ద, టాటా టెలీ (మహారాష్ట్ర) సుమారు 10 శాతం వృద్ధితో రూ. 4.42 వద్ద క్లోజయ్యాయి. మూసివేత కన్నా ఇదే మంచిది.. టాటా టెలీని మూసివేయడం కన్నా మరో కంపెనీకి అప్పగించడమే మంచిదని భావించినట్లు టాటా గ్రూప్ సీఎఫ్ఓ సౌరభ్ అగ్రవాల్ తెలిపారు. ఏదైనా సంస్థను మూసివేయడమనేది టాటా గ్రూప్ విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. మూసివేసి ఉంటే అనేక మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయి ఉండేవారన్నారు. ‘కన్జూమర్ మొబైల్ వ్యాపారాన్ని మూసివేయడమనేది చాలా భారీ ఖర్చులతో కూడుకున్నది.. పైగా అనేక మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చేది. దానికన్నా ఈ మార్గం శ్రేయస్కరమని ఎంచుకోవడం జరిగింది‘ అని ఆయన చెప్పారు. టవర్ల కంపెనీ వ్యోమ్ .. టాటా చేతిలోనే ఉంటుందన్నారు. టాటా కమ్యూనికేషన్స్కి ఎంటర్ప్రైజ్ విభాగం.. ఎంటర్ప్రైజ్ వ్యాపార విభాగాన్ని టాటా కమ్యూనికేషన్స్కి, రిటైల్ ఫిక్సిడ్ లైన్.. బ్రాడ్బ్యాండ్ వ్యాపారాన్ని శాటిలైట్ టీవీ సంస్థ టాటా స్కైకి బదలాయించే అవకాశాలు ఉన్నాయని అగ్రవాల్ పేర్కొన్నారు. ఇరు కంపెనీల బోర్డులు ఈ అవకాశాలని పరిశీలించి, 4–6 వారాల్లో తగు నిర్ణయం తీసుకుంటాయని అగ్రవాల్ చెప్పారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న టాటా టెలీ మొబైల్ వ్యాపారాన్ని సరిదిద్దేందుకు పునర్వ్యవస్థీకరణ చర్యలు చాన్నాళ్ల క్రితమే తీసుకుని ఉండాల్సిందని తెలిపారు. గ్రూప్ చైర్మన్గా ఫిబ్రవరిలో పగ్గాలు చేపట్టిన ఎన్ చంద్రశేఖరన్.. తోడ్పాటు అందించే వారితో మాట్లాడి డీల్ను సాకారం చేశారన్నారు. ఎంత మంది ఉద్యోగులను బదలాయించేది వెల్లడించని అగ్రవాల్.. విలీనం పూర్తయ్యాక ఎయిర్టెల్ సిబ్బందిని క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందని మాత్రం చెప్పారు. -
రిలయన్స్ రికార్డ్స్.. టెల్కోలు బేజారు
సాక్షి, ముంబై : ట్రాయ్ మంగళవారం ఇచ్చిన షాక్తో టెల్కోలు భారీగా దెబ్బతిన్నాయి. భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు బుధవారం మార్కెట్లో 7 శాతం పైగా నష్టపోయాయి. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ప్రకటించింది. ఈ ప్రకటన టెల్కోలకు తీవ్ర షాకింగ్కు గురిచేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలవుతాయని ట్రాయ్ పేర్కొంది. 2020 జనవరి నుంచైతే ఏకంగా ఈ ఛార్జీలను జీరోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపింది. టర్మినేషన్ చార్జీ అన్నది ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్కు తన నెట్వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. దీంతో ప్రధాన టెల్కోలన్నీ తమ రెవెన్యూలను భారీగా కోల్పోనున్నాయి. ఈ నిర్ణయం జియోకు అనుకూలంగా ఉందని ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు ఆరోపిస్తున్నాయి. దీన్ని కనీసం 30–35 పైసలుగా నిర్ణయించాలని టెల్కోలు కోరుతున్నాయి. ట్రాయ్ నిర్ణయంతో ఐడియా 7 శాతం నష్టపోయి రూ.76.85 వద్ద, ఎయిర్టెల్ 6 శాతం పడిపోయి రూ.370 వద్ద ట్రేడైంది. ట్రాయ్ తాజా నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ పండుగ చేసుకుంటోంది. ఈ కంపెనీ షేర్లు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. రిలయన్స్ షేర్లు, ట్రాయ్ నిర్ణయంతో జియోకు వార్షికంగా రూ.3,800 కోట్ల మేర ఆదా అయ్యే అవకాశముందని ఇండస్ట్రి వర్గాలు చెప్పాయి. ఇదే సమయంలో ఎయిర్టెల్ రూ.1500-2000 కోట్లు, వొడాఫోన్ రూ.1500 కోట్లు, ఐడియా సెల్యులార్ రూ.1200 కోట్లు నష్టపోనున్నట్టు అంచనా వేస్తున్నాయి. జియో రాకతో ఇప్పటికే పతనమైన టెలికాం ఇండస్ట్రి, మరింత కుదేలు కానున్నట్టు ఎయిర్టెల్ ఆరోపిస్తోంది. -
జియోకు చెక్: రూ.32వేల కోట్లతో ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు చెక్ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్వర్క్ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. జియో గతేడాది సెప్టెంబర్లో లాంచ్ చేసిన కమర్షియల్ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్ వేసినా.. అవి వర్క్వుట్ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్టెల్ పెద్ద ఎత్తునే ప్లాన్ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్వర్క్ను భారీగా విస్తరించనుంది. అంతేకాక వీటిని స్పెక్ట్రమ్ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్ఫ్లోస్ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్టెల్ తన నెట్వర్క్లను అప్గ్రేడ్ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్వర్క్ల అప్గ్రేడ్ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. -
ఎయిర్టెల్ 4జీ ఫోన్ ధర, ఫీచర్లు లీక్!
సాక్షి, ముంబై: రిలయన్స్ జియోకు పోటీగా దేశీ ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ అందుబాటులోకి తేనున్న 4జీ స్మార్ట్ఫోన్పై కసరత్తును ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జియో తన 4 జీ ఫీచర్ ఫోన్ను దసరాకి బరిలోకి దింపుతుండగా,ఎయిర్టెల్ దీపావళి నాటికి మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ముఖ్యంగా జియో 4జీ ఫీచర్ ఫోన్కు పోటీగా ఎయిర్టెల్ కూడా బడ్జెట్ ధరలో4జీఫోన్ను ప్రకటించింది. దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్గా విడుదల చేయాలని భావిస్తోందట. తాజా అంచనాల ప్రకారం రూ. 2,500-2,700 మధ్యలో ఈ ఫోన్ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు వేగవంతం చేసింది. దీపావళికి దీనికి కస్టమర్లకు అందించాలని బావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్తో ఎయిర్టెల్ సిమ్ను ఉచితం. దీంతోపాటు ఆకర్షణీయైన డేటా ఆఫర్లను కూడా ప్రవేశపెట్టనుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే .. డ్యుయల్ సిమ్ 4 అంగుళాల డిస్ప్లే 1 జీబీ ర్యామ్ డబుల్ కెమెరాలు 4జీ వోల్ట్ కాలింగ్ సదుపాయం భారీ బ్యాటరీ ఇవి ప్రధాన ఫీచర్లుగా అందించనుందని విశ్వనీయ వర్గాలు సమాచారం. అయితే ఎప్పటినుంచి బుకింగ్లను ప్రారంభించనుందనే విషయాలను ఇంకా వెల్లడించలేదు. కాగా ఆగస్టు 24నుంచి జియో ఫోన్ కోసం అధికారిక బుకింగ్స్ ప్రారంభించిన రిలయన్స్ జియో దీన్ని దసరాకు (సెప్టెంబర్లో) కస్టమర్లకు పలకరించనుంది. అన్లిమిటెడ్కాలింగ్, ఎస్ఎంఎస్లతో అందిస్తున్న జియో ఫోన్ కోసం 60లక్షల (ఆరు మిలియన్ల) బుకింగ్లులు నమోదైన సంగతి తెలిసిందే. -
భారతి ఎయిర్టెల్...ఫ్యూచర్స్ సిగ్నల్స్
బుధవారంనాటి మార్కెట్ ర్యాలీలో బ్యాంకింగ్ షేర్లతో పాటు మెటల్, టెలికం రంగాలకు చెందిన షేర్లు కూడా పాలుపంచుకున్నాయి. వీటిలో టెలికం షేరు భారతి ఎయిర్టెల్ 2.6 శాతం పెరిగి 52 వారాల గరిష్టస్థాయి రూ. 432 వద్ద ముగిసింది. జూలై నెలలో ఈ షేరు మూడు దఫాలు రూ. 430 స్థాయిని తాకినప్పటికీ, ఆపైన ముగియలేకపోయింది. తాజా ర్యాలీ సందర్భంగా భారతి ఎయిర్టెల్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) నుంచి 1.46 లక్షల షేర్లు (0.50 శాతం) కట్ అయ్యాయి. దీంతో మొత్తం ఓఐ 2.90 కోట్లకు తగ్గింది. స్పాట్తో పోలిస్తే ఫ్యూచర్ ధర ప్రీమియం సైతం రూ. 1.70 నుంచి రూ. 1కి తగ్గింది. స్వల్పంగా ఓఐ కట్కావడం బుల్ ఆన్వైండింగ్ను సూచిస్తుండగా, ప్రీమియం తగ్గుదలకు డెరివేటివ్ సెటిల్మెంట దగ్గరపడుతుండటం కారణం. ఆప్షన్స్ విభాగంలో రూ. 430 స్ట్రయిక్ వద్ద కాల్ కవరింగ్తో లక్ష షేర్లు కట్కాగా, బిల్డప్ 5.30 లక్షలకు తగ్గింది. రూ. 440 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్రైటింగ్ జరగడంతో 11 వేల షేర్లు యాడ్ అయ్యాయి. బిల్డప్ 5.15 లక్షల షేర్లకు చేరింది. రూ. 420 స్ట్రయిక్ వద్ద భారీ పుట్ రైటింగ్ జరగడంతో 3.72 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. పుట్ బిల్డప్ 7.90 లక్షల షేర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో అనూహ్య వార్తలేవైనా వెలువడితే తప్ప, ఈ షేరు తగ్గితే రూ. 420 సమీపంలో మద్దతు పొందవచ్చని, రూ. 430పైన స్థిరపడితే క్రమేపీ రూ. 440 స్థాయిని అధిగమించవచ్చని ఆప్షన్ బిల్డప్ వెల్లడిస్తున్నది. -
మరోసారి భారీగా కుదేలైన ఎయిర్టెల్
-
మరోసారి భారీగా కుదేలైన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ మరోసారి భారీగా కుదేలైంది. మంగళవారం ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాల్లో భారతీ ఎయిర్టెల్ లాభాలు 75 శాతం కిందకి పడిపోయి, రూ.367 కోట్లగా రికార్డయ్యాయి. అయితే విశ్లేషకులు అంచనావేసిన దానికంటే మెరుగైన లాభాలనే ఎయిర్టెల్ నమోదుచేసింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ లాభాలు రూ.1462 కోట్లగా ఉన్నాయి. భారతీ ఎయిర్టెల్ ఆర్ప్(ఒక్కో యూజర్పై ఆర్జించే సగటు రెవెన్యూ) కూడా క్వార్టర్ క్వార్టర్ బేసిస్లో 2 శాతం పడిపోయి, ఒక్కో నెలకు రూ.154 మాత్రమే ఆర్జించింది. మొత్తం రెవెన్యూలు కూడా కంపెనీవి ఏడాది ఏడాదికి 14 శాతం కిందకి దిగజారాయి. క్వార్టర్ రివ్యూలో కంపెనీ మొత్తం రెవెన్యూలు రూ.21,958 కోట్లగా ఉన్నట్టు తెలిసింది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్వార్టర్లో 527 మిలియన్ ఎంబీగా ఉందని కంపెనీ చెప్పింది. దీనిలో కంపెనీ ఏడాదికి ఏడాది గణనీయమైన వృద్ధి 178 శాతాన్ని నమోదుచేసింది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఈ క్వార్టర్లో 16.8 శాతం క్షీణించి, రూ.3,765 కోట్లగా నమోదయ్యాయి. మొత్తంగా దేశీయంగా కంపెనీ రెవెన్యూలు క్యూ1లో ఏడాది ఏడాదికి 10 శాతం పడిపోయి, రూ.17,244 కోట్లగా నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది. కాగ, కంపెనీ నికర రుణం రూ.91,400 కోట్ల నుంచి రూ.87,840 కోట్లకు తగ్గింది. మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్తో ప్రస్తుత క్వార్టర్లో కూడా మొబైల్ మార్కెట్లో తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చవిచూశామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మార్కెట్లోకి ప్రవేశించిన కొత్త ఆపరేటర్తో దేశీయ టెలికాం మార్కెట్లో తీవ్ర ధరల అంతరాయం ఏర్పడి ఇండస్ట్రి రెవెన్యూలను కంటిన్యూగా పడిపోతున్నాయని, ఏడాది ఏడాదికి ప్రస్తుతం 15 శాతం ఇండస్ట్రి రెవెన్యూలను కోల్పోయినట్టు భారతీ ఎయిర్టెల్ భారత్, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ చెప్పారు. ఫలితాల నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.76 శాతం పెరిగాయి. మార్కెట్ అవర్స్ తర్వాత కంపెనీ ఈ ఫలితాలను ప్రకటించింది. -
టెల్కోల గుట్టు రట్టు చేసిన కాగ్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ల వంటి ప్రైవేట్ టెలికాం కంపెనీల గట్టును కాగ్ రట్టు చేసింది. 2010-11, 2014-15 మధ్య కాలంలో వీరు తక్కువ చేసి చూపించిన రెవెన్యూ విలువపై కాగ్ ఓ నివేదిక రూపొందించి పార్లమెంట్కి సమర్పించింది. ఈ రిపోర్టులో ఆరు ప్రైవేట్ టెలికాం కంపెనీలు రూ.61,064.5 కోట్ల రెవెన్యూలను తక్కువ చేసి చూపించినట్టు తెలిపింది. దీంతో ప్రభుత్వానికి రూ.7,697.6 కోట్ల చెల్లింపులు తగ్గిపోయాయని కాగ్ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి నివేదికను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) శుక్రవారంపార్లమెంట్లో సమర్పించింది. కాగ్ తన ఆడిట్లో ఆరు ఆపరేటర్లు అడ్జెస్టడ్ గ్రాస్ రెవెన్యూలు మొత్తం రూ. 61,064.56 కోట్లకు తగ్గించి చూపించాయని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్సెల్ వంటి ఐదు ఆపరేటర్లకు సంబంధించిన 2010-11 నుంచి 2014-15 కాల ఆడిట్ రిపోర్టులో ఇవి బయటపడగా.. సిస్టెమా శ్యామ్ అనే కంపెనీ 2006-07 నుంచి 2014-15 ఈ చర్యకు పాల్పడిందని తెలిసింది. రెవెన్యూ షేరును తక్కువ చేసి చూపించడంతో ప్రభుత్వం భారీ మొత్తంలోనే చెల్లింపులను పోగట్టుకుందని కాగ్ రిపోర్టు తేల్చింది. -
టెలికంకు 'టాటా'?
భారతీ ఎయిర్టెల్తో విలీనానికి సన్నాహాలు! ♦ టాటా టెలీ, టాటా కమ్యూనికేషన్స్తో పాటు డీటీహెచ్ వ్యాపారాన్ని కూడా కలిపేసే అవకాశం ♦ చర్చలు జరుపుతున్న ఇరు గ్రూప్లు... ♦ విలీనం ఇరు సంస్థలకు లాభమేనంటున్న విశ్లేషకులు ♦ ఇదే జరిగితే ఇక మిగిలేవి నాలుగైదు టెలికం సంస్థలే! (సాక్షి, బిజినెస్ విభాగం) దేశీ టెలికం రంగంలో మరో మెగా విలీన పర్వానికి తెరలేచింది. భారత కార్పొరేట్ ప్రపంచంలో పేరొందిన టాటా గ్రూప్, భారతీ గ్రూప్ల మధ్య భాగస్వామ్యానికి రంగం సిద్ధమవుతున్నట్లు తాజా సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. టాటా గ్రూప్లోని టెలికం కంపెనీలన్నింటినీ భారతీ ఎయిర్ టెల్లో విలీనం చేయొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. ఈ భారీ విలీనానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, ఇతరత్రా అంశాలపై ఇరు వర్గాలు ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు కూడా మొదలుపెట్టినట్లు సమాచారం. ఇది సాకారమైతే టెలికం వ్యాపారంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న టాటాలు.. ఈ రంగం నుంచి పూర్తిగా వైదొలగడానికి ఇది మంచి అవకాశమేనన్నది విశ్లేషకుల మాట. మరోపక్క, రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న భారతీ ఎయిర్టెల్కు కూడా ఈ డీల్ కలిసొస్తుందనేది వారి అభిప్రాయం. ఈ వార్తల నేపథ్యంలో టాటా టెలీ షేరు దూసుకుపోయింది. శుక్రవారం బీఎస్ఈలో దాదాపు 19 శాతం ఎగబాకింది. చివరకు 17 శాతం లాభంతో రూ.8.56 వద్ద ముగిసింది. ఇక భారతీ ఎయిర్టెల్ షేరు 1 శాతం మేర లాభపడి రూ.385 వద్ద స్థిరపడింది. ‘టాటా’ ఎందుకు... ప్రస్తుతం టాటా గ్రూప్ టెలికం వ్యాపారంలో టాటా టెలీసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్స్ ప్రధాన కంపెనీలుగా ఉన్నాయి. టాటా టెలీ సర్వీసెస్ (టీటీఎస్ఎల్), టాటా టెలీ (మహారాష్ట్ర) లిమిటెడ్ (టీటీఎస్ఎంఎల్)æలు అనేవి టెలికం వ్యాపారాన్ని నిర్వహిస్తుండగా.. టాటా కమ్యూనికేషన్స్ సముద్రగర్భ కేబుల్ వ్యవస్థ, టెలికంలో ఎంటర్ప్రైజ్ సేవలను అందిస్తోంది. టాటా స్కై పేరిట డైరెక్ట్ టు హోమ్(డీటీహెచ్) వ్యాపారాన్ని కూడా టాటా గ్రూప్ నిర్వహిస్తోంది. బ్రిటిష్ టెలికం సంస్థ ‘స్కై’ భాగస్వామ్యంతో టాటాలు దీన్ని ఏర్పాటు చేశారు. ఇక సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎంటర్ప్రైజెస్కు కూడా భారత్లో అతిపెద్ద టెల్కో భారతీ ఎయిర్టెల్తో పాటు ఎయిర్టెల్ డీ2హెచ్ పేరుతో డీటీహెచ్ కంపెనీ ఉంది. ఇరు గ్రూప్లకూ టెలికంలో దాదాపు ఒకే విధమైన సేవల విభాగాలు ఉండటంతో ప్రతిపాదిత విలీనం కలిసొస్తుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోపక్క, గత కొన్నేళ్లుగా టాటా టెలీ యూజర్ల సంఖ్య ఘోరంగా పడిపోతూ వస్తోంది. ట్రాయ్ గణంకాల ప్రకారం గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యలో ఈ రెండు టాటా టెల్కోలకు చెందిన కోటి మందికిపైగా యూజర్లు ఇతర టెల్కోలకు మారిపోయినట్లు లెక్కతేలుతోంది. మరోపక్క, జపాన్ కంపెనీ డొకోమో భాగస్వామ్యంతో టాటా డొకోమో పేరిట దేశవ్యాప్తంగా సేవలు అందిస్తున్న టాటాలకు ఆ కంపెనీతో తలెత్తిన విభేదాలు సద్దుమణిగాయి. టాటా డొకోమో జేవీ నుంచి వైదొలగడానికి డొకోమో చేస్తున్న న్యాయ పోరాటం కొలిక్కివచ్చింది. దీంతో డొకోమో ఇక భారత్కు గుడ్బై చెప్పేయనుంది. ఈ నేపథ్యంలో తమకు అంతగా కలిసిరాని టెలికం వ్యాపారాన్ని వదిలించుకోడంపై టాటాలు దృష్టిపెట్టినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఇక టాటా టెలీ ఆదాయం వార్షికంగా రూ.9,500 కోట్లు కాగా, రూ.30 వేల కోట్ల మేర రుణ భారం ఉంది. ఏటా రూ.2,500 కోట్లను వడ్డీగా చెల్లించాల్సివస్తోంది. ఎయిర్టెల్కు కలిసొస్తుందా? ప్రస్తుతం భారత్లో దాదాపు 30 కోట్ల మంది టెలికం యూజర్లతో భారతీ ఎయిర్టెల్ అతిపెద్ద నెట్వర్క్గా కొనసాగుతోంది. అయితే, తాజాగా రిలయన్స్ జియో అరంగేట్రం, అది ప్రవేశపెట్టిన చౌక టారిఫ్లు, ఉచిత వాయిస్ కాలింగ్తో ఇతర టెల్కోల మాదిరిగానే ఎయిర్టెల్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో టారిఫ్లను తగ్గించుకోవాల్సి వచ్చింది. కంపెనీ మార్జిన్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశమిది. దీనికితోడు ఐడియా సెల్యులార్తో బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా విలీనం కారణంగా దేశంలో నంబర్ వన్ టెలికం ఆపరేటర్ స్థానాన్ని కూడా కోల్పోయేందుకు దారితీస్తుంది. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఎయిర్టెల్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి తరుణంలో టాటా టెలికం వ్యాపారాన్ని విలీనం చేసుకోవడం ఎయిర్టెల్కు వ్యూహాత్మకంగా సానుకూలాంశమని భావిస్తున్నారు. ప్రధానంగా టాటా కమ్యూనికేషన్స్కు ఉన్న విదేశీ కేబుల్ బిజినెస్, ఎంటర్ప్రైజ్ సేవలు ఆసరాతో ఎయిర్టెల్ తన ఎంటర్ప్రైజ్ విభాగాన్ని అత్యంత పటిష్టం చేసుకోవడానికి వీలవుతుంది. ప్రపంచంలో అతిపెద్ద సబ్మెరైన్ (సముద్రగర్భ) ఫైబర్ఆప్టిక్ నెట్వర్క్ టాటా కమ్యూనికేషన్స్ సొంతం. ప్రపంచంలోని మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్లలో 70 శాతం దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇదేకాకుండా డీటీహెచ్ విభాగంలో దేశంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించేందుకు టాటా స్కై, ఎయిర్టెల్ డీ2హెచ్ విలీనం వీలుకల్పిస్తుంది. వీడియోకాన్ డీ2హెచ్ను విలీనం చేసుకున్న డిష్ టీవీ ప్రస్తుతం 45 శాతం మేర వాటాతో దేశంలో నంబర్వన్ స్థానంలో ఉంది. అంతేకాకుండా టాటా స్కైలో విదేశీ ఇన్వెస్టర్లయిన ట్వంటీఫస్ట్ సెంచురీ ఫాక్స్, టెమాసెక్ హోల్డింగ్స్ కూడా ఈ విలీనంద్వారా అవసరమైతే తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. ఇదీ టెలికం ముఖచిత్రం... ⇔ ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్కు దాదాపు 27 కోట్ల మంది టెలికం యూజర్లు ఉన్నారు. ఆదాయం, సబ్స్క్రయిబర్ల ప రంగా 33 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ⇔ వొడాఫోన్ ఇండియా మార్కెట్ వాటా 18.5 శాతంగా అంచనా. కస్టమర్ల సంఖ్య దాదాపు 20.5 కోట్లు. దేశంలో నంబర్–2 టెలికం కంపెనీగా కొనసాగుతోంది. ⇔ ఐడియా సెల్యులార్ 17% మార్కెట్ వాటా, 19 కోట్లకుపైగా యూజర్లతో మూడో అతిపెద్ద టెల్కోగా నిలుస్తోంది. ⇔ అయితే, ప్రతిపాదిత ఐడియా–వొడాఫోన్ విలీనం ద్వారా ఆవిర్భవించే కంపెనీ... 40 కోట్ల మేర యూజర్లతో ఎయిర్టెల్ను వెనక్కినెట్టి నంబర్ వన్గా ఆవిర్భవిస్తుంది. అంతేకాకుండా ఈ విలీన సంస్థ రూ.80 వేల కోట్ల ఆదాయంతో 43% మార్కెట్ వాటాను దక్కించుకుంటుందని అంచనా. ⇔ ఆదాయపరంగా మార్కెట్ వాటాను కోల్పోకూడదనే ఎయిర్టెల్.. టాటా టెలీ విలీనానికి ముందుకొస్తోంది. ⇔ టాటా టెలీ, ఎయిర్టెల్ విలీనంతో పాటు రిలయన్స్ జియోతో ఆర్కామ్ కూడా విలీనమైతే ప్రైవేటు రంగంలో మూడు, ప్రభుత్వ రంగంలో ఒక (బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్) టెల్కోయే మిగిలే అవకాశం ఉందని లండన్కు చెందిన సీసీఎస్ అనే సంస్థ తాజా నివేదికలో పేర్కొంది. ⇔ అప్పటికి మూడు ప్రైవేటు టెలికం కంపెనీలు ఒక్కొక్కటి 30 కోట్లకుపైగా యూజర్లను కలిగి ఉంటాయని, ఇక ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్–ఎంటీఎన్లకు 10 కోట్ల మేర యూజర్లు ఉంటారని లెక్కగట్టింది. మిగిలేవి నాలుగైదే... ⇔ దేశీ టెలికంలో విలీనాలు–కొనుగోళ్లకు ప్రధానంగా ఆజ్యం పోసింది రిలయన్స్ జియో రంగప్రవేశమే. ఇక భారత్లో నియంత్రణపరమైన ఇబ్బందులు, కోర్టు కేసులు (స్పెక్ట్రం కుంభకోణం ఇతరత్రా) కారణంగా విదేశీ కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా గుడ్బై చెబుతూ వస్తున్నాయి. ⇔ తొలుత అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్) రష్యాకు చెందిన సిస్టెమా శ్యామ్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత దేశీ సంస్థ ఎయిర్సెల్తో తన టెలికం వ్యాపారాన్ని విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ⇔ వొడాఫోన్ కూడా పన్ను సంబంధ కేసుల నేపథ్యంలో భారత్ నుంచి వైదొలగాలని ఎప్పటినుంచో భావిస్తోంది. ఐడియాతో విలీనాన్ని ప్రకటించడం ద్వారా వొడాఫోన్ ఎగ్జిట్ రూట్ను ఆశ్రయించింది. ⇔ ఇదిలా ఉండగా... భారతీ ఎయిర్టెల్ కూడా ఈ రేసులో తానూ ఉన్నానని రంగంలోకి దూకింది. నార్వేకు చెందిన టెలినార్ భారత్ కార్యకలాపాలను కొనుగోలు చేసేందుకు ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా టెలినార్ భారత్ నుంచి వైదొలగుతోంది. ⇔ టాటాడొకోమో నుంచి జపాన్ కంపెనీ ఎన్టీటీ డొకోమో కూడా బయటికి వెళ్లిపోయేందుకు తాజాగా న్యాయపరమైన చిక్కులు తొలగిపోయాయి. టాటాలతో విభేధాలకు తెరపడటంతో డొకోమో భారత్కు గుడ్బై చెప్పనుంది. ⇔ మొత్తంమీద.. ఇక భారత్లో విదేశీ టెలికం కంపెనీలన్నీ ప్రత్యక్ష కార్యకలాపాల నుంచి తప్పుకున్నట్టే లెక్క. ⇔ భారత్కు నాలుగైదు పెద్ద టెలికం కంపెనీలు ఉంటే చాలని అటు కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ విలీనాలు–కొనుగోళ్లు వేగం పుంజుకోవడం విశేషం. ⇔ తాజా పరిణామాలు కొలిక్కివస్తే.. దేశంలో రానున్న రెండుమూడేళ్లలో నిజంగానే టెలికం కంపెనీలు నాలుగైదుకే (ఐడియా, రిలయన్స్ జియో, ఆర్కామ్–ఎయిర్సెల్, భారతీ ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్) పరిమితం అయిపోయేందుకు దారితీస్తుంది. -
జియోకి వ్యతిరేకంగా ఏకమైన టెల్కోలు
న్యూడిల్లీ: టెలికాం కంపెనీల మధ్య వార్ మరోసారి తెరపైకి వచ్చింది. ఉచిత ఆఫర్లతో దూసుకువచ్చిన రిలయన్స జియోపై టెలికాం దిగ్గజం కంపెనీలు పలు ఆరోపణలు గుప్పించాయి. జియోకి వ్యతిరేకంగా ఏకమైన దిగ్గజ కంపెనీలు దోపిడీధరలతో జియో కస్టమర్లను మోసం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఈ మేరకు ఇంటర్మీడియాలిటీ గ్రూప్ (ఐఎంజీ) ముందు తమ వాదనను వినిపించాయి. శుక్రవారం ఫైనాన్స్, టెలికాం మంత్రిత్వ శాఖల అధికారుల బృందంతో మాట్లాడిన కంపెనీలు, జియో వాస్తవికతను తప్పుగా చూపించిందన్నారు. దేశంలోని ప్రధాన టెలికాం సంస్థలు భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు రిలయన్స్ జియో అధికారులకు అవాస్తవాలు చెప్పిందని ఆరోపించాయి. తక్కువ ధరకే డేటా సేవలను ఆఫర్ చేసి మార్కెట్ షేరును గెలుచుకోవాలని చూస్తోందంటూ ప్రత్యర్థి జియోపై మండిపడ్డాయి. ముఖ్యంగా దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్ టెల్ జియో "దోపిడీ ధర" విధానాన్ని స్వీకరించిందని ఆరోపించింది. తద్వారా పరిశ్రమల ఆదాయం, నికర ఆదాయం, క్యాపిటల్స్ను తిరిగి రాబట్టడంలో తీవ్రంగా నష్టపోయిందని ఎయిర్టెల్ పేర్కింది. దీన్ని నిరోధించాలని ఐఎంజీని కోరింది. అంతేకాదు, టెలికాం నియంత్రణాధికారి ట్రాయ్ కోర్టులో అంతిమ నిర్ణయం తీసుకునే వరకు ఇంటర్కనెక్షన్ యూసేజ్ ధరలను నియంత్రిచాలని కోరాయి. లేదంటే తమకు "కోలుకోలేని ఆర్థిక నష్టం తప్పదని ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు జీఎస్టీ పన్ను విధానంపై కూడా కంపెనీలు స్పందించాయి. ఇతర ప్రధాన రంగాల లాగానే, 18 శాతానికి బదులుగా, ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని కొనసాగించాలని వోడాఫోన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కోరారు. టెలికాం సేవంలపై 5శాతం జీఎస్టీ పన్ను ఉండాలన్న వాదనను ఐడియా కూడా సమర్ధించింది. తద్వారా లైసెన్సింగ్ ఫీజు తగ్గుతుందని పేర్కింది. యూనివర్సల్ సర్వీసెస్ ఆబ్లిగేషన్ ఫండ్ లెవీని రద్దు చేయడం ద్వారా లైసెన్స్ ఫీజును 3 శాతానికి తగ్గించాలని ఎయిర్ టెల్ సూచించింది. -
ఎయిర్టెల్ ఫిర్యాదును తోసిపుచ్చిన సీసీఐ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో సంస్థలు గుత్తాధిపత్య కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ భారతీ ఎయిర్టెల్ చేసిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొట్టిపారేసింది. ఎయిర్టెల్ చేసిన ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ... ‘‘ఒకవంక రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో తనకున్న ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని జియో సేవల్ని అందిస్తోందని, మరోవంక రిలయన్స్– జియో మధ్య పరస్పర పోటీ లేకుండా చూసుకునే ఒప్పందం కుదిరిందని ఎయిర్టెల్ చెబుతోంది. ఈ రెండూ ఎలా కుదురుతాయి?’’ అని సీసీఐ ప్రశ్నించింది. ఎయిర్టెల్ తన ఆరోపణలకు సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. జియో పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని కూడా తెలిపింది. జియోలో ఆర్ఐఎల్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినంత మాత్రానా, ఆర్ఐఎల్ను కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించిందనడానికి వీలులేదని స్పష్టంచేసింది. ఆర్ఐఎల్ టెలికం సర్వీసుల వ్యాపారంలో లేదని, అలాంటప్పుడు ఆ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్లను పోటీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావిస్తే పరిశ్రమ వృద్ధికి విఘాతం ఏర్పడుతుందని, కొత్త కంపెనీల విస్తరణ, అభివృద్ధి కుంటుపడుతుందని వివరించింది. -
ఎయిర్టెల్–టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ, స్టాక్ ఎక్సే్చం జ్లు ఇప్పటికే ఆమోదం తెలియజేయడంతో గతవారం ఎయిర్టెల్, టెలీనార్ విలీనానికి అనుమతి కోరుతూ సీసీఐ ముందు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల 5న సీసీఐ నుంచి అనుమతి లభించినట్టు భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈకి తెలియజేసింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్టెల్ సొంతం అవుతాయి. దీంతో వృద్ధికి అపార అవకాశాలున్నాయనేది ఎయిర్టెల్ అంచనా. -
భారతి ఎయిర్టెల్కు ఊరట
ముంబై: దేశీయ టెలీ దిగ్గజం భారతి ఎయిర్టెల్కు సెబీ ద్వారా భారీ ఊరట లభించింది. ఎయిర్ టెల్ టెలినార్ డీల్ కి సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జియో షాక్ తో ఇబ్బందుల్లో పడిన ఎయిర్టెల్ ఉపశమనం లభించనుంది. నార్వే టెలికాం ఆపరేటర్ టెలినార్ భారతీయ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నందుకు సెబీ, స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఆమోదం లభించిందని ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో చెప్పింది. టెలినార్ కమ్యూనికేషన్స్ను విలీనం చేసుకునేందుకు అటు స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందిన వార్తలతో మార్కెట్లో భారతీ ఎయిర్టెల్ కౌంటర్ బాగా పుంజుకుంది. దాదాపు 3 శాతానికిపైగా జంప్చేసింది. మరోవైపు టెలినార్, ఎయిర్టెల్ విలీన ఆమోదానికి గాను భారతి, టెలినార్ రెండూ కలిసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) ఢిల్లీ బెంచ్ వద్ద దరఖాస్తును దాఖలు చేశాయి. అలాగే ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టబద్ధమైన ఆమోదాన్ని కూడా పొందాల్సి ఉంది. కాగా ఫిబ్రవరి 23 న టెలినార్ ను కొనుగోలు చేయనున్నామని ఎయిర్ టెల్ భారత్ ప్రకటించింది. ఈ విలీనం ద్వారా రెవెన్యూ మార్కెట్ వాటాను 35 శాతానికి పెంచుకోవడమే కాకుండా గుజరాత్,మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో మరింత బలోపేతం కానున్నట్టు తెలిపింది. టెలికాం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక్క దెబ్బతో మిగతా టెలికాం కంపెనీలన్ని కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్, టెలినార్ విలీనం ప్రాధాన్యతను సంతరించుకోనుంది. జియో ఎంట్రీతో వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ కూడా విలీన బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుల ఊబిలో కూరుకు పోయిన ఆర్ కాం, ఎయిర్సెల్ వంటి ఇతర ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది. -
ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్: 1000జీబీ డేటా ఫ్రీ
ముంబై: దేశీయ టెలికాం మేజర్ భారతి ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్ను అందిస్తోంది. ఎయిర్ టెల్ బ్రాండ్ బ్యాండ్ కస్టమర్లకు అదనపు డేటా ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన బ్రాడ్బ్యాండ్ ప్లాన్స్లో అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తోంది. 1000 జీబీ ని ఉచితంగా అందిస్తోంది. ఏప్రిల్ 16 తరువాతి ఖాతాదారులకు, ఇప్పటికే బ్రాడ్బ్యాండ్ సేవలను అనుభవిస్తున్న కస్టమర్లు బోనస్ డేటాను పొందవచ్చు. ఈ 'బోనస్' ఆఫర్ ఎయిర్టెల్ వెబ్ పోర్టల్లో యాక్టివ్ గా ఉంది ఉదాహరణకు, ఢిల్లీలో రూ .899 ప్లాన్ 30 జీబీకి బదులుగా ప్రస్తుతం 60 వేగవంతమైన డేటాను అందిస్తోంది. రూ 1099 ప్లాన్లో ఇపుడు 90 జీబీ (గతంలో 50 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1299 ప్లాన్ లో 125 జీబీ (గతంలో 75 జీబీ) ఆఫర్ చేస్తోంది. రూ .1499 ప్లాన్ గతంలో 100 జీబీ డేటాతో పోలిస్తే 160 జీబీ అందిస్తోందిఈ భారీ ప్రయోజనాలను దాదాపు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంచింది. వెబ్సైట్ ప్రకారం రూ.899 ప్లాన్ తరవాతిప్లాన్లలో 1000 జీబీ ఉచితం.అలాగే ఈ ప్లాన్స్ అన్నింటిలోనే అన్లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్స్ ఉచితం. కాగా గత వారం, కంపెనీ తన బ్రాడ్ బ్యాండ్ ప్రణాళికలను రిఫ్రెష్ చేసింది. కొత్త ప్రణాళికల్లో ఎయిర్టెల్ హోమ్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు 100 శాతం అదనపు డేటాను అందిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ, ఏపీల్లో ఎయిర్టెల్ 4జీ అప్గ్రేడ్
దేశంలో అతిపెద్ద టెలీకమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ భారతీ ఎయిర్టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 4జీ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేసింది. టీడీ–ఎల్టీఈ (2300 ఎంహెచ్జెడ్ బాండ్), ఎఫ్డీ–ఎల్టీఈ (1800 ఎంహెచ్జెడ్) డ్యుయల్ కెరీర్ స్పెక్ట్రమ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని దీంతో కస్టమర్లు ప్రస్తుతమున్న దాని కంటే 20 ఎంహెచ్జెడ్ వేగంతో 4జీ సేవలను పొందొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
జియో దెబ్బకొట్టినా.. దూకుడుగా ఎయిర్ టెల్
టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ షేర్లు నేటి ట్రేడింగ్ లో మెరుపులు మెరిపించాయి. దూకుడుగా దూసుకుపోతూ 10 శాతం ర్యాలీ జరిపి, ఇంట్రాడేలో 380 రూపాయల గరిష్ట స్థాయిని తాకాయి. ఓ వైపు భారతీ ఎయిర్ టెల్ లాభాలకు రిలయన్స్ జియో భారీగా దెబ్బకొట్టినా బుధవారం మార్కెట్లో మాత్రం కంపెనీ షేర్లపై ఆ ప్రభావమే కనిపించలేదు. మంగళవారం ఫలితాలు ప్రకటించిన ఈ కంపెనీ లాభాల్లో పడిపోయినప్పటికీ, తన ఆఫ్రికన్ వ్యాపారాలు లాభాల్లో మరలినట్టు రిపోర్టు చేసింది. 2010లో ప్రారంభించిన ఈ ఆఫ్రికన్ వ్యాపారాలు మొదటిసారి లాభాల బాట పట్టడం కంపెనీ షేర్లకు భారీగా బూస్ట్ నిచ్చినట్టు అనాలిస్టులు చెప్పారు. జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఎయిర్ టెల్ తన లాభాలను 72 శాతం కోల్పోయినట్టు పేర్కొంది. లాభాల్లో భారీ క్షీణత ఉన్నప్పటికీ, కంపెనీ ఆఫ్రికన్ వ్యాపారాలు మాత్రం లాభాల బాట పట్టాయి. కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. అయితే స్థిరమైన కరెన్సీ విలువల్లో ఏడాది ఏడాదికి ఆఫ్రికన్ రెవెన్యూలు 2.6 శాతం పెరిగాయి. డేటా రెవెన్యూలు కూడా 14.5 శాతం పెరిగి 157 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. మొత్తం డేటా రెవెన్యూల్లో ఆఫ్రికన్ రెవెన్యూలు 17.7 శాతం ఉన్నట్టు భారతీ ఎయిర్ టెల్ ప్రకటించింది. -
ఎయిర్టెల్ లాభం 72% డౌన్
♦ తీవ్ర స్థాయిలో రిలయన్స్ జియో ప్రభావం ♦ వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిన నికర లాభం ♦ 12 శాతం తగ్గిన మొత్తం ఆదాయం; రూ.21,935 కోట్లు ♦ ఒక్కో షేర్కు రూ.1 డివిడెండ్ న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్ జియో ప్రభావం తీవ్రంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్లో ఎయిర్టెల్ నికర లాభం ఏకంగా 72 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2015–16) క్యూ4లో రూ.1,319 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.373 కోట్లకు తగ్గిందని ఎయిర్టెల్ తెలిపింది. రిలయన్స్ జియో పోటీ తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపించిందని కంపెనీ ఎండీ, సీఈఓ(భారత్, దక్షిణాసియా) గోపాల్ విఠల్ చెప్పారు. మొత్తం ఆదాయం రూ.24,960 కోట్ల నుంచి 12 శాతం తగ్గి రూ.21,935 కోట్లకు చేరిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరానికి గాను ఇక ఒక్కో షేర్కు రూ.1 తుది డివిడెండ్ను ఇవ్వనున్నామని తెలిపారు. జియో ఇన్కమింగ్ కాల్స్ సునామీ... కొత్తగా వచ్చిన రిలయన్స్ జియో ఆకర్షణీయమైన ఆఫర్ల కారణంగా నికర లాభం వరుసగా రెండో క్వార్టర్లోనూ క్షీణించిందని విఠల్ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ నికర లాభం 55 శాతం తగ్గిందన్నారు. మూలధన పెట్టుబడులను రూ.6,057 కోట్ల నుంచి రూ.3,808 కోట్లకు తగ్గించుకున్నప్పటికీ, నికర లాభంలో క్షీణత తప్పలేదని చెప్పారు. రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల కారణంగా ఇన్కమింగ్ కాల్స్ సునామీలా వెల్లువెత్తాయని చెప్పారు. తమ నెట్వర్క్లో ఈ ఇన్కమింగ్ ట్రాఫిక్ను తట్టుకోవడానికి చెప్పుకోదగ్గ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో ఆదాయం 7 శాతం తగ్గిందని, ఇబిటా మార్జిన్లు 2.9 శాతం మేర తగ్గిపోయాయని పేర్కొన్నారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధి రెండంకెల్లో ఉండేదని, గత ఆర్థిక సంవత్సరంలో కేవలం 3.6 శాతం వృద్ధినే సాధించామని పేర్కొన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2015–16లో రూ.6,077 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 38 శాతం తగ్గి రూ.3,800 కోట్లకు చేరింది. ఆదాయం 1 శాతం వృద్ధితో రూ.95,468 కోట్లకు పెరిగింది. కాగా మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వచ్చాయి. ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 1.7 శాతం క్షీణించి రూ.345 వద్ద ముగిసింది. జియోతో టెలికం వ్యవస్థ చిన్నాభిన్నం! ముకేష్ అంబానీ ప్రమోట్ చేస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది సెప్టెంబర్లో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లను ఆఫర్ చేసింది. మార్చిలో వాణిజ్యపరంగా కార్యకలాపాలు ప్రారంభించిన జియో మరింత దూకుడుగా తన ఆఫర్లను అందిస్తోంది. రిలయన్స్ జియో దూకుడు కారణంగా టెలికం కంపెనీలే కాకుండా మొత్తం టెలికం పరిశ్రమ ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్తం చేసిందని నిపుణులంటున్నారు. టెలికం పరిశ్రమ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా క్షీణించింది. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు టెలికం పరిశ్రమ బకాయిలు రూ.4.60 లక్షల కోట్లుగా ఉంటాయని అంచనా. ఫలితాలు కొన్ని ముఖ్యాంశాలు... ♦ ఈ ఏడాది మార్చి 31 నాటికి భారత్, దక్షిణాసియా, ఆఫ్రికాలో మొత్తం ఎయిర్టెల్ వినియోగదారుల సంఖ్య 35.6 కోట్లుగా ఉంది. ♦ మొత్తం ఆదాయంలో 77 శాతం ఉండే భారత్ మార్కెట్లో ఈ కంపెనీకి 27.4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ♦ నిర్వహణ లాభాన్ని సూచించే ఇబిటా 13 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.9,188 కోట్లుగా ఉన్న ఇబిటా గత ఆర్థిక సంవత్సరం(2016–17) క్యూ4లో రూ.7,993 కోట్లకు తగ్గింది. ♦ డేటా ఏఆర్పీయూ(యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్) 17 శాతం క్షీణించి రూ.162కు, వాయిస్ ఏఆర్పీయూ కూడా 17 శాతం తగ్గి రూ.114కు చేరాయి. -
ఫేస్బుక్ నుంచి ఎక్స్ప్రెస్ వై–ఫై
► భారతీ ఎయిర్టెల్తో జట్టు ► గ్రామీణ ప్రాంతాల్లో పబ్లిక్ హాట్స్పాట్స్ ఏర్పాటు ► ఉచిత ఫ్రీ–బేసిక్స్కు భిన్నంగా పెయిడ్ విధానంలో సేవలు న్యూఢిల్లీ: సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్ తాజాగా భారత్లోని గ్రామీణ ప్రాంతాల యూజర్లకు ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చే దిశగా ‘ఎక్స్ప్రెస్ వై–ఫై’ సర్వీసులు ఆవిష్కరించింది. గతంలో ప్రతిపాదించిన ఉచిత ఫ్రీ బేసిక్స్ ఇంటర్నెట్ సేవలకు భిన్నంగా దీన్ని పెయిడ్ విధానంలో అమలు చేయనుంది. ఇందుకోసం టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఎయిర్టెల్ రాబోయే కొన్ని నెలల్లో 20,000 పైచిలుకు వై–ఫై హాట్స్పాట్స్ ఏర్పాటు చేయనుంది. నిర్దిష్ట వెబ్సైట్స్కి మాత్రమే పరిమితమైన ఫ్రీ బేసిక్స్కు భిన్నంగా ఎక్స్ప్రెస్ వై–ఫైలో పోర్టల్స్పై ఎటువంటి పరిమితి ఉండదు. టెలికం ఆపరేటర్ల ద్వారా అందుబాటులో ఉండే పబ్లిక్ వై–ఫై హాట్స్పాట్స్ను ఉపయోగించుకునేందుకు యూజర్లు రోజువారీ, వారంవారీ, నెలవారీ డేటా ప్యాక్స్ను స్థానిక రిటైలర్స్ నుంచి కొనుగోలు చేయొచ్చు. నాలుగు రాష్ట్రాల్లో..: ఫేస్బుక్ ఎక్స్ప్రెస్ వై–ఫై సర్వీసును ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, మేఘాలయాలో 700 హాట్స్పాట్స్ ద్వారా అందిస్తారు. టారిఫ్లు, ప్లాన్ వేలిడిటీ అనేది ఆపరేటర్ను బట్టి ఆధారపడి ఉంటాయి. ఉత్తరాఖండ్లో ఎయిర్జల్దీ, రాజస్థాన్లో ఎల్ఎంఈఎస్, గుజరాత్లో టికోనా, మేఘాలయాలో షైల్ధర్ సంస్థలు ఐఎస్పీలుగా వ్యవహరిస్తాయి. ఎక్స్ప్రెస్ వై–ఫై ప్రస్తుతం కెన్యా, టాంజానియా, నైజీరియా, ఇండొనేషియా వంటి నాలుగు దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉంది. దేశీయంగా నెట్ వినియోగం తక్కువే.. 130 కోట్ల మంది జనాభా గల భారత్లో కేవలం 39 కోట్ల మంది మాత్రమే ఇంటర్నెట్కి అనుసంధానమై ఉన్నారని ఫేస్బుక్ ఆసియా పసిఫిక్ ప్రాంత కనెక్టివిటీ సొల్యూషన్స్ విభాగం హెడ్ మునీష్ సేథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయంగా మారుమూల ప్రాంతాలకు కూడా నెట్ను అం దుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో ఎక్స్ప్రెస్ వై–ఫై అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మిగతా భాగస్వాములంతా కూడా కలిస్తే విస్తరించేందుకు వీలు కాగలదన్నారు. ఈ సేవలకు సంబంధించి తాము ప్లాట్ఫామ్, సొల్యూషన్స్ మాత్రమే అందిస్తామని.. ఇందుకు గాను ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా టెలికం ఆపరేటర్, రిటైలర్ నుంచి ఎటువంటి చార్జీలు వసూలు చేయమని వివరించారు. డేటాకు సంబంధించిన చార్జీలు మొదలైనవి ఆపరేటర్ నిర్ణయిస్తారని సేథ్ తెలిపారు. ప్రస్తుతం ఫేస్బుక్ పలు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ (ఐఎస్పీ), 500 పైగా స్థానిక రిటైలర్లతో చేతులు కలిపినట్లు వివరించారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్తో కలిసి ఫేస్బుక్ 2015లో ఫ్రీ బేసిక్స్ పేరిట పరిమిత వెబ్సైట్స్తో ఉచిత ఇంటర్నెట్ సేవలు ప్రవేశపెట్టింది. -
ఎయిర్టెల్ కొత్త ప్లాన్స్... ఏంటవి?
జియో ఎంట్రీతో మొదలైన టెలికాం ఇండస్ట్రీలో బ్రాడు బ్యాండ్ స్పీడు, డేటా, కాలింగ్ ప్లాన్స్ లో వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరోసారి తన పోస్టు పెయిడ్ కస్టమర్ల ప్లాన్స్ ను సవరించింది. ప్రస్తుతం సవరించిన ప్లాన్స్ మైప్లాన్ ఇన్ఫీనిటీ కింద దేశవ్యాప్తంగా ఇన్ కమింగ్ కాల్స్ కు ఉచిత రోమింగ్ ప్రయోజనాలను అందించనుంది. రూ.299 ప్లాన్... అన్ని కనెక్షన్లకు 680 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ తో పాటు, 600 ఎంబీ 4జీ డేటాను కంపెనీ ఈ బిల్లింగ్ సైకిల్ లో ఆఫర్ చేయనుంది. రూ.399 ప్లాన్... ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ నిమిషాలను కంపెనీ 765కు పెంచింది. డేటా వాడకం కూడా ఈ బిల్లింగ్ సైకిల్ లో 1జీబీకి పెంచింది. ఈ రెండు ప్యాక్ ఆఫర్స్ కింద కంపెనీ ఉచిత రోమింగ్ ఇన్కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందించనుంది. అవుట్ గోయింగ్ లోకల్ కాల్స్ కు నిమిషానికి 80 పైసలను వసూలు చేయనుంది. అదే అవుట్ గోయింగ్ ఎస్టీడీ కాల్స్ కైతే, నిమిషానికి 1.15పైసల ఛార్జీ వేయనుంది. స్పీడ్ టెస్ట్ సర్వీసుల తనకు ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అనే టైటిల్ ఇచ్చిన సందర్భంగా కంపెనీ తన పోస్టు పెయిడ్ కస్టమర్లకు 6జీబీ నుంచి 30జీబీ డేటా ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఏప్రిల్ 30 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే ఈ కొత్త ప్లాన్స్ లో కంపెనీ అపరిమిత ప్రయోజనాలను కల్పించడం లేదు. 499 ప్లాన్ కిందనైతే, కంపెనీ అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్, 3జీబీ 4జీ డేటాను వంటివాటిని పొందవచ్చు. -
వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు!
వాస్తవ విరుద్దంగా ప్రకటనలు: ఏఎస్సీఐ న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 7 ప్రకటనను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా...? నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్ 7 కాదు. ఐఫోన్ 7ప్లస్. అంటే మెరుగైన ఉత్పత్తిని చూపిస్తూ వినియోగదారులను ఆకర్షించేలా ఈ ప్రకటన ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలా 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్ (ఏఎస్సీఐ) ప్రకటించింది. వీటిలో కోకకోలా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలవి సైతం ఉన్నాయి. మొబిక్విక్, హిందూస్తాన్ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి. -
ప్రీ డేటా ఓకే, కానీ క్వాలిటీ....
న్యూఢిల్లీ: మార్కెట్లో టెల్కోలను హడలెత్తిస్తున్న రిలయన్స్ జియోను తట్టుకునేందుకు, దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో తాకిడిని తట్టుకునేందుకు, ఎయిర్ టెల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం ఉచిత డేటా ప్రయోజనాలు ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకైతే ఏకంగా 30జీబీ వరకు ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఇలా ఇతర కంపెనీలు కూడా డేటా ప్రయోజనాలను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి. ఉచిత డేటాలనైతే కంపెనీలు ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా సర్వీసుల క్వాలిటీ గురించి ఊసైనా ఎత్తడం లేదు. ప్రమోసనల్ స్కీమ్స్ పై ఏ మేర క్వాలిటీ సర్వీసులు అందిస్తాయో కనీస గ్యారెంటీ ఇవ్వడం లేదు. ఆపరేటర్లు అందించే స్కీమ్ లకు, వారు అందించే డెలివరీకి చాలా గ్యాప్ ఉంటుందని, వాటిని సమీక్షించడానికి కనీసం ఎలాంటి మెకానిజం లేదని వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటరెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఎస్ఆర్ ఖన్నా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా సీరియస్ గా తీసుకుంటోంది. ప్రమోషనల్ ఆఫర్లో కూడా ఒకే విధమైన క్వాలిటీ సర్వీసులు అందించే విషయంపై ఆపరేటర్లతో చర్చించడానికి ట్రాయ్ ఈ వారంలో వారితో సమావేశమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్లలో క్వాలిటీ సర్వీసులు ఆందోళనను కలిగిస్తున్నాయని, ఉచితంగా సర్వీసులు అందించడమంటే నాసిరకంగా అందించడం కాదని ట్రాయ్ అధికారి అన్నారు. త్వరలోనే ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించి దీనిపై చర్చించనున్నామని చెప్పారు. అయితే ప్రమోషనల్ ఆఫర్లలో సర్వీసుల క్వాలిటీ నాసిరకంగా ఉన్నాయనే దాన్ని టెల్కోలు ఖండిస్తున్నాయి. -
‘ఎయిర్టెల్’ ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్
ధర రూ. 4,999 న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ గ్రూప్లో భాగమైన ఎయిర్టెల్ డిజిటల్ టీవీ తాజాగా ఆండ్రాయిడ్ ఆధారిత సెట్ టాప్ బాక్స్ను (ఎస్టీబీ) ప్రవేశపెట్టింది. దీంతో సాధారణ శాటిలైట్ టీవీ చానల్స్తో పాటు టీవీలోనే ఆన్లైన్ కంటెంట్ కూడా వీక్షించేందుకు వీలుంటుంది. కొత్త కస్టమర్స్ దీనికోసం రూ.4,999 చెల్లించాల్సి ఉంటుందని భారతీ ఎయిర్టెల్ సీఈవో (డీటీహెచ్) సునీల్ తల్దార్ తెలిపారు. ఎయిర్టెల్ డీటీహెచ్పై ఏడాదిపాటు 500 చానల్స్ సబ్స్క్రిప్షన్తో కొత్త కస్టమర్లు ఈ ఎస్టీబీని రూ.7,999కి కొనుగోలు చేయొచ్చని ఆయన వివరించారు. టీవీలో ఇంటర్నెట్ సదుపాయం కోసం వినియోగదారులు సాధారణ టీవీ రేటుకి మించి రూ.10,000–15,000 అధికంగా చెల్లించాల్సి వస్తోందని.. అయితే ఆన్లైన్, ఆఫ్లైన్ మాధ్యమాల మధ్య సరిహద్దు చెరిగిపోతున్న నేపథ్యంలో ఒకే డివైజ్పై రెండింటి ప్రయోజనాలు అందించాలన్న లక్ష్యంతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. ఎయిర్టెల్ ఇంటర్నెట్ టీవీ ఎస్టీబీలో మూవీ అప్లికేషన్ నెట్ఫ్లిక్స్ ప్రీలోడెడ్ ఉంటుంది. యూట్యూబ్ వీడియోలను ఇందులో చూసుకోవచ్చు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఇతరత్రా యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎస్టీబీని కొనుగోలు చేసే తమ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులకు మరింత అధికంగా డేటా కూడా ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఇంటర్నెట్ టీవీ ఎస్టీబీకి కనీసం 4 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్ ఉండే బ్రాడ్బ్యాండ్ లేదా 4జీ హాట్స్పాట్ అవసరమవుతుంది. -
ట్రాయ్ ఎఫెక్ట్: ఎయిర్టెల్, ఐడియా షేర్లు రయ్
ముంబై: ఉచిత ఆఫర్లతో సునామిలా దూసుకొచ్చిన రిలయన్స్ జియోకు టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ అనూహ్యంగా చెక్ పెట్టడం దేశీయ టెలికాం ఆపరేటర్లకు బాగా కలిసి వచ్చింది. జియో తాజా సమ్మర్ సర్ప్రైజ్ ఉచిత ఆఫర్లను నిలిపివేయాలంటూ ట్రాయ్ ఆ దేశించడంతో ప్రత్యర్థి సంస్థలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా భారతి ఎయిర్ టెల్, ఐడియా తదితర మేజర్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. శుక్రవారం నాటిమార్కెట్లో మదుపర్లు టెలి కాం ఇండెక్స్ లో కొనుగోళ్లవైపు మొగ్గు చూపారు. ఒకవైపు దలాల్ స్ట్రీట్ నష్టాల పాలవుతుండగా టెలికాం షేర్లు మాత్రం లాభాలనార్జించడం విశేషం. భారతి ఎయిర్ టెల్ దాదాపు 3 శాతంపైగా జంప్చేసిటాప్ గెయినర్గా నిలిచింది. ఇదే బాటలో ఐడియా సెల్యులర్ పయనిస్తూ 2 శాతానికిపైగా పుంజుకుంది. మరోవైపు ఇటీవలి రికార్డ్స్తాయి లాభాలను పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతానిపైగా నష్టపోయింది. కాగా ఇటీవల టారిఫ్లలోకి ఎంట్రీ ఇచ్చిన జియో తన ప్రైమ్ మెంబర్షిప్ పథకంలో ఉచిత ఆఫర్ను మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించి ప్రత్యర్థి కంపెనీలపై బాంబు వేసింది. అయితే జియో తాజా ఆఫర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, తక్షణమే నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
జియో సమ్మర్ ఎఫెక్ట్: టెలికాం స్టాక్స్ ఢమాల్
ఉచిత ఆఫర్లకు స్వస్తి చెప్పి, ఇక టారిఫ్ లు అమలు చేయబోతుందనుకున్న రిలయన్స్ జియో ఇచ్చిన సమ్మర్ సర్ప్రైజ్ ఎఫెక్ట్ టెలికాం దిగ్గజాలను తాకింది. జియో ప్రైమ్ ఆఫర్ గడువును మరో 15 పొడిగింపుతో పాటు, ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకున్న వారికి రూ.303 రీఛార్జ్ తో మరో మూడు నెలల పాటు కాంప్లిమెంటరీ సర్వీసుల కింద ఉచితంగా సేవలందించనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించడంతో ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లలో ఆందోళన ప్రారంభమైంది. దీంతో టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలో 3 శాతానికి పైగా పడిపోయాయి. సంచలనకరమైన జియో డేటా ఆఫర్లతో, ఉచిత కాల్స్ పై తమ బిజినెస్ అవుట్ లుక్ ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో జియోలో పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో జియో షేర్లు 52 వారాల గరిష్టంలో 4.5 శాతం పైకి ఎగిసి రూ.1,380.50 వద్ద నమోదవుతోంది. ప్రైమ్ మెంబర్ షిప్ లో ఇప్పటికే 7 కోట్ల మంది కస్టమర్లను ఛేదించామని కంపెనీ ప్రకటించేసింది. ఈ ప్రకటన రిలయన్స్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్ గా.. ఇతర టెలికాం కంపెనీల ఇన్వెస్టర్లకు ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర 3.60 శాతం పైగా లాభాల్లో ట్రేడవుతుండగా.. ఐడియా సెల్యులార్ షేరు ధర 0.82 శాతం, ఎయిర్ టెల్ షేరు ధర 2.87 శాతం, వొడాఫోన్ 0.33 శాతం, భారతీ ఇన్ఫ్రాటెల్ 1.47శాతం నష్టాల్లో రన్ అవుతున్నాయి. -
‘నెట్వర్క్’ ప్రకటనలపై ఎయిర్టెల్కు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ‘అధికారికంగా’ అత్యంత వేగవంతమైన నెట్వర్క్ ప్రకటనల విషయంలో టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇవి తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయంటూ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆస్కీ ఆక్షేపించింది. ఏప్రిల్ 11లో ఈ ప్రకటనలను మార్చాలని లేదా ఉపసంహరించాలని సూచించింది. ఎయిర్టెల్ నెట్వర్క్ అత్యంత వేగవంతమైనదంటూ కన్సల్టెన్సీ సంస్థ ఊక్లా ఇచ్చిన సర్టిఫికెట్కు ఊతంగా సరైన ఆధారాలేమీ లేవని ఆస్కీ ఫాస్ట్ ట్రాక్ కంప్లయింట్స్ కమిటీ (ఎఫ్టీసీసీ) అభిప్రాయపడింది. ఎయిర్టెల్ ప్రకటనలపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఫిర్యాదును సమర్ధిస్తూ ఎఫ్టీసీసీ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ఎయిర్టెల్ ప్రకటనలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. మరోవైపు ఎఫ్టీసీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని భారతి ఎయిర్టెల్ తెలిపింది. దీనిపై అప్పీలు చేయనున్నట్లు వివరించింది. మొబైల్ స్పీడ్ టెస్టులు నిర్వహించే అంతర్జాతీయ సంస్థ ఊక్లా నిర్ధారించిన వాస్తవిక అంశాల అధారంగానే తమ ప్రకటనలు రూపొందించినట్లు, ఆ వివరాలు ఆస్కీకి కూడా సమర్పించినట్లు ఎయిర్టెల్ పేర్కొంది. -
భారతీ ఇన్ఫ్రాటెల్లో 10% వాటా విక్రయం
► కేకేఆర్, సీపీపీఐబీలకు అమ్మేసిన భారతీ ఎయిర్టెల్ ► ఒప్పందం విలువ రూ.6,194 కోట్లు న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ.. భారతీ ఎయిర్టెల్ తన మొబైల్ టవర్ల విభాగం భారతీ ఇన్ఫ్రాటెల్లో 10.3 శాతం వాటాను విక్రయించింది. ఈ వాటాను కేకేఆర్, కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) కన్సార్షియమ్కు రూ.6,193.9 కోట్లకు విక్రయించామని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. 10.3 శాతం వాటాకు సమానమైన 19 కోట్లకు పైగా షేర్లను ఒక్కో షేర్ను రూ.325 సగటు ధరకు విక్రయించామని వివరించింది. ఈ వాటా విక్రయం కారణంగా వచ్చిన నిధులను రుణభారం తగ్గించుకోవడానికి వినియోగించాలని ఎయిర్టెల్ కంపెనీ భావిస్తోంది. ఈ వాటా విక్రయానంతరం భారతీ ఇన్ఫ్రాటెల్లో భారతీ ఎయిర్టెల్కు 61.7 శాతం వాటా, కేకేఆర్, సీపీపీఐబీకు 10.3 శాతం చొప్పున వాటాలుంటాయి. భారత వృద్ధిపై, భారత ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమ ప్రయత్నాలపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక నిదర్శనమని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్భారతీ మిట్టల్ వ్యాఖ్యానించారు. టెలికం మౌలిక రంగం భవిష్యత్తు సానుకూలంగా ఉండనున్నదనడానికి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ ఒక ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. కాగా కేకేఆర్ సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్లో ఇన్వెస్ట్ చేయడం ఇది రెండోసారి. గతంలో అంటే 2008–15 కాలంలో కేకేఆర్ నిర్వహణలోని కొన్ని ఫండ్స్ భారతీ ఇన్ఫ్రాటెల్లో కొంత వాటాను కొనుగోలు చేశాయి. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో భారతీ ఇన్ఫ్రాటెల్ షేరు ధర మంగళవారం 2 శాతం లాభంతో రూ.319 వద్ద ముగిసింది. -
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సియల్, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ తన 9100 లెవల్ను పునరుద్ధరించుకుని, 9111 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 92.48 పాయింట్ల లాభంలో 29,424 వద్ద కొనసాగుతోంది. ఇంటర్నెట్ సంస్థ టికోనా నెట్ వర్క్స్కు చెందిన 4జీ వ్యాపారాన్ని టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ సొంతం చేసుకోవడంతో, ఈ కంపెనీ షేర్లు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ప్రారంభ ట్రేడింగ్ లో 2 శాతం పైగా పైకి ఎగిశాయి. ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 1.67 శాతం పెరిగాయి. వాటితో పాటు కోల్ ఇండియా, ఐటీసీలు కూడా లాభపడ్డాయి. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం ఒబామాకేర్ బిల్లుకు రీప్లేస్గా తీసుకురాబోతున్న బిల్లుపై ఓటింగ్ ను రిపబ్లికన్ చట్టసభ్యులు వాయిదా వేశారు. దీంతో ఎన్నికల సందర్భంగా ట్రంప్ ఇచ్చిన హామీలను ఆయన నెరవేరుస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. ఈ సందిగ్ధతతో ఆసియన్ మార్కెట్లు స్తబ్ధుగా ట్రేడవుతున్నాయి. అటు డాలర్ విలువ కూడా నాలుగు నెలల కనిష్టంలో ట్రేడైంది.. డాలర్ కనిష్టంతో రూపాయి మారకం విలువ పుంజుకుని 65.48గా ప్రారంభమైంది. -
ఎయిర్టెల్ మరో భారీ డీల్
ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్ టెల్ కీలక అడుగు వేసింది. భారత్లో 4జీ ఇంటర్నెట్ సేవల్ని మరింత వేగంగా అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ దేశీయ బ్రాడ్బాండ్ సేవల సంస్థ టికోనా ను కొనుగోలు చేయనుంది. రూ.1600కోట్లతో టికోనా 4జీ బిజినెస్ను స్వాధీనం చేసుకోనుంది. టికోనా 4జీ డిజిటల్ నెట్వర్క్ బిజినెస్ను కొనుగోలు చేయనున్నట్టు ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.1600కోట్లుగా తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా టికోనా బ్రాడ్ బాండ్ వైర్లెస్ యాక్సెస్ స్పెక్ట్రం సహా, ఐదు టెలికాం సర్కిల్స్లో 350 సైట్లు తమ సొంతంకానున్నట్టు ఎయిర్టెల్ మార్కెట్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో పేర్కొంది. కాగా ఒకవైపు జియో ఉచిత సేవల ఎంట్రీతో రిలయన్స్ జియో సునామీ సృష్టిస్తే.. వొడాఫోన్, ఐడియా మెగామెర్జర్ టెలికాం పరిశ్రమలో సంచలనం మారింది. భారతీ ఎయిర్టెల్ నార్వే ఆధారిత టెలినార్ భారత వ్యాపార కొనుగోలు ప్రణాళికలను ప్రకటించింది. మరోవైపు ఈ పోటీని తట్టుకునేందుకు ఎయిర్ టెల్ టికోనాతో నిశ్చయాతమ్మకం ఒప్పందం చేసుకోవడం విశేషం. జియో ఎంట్రీ స్వదేశీ ఒప్పందాలు, విదేశీ సంస్థ నిష్క్రమణకు ఉత్ర్పేరకంగా నిలిచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధం: జియో
టెలికాం కంపెనీల మధ్య వార్ ఇప్పట్లో సమసిపోయేటట్లు కనిపించడం లేదు. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ పై రిలయన్స్ జియో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలోనే తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్ టెల్ తప్పుదోవపట్టిస్తుందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కుట్రలు పన్నుతూ ఎయిర్ టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపింది. ఈ విషయంపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదుచేసింది. ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధమని, తప్పుడుదోవ పట్టిస్తుందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమకు ఊక్లా రేటింగ్ ఇచ్చిందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రకటనలో కూడా అన్ని క్లియర్ గా పేర్కొన్నామని చెప్పారు. ఊక్లా తన పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్లు వాడే మోడరన్ డివైజస్ లోకి లాగిన్ అయి, లక్షల కొలదీ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లను నిర్వహిస్తుందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని మొబైల్ టెస్ట్ లు దీనిలో కలిసి ఉంటాయన్నారు. అయితే ఊక్లా డబ్బుల తీసుకుని ఇలాంటి అవార్డులు ఇస్తుందని ముఖేష్ అంబానీ సంస్థ జియో ఆరోపిస్తోంది. ఊక్లాకు లీగల్ నోటీసు పంపుతామని తెలిపింది. ఊక్లా బ్రాండ్ బ్యాండ్ టెస్టింగ్, వెబ్ ఆధారిత నెట్ వర్క్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ లో గ్లోబల్ లీడర్. -
జియో టారిఫ్లు దూకుడుగా ఉన్నాయి: మిట్టల్
బార్సిలోనా: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన టారిఫ్ ప్లాన్స్ దూకుడుగా ఉన్నాయని దేశీ దిగ్గజ మొబైల్ ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ పేర్కొంది. దీనికి స్పందనగా పరిశ్రమ మరిన్ని కాంపిటీటివ్ ప్లాన్స్తో, అదనపు డేటాతో జియోని ఎదుర్కొవలసి ఉందని తెలిపింది. ‘జియో ప్రకటించిన టారిఫ్లకు ప్రతిగా మేము యూజర్లకు ఎక్కువ ప్యాకేజీలు అందించాలి. అధిక డేటాను అఫర్ చేయాలి’ అని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఆయన ఇక్కడ జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో మాట్లాడారు. జియో తన సర్వీసులకు ఏప్రిల్ 1 నుంచి చార్జీలను వసూలు చేయడం టెల్కోలకు శుభవార్తని తెలిపారు. అయితే ఇంతటితోనే టారిఫ్ల యుద్ధం ముగియలేదన్నారు. ‘జియో తన రూ.303 టారిఫ్లో యూజర్లకు రోజుకు ఒక జీబీ డేటా ఇవ్వనుంది. ఇది చాలా తక్కువ ధర. ఉచిత సర్వీసులకు కన్నా ఇది నయం’ అని పేర్కొన్నారు. ఎయిర్టెల్ బ్యాలెన్స్ షీట్ చాలా పటిష్టంగా ఉందని, మార్కెట్లోని తీవ్రమైన పోటీ కారణంగా తాము నష్టాల్లోకి వెళతామని భావించడం లేదని తెలిపారు. 2018 మార్చి వరకు కంపెనీ ఆదాయంపై జియో ప్రభావం ఉండొచ్చని అంచనా వేశారు. -
ఎయిర్టెల్ నేషనల్ రోమింగ్ చార్జీలు తొలగింపు
⇒ 90% తగ్గిన ఇంటర్నేషనల్ కాల్ రేట్స్ ⇒ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి... న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కంపెనీ నేషనల్ రోమింగ్ చార్జీలను పూర్తిగా తొలగించింది. భారత్లో రోమింగ్కు సంబంధించి అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా వినియోగంపై అన్ని రోమింగ్ చార్జీలను తొలగిస్తున్నట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. అంతర్జాతీయ కాల్ రేట్లను 90 శాతం, డేటా చార్జీలను 99 శాతం తగ్గించామని భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈఓ (ఇండియా, సౌత్ ఏషియా) గోపాల్ విట్టల్ చెప్పారు. ఇప్పుడు అంతర్జాతీయ కాల్స్ నిమిషానికి కనిష్టంగా రూ.3, డేటా చార్జీలు ఒక్క ఎంబీకి రూ.3 చొప్పున ఉంటాయని పేర్కొన్నారు. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. ఇటీవలే రంగంలోకి వచ్చిన రిలయన్స్ జియో పోటీని తట్టుకోవడానికి ఎయిర్టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో ఎక్కడ నుంచి ఎక్కడికైనా తమ వినియోగదారులు రోమింగ్ చార్జీలు లేకుండా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చని గోపాల్ విట్టల్ చెప్పారు. నేషనల్ రోమింగ్లో ఉన్నప్పుడు అదనపు డేటా చార్జీలు కూడా ఉండవని, తమ వినియోగదారులకు ఇప్పుడు దేశం మొత్తం లోకల్ నెట్వర్క్లాగానే ఉంటుందని వివరించారు. ఆనలాగ్ ప్రపంచంలో నియంత్రణ సంస్థలు... బార్సిలోనా: పలు నియంత్రణ సంస్థలు ఇంకా అనలాగ్ ప్రపంచంలోనే ఉన్నాయని బారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. కంపెనీలు ఎక్కువగా ఉంటే, పోటీ తీవ్రంగా ఉంటుందనుకోవడం సరికాదన్నారు. చిన్న దేశాల్లో 2, పెద్ద దేశాల్లో అయితే మూడే టెలికం కంపెనీలుండాలని సూచిం చారు. బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో ఆయన మాట్లాడారు. ఎయిర్టెల్ టెలినార్ను కొనుగోలు చేయడం, ఐడియా, వొడాఫోన్ల విలీన వార్తల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
-
మార్కెట్లో దూసుకెళ్తున్న టెలికాం దిగ్గజాలు
టెలికాం దిగ్గజాలు భారతీ ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్లు గురువారం ట్రేడింగ్ లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. మార్నింగ్ ట్రేడింగ్లో టెలికాం సర్వీసు ప్రొవైడర్ షేర్లు 11 శాతం మేర పైకి దూసుకెళ్లాయి. పోస్టు టెలినార్ డీల్ అనంతరం దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్ వర్క్ గా పేరున్న భారతీ ఎయిర్ టెల్ 52 వారాల గరిష్టంలో 11 శాతం పైకి ఎగిసి, రూ.397 వద్ద ట్రేడైంది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించడంతో షేర్లు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. ఈ కొనుగోలు ఒప్పందంతో ఏడు సర్కిళ్లలో టెలికాం ఇండియా ఆపరేషన్లు ఇక ఎయిర్ టెల్ సొంతం కానున్నాయి. 1800 మెగాహెడ్జ్ బ్యాండ్లో అదనంగా 43.4 మెగాహెడ్జ్ స్పెక్ట్రమ్ దీనికి లభించనుంది. ఉదయం 9.35 సమయంలో 7 శాతం పైకి ట్రేడయిన ఎయిర్ టెల్, తొలి 25 నిమిషాల్లో 11.28 మిలియన్ షేర్లు చేతులు మారడంతో మరింత పైకి ఎగిసింది. అదేవిధంగా ఐడియా సెల్యులార్ కూడా 6 శాతం పైకి జంప్ చేసి, రూ.120 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా 5.31 శాతం ర్యాలీ నిర్వహిస్తోంది.. -
జియో ఎఫెక్ట్ : మరో విలీనం కన్ఫార్మ్
ముంబై: జియో ఎఫెక్ట్తో టెలికాం ఇండస్ట్రీలో మరో విలీనం కన్ ఫార్మ్ అయిపోయింది. మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్ లను టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్ టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది. టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్ లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్ టెల్ భావిస్తోంది. అయితే ఎంతమొత్తంలో కొనుగోలు చేయబోతుందో, ఒక్కో షేరుకు ఎంత చెల్లించనుందో బీఎస్ఈ ఫైలింగ్ లో ఎయిర్ టెల్ తెలుపలేదు. అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్ టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది. వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్ స్క్రైబర్ బేస్ లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది. టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్ టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్స్రైబర్లు ఉన్నారు. -
జియోపై దిగ్గజాల కౌంటర్ అటాక్
డేటా రేట్ల కోత దిశగా అడుగులు కోల్ కత్తా : దాదాపు దశాబ్దం తర్వాత టెలికాం పరిశ్రమలోకి అడుగుపెట్టిన రిలయన్స్ జియో దిగ్గజాలను ఓ కుదుపు కుదిపేస్తోంది. తాజాగా జియో టారిఫ్ ప్లాన్స్ అమల్లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ, ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. దీంతో టెల్కోలు తమ హై ఎండ్ కస్టమర్లను అలానే అట్టిపెట్టుకోవడానికి, జియోకు కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్లు వెంటనే డేటా రేట్ల కోతకు పిలుపు ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రి విశ్లేషకులు చెబుతున్నారు. రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు, నెలకు మరో రూ.303లు చెల్లిస్తే హ్యాపీ న్యూఇయర్ కింద ప్రస్తుతం లభిస్తున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు. ఈ తాజా ప్రకటనతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా టాప్-ఎండ్ కస్టమర్లు, ఇప్పటికే జియోను రెండో సిమ్ గా వాడుతున్న వారిని అంబానీ టార్గెట్ చేసినట్టు తెలిసింది. దీంతో తమ టాప్-ఎండ్ కస్టమర్లను కాపాడుకోవడంలో టెల్కోలు సిద్ధమయ్యాయి. ఈ టాప్-ఎండ్ కస్టమర్లే టెల్కోలకు 60 శాతం రెవెన్యూలకు పైగా అందిస్తున్నాయని ఓ సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ చెప్పారు. ప్రస్తుతం టెల్కోలు అందిస్తున్న డేటా ఛార్జీలు ఎయిర్ టెల్ : రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటా వొడాఫోన్ : రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటా ఐడియా : రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటా 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటా బీఎస్ఎన్ఎల్ : రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటా వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రస్తుత కస్టమర్లకే అందనుంది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనున్నట్టు రిలయన్స్ అధినేత ప్రకటించారు. దీంతో దిగ్గజాలు సైతం పైన పేర్కొన్న డేటా రేట్లను మరింత తగ్గించేందుకు యోచిస్తున్నాయి. -
ఎయిర్టెల్పై భారీ జరిమానా విధించండి
ట్రాయ్కు రిలయన్స్ జియో ఫిర్యాదు న్యూఢిల్లీ: వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా భారతీ ఎయిర్టెల్ ప్రకటనలు ఇస్తోందని రిలయన్స్జియో టెలికం నియంత్రణ సంస్థ, ట్రాయ్కు ఫిర్యాదు చేసింది. ప్రమోషన్ ఆఫర్లలో అందించే డేటా గురించి ఎయిర్టెల్ అతిగా ప్రచారం చేస్తోందని, తప్పుదోవ పట్టించేలా టారిఫ్ యాడ్స్ను ఇస్తోందని రిలయన్స్ జియో పేర్కొంది. అందుకని భారతీ ఎయిర్టెల్పై అధిక మొత్తంలో జరిమానా విధించాలని పేర్కొంది. ఫ్రీ యూసేజ్ పాలసీ(ఎఫ్యూపీ) గురించి ప్రకటనల్లో ఎయిర్టెల్ కంపెనీ ఎక్కడా ప్రస్తావించడం లేదని, ఎవరైనా ఫోన్ చేస్తేనే, కాల్సెంటర్లో వివరణ ఇస్తున్నారని తెలిపింది. ఇది ట్రాయ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. -
జియో ఎఫెక్ట్: భారీగా కుదేలైన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో నుంచి వస్తున్న ఉచిత ఆఫర్ల పోటీని తట్టుకోలేక టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కుదేలైంది. అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54 శాతానికి పైగా దిగజారి రూ.503.7 కోట్లగా నమోదయ్యాయి. గత ఆర్థికసంవత్సరంలో ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,108.1 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీ ఏకీకృత ఆదాయం కూడా 3 శాతం క్షీణించి రూ.23,363.9 కోట్లగా నమోదైనట్టు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్, ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తుందని, దీంతో కంపెనీ ఇరకాటంలో పడినట్టు భారతీ ఎయిర్టెల్ భారత, దక్షిణాసియా ఎండీ, సీఈవో గోపాల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల యేటికేటికి ఆర్జించే రెవెన్యూలను ఊహించని విధంగా కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. మార్జిన్లపై ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు. ఇది టెలికాం రంగంలో ఫైనాన్సియల్ హెల్త్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మిట్టల్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జియో గతేడాది సెప్టెంబర్ నుంచి ఉచిత 4జీ సర్వీసులను అందిస్తూ టెలికాం కంపెనీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కంపెనీ తన ఉచిత సర్వీసులను మరోసారి 2017 మార్చి 31 వరకు పొడిగించింది. జియో దెబ్బకు కంపెనీలు సతమవుతున్నాయి. ఏకీకృత మొబైల్ డేటా రెవెన్యూలు కూడా ఎయిర్టెల్కు ఫ్లాట్గా నమోదయ్యాయి. ఈ రెవెన్యూలు రూ.4,049 కోట్లగా ఉన్నాయి. అయితే ఇదే సమయంలో కంపెనీ రెవెన్యూ మార్కెట్ షేరు 33 శాతం గరిష్టానికి చేరుకుందట. నైజీరియా కరెన్సీ డివాల్యుయేషన్ కూడా ఆఫ్రికాలో కంపెనీపై ప్రభావం చూపినట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
టెలినార్ ఇండియాపై ఎయిర్టెల్ కన్ను
డీల్ విలువ 350 మిలియన్ డాలర్లు! న్యూఢిల్లీ: నార్వే టెలికం సంస్థ టెలినార్కి భారత్లో ఉన్న వ్యాపార కార్యకలాపాలను కొనుగోలు చేయాలని భారతీ ఎయిర్టెల్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి టెలినార్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు 350 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని అంచనా. టెలినార్ ఇండియా రుణభారంలో సగం తాము, మిగతాది ఆ కంపెనీ మాతృ సంస్థ భరించేలా ఎయిర్టెల్ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. జనవరి ఆఖరు నాటికి ఒప్పందం పూర్తి కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాలు, ప్రత్యర్థి సంస్థల నుంచి తీవ్రమైన పోటీ తదితర అంశాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని టెలినార్ కొన్నాళ్లుగా యోచిస్తోంది. భారత కార్యకలాపాలను విక్రయించేందుకు ఐడియాతోనూ టెలినార్ చర్చలు జరిపినట్లు సమాచారం. టెలినార్ ఇండియాకు 7 సర్కిళ్లలో 4జీ స్పెక్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్లో కంపెనీ 2జీ సేవలు అందిస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి టెలినార్ ఇండియా .. ప్రభుత్వానికి రూ.1900 కోట్ల దాకా, రుణం రూపంలో ఆర్థిక సంస్థలకు రూ. 1,800 కోట్లు బకాయిపడింది. కంపెనీకి దాదాపు 5.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. -
ఎయిర్టెల్ చేతికి ఓరాస్కామ్ వాటా
ఎయిర్టెల్ గ్లోబల్ నెట్వర్క్ మరింత పటిష్టం న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ అనుబంధ సంస్థ, నెట్వర్క్ ఐ2ఐ, ఈజిప్ట్కు చెందిన ఒరాస్కామ్కు చెందిన ఎంఈఎన్ఏలోని పూర్తి వాటాను కొనుగోలు చేయనున్నది. మిడిల్ ఈస్ట్ నార్త్ఆఫ్రికా సబ్మెరైన్ కేబుల్ సిస్టమ్స్(ఎంఈఎన్ఏ–ఎస్సీఎస్)లో ఒరాస్కామ్కు చెందిన పూర్తి వాటాను కొనుగోలు చేయడానికి నెట్వర్క్ ఐ2ఐ ఒప్పందం కుదుర్చుకుంది. డీల్కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఒరాస్కామ్ టెలికం మీడియా అండ్ టెక్నాలజీ హోల్డింగ్ ఎస్ఏఈతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని భారతీ ఎయిర్టెల్ డైరెక్టర్ అజయ్ చిత్కారా పేర్కొన్నారు. భారత్, ఆఫ్రికా వంటి వృద్ధి చెందుతున్న దేశాల్లో డేటా వినియోగం జోరుగా పెరుగుతోందని, ఎంఈఎన్ఏ వాటా కొనుగోలు చేయడంతో వినియోగదారులకు మరింత మన్నికైన సేవలందించగలమని వివరించారు. ప్రస్తుతం ఎయిర్టెల్ 5 ఖండాల్లో, 50 దేశాల్లో 2,25,000 రూట్ కిమీ. నెట్వర్క్ను నిర్వహిస్తోంది. ఎంఈఎన్ఏ–ఎస్సీఎస్ కొనుగోలుతో ఎయిర్టెల్ గ్లోబల్ నెట్వర్క్ మరింతగా పటిష్టమవుతుంది. -
25 నిమిషాల ఆ స్పీచ్కు రూ.3000 కోట్లు ఆవిరి!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 25 నిమిషాల స్పీచ్కు మేజర్ టెలికాం స్టాక్స్ అన్నీ గజగజలాడాయి. రిలయన్స్ జియో అందిస్తున్న ఉచిత సేవల ఆఫర్ మరో మూడు నెలల పాటు అంటే వచ్చే ఏడాది మార్చి 31వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించగానే దిగ్గజ టెలికాం స్టాక్స్ అన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో టెలికాం దిగ్గజాల మార్కెట్ విలువ రూ.3000 కోట్లు ఆవిరైపోయింది. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 1.66 శాతం, ఐడియా సెల్యులార్ 5.93 శాతం, రిలయన్స్ కమ్యూనికేషన్ 5.05 శాతం కుదేలయ్యాయి. ఈ సమయంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 శాతం లాభపడింది. ఒకటిన్నర మధ్యలో రూ.324గా ట్రేడ్ అయిన ఎయిర్టెల్ షేర్లు, ముఖేష్ స్పీచ్ ప్రారంభం కాగనే రూ.318.3కు దిగొచ్చాయి. దీంతో ఆ కంపెనీ మార్కెట్ విలువ రూ.2,276 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. అదేవిధంగా 76.60గా ట్రేడ్ అయిన ఐడియా సెల్యులార్ షేర్లు కూడా ముఖేష్ స్పీచ్తో రూ.74.20కి పడిపోయాయి. ఈ కంపెనీ కూడా రూ.792 కోట్లను మార్కెట్ విలువను పోగొట్టుకుంది. నేడు దేశీయ మార్కెట్లో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ భారీగా నష్టపోయినట్టు మార్కెట్ విశ్లేషకులు చెప్పారు. టెలికాం కంపెనీల మధ్య పోటీ తీవ్రతరమవుతుందని వారు పేర్కొన్నారు. సంచలమైన ఆఫర్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు(సెప్టెంబర్1న) కూడా ఎయిర్టెల్, ఐడియా షేర్ల మార్కెట్ విలువ భారీగా కోల్పోయినట్టు, రూ.16,000కోట్లు తుడిచిపెట్టుకుపోయినట్టు వెల్లడించారు. మరోసారి హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద జియో సేవలను పొడిగించనున్నట్టు సంచలనమైన ప్రకటనను వాటాదారుల సమావేశంలో గురువారం రిలయన్స్ అధినేత వెల్లడించడంతో ఈ కంపెనీలు భారీగా నష్టపోయాయి. రూ.3000 కోట్ల మేర మార్కెట్ విలువను కోల్పోయాయి. -
ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు షురూ!
• రాజస్థాన్ నుంచి సేవలు ఆరంభం • త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి • పొదుపు ఖాతా నిల్వలపై 7.25% వడ్డీ న్యూఢిల్లీ: టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్టెల్ అవుట్లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్టెల్ అవుట్లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది. నిమిషాల్లో బ్యాంకు ఖాతా పేపర్తో పనిలేకుండా ఆధార్ ఈ కేవైసీ ఆధారంగా సత్వరమే ఖాతా ప్రారంభించవచ్చు. ఖాతాదారుల ఎరుుర్టెల్ మొబైల్ నంబరే వారి ఖాతా నంబర్గానూ పనిచేస్తుంది. సేవింగ్స ఖాతాలోని నగదు నిల్వలపై వార్షికంగా 7.25 శాతం వడ్డీని కంపెనీ చెల్లిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఖాతాకై నా నగదును బదిలీ చేసుకునే సౌకర్యం ఉంది. ఎరుుర్టెల్ నుంచి ఎరుుర్టెల్ నంబర్లకు ఉచితంగా నగదు బదిలీ చేసుకోవచ్చు. ప్రతి సేవింగ్స ఖాతాదారుడికి రూ.లక్ష మేరకు వ్యక్తిగత ప్రమాద బీమా ఉచితంగా అందిస్తారు. ఎరుుర్టెల్ మొబైల్ కస్టమర్లు తమ స్మార్ట్ఫోన్లలో ఎరుుర్టెల్ మనీ యాప్ ద్వారా పేమెంట్ బ్యాంకు సేవలు పొందవచ్చు. లేదా ూ400ు కోడ్ను తమ మొబైల్లో టైప్ చేయడం ద్వారా, 400 నంబర్కు కాల్ చేయడం ద్వారా కూడా సేవలు పొందవచ్చు. నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు.. దేశవ్యాప్తంగా పేమెంట్ బ్యాంకు సేవలు పూర్తి స్థారుులో ప్రారంభించే ముందు రాజస్థాన్లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టినట్టు కంపెనీ తెలియజేసింది. దీని ద్వారా తమ నిర్వహణ సామర్థ్యాన్ని పరీక్షించుకోనున్నట్లు ఎరుుర్టెల్ పేమెంట్ బ్యాంకు ఎండీ, సీఈవో శశి అరోరా చెప్పారు. వ్యాపారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా సురక్షిత విధానంలో ఎరుుర్టెల్ బ్యాంకు నుంచి డిజిటల్ రూపంలో చెల్లింపులను స్వీకరించవచ్చని, నగదు రహిత వస్తు, సేవలను అందించవచ్చని ఎరుుర్టెల్ సూచించింది. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్లో తమ బ్యాంకు నెట్వర్క్ పరిధిలో దుకాణాల సంఖ్యను లక్షకు విస్తరించనున్నట్టు కంపెనీ పేర్కొంది. ఎరుుర్టెల్ పేమెంట్ బ్యాంకు సేవలు ప్రధాని సంకల్పమైన అందరికీ ఆర్థిక సేవలు, డిజిటల్ ఇండియాకు అనుకూలమని, బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వారికి ప్రయోజనకరమని రాజస్థాన్ సీఎం వసుంధరరాజే అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో పేమెంట్ బ్యాంకు లెసైన్సను సంపాదించిన ఎరుుర్టెల్ దేశవ్యాప్తంగా ఉన్న 15 లక్షల రిటైల్ అవుట్లెట్ల ద్వారా సేవలు అందించే ఆలోచనల్లో ఉంది. -
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్...
• డిసెంబర్లో సేవలు షురూ..! • మారుమూల పల్లెలకూ సర్వీసులు • కోటక్ మహీంద్రాతో కలసి కార్యకలాపాలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వారుుదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎరుుర్టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఎరుుర్టెల్ అనుబంధ కంపెనీ అరుున ఎరుుర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ (ఏఎంఎస్ఎల్) 2016 ఏప్రిల్లో ఆర్బీఐ నుంచి లెసైన్సును దక్కించుకుంది. దేశంలో పేమెంట్స్ బ్యాంకు లెసైన్సును పొందిన తొలి కంపెనీ ఏఎంఎస్ఎల్ కావడం విశేషం. మారుమూల పల్లెల్లో సేవలు..: పేమెంట్స్ బ్యాంకులో సేవింగ్స, డిపాజిట్, పేమెంట్, రెమిటెన్సు సేవలను ఆఫర్ చేస్తారు. మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి ఆర్థిక సేవలు అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకు అనుభవం ఎరుుర్టెల్కు దోహదం చేయనుంది. దేశవ్యాప్తంగా ఎరుుర్టెల్కు 26 కోట్లకుపైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. 15 లక్షలకుపైగా కేంద్రాల ద్వారా ఎరుుర్టెల్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. దేశంలో 87% జనాభాకు టెలికం కవరేజ్ను విస్తరించింది. బ్యాంకింగ్ రంగంలో కొత్త కస్టమర్లను దక్కించుకోవడానికి ఇరు బ్రాండ్లకు ఉన్న పాపులారిటీ ఉపయోగపడుతుంది. 2011 నుంచి ఎరుుర్టెల్ మనీ సేవలు అందిస్తున్న ఏఎంఎస్ఎల్ పేరును ఈ ఏడాది మే నెలలో ఎరుుర్టెల్ పేమెంట్స్ బ్యాంక్గా మార్చారు. -
ఇంటర్కనెక్ట్ జరిమానాపై స్పందిస్తాం: మిట్టల్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి తగినన్ని ఇంటర్కనెక్ట్ పాయింట్లు ఏర్పాటు చేయలేదనే అంశానికి సంబంధించి ట్రాయ్ తమపై డాట్కు సూచించిన జరిమానా విధింపు చర్యకు తగిన సమయంలో స్పందిస్తామని భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. ప్రభుత్వం స్పెక్ట్రమ్ ధర లను సవరిస్తే.. దాని వల్ల టెలికం ఇన్ఫ్రా ఏర్పాటు సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆయన ఇక్కడ జరిగిన జీఎస్ఎంఏ కార్యక్రమంలో మాట్లాడారు. ఇంటర్కనెక్ట్ అంశం పెద్ద సమస్య కాదని చెప్పారు. లెసైన్స్ నిబంధనల అతిక్రమణ, జియోకి ఇంటర్కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేయకపోవడం వంటి పలు అంశాల నేపథ్యంలో ఎయిర్టెల్, వొడాఫోన్లపై రూ.1,050 చొప్పున, ఐడియాపై రూ.950 కోట్ల జరిమానా విధించాలని రెగ్యులేటర్ ట్రాయ్.. డాట్కు సూచించింది. -
ఎయిర్టెల్ లాభం 1,461 కోట్లు
• మొబైలేతర ఆదాయం ఆసరా • రిలయన్స్ జియో ఉచిత సేవలతో వ్యాపార వృద్ధి నిదానం న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వ్యయాలు పెరిగిపోవడంతో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కన్సాలిడేటెడ్ లాభం జూలై - సెప్టెంబర్ త్రైమాసిక కాలంలో 5% క్షీణించి రూ.1,461 కోట్లకు పరిమితమయింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ లాభాలు రూ.1,536 కోట్లుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం గతేడాది ఇదే కాలంలో రూ.23,851 కోట్లు కాగా ఇపుడది రూ.24,671 కోట్లకు చేరింది. నైజీరియా కరెన్సీ విలువ క్షీణించడంతో ఆదాయంలో వృద్ధి 3.3 శాతానికే పరిమితమైనట్టు కంపెనీ వెల్లడించింది. నికర వడ్డీ వ్యయాలు సైతం గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రూ.1,053 కోట్ల నుంచి రూ.1,603 కోట్లకు పెరిగాయి. స్పెక్ట్రమ్ సంబంధిత వ్యయాలు పెరిగిపోవడమే దీనికి కారణమని సంస్థ వివరించింది. దేశీయ కార్యకలాపాల ద్వారా ఆదాయం మాత్రం 10 శాతం వృద్ధి చెంది రూ.19,219 కోట్లకు చేరింది. డిజిటల్ టీవీ వ్యాపారం 20.9 శాతం, ఇతర మొబైలేతర వ్యాపారంలో వృద్ధి ఇందుకు దోహదపడినట్టు ఎయిర్టెల్ తెలిపింది. జియో ఉచిత సేవలతో కంపెనీ మొబైల్ వ్యాపార వృద్ధి నిదానించినట్టు కంపెనీ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్ విట్టల్ తెలిపారు. కంపెనీ మొబైల్ డేటా ఆదాయం వరకే చూస్తే... 21 శాతం వృద్ధితో రూ.4,536 కోట్లకు చేరింది. దేశీయ మొబైల్ వ్యాపార ఆదాయంలో డేటా వాటా 24.7 శాతంగా ఉన్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. -
రూ.259లకే 10 జీబీ డేటా
ఎయిర్టెల్ నయా ఆఫర్ న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ తాజాగా రూ.259లకే 10 జీబీ డేటా ఆఫర్ను ప్రకటించింది. ఇది కొత్త 4జీ మొబైల్ కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది. రూ.259లో రీచార్జ్ చేసుకున్న తర్వాత యూజర్ అకౌంట్కు వెంటనే 1 జీబీ డేటా వస్తుంది. వినియోగదారుడు మిగిలిన 9 జీబీ డేటాను మైఎయిర్టెల్ యాప్ ద్వారా వినియోగించుకోవాలి. డేటా వాలిడిటీ 28 రోజులుగా ఉంది. ఒక కస్టమర్ 90 రోజుల్లో గరిష్టంగా మూడుసార్లు మాత్రమే ఈ ఆఫర్ను ఉపయోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. -
ఎయిర్ టెల్ మరో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ బుధవారం మరో కొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంటే చౌక ధరలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా రూ.259 రీచార్జ్ పై 10జీబీ 4జీ డేటా ఆఫర్ చేస్తోంది. వినియోగదారులు కొత్తగా కొనుగోలు చేసిన ఏ 4 జీ స్మార్ట్ ఫోన్ కైనా ఈ ఆఫర్ ను అందించనుంది. ఈ ఇన్విటేషనల్ ఆఫర్ ద్వారా దేశమంతా తాము అమలు చేస్తున్న4జీ నెట్ వర్క్ ను యూజర్లకు అందుబాటులోకి వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిర్ టెల్ బిజినెస్ డైరెక్టర్ అజయ్ పూరి తెలిపారు. ఒక జిబి డేటా తక్షణమే వినియోగదారుని ఖాతాలో జమ చేయబడుతుందనీ, మిగిలిన 9 జీబీ డేటా మై ఎయిర్ టెల్ ఆప్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని ఎయిర్ టెల్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 4 జీ అందుబాటులో లేనిచోట 3జీ డాటా వాడుకోవచ్చని తెలిపింది. గరిష్టంగా 90 రోజుల్లో మూడుసార్లు రీచార్జ్ చేసుకునేందుకు ఈ తాజా ఆఫర్ అనుమతినిస్తుంది. ఇటీవల గుజరాత్, మధ్య ప్రదేశ్, చత్తీస్గడ్ లో ప్రారంభించిన ఈ ఆఫర్ ను ఇపుడు దేశమంతా వర్తింపచేస్తోంది. కాగా ఆగస్ట్ లో రూ.250 రీచార్జ్ తో 10 జీబీ 4 జీ డాటాను కేవలం శాంసంగ్ గెలాక్సీ జె సీరిస్ స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఆఫర్ చేసింది. తాజా ఆఫర్ ప్రకారం 4 జీ స్మార్ట్ ఫోన్లు అన్నింటికీ ఈ డాటా సేవలు వర్తింప చేస్తోంది. -
ఎయిర్టెల్ కొత్త ఎత్తుగడ - ట్రయల్ ఆఫర్ సూపర్
రిలయన్స్ జియో ఫ్రీ ఆఫర్ల హవా కొనసాగుతుండడంతో ఇతర టెలికం దిగ్గజాలలో గుబులుమరింత పెరుగుతోంది. ఎలాగైనా తమకస్టమర్లను నిలపుకోవాలనే యోచనతో ఆఫర్ల కురిపిస్తున్నాయి. తాజా మార్కెట్ లీడర్ భారతి ఎయిర్ టెల్ ఎయిర్టెల్ మరో కొత్త ఎత్తుగడ వేసింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు మూడు నెలలపాటు అన్లిమిటెడ్ డాటా ఫ్రీ ఆఫర్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దీనికోసం బ్రాడ్ బ్యాండ్ టెక్నాలజీనిని 'వి ఫైబర్ 'టెక్నాలజీతో అప్ గ్రేడ్ చేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ద్వారా ఇక సెకనుకి వరకు 100 మెగాబిట్ ఇంటర్నెట్ వేగాన్ని అందుకుంటుందని తెలిపింది. బ్రిటిష్ టెలికాం,ఫా స్ట్ వెబ్, టి. టెలికాం, టెలీ ఫోనికా మాత్రమే వాడుతున్న ఈ కొత్త టెక్నాలజీని ద్వారా వినియోగదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే అధిక వేగంతో పనిచేసే ఇంటర్నెట్ సేవలను అందించనున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఇప్పటికే చెన్నైలో ఈ సేవలను ప్రారంభించామని, మరో రెండుమూడువారాల్లో దేశమంతా అమలు చేస్తామని భారతి ఎయిర్ టెల్ డైరెక్టర్ (ఆపరేషన్స్ ) అజయ్ పూరి ప్రకటించారు. ఎయిర్టెల్ 'వి-ఫైబర్ కొత్త వినియోగదారులకు మూడు నెలల ఉచిత ట్రయల్ ఆఫర్ అందిస్తోంది. అలాగే రూ 1,299 నుంచిమొదలయ్యే ప్లాన్ లో దేశమంతా ఉచిత వాయిస్ కాల్స్ అందిస్తున్నామని తెలిపింది. ముఖ్యంగా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లో ఎలాంటి భారీ మార్పులు లేకుండానే, కస్టమర్ ప్రాంగణంలో కొత్త వైరింగ్, డ్రిల్లింగ్ అవసరంలేకుండానే ఇంటర్నెట్ వేగాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నామని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే ప్రస్తుత వినియోగదారులు అధిక చార్జ్ తో, సేమ్ ప్లాన్ లో 'వి-ఫైబర్' వేగంతో అప్గ్రేడ్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీనికోసం మోడెమ్ రూ 1,000 చెల్లించాల్సి ఉంటుందని , ఒక వేళ ఒక నెలలో ఈ సర్వీసులో వినియోగదారుడు సంతృప్తి చెందకపోతే మోడెం చార్జీలు వెనక్కి తిరిగి చెల్లించబడతాయని ఎయిర్టెల్ ప్రతినిధి చెప్పారు. తమ రూ 60,000 కోట్ల ప్రాజెక్ట్ అభివృద్ధిలో భాగంగా ఎయిర్టెల్ ప్రస్తుత బ్రాడ్ బ్యాండ్వేగాన్ని 100 ఎంబీపీఎస్ వేగాన్ని అందుకునేలా విక్టోరైజేషన్ టెక్నాలజీని అమలు చేస్తున్నట్టు అజయ్ పూరి స్పష్టం చేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించడంతో పాటు, చాలా వేగవంతమైన అనుకూలమైన, అతి తక్కువ ధరకే అదనపు డేటా అందించటం తమ ధ్యేయమని పూరీ చెప్పారు. మరోవైపు ఇప్పటివరకు, ఈ రంగంలో ఈ ఐదు మిలియన్ల వినియోగదారులు ఎయిర్ టెల్ ఉన్నారనీ, ఇదే అతిపెద్ద టెక్నాలజీ అప్ గ్రేడ్ అని మార్కెట్ వర్గాల అంచనా. -
ఎయిర్టెల్కు 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్
• రూ.14,244 కోట్ల వ్యయం • ఐడియా సెల్యులార్కు రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ న్యూఢిల్లీ: టెలికం శాఖ నిర్వహిస్తున్న స్పెక్ట్రమ్ వేలంలో భారతీ ఎయిర్టెల్ 173.8 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను సొంతం చేసుకుంది. దీని విలువ రూ.14,244 కోట్లని ఎయిర్టెల్ గురువారం వెల్లడించింది. వచ్చే 20 ఏళ్ల కాలానికి సరిపడా స్పెక్ట్రమ్ను తాము సొంతం చేసుకున్నామని, అన్ని సర్కిళ్లలో తాము 3జీ, 4జీ సర్వీసులకు స్పెక్ట్రమ్ కలిగి ఉన్నామని తెలిపింది. ఈ స్పెక్ట్రమ్ను 1800, 2100, 2300 మెగాహెర్జ్ బ్యాండ్లలో ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఐడియా సెల్యులార్ సైతం రూ.12,798 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను తాజా వేలంలో సొంతం చేసుకుంది. మరోవైపు టెలికం శాఖ స్పెక్ట్రమ్ వేలం గురువారంతో ఐదు రోజుకు చేరుకుంది. మొత్తం 26 రౌండ్లకు గాను రూ.66 వేల కోట్ల విలువైన బిడ్లు దాఖల య్యాయి. ప్రభుత్వం 2,354.55 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీలను వేలానికి ఉంచగా... ఇప్పటి వరకు 960 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీల స్పెక్ట్రమ్ కోసం బిడ్లు వచ్చినట్టు అధికారిక వర్గాల సమాచారం. ప్రస్తుత వేలంలో 4జీ సర్వీసులకు అనుకూలించే 1800, 2300 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్ కోసం టెలికం కంపెనీల నుంచి అధిక స్పందన ఉంది. 3జీ/4జీ సర్వీలకు ఉపకరించే 2100 మెగాహెర్జ్, 4జీ సర్వీలకు అనుకూలించే 2500 మెగాహెర్జ్, 2జీ/4జీ సేవలకు వీలు కల్పించే 800 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్లకు కూడా స్పందన ఫర్వాలేదు. అత్యంత ఖరీదైన 700 మెగాహెర్జ్తోపాటు 900 మెగాహెర్జ్ బ్యాండ్ల స్పెక్ట్రమ్కు కంపెనీలు దూరంగా ఉన్నాయి. వీటి రిజర్వ్ ధర (రూ.4 లక్షల కోట్లు) చాలా ఎక్కువ స్థాయిలో ఉందని, ఇది తమకు అనుకూలం కాదని ఎయిర్టెల్ తెలిపింది. -
ఆ ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
• రూ.9,900 కోట్లు రాబట్టాలి... • టెలికం మంత్రికి జస్టిస్ బీసీ పటేల్ లేఖ న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకు ఇంటర్కనెక్షన్ కల్పించకుండా లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించిన భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, జరిమానా కింద రూ.9,900 కోట్లు వసూలు చేయాలని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీసీ పటేల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు టెలికం శాఖ మంత్రి మనోజ్సిన్హాకు లేఖ రాశారు. ఆపరేటర్ల చర్యలు స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనేనని జస్టిస్ పటేల్ అన్నారు. ఈ విషయంలో టెలికం శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశాన్ని అవి తమ చర్యల ద్వారా కల్పించాయని, ఒక్కో ఆపరేటర్పై విడివిడిగా రూ.3,300 కోట్ల చొప్పున జరిమానా విధించాలని కోరారు. ఈ అంశాన్ని పూర్తిగా అధ్యయనం చేసి చూడగా వినియోగదారుడి వ్యతిరేక, పోటీ వ్యతిరేక చర్యలను ఆపరేటర్లు అనుసరించినట్టు తెలుస్తోందని, వీటికి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నారు. కస్టమర్ల పోర్టబిలిటీ దరఖాస్తులను సైతం సరైన కారణం లేకుండా తోసిపుచ్చాయన్నారు. ఇందుకు సంబంధించి మీడియా కథనాలను ఆయన ఉదహరించారు. న్యాయ చింతన కలిగిన ఈ దేశ పౌరుడిగా తాను ఈ పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండిపోదలచుకోలేదని.. ఈ మూడు టెలికం ఆపరేటర్ల చర్యలు చట్ట వ్యతిరేకమని, లెసైన్స్ నిబంధనలను ఉల్లంఘించాయని జస్టిస్ పటేల్ లేఖలో పేర్కొన్నారు. సత్వరమే కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానా విధించాలని టెలికం శాఖను కోరారు. కాల్ డ్రాప్స్ డేటా బహిర్గతం రిలయన్స్ జియో కాల్ డ్రాప్స్ డేటాను తన వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచింది. తన నెట్వర్క్ నుంచి వెళ్లే కాల్స్కు ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా తగినన్ని ఇంటర్కనెక్షన్ పాయింట్లను ఇవ్వడం లేదంటూ జియో మొదటి నుంచి ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ అంశంపై ట్రాయ్కు కూడా ఫిర్యాదు చేసింది. ఇది నిజమేనని ట్రాయ్ పరిశీలనలోనూ తేలింది. ఈ నేపథ్యంలో జియో సెప్టెంబర్ 22వ తేదికి సంబంధించి కాల్డ్రాప్స్ డేటాను వెబ్సైట్లో ఉంచింది. ఈ ఒక్కరోజే 15 కోట్ల కాల్స్కు గాను 12 కోట్ల కాల్స్ ఫెయిల్ అయినట్టు పేర్కొంది. 6.13 కోట్ల కాల్స్ ఎయిర్టెల్ నెట్వర్క్కు వెళ్లే ప్రయత్నంలో 4.8 కోట్ల కాల్స్ (78.4 శాతం) ఫెయిల్ అయ్యాయి. వొడాఫోన్ నెట్వర్క్కు 4.69 కోట్ల కాల్స్కు గాను 3.95 కోట్ల కాల్స్ (84.1 శాతం) ఫెయిల్ అయ్యాయి. ఐడియా నెట్వర్క్కు వెళ్లే 4.39 కోట్ల కాల్స్లో 3.36 కోట్ల కాల్స్ విఫలం అయినట్టు ఈ డేటా ఆధారంగా జియో తెలిపింది. -
ట్రాయ్ చైర్మన్తో మిట్టల్ భేటీ
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ తాజాగా ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన జియో, ఎయిర్టెల్ మధ్య జరుగుతోన్న ఇంటర్కనెక్ట్ పాయింట్స్ వివాదంపై ట్రాయ్కి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మిట్టల్ మాట్లాడుతూ.. జియోకి తగినన్ని (2,100) ఇంటర్కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను మరో 1,000కి పెంచే పనిలో ఉన్నామని చెప్పారు. ‘టెస్టింగ్ ప్రక్రియ నడుస్తోంది. డిమాండ్ నోట్స్ అందాయి. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమౌతాయి’ అని వివరించారు. -
జియోకి ఎయిర్టెల్ అదనపు ఇంటర్కనెక్ట్ పాయింట్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియోకి అదనపు ఇంటర్కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు భారతి ఎయిర్టెల్ అంగీకరించింది. తాము ఏర్పాటుచేసే పోర్ట్లు జియో 1.5 కోట్ల మంది కస్టమర్ల కాల్స్ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.. జియో యూజర్లు ఎయిర్టెల్ యూజర్లకు ఫోన్ చేసుకోవచ్చు. తాజా చర్యతో ప్రస్తుత పోర్టుల సంఖ్య 3 రెట్లు పెరుగుతుందని ఎయిర్టెల్ పేర్కొంది. ఐడియా, ఎయిర్టెల్ వంటి టెలికం కంపెనీలు తమకు ఇంటర్కనెక్ట్ పోర్ట్లను సక్రమంగా ఇవ్వడం లేదంటూ ఇటీవల ముకేశ్ అంబానీ ఆరోపించిన విషయం తెలిసిందే. దీని కారణంగా అప్పుడు జియో 5 కోట్ల కాల్స్ ఫెయిల్ అయ్యాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి ట్రాయ్ రంగంలోకి దిగింది. దీంతో ఐడియా సోమవారం జియోకి అదనపు ఇంటర్కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. -
సునీల్ మిట్టల్ వేతనం పెరిగిందట!
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వార్షిక వేతనం రూ.30 కోట్ల పైమేటేనట. ఐదేళ్ల కాలపరిమితి గల కంపెనీ చైర్మన్ పదవికి మరోమారు ఎంపికైన మిట్టల్.. స్థిరవేతనం కింద రూ.21 కోట్లు, ఫర్ఫార్మెన్స్ ఇన్సెసింటివ్స్ కింద రూ.9 కోట్లను వార్షికంగా ఈ ఏడాది అందుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది. జీతం కాక పైవచ్చు వచ్చే ఆదాయాలను మినహాయించి ఆయన ఈ వేతనాన్ని అందుకోనున్నారు. జీతానికి పైన వచ్చు ఆదాయాలు కలుపుకుంటే ఆయన రూ.30 కోట్లకు పైననే ఆదాయాన్ని ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. దీంతో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీని అందుకుంటున్న వారిలో ఒకరిగా సునీల్ మిట్టల్ నిలిచారు. 2016 ఆగస్టు 19న కంపెనీ నిర్వహించిన 21వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సునీల్ మిట్టల్ వార్షిక వేతనం పెంచాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక ప్యాకేజీ 27.8 కోట్లగా ఉండేది. సునీల్ మిట్టల్ వేతన పెంపుతో పాటు భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో(ఇండియా, దక్షిణాసియా)గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్ విట్టల్ వేతనాన్ని కూడా సమీక్షించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇకనుంచి గోపాల్ మిట్టల్ కూడా స్థిర వేతనం కింద వార్షికంగా రూ.7 కోట్లను అందుకోనున్నారు. సవరించిన గోపాల్ విట్టల్ వేతనం 2016 జూన్ 1 నుంచి 2018 జనవరి 31వరకు వర్తించనుంది. -
భారతీ టెలికంలో 7.39% వాటా సింగ్ టెల్ చేతికి
డీల్ విలువ రూ.4,400 కోట్లు న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ అయిన భారతీ టెలికంలో 7.39 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్(సింగ్టెల్) తెలిపింది. ఈ వాటాను 65.95 కోట్ల డాలర్లకు (రూ.4,400 కోట్లు) కొనుగోలు చేస్తామని పేర్కొంది. అలాగే థాయ్లాండ్ టెలికం కంపెనీ ఇన్టచ్ హోల్డింగ్స్ పీసీఎల్లో 21 శాతం వాటాను కొనుగోలు చేయనున్నామని వెల్లడించింది. ఈ రెండు వాటాల కొనుగోలు కోసం మొత్తం 180 కోట్ల డాలర్లు వెచ్చించనున్నామని, అంతా నగదులోనే చెల్లింపులు జరుపుతామని పేర్కొంది. భారతీ ఎయిర్టెల్లో భారతీ టెలికం కంపెనీకి 45.09 శాతం వాటా ఉంది. భారతీ టెలికం కంపెనీలో మిట్టల్ కుటుంబానికి 51 శాతం, సింగ్టెల్కు 39 శాతం, తమసెక్కు 7.39 శాతం చొప్పున వాటాలున్నాయి. ఇప్పుడు ఈ 7.39 శాతం తమసెక్ వాటా సింగ్టెల్ పరం కానుంది. ఈ వాటా కొనుగోలుకు వాటాదారులతో సహా, పలు ప్రభుత్వ సంస్థల ఆమోదం పొందాల్సి ఉందని, ఈ ఏడాది డిసెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవగలదని సింగ్టెల్ పేర్కొంది. -
కనెక్షన్కు 5 జీబీ డేటా అదనం
ఎయిర్టెల్ కొత్త స్కీమ్ న్యూఢిల్లీ: దిగ్గజ టెలికం కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా ‘మైహోమ్ రివార్డ్స్’ స్కీమ్ను ప్రకటించింది. దీంతో ప్రతి పోస్ట్-పెయిడ్ బ్రాడ్బాండ్/డిజిటల్ టీవీ (డీటీహెచ్) కస్టమర్ అదనంగా 5 జీబీ డేటాను ఉచితంగా పొందొచ్చని కంపెనీ తెలిపింది. అంటే ఒక ఇంట్లో ఐదు ఎయిర్టెల్ కనెక్షన్లు ఉంటే వారు 25 (5ఁ5) జీబీ డేటాను ప్రతి నెలా ఉచితంగా పొందొచ్చు. అదే కుటుంబంలో రెండు పోస్ట్-పెయిడ్ మొబైల్స్, ఒక ఎయిర్టెల్ డిజిటల్ టీవీ కనెక్షన్ను ఉంటే వారు అదనంగా 15 (3ఁ5) జీబీ డేటాను పొందొచ్చు. కస్టమర్లు మైఎయిర్టెల్ యాప్/కంపెనీ వెబ్సైట్లోని మైహోమ్ సెక్షన్ ద్వారా వారి కనెక్షన్లను నమోదు చేసుకొని మైహోమ్ రివార్డ్స్ను సొంతం చేసుకోవాలని తెలిపింది. -
ఎయిర్ టెల్ హ్యాపీ అవర్స్ డేటా
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డాటా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సిమ్ కార్డులు ఆగష్టులో కమర్షియల్ గా విడుదల కానున్న నేపథ్యలో తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్ టెల్ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ప్రీ పెయిడ్ యూజర్ల కోసం హ్యాపీ డేటా ను ప్రకటించింది. ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డాటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఈ తాజా ఆఫర్ ద్వారా , ఖతాదారులు హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు డోన్ లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ డెవలపర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అజయ్ పూరీ డైరెక్టర్ - ఆపరేషన్స్ ( భారతదేశం మరియు దక్షిణ ఆసియా) చెప్పారు. అత్యవసరంకాని వీడియోలు, ఫోటో ఆల్బములు , సంగీతం లాంటి భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో చేసుకోవడం ద్వారా 50 శాతం డేటా సేవ్ చేసుకోవచ్చన్నారు. మరోవైపు వినియోగదారులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారి వెబ్సైట్ల అభివృద్ధి , యాప్ డెవలపర్లను ఫెసిలిటేట్ చేయాలని ట్రోయ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది. కాగా ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ వచ్చే నెలలోనే వాణిజ్యపరంగా జియో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ గంటల్లో ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తోంది. ఎయిర్ టెల్ కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉన్నారు. అటు రిలయన్స్ జియో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్లను ఊరిస్తోంది. మరి 4జీ సేవలను చేరవేయడంలో వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో తేలాలంటే..వెయిట్ చేయాల్సిందే.. -
ఎయిర్టెల్-ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ ఒప్పందానికి ఆమోదం!
డీల్ విలువ రూ. 3,500 కోట్లు న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, ఎయిర్సెల్ల రూ.3,500 కోట్ల 4జీ స్పెక్ట్రమ్ ట్రేడింగ్ ఒప్పందానికి టెలికం శాఖ ఆమోదం లభించిందని సమాచారం. అయితే ఈ విషయమై వ్యాఖ్యానించడానికి భారతీ ఎయిర్టెల్ నిరాకరించింది. ఎనిమిది టెలికం సర్కిళ్ల (ఆంధ్రప్రదేశ్, తమిళనాడు(చెన్నైతో కలుపుకొని),బిహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, అస్సాం, ఈశాన్య ప్రాంతం, ఒడిశా) ఎయిర్సెల్కు చెందిన 4జీ స్పెక్ట్రమ్ను ఉపయోగించుకునే హక్కులను రూ.3,500 కోట్లకు కొనుగోలు చేయడానికి భారత్ ఎయిర్టెల్ ఇంతకుముందు ఒప్పందం కుదుర్చుకుంది. ఒక టెలికం సర్కిల్కు కేటాయించిన మొత్తం స్పెక్ట్రమ్లో ఏ కంపెనీకి 25 శాతానికి మించి స్పెక్ట్రమ్ ఉండకూడదు. ఒడిశా సర్కిల్లో అప్పటికే ఎయిర్టెల్కు కొంత స్పెక్ట్రమ్ ఉంది. ఒడిశా సర్కిల్లోని ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ కొనుగోలు కారణంగా ఈ పరిమితిని మించిన స్పెక్ట్రమ్ భారతీ ఎయిర్టెల్కు ఉంటుంది. అదనంగా ఉన్న 1.2 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ను ఎయిర్టెల్ ప్రభుత్వానికి అప్పగించిందని, దీంతో ఈ ఒప్పందం సాకారమైందని సమాచారం. కాగా ఎయిర్సెల్ స్పెక్ట్రమ్ను తక్షణం స్తంభింపజేయాలని ప్రశాంత్ భూషణ్ అనే ఉద్యమ న్యాయవాది ఈ నెల 8న సీబీఐ, ఈడీలకు ఒక లేఖ రాశారు. ఆర్కామ్, ఎయిర్టెల్లతో ఎయిర్సెల్ కుదుర్చుకున్న ఒప్పందాలు సాకారమైతే, ఎయిర్సెల్ మాతృ కంపెనీ మ్యాక్సిస్ పారిపోతుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. -
ఎయిర్టెల్ ఎం-కామర్స్ ఇక ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ భారతి ఎయిర్టెల్ తాజాగా తన అనుబంధ కంపెనీ ‘ఎయిర్టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్’ పేరును ‘ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్’గా మార్పు చేసింది. అలాగే సంస్థ తన పేమెంట్ బ్యాంక్ కార్యకలాపాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రారంభించే అవకాశముంది. ‘పేరు మార్పు పేమెంట్స్ బ్యాంక్ విభాగంపై మాకున్న ఆసక్తికి నిదర్శనం. కంపెనీకున్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్.. మేము ప్రజలకు నాణ్యమైన బ్యాంకింగ్ సేవలను అందించడానికి దోహ దపడుతుంది’ అని భారతి ఎయిర్టెల్ (ఇండియా, దక్షిణాసియా) ఎండీ, సీఈవో గోపాల్ విట్టల్ తెలిపారు. కాగా ఆర్బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ లెసైన్స్ పొందిన (ఏప్రిల్ 11న) తొలి కంపెనీ భారతి ఎయిర్టెల్. -
ఎయిర్టెల్ లాభం రూ.1,290 కోట్లు
న్యూఢిల్లీ: టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ నికరలాభం మార్చి క్వార్టర్లో 2.8 శాతం పెరిగి రూ. 1,290 కోట్లకు చేరింది. గతేడాది జనవరి-మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ. 1,255 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. తాజా త్రైమాసికంలో మొత్తం ఆదాయం 8.4 శాతం వృద్ధితో రూ. 23,016 కోట్ల నుంచి రూ. 24,960 కోట్లకు పెరిగింది. 2015-16 పూర్తి సంవత్సరానికి రూ. 96,532 కోట్ల ఆదాయంపై రూ. 5,484 కోట్ల నికరలాభం ఆర్జించింది. తాజా త్రైమాసికంలో ఇండియా నుంచి ఆదాయం 11.7 శాతం పెరుగుదలతో రూ. 18,328 కోట్లకు పెరిగిందని, మొబైల్ డేటా ఆదాయం జోరుగా 44 శాతం ఎగిసి రూ. 3,357 కోట్లకు చేరినట్లు కంపెనీ పేర్కొంది. డేటా వినియోగదారులు, ట్రాఫిక్ పెరగడంతో ఈ వృద్ధి సాధ్యపడిందని కంపెనీ తెలిపింది. మొబైల్ డేటా జోరు...: ఇండియా నుంచి ఒనగూడుతున్న మొబైల్ ఆదాయంలో డేటా ఆదాయం వాటా ప్రస్తుతం 23.3 శాతానికి పెరిగిందని, ఏడాది క్రితం ఇది 17.6 శాతమేనని ఎయిర్టెల్ వివరించింది. ఒక్కో వినియోగదారు నుంచి లభిస్తున్న డేటా సగటు ఆదాయం తాజా త్రైమాసికంలో రూ. 21 పెరిగి రూ. 196కు చేరిం దని, ఈ విభాగంలో 31 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొంది. మొబైల్ డేటాకు సంబంధించి ట్రాఫిక్ 69 శాతం, ఆదాయం 44% పెరగడంతో మంచి ఫలితాల్ని ప్రకటించగలిగామని, డేటా ట్రాఫిక్ 60% వృద్ధిచెందగా, ఆదాయం 44% ఎగిసిందని భారతీ ఎయిర్టెల్ ఇండియా, దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ విఠల్ వివరించారు. రూ. 1,434 కోట్లతో బైబ్యాక్ ప్రతిపాదనను కంపెనీ బోర్డు సిఫార్సుచేసింది. షేరుకు రూ. 400 ధరతో మొత్తం చెల్లింపు మూలధనంలో 0.90% షేర్లను కొనుగోలు చేయాలన్నది ప్రతిపాదన. 2016 మార్చి 31నాటికి కంపెనీ మొత్తం రుణభారం రూ. 83,888 కోట్లకు చేరింది. రూ. 5 ముఖవిలువగల షేరుపై రూ. 1.36 చొప్పున డివిడెండును డెరైక్టర్ల బోర్డు సిఫార్సుచేసింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు 3% పైగా పెరిగి రూ. 374 వద్ద ముగిసింది.