5G
-
'స్పెక్ట్రం అవసరం మరింత పెరుగుతుంది': టెలికం కార్యదర్శి
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో టెలికం సదుపాయాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని కేంద్ర టెలికం శాఖ కార్యదర్శి 'నీరజ్ మిట్టల్' తెలిపారు. మొబైల్, బ్రాడ్బ్యాండ్ వినియోగానికి మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని తెలిపారు. అటు 5జీ సేవల కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్లపై టెల్కోలకు రాబడులు లభించడం కష్టతరంగా ఉంటున్న నేపథ్యంలో.. ఈ రెండు అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెడుతున్నట్లు వివరించారు.దేశీయంగా డేటా స్పీడ్ సగటున 99–100 ఎంబీపీఎస్ నుంచి 151 ఎంబీపీఎస్కి పెరిగినట్లు చెప్పారు. సగటున ప్రతి నెలా ఒక్కో యూజరు దాదాపు 29 గిగాబైట్ల డేటాను వినియోగిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో 5జీ నుంచి 6జీకి మారాలంటే మౌలిక సదుపాయాలపై భారీగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, మరింత స్పెక్ట్రం అవసరమవుతుందని చెప్పారు.ప్రైవేట్ టెల్కోలు 5జీ సేవల కోసం 2024లో టెలికం మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రంపై రూ. 70,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో, భారతి ఎయిర్టెల్ 5జీ సర్వీసులను అందిస్తుండగా.. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ ఇంకా సేవలను ప్రారంభించాల్సి ఉంది. భారీగా డేటాను వినియోగించే యూజర్లున్నందున నెట్ఫ్లిక్స్, మెటా, అమెజాన్, గూగుల్లాంటి టెక్ దిగ్గజాలు కూడా తమ ఆదాయాల్లో కొంత భాగాన్ని భారత్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాల కల్పన కోసం అందించాలంటూ టెల్కోలు కోరుతున్నాయి. -
5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియోకు పోటీ!?
భారతదేశంలో జియో, ఎయిర్టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) సిద్ధమైంది.దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్.. 'బీఎస్ఎన్ఎల్' దేశవ్యాప్తంగా మెరుగైన సేవలను అందించడానికి తన నెట్వర్క్ను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 65,000 4జీ సైట్లను ఏర్పాటు చేసింది. ఇటీవల కేరళలో కూడా 5,000 కొత్త సైట్లను జోడించింది. కంపెనీ దేశం అంతటా మొత్తం ఒక లక్ష 4G సైట్లను చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.బీఎస్ఎన్ఎల్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G టారిఫ్లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కంపెనీ వివిధ ప్రాంతాలలో కొత్త సైట్ ఇన్స్టాలేషన్లను చురుకుగా ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఒక లక్ష 4జీ సైట్ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత.. 5G నెట్వర్క్ను ప్రారంభించనున్నట్లు సమాచారం.బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్వర్క్ను 5జీకి అప్గ్రేడ్ చేయడానికి.. 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) సహకరిస్తోంది. కంపెనీ తన ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలను సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా 5జీగా మార్చాలని యోచిస్తోంది. ఎయిర్టెల్ మాదిరిగానే కంపెనీ భారతదేశం అంతటా 5జీ నాన్ స్టాండలోన్ (NSA) టెక్నాలజీని కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది.ఇదీ చదవండి: వాట్సాప్లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోందిబీఎస్ఎన్ఎల్ 5జీ స్టాండలోన్ (SA) టెక్నాలజీని పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 5G SA టెస్టింగ్ జరుగుతోంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే.. ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా లభిస్తాయి. ఇదే జరిగితే జియో, ఎయిర్టెల్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ తన నెట్వర్క్ను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది. -
మార్చిలోగా వొడాఫోన్ ఐడియా 5జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా దేశవ్యాప్తంగా 2025 మార్చిలోగా వాణిజ్యపరంగా 5జీ సేవలను ప్రారంభించనుంది. ప్రస్తుతం కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టు నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్లస్టర్ బిజినెస్ హెడ్ ఆనంద్ దానీ బుధవారమిక్కడ మీడియాకు వెల్లడించారు. ‘తెలుగు రాష్ట్రాల్లో 11,500లకుపైగా 4జీ టవర్స్ ఉన్నాయి. దశలవారీగా వీటిని 5జీకి అప్గ్రేడ్ చేస్తాం. స్పామ్ సందేశాలను అడ్డుకునే సాంకేతికతను పరిచయం చేశాం. ఈ సేవలను కాల్స్కు కూడా త్వరలో విస్తరిస్తాం. ప్రస్తుతం స్పామ్ కాల్స్ కట్టడికి సంబంధించి టెక్నాలజీని పైలట్ ప్రాజెక్టుగా వినియోగిస్తున్నాం’ అని తెలిపారు. సంస్థకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఒక కోటికి పైగా చందాదార్లు ఉన్నారు. ఒక్కో వినియోగదారు నుంచి కంపెనీకి వస్తున్న సగటు ఆదాయం నెలకు రూ. 200 ఉంది. సగటున ఒక్కో కస్టమర్ డేటా వినియోగం ప్రస్తుతం నెలకు 18–20 జీబీ ఉందని ఆనంద్ చెప్పారు. దేశవ్యాప్తంగా కంపెనీ రూ.18,000 కోట్ల తాజా పెట్టుబడులు చేస్తోందని తెలిపారు. -
భారత్లో 5జీ జోరు.. 6జీ సేవల ప్రారంభం అప్పుడే..
టెలికం రంగంలో భారత్లో 5జీ కొత్త పుంతలు తొక్కుతోంది. 2030 నాటికి 5జీ చందాదార్ల సంఖ్య మూడురెట్లు దూసుకెళ్లి 97 కోట్లకు చేరుతుందని నెట్వర్కింగ్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజం ఎరిక్సన్ రూపొందించిన కంజ్యూమర్ల్యాబ్ రిసర్చ్ నివేదిక వెల్లడించింది. ఆ సమయానికి మొత్తం మొబైల్ కస్టమర్లలో 5జీ యూజర్ల వాటా ఏకంగా 74 శాతానికి ఎగబాకుతుందని తెలిపింది.ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం 2024 చివరి నాటికి భారత్లో 5జీ సబ్స్క్రిప్షన్లు 27 కోట్లు నమోదు కావొచ్చని అంచనా. ఇది దేశంలోని మొత్తం మొబైల్ కస్టమర్లలో 23 శాతం. ఇక అంతర్జాతీయంగా 5జీ చందాదార్ల సంఖ్య ఈ ఏడాది చివరికల్లా దాదాపు 230 కోట్లుగా ఉంటుంది. ఇది మొత్తం గ్లోబల్ మొబైల్ సబ్స్క్రిప్షన్లలో 25 శాతానికి సమానం. అలాగే 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 630 కోట్ల మంది 5జీ మొబైల్ సేవలను వినియోగిస్తారని నివేదిక అంచనా వేస్తోంది. 2027 నాటికి 4జీని దాటి.. 5జీ వినియోగదార్ల సంఖ్య 2027లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4జీ సబ్స్క్రిప్షన్లను అధిగమిస్తాయని అంచనా. మొదటిసారిగా 6జీ సేవలు 2030లో ప్రారంభం కావొచ్చు. భారత్లోని స్మార్ట్ఫోన్ వినియోగదారులు మెరుగైన పనితీరు కోసం వీడియో కాలింగ్, స్ట్రీమింగ్, ఆన్లైన్ చెల్లింపులకు అదనంగా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 5జీ వినియోగదార్లలో ఆరుగురిలో ఒకరు తమ ప్రస్తుత నెలవారీ మొబైల్ ఖర్చులో 20 శాతం ఎక్కువ చెల్లించడానికి రెడీగా ఉన్నారని ఎరిక్సన్ ఆగ్నేయాసియా, భారత్ నెట్వర్క్ సొల్యూషన్స్ హెడ్ ఉమాంగ్ జిందాల్ తెలిపారు.జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) అప్లికేషన్లు 5జీ పనితీరును నడిపించే కీలక సాధనాలుగా ఉద్భవించాయి. జెన్ ఏఐ యాప్లను ఉపయోగించే స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో పెరుగుతుంది. భారత్లోని 5జీ స్మార్ట్ఫోన్ కస్టమర్లలో 67 శాతం మంది వచ్చే ఐదేళ్లలో ప్రతీ వారం జెన్ ఏఐ యాప్లను ఉపయోగిస్తారని నివేదిక వివరించింది. -
ఫైబర్ టెక్లో లక్ష కొలువులు..
ముంబై: బ్రాడ్బ్యాండ్, 5జీ నెట్వర్క్ సహా డిజిటల్ రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఫైబర్ టెక్నాలజీ విభాగంలో ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. ఫైబర్ ఇన్స్టాలేషన్, మెయింటెనెన్స్, రిపేర్ సెగ్మెంట్లలో కొత్తగా లక్ష ఉద్యోగాలు రానున్నాయి. టీమ్లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటెజీ ఆఫీసర్ పి. సుబ్బురత్నం ఈ విషయాలు వెల్లడించారు. 2024లో దేశీయంగా టెలికం మార్కెట్ 48.61 బిలియన్ డాలర్లుగా ఉండగా ఏటా 9.40 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2029 నాటికి 76.16 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి దేశవ్యాప్తంగా 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం పూర్తయిందని, డిజిటల్ మౌలిక సదుపాయాలు విస్తరించడానికి ఇది గణనీయంగా ఉపయోగపడిందని వివరించారు. అసాధారణమైన స్పీడ్, తక్కువ లేటెన్సీ, మరింత మెరుగైన కనెక్టివిటీని అందిస్తూ 2030 నాటికి 5జీ టెక్నాలజీ మరింతగా విస్తరించనుందని సుబ్బురత్నం చెప్పారు. ‘ప్రభుత్వం, టెలికం సంస్థలు ఫైబర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణపై దృష్టి పెడుతుండటంతో ఫైబర్ టెక్నీషియన్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో కొత్తగా సుమారు లక్ష ఉద్యోగావకాశాలు రానున్నాయి‘ అని సుబ్బురత్నం చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ఫైబర్ టెక్నీషియన్ల సంఖ్య సుమారు 5 లక్షల పైగా ఉన్నట్లు అంచనా. ఇంజనీర్లు, టెక్నీషియన్లకు డిమాండ్... పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి పెట్టే టెలికం, ఐటీ, నిర్మాణ, తయారీ తదితర రంగాల్లో ఫైబర్ సాంకేతిక నిపుణుల అవసరం ఉంటుంది. ఫైబర్ ఇంజనీర్లు, ఫైబర్ టెర్మినేషన్ ఎక్విప్మెంట్ టెక్నీషియన్లు, ఇన్స్టాలేషన్.. రిపేరు, ఫాల్ట్ రిజల్యూషన్ టీమ్, ఫైబర్ సెల్సైట్ ఇంజనీర్లు, ఫీల్డ్ టెక్నీషియన్లు మొదలైన వర్గాలకు డిమాండ్ నెలకొనవచ్చని సుబ్బురత్నం చెప్పారు. అయితే, అట్రిషన్ రేటు అధిక స్థాయిలో వార్షికంగా 35–40%గా ఉంటోందన్నారు. సుదీర్ఘ పనిగంటలు, వేతనాల పెంపు చాలా తక్కువగా ఉండటం, ఉద్యోగులను ఇతర సంస్థలను ఎగరేసుకు పోతుండటం తదితర అంశాలు కారణమని వివరించారు. -
5జీ నెట్వర్క్లో నెంబర్ వన్: తెలుగు రాష్ట్రాల్లో జియో హవా..
5జీ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్లో రిలయన్స్ జియో నెంబర్ వన్గా అవతరించింది. 5జీ నెట్వర్క్ కవరేజ్లో మాత్రమే కాకుండా , లభ్యతలో కూడా జియో అద్భుతమైన పనితీరును ప్రదర్శిచింది. తాజాగా ఓపెన్ సిగ్నల్ విడుదల చేసిన నివేదికలో.. ఆంధ్రప్రదేశ్ టెలికామ్ సర్కిల్ (ఆంధ్ర, తెలంగాణ) జియో అసాధారణమైన పనితీరును కనపరిచినట్లు వెల్లడించింది.ఓపెన్ సిగ్నల్ నివేదిక ప్రకారం.. జియో 5జీ కవరేజ్ టవర్లు 66.7 శాతం నెట్వర్క్ లభ్యత స్కోర్తో దాని ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని జియో వినియోగదారులు మూడింట రెండు వంతులు 5జీ సేవలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద విస్తృతమైన, స్థిరమైన 5జీ కనెక్టివిటీని అందించడంలో జియో ముందంజలో ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.5జీ కవరేజ్ ఎక్స్పీరియన్స్లో జియో.. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలలో ముందుంది. 10 పాయింట్ల స్కేల్పై జియో 9.0 పాయింట్ల స్కోర్తో.. దాని ప్రధాన ప్రత్యర్థి ఎయిర్టెల్ (7.1 స్కోర్) కంటే ముందు వరసలో ఉంది. జియో ఎప్పటికప్పుడు నిరంతరాయ సేవలను అందిస్తూ ముందుకు సాగుతుండటంతో వినియోగదారులు ఈ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించడానికి సుముఖత చూపుతున్నారు.జియో, ఎయిర్టెల్ తరువాత వోడాఫోన్ ఐడియా 3.7 పాయింట్ల స్కోర్, బీఎస్ఎన్ఎల్ 1.2 పాయింట్ల స్కోర్స్ సాధించాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో 5G కవరేజీని విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్, వోడాఫోన్ ఐడియాకు సవాలుగా మారింది. అయితే ప్రస్తుతం వినియోగదారులు జియో 5జీ ద్వారా స్పీడ్ డౌన్లోడ్ పొందుతూ మెరుగైన నెట్వర్క్ అనుభవం పొందుతున్నారని సమాచారం. -
జియో స్పీడ్ ఎక్కువే: ఓపెన్ సిగ్నల్!
వేగంగా నెట్వర్క్ సేవలందించడంలో జియో దూసుకుపోతుంది. నెట్వర్క్ స్పీడ్, కవరేజ్, స్థిరమైన సర్వీసులు అందించడంలో జియో మరింత మెరుగుపడిందని ఓపెన్ సిగ్నల్ నివేదించింది. దేశంలోని టెలికాం కంపెనీలతో పోలిస్తే జియో అధికంగా 89.5 ఎంబీపీఎస్ స్పీడ్ నెట్వర్క్ను అందిస్తున్నట్లు పేర్కొంది. ‘ఇండియా మొబైల్ నెట్వర్క్ ఎక్స్పీరియన్స్’ పేరుతో విడుదల చేసిన నివేదికలో భారత టెలికాం నెట్వర్క్ కంపెనీల సేవలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది.నివేదికలోని వివరాల ప్రకారం..రిలయన్స్ జియో గరిష్ఠంగా 89.5 ఎంబీపీఎస్ డౌన్లోడ్ స్పీడ్ కలిగిన నెట్వర్క్ను అందిస్తుంది. ఎయిర్టెల్ 44.2 ఎంబీపీఎస్, వొడాఫోన్ ఐడియా 16.9 ఎంబీపీఎస్తో తర్వాత స్థానాల్లో నిలిచాయి. జియో నెట్వర్క్ స్పీడ్ ఎయిర్టెల్ కంటే రెండింతలు ఎక్కువగా ఉంది. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, ఇతర డేటా సేవలను మరింత మెరుగ్గా అందించే అవకాశం ఉంది. జియో నెట్వర్క్ సేవలు చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా విస్తరించాయి. ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..దేశీయంగా టెలికాం నెట్వర్క్ సేవలకు సంబంధించి కస్టమర్ల అంచనాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్ గేమ్లు, వీడియో స్ట్రీమింగ్, ఇతర డేటా అవసరాల కోసం వేగంగా నెట్వర్క్ ఉండాలనుకుంటున్నారు. అదే సమయంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ పెరుతుతోంది. దాంతో సంస్థలు మెరుగైన సర్వీసులు ఇచ్చేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ ఏడాది జులైలో జియోతోపాటు ఇతర కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. దాంతో కస్టమర్ల అట్రిషన్ రేటు(నెట్వర్క్ మారడం) పెరగడంతో జియో విభిన్న మార్గాలు అనుసరిస్తోంది. టారిఫ్ రేట్లను పెంచినప్పటి నుంచి నెట్వర్క్ స్పీడ్ తగ్గిపోయిందనే అభిప్రాయాలున్నాయి. కాబట్టి క్రమంగా నెట్వర్క్ స్పీడ్ పెంచుతున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. -
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్ నాటికి 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్ఎన్ఎల్ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు‘బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు. -
రూ.83 లక్షల కోట్లకు డిజిటల్ ఎకానమీ
భారత్ డిజిటల్ ఎకానమీ వేగంగా వృద్ధి చెందుతోందని ఆస్క్ క్యాపిటల్ తెలిపింది. 2028 నాటికి ఇండియా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు)కు చేరుతుందని అంచనా వేసింది. అందుకోసం యూపీఐ, 4జీ, 5జీ సాంకేతికతలు ఎంతో తోడ్పడుతాయని తెలిపింది. ఈమేరకు నివేదిక రూపొందించింది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశంలో ఇంటర్నెట్ వేగంగా విస్తరిస్తోంది. 4జీ, 5జీ సేవలు అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి. యూపీఐ సేవలు మెరుగవుతున్నాయి. 2028 నాటికి భారత్ ట్రిలియన్ డాలర్ల(రూ.83 లక్షల కోట్లు) డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారనుంది. గత కొన్నేళ్లుగా స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ఆర్థిక కార్యకలాపాలను డిజిటలైజేషన్ చేయడంతో నగదు రహిత లావాదేవీలు, ఆన్లైన్ కొనుగోళ్లవైపు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ (ఐసీఆర్ఐఈఆర్) ప్రకారం..భారత్ డిజిటల్ ఎకానమీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలైన జపాన్, యూకే, జర్మనీలను అధిగమించింది.ఇదీ చదవండి: ‘కాల్ చేసి స్కామ్ చేయాలి’.. చాట్జీపీటీ స్పందన ఇదే..ప్రధానమంత్రి జన్ ధన్ యోజన వంటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పథకాలు డిజిటల్ ఎకానమీకి ఊతమిచ్చేలా పనిచేస్తున్నాయి. డిజిటల్ ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ విద్య, టెలి-మెడిసిన్, డిజిటల్ హెల్త్, డిజాస్టర్ రెస్పాన్స్..వంటి సేవలకోసం ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. -
వొడాఫోన్ ఐడియా భారీ కాంట్రాక్టులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) తాజాగా భారీ కాంట్రాక్టులకు తెరతీసింది. 4జీ, 5జీ నెట్వర్క్ పరికరాల కొనుగోలు కోసం రూ. 30,000 కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చింది. మూడేళ్లలో వీటిని సరఫరా చేసేందుకు దిగ్గజాలు నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్లను ఎంపిక చేసుకుంది. వెరసి ఈ ఏడాది భారీ ఆర్డర్లను ఇచ్చిన టెలికం ఆపరేటర్గా వొడాఫోన్ ఐడియా నిలిచింది. మూడేళ్ల కాలంలో 6.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 55,000 కోట్లు) పెట్టుబడులు వెచి్చంచేందుకు కంపెనీ ప్రణాళికలు వేసిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా తొలి దశ కింద తాజా కాంట్రాక్టులకు తెరతీసింది. మూడేళ్లలో 4జీ, 5జీ కవరేజీకి వీలుగా నోకియా, ఎరిక్సన్, శామ్సంగ్లు పరికరాలు సరఫరా చేయవలసి ఉంటుందని వొడాఫోన్ ఐడియా ప్రకటన పేర్కొంది. సరఫరాలు డిసెంబర్ క్వార్టర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. తద్వారా 4జీ కవరేజీని 1.03 బిలియన్ నుంచి 1.2 బిలియన్ల జనాభాకు పెంచడం, కీలక మార్కెట్లలో 5జీ సేవలను ప్రవేశపెట్టడం, డేటా వినియోగానికి అనుగుణంగా సామర్థ్యాన్ని విస్తరించడం చేపట్టనున్నట్లు తెలియజేసింది. తొలుత 4జీ కవరేజీని 120 కోట్ల మందికి చేరువ చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది. వీఐఎల్ 2.0కు శ్రీకారం... వీఐఎల్ 2.0 పేరుతో పెట్టుబడుల ప్రక్రియను ప్రారంభించినట్లు వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూంద్రా తెలియజేశారు. నోకియా, ఎరిక్సన్ కంపెనీ ప్రారంభం నుంచి భాగస్వాములుకాగా.. తాజాగా శామ్సంగ్తో ప్రయా ణం ప్రారంభించడం ప్రోత్సాహకర అంశమని వ్యాఖ్యానించారు. 2018లో ఐడియా సెల్యులర్తో విలీనం అనంతరం వొడాఫోన్ ఐడియాగా ఏర్పాటైనప్పుడు 40.8 కోట్లమంది కస్టమర్లతో అతిపెద్ద టెలికం ఆపరేటర్గా అవతరించింది. అయితే ఆపై జియో, ఎయిర్టెల్తో ఎదురైన తీవ్ర పోటీలో వెనకబడటంతో ప్రతీ నెలా కస్టమర్ల సంఖ్య తగ్గుతూ వచి్చంది. ప్రస్తుతం వీఐఎల్ వినియోగదారుల సంఖ్య 21.5 కోట్లు. -
బీఎస్ఎన్ఎల్ 4జీ కోసం 5జీ ఫోన్ కొనాలా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు చార్జీలు పెంచేయడంతో చాలామంది ప్రభుత్వ టెలికాం సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే గణనీయంగా యూజర్లు ఇతర కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్లో చేరారు. వినియోగదారుల డిమాండ్కు తగ్గుట్టుగానే ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది. అయితే బీఎస్ఎన్ఎల్ యూజర్లకు కొత్త సమస్య వచ్చింది. అదేంటంటే..4జీ రోల్అవుట్ కోసం ఉపయోగిస్తున్న ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కారణంగా, బీఎస్ఎన్ఎల్ (BSNL) కస్టమర్లు 4జీ సేవలను ఉపయోగించడానికి 5జీ-అనుకూల ఫోన్ను కొనుగోలు చేయాల్సి రావచ్చు. 4G సేవలను అందించేందుకు బీఎస్ఎన్ఎల్ 2,100 MHz, 700 MHz అనే రెండు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ఉపయోగిస్తోంది. వీటిలో 700 MHz బ్యాండ్ సాధారణంగా 5జీ సేవలకు సంబంధించిదైనా బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలకు కూడా వినియోగిస్తోంది.ఇతర టెలికాం ఆపరేట్లకు ఇచ్చినట్లే ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కి కూడా 700 MHz బ్యాండ్ని కేటాయించింది. అయితే జియో వంటి వాణిజ్య ఆపరేటర్లు తమ స్వంత 5జీ నెట్వర్క్ కోసం దీనిని ఇంకా ఉపయోగించడం లేదు. ఈ బ్యాండ్ 5జీ సేవల కోసం ఇంకా పూర్తిగా స్థాపితం కాలేదు.దీంతో 2,100 MHz ఫ్రీక్వెన్సీ మాత్రమే సరిపోదన్న ఉద్దేశంతో బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్ని కూడా 4జీ సేవలు అందించడానికి ఉపయోగిస్తోంది.ఇదీ చదవండి: జియోలో అత్యంత చవకైన ప్లాన్ ఇదే..ఈ సమస్య గురించి తెలిసిన ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్ (B28)తో పని చేసేలా 4జీ ఫోన్లను తయారు చేయాలని తయారీ కంపెనీలను కోరింది. రాబోయే హ్యాండ్సెట్లు 700 MHz బ్యాండ్లో 4జీ, 5జీ రెండింటికి సపోర్ట్ చేసేలా చూసేందుకు బీఎస్ఎన్ఎల్ స్మార్ట్ఫోన్ తయారీదారులతో సమన్వయంతో పనిచేస్తోంది. బీఎస్ఎన్ఎల్ 700 MHz బ్యాండ్తో పనిచేసే ఫోన్లు ప్రస్తుతం 1,000 మాత్రమే ఉన్నాయి. -
ప్రపంచంలో రెండో స్థానానికి భారత్
అమెరికాను వెనక్కి నెట్టి భారత్ తొలిసారిగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5జీ మొబైల్ మార్కెట్గా అవతరించింది. గ్లోబల్గా 5జీ మొబైళ్ల వాడకంలో గతేడాదితో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 20 శాతం పెరిగిందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక తెలిపింది. 5జీ ఫోన్లలో యాపిల్ మొబైళ్లను ఎక్కువగా వాడుతున్నారని పేర్కొంది.కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం..ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా 5జీ మొబైళ్లు వాడుతున్న దేశాల్లో అమెరికా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్ ఒక స్థానం ముందుకు చేరింది. 5జీ ఫోన్లలో ఎక్కువగా యాపిల్ మొబైళ్లను వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కేటగిరీలో 25 శాతం కంటే ఎక్కువ వాటా యాపిల్ సొంతం చేసుకుంది. ఐఫోన్ 15, 14 సిరీస్ల్లో ఈ సాంకేతికతను ఎక్కువగా వాడుతున్నారు.బడ్జెట్ విభాగంలో ఎక్కువగా షావోమీ, వివో, శామ్సంగ్ ఇతర బ్రాండ్లకు చెందిన మొబైళ్లను వాడుతున్నారు. 5జీ వాడుతున్నవారిలో 21 శాతం మంది శామ్సంగ్ గెలాక్సీ ఏ సిరీస్, ఎస్24 సిరీస్లను ఉపయోగిస్తునారు. ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు.ఇదీ చదవండి: అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
ఆ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..?
భారత్లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’ -
బీఎస్ఎన్ఎల్ యూనివర్సల్ సిమ్: ఎక్కడైనా.. ఎప్పుడైనా
జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచిన తరువాత బీఎస్ఎన్ఎల్ ఊపందుకుంది. ఇప్పటికే లక్షలమంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్లోకి చేరారు. తమ యూజర్లకు అత్యుత్తమ సర్వీస్ అందించడానికి.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) త్వరలో 4G, 5G రెడీ సిమ్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి రీవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల వెల్లడించింది.ఈ విషయాన్ని డాట్ ఇండియా తన అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేసింది. 4G, 5G సర్వీస్ అనేది భౌగోళిక పరిస్థితులతో సంబంధం లేకుండా ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఇందులో పేర్కొన్నారు.భారతదేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ కంపాటబుల్ ఓవర్ ది ఎయిర్ (OTA), యూనివర్సల్ సిమ్ (U SIM) ప్లాట్ఫారమ్ను త్వరలోనే విడుదల చేయనుంది. దీని ద్వారా యూజర్లు తమ మొబైల్ నెంబర్లను ఎంచుకోవచ్చు. దీనికి ఎలాంటి భౌగోళిక పరిమితులు లేవు.గత సంవత్సరం.. నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం మొత్తం రూ. 89,047 కోట్లతో బీఎస్ఎన్ఎల్ కోసం మూడవ పునరుద్ధరణ ప్యాకేజీని ఆమోదించింది. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణ వ్యూహంలో భాగంగా ఈ ప్యాకేజ్ ప్రకటించడం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 4G/5G స్పెక్ట్రమ్ కేటాయింపులు కూడా ఉన్నాయి.BSNL ready. Bharat ready.#ComingSoon pic.twitter.com/BpWz0gW4by— DoT India (@DoT_India) August 10, 2024 -
బీఎస్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్కార్డు’ విడుదల
బీఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో ‘5జీ-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్గ్రేడ్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3జీ సదుపాయాన్నే అందిస్తోంది. కొన్ని టైర్1, టైల్ 2 నగరాలతోపాటు ఇతర టౌన్ల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా..వంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను సవరించాయి. వాటిని గతంలో కంటే దాదాపు 20-30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఆ నెట్వర్క్ వినియోగదారులు మార్కెట్లో చౌకగా రీచార్జ్ ప్లాన్లు అందించే బీఎస్ఎన్ఎల్వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇందులో 4జీ సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు 4జీ సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5జీ-రెడీ సిమ్కార్డు’లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వివరించింది.ఈ సిమ్కార్డును ఆధునిక స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎయిర్టెల్, జియో మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ 4జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్ కార్డ్కు అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5జీ-రెడీ సిమ్నే వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులకు మరింత మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.ఇదీ చదవండి: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!ఇదిలాఉండగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల ట్రయల్స్ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. -
5 వేల కి.మీ. దూరం నుంచి శస్త్రచికిత్స
బీజింగ్: అత్యాధునిక వైద్య విధానాలతో అత్యవసర, ఆకస్మిక వైద్య సేవలు సైతం క్షణాల్లో అందుబాటులోకి వస్తాయని నిరూపితమైంది. చైనాలోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రి ఈ ఘటనకు వేదికగా నిలిచింది. 5జీ టెక్నాలజీ సాయంతో వైద్యుడు 5,000 కిలోమీటర్ల దూరంలోని ఊపిరితిత్తుల రోగికి విజయవంతంగా శస్త్రచికిత్సచేయడం విశేషం. టెక్నాలజీకి ఆధునిక వైద్యవిధానాలు జోడిస్తే అద్భుతాలు సంభవిస్తాయని మరోసారి రూఢీ అయింది. వాయవ్య చైనాలోని గ్జిన్జియాంగ్ ప్రావిన్స్లోని మారుమూల కష్కర్ ఛాతి ఆస్పత్రిలో నూతన 5జీ సర్జికల్ రోబోట్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఊపిరితిత్తుల్లో కణతితో బాధపడుతున్న రోగికి రోబో శస్త్రచికిత్స చేసేందుకు ఇక్కడి నుంచి 5,000 కిలోమీటర్ల దూరంలోని షాంఘై నగరంలోని శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ లూ క్వింగ్క్వాన్ సిద్ధమయ్యారు. పలు రోబో చేతులు అమర్చిన 5జీ ఆధారిత రోబోటిక్ సర్జరీ వ్యవస్థను సునాయసంగా వాడుతూ కేవలం గంటలో రోగి శరీరంలోని కణతిని విజయవంతంగా తొలగించారు.భారత్లోనూ సేవలు మొదలు: ఇలాంటి సేవలు భారత్లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఎస్ఎస్ఐ మంత్ర ఈ సేవలను చేరువచేసింది. ఐదు రోబో చేతులున్న ఈ వ్యవస్థతో గుండె ఆపరేషన్లనూ చేయొచ్చు. వైద్యుని ముందు 32 అంగుళాల మానిటర్, ఒక 3డీ విజన్ ఉంటాయి. ఇందులో ఒక భద్రతా కెమెరానూ బిగించారు. ఆపరేషన్ చేస్తూ వైద్యుడు మధ్యలో తల పక్కకు తిప్పగానే రోబో ఆపరేషన్ను ఆపేస్తుంది. శస్త్రచికిత్సలో ఒక్క సెకన్ కూడా పొరపాట్లు, తప్పిదాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ జాగ్రత్త ఏర్పాటుచేశారు. 8 మిల్లీమీటర్ల సన్నని ఉపకరణాలతో రోబో చేతులు చకచకా ఆపరేషన్ చేసేస్తాయి. -
గుడ్న్యూస్.. బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం
BSNL 5G: ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్లో మరో శుభ పరిణామం చోటుచేసుకుంది. బీఎస్ఎన్ఎల్ దేశంలో తన 5జీ సేవల ట్రయల్స్ నిర్వహించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి, జ్యోతిరాదిత్య సింధియా ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు."బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్తో ఫోన్ కాల్ ప్రయత్నించాను" అని సింధియా రాసుకొచ్చారు. ఈ మేరకు సి-డాట్ క్యాంపస్లో బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ను పరీక్షిస్తున్న వీడియోను షేర్ చేశారు. మంత్రి పోస్ట్ చేసిన వీడియోలో ఆయన బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ ద్వారా వీడియో కాల్ మాట్లాడారు.ఈ ఏడాది బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ. 82 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. టెలికం సంస్థ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, దేశంలో పూర్తిగా అభివృద్ధి చేసిన 4జీ, 5జీ సాంకేతికతను సులభతరం చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు. ఈ చర్య భవిష్యత్తులో ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పెద్ద సవాలుగా మారవచ్చు.Connecting India! Tried @BSNLCorporate ‘s #5G enabled phone call. 📍C-DoT Campus pic.twitter.com/UUuTuDNTqT— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 2, 2024 -
సెకనుకు 1.2 జీబీ స్పీడ్.. నోకియా ఘనత
న్యూఢిల్లీ: టెలికం గేర్స్ తయారీ దిగ్గజం నోకియా మరో ఘనతను సాధించింది. 5జీ సేవల్లో డౌన్లోడ్ వేగం గరిష్టంగా సెకనుకు 1.2 గిగాబిట్ నమోదు చేసింది. భారత్లో భారతీ ఎయిర్టెల్తో కలిసి మొదటి 5జీ నాన్ స్టాండలోన్ క్లౌడ్ రేడియా యాక్సెస్ నెట్వర్క్ పరీక్షల సమయంలో నోకియా ఈ రికార్డు నమోదు చేసింది.5జీ కోసం 3.5 గిగాహెట్జ్, 4జీ కోసం 2100 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్ వినియోగించి ఓవర్–ది–ఎయిర్ వాతావరణంలో పరీక్ష జరిగింది. ఎయిర్టెల్ వాణిజ్య నెట్వర్క్ ద్వారా డేటా కాల్స్ విజయవంతంగా పూర్తి అయ్యాయి. క్లౌడ్ నెట్వర్క్ టెక్నాలజీని ఉపయోగించి నోకియా, ఎయిర్టెల్ ఈ ట్రయల్ నిర్వహించాయి. -
రూ.10 వేలకే 5జీ స్మార్ట్ఫోన్.. కెమెరా ఫీచర్స్ అదుర్స్!
ఐకూ (iQoo) తన తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్ ఐకూ జెడ్9 లైట్ 5జీ (iQoo Z9 Lite 5G)ని ఈరోజు భారత్లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, డ్యూయల్ కెమెరాలతో ఉన్న ఈ ఫోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, బ్యాటరీ ఉన్నాయి.ఐకూ జెడ్9 లైట్ 5జీ 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ మోడల్ ప్రారంభ ధర రూ.10,499. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. దీని ధర రూ. 11,499. ఈ స్మార్ట్ఫోన్లు ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటి విక్రయాలు అమెజాన్తోపాటు ఐకూ వెబ్సైట్లో జూలై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్లు, ఈఎంఐ లావాదేవీలతో రూ. 500 అదనపు తక్షణ తగ్గింపును ఐకూ అందిస్తోంది.స్పెసిఫికేషన్లు, ఫీచర్లు» 6.56-అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లే » మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్» 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ » సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా» ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఫన్టచ్ ఓఎస్ 14» 15W ఛార్జింగ్ సపోర్ట్తో 5000mAh బ్యాటరీ» సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ -
చౌక 5జీ ఫోన్ల మోత!
5జీ ఫోన్ కొనే ప్లాన్లో ఉన్నారా? పండుగ సీజన్ వరకు కాస్త ఓపిక పట్టండి! ఎందుకంటారా? భారీగా ఆదా చేసే చాన్స్ రాబోతోంది. రాబోయే పండుగల్లో చౌక 5జీ ఫోన్లు మార్కెట్ను ముంచెత్తనున్నాయి. ప్రధానంగా హ్యాండ్సెట్ల తయారీలో కీలకమైన 5జీ చిప్సెట్లను చిప్ తయారీ బ్రాండ్లు తక్కువ ధరల్లో విడుదల చేస్తుండటంతో ఫోన్ రేట్లు దిగొచ్చేందుకు వీలవుతోంది. దీంతో ఈ ఏడాది చివరికల్లా దేశంలో 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ భారీగా ఎగబాకుతుందనేది పరిశ్రమ వర్గాల అంచనా.మనం ఇప్పటికే 5జీ యుగంలోకి అడగుపెట్టేశాం. ఒకపక్క టెలికం కంపెనీలు 5జీ నెట్వర్క్ విస్తరణకు వడివడిగా అడుగులు వేస్తున్నాయి. మరోపక్క మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు కూడా 5జీ హ్యాండ్సెట్లను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. దీంతో ఫోన్ కొనుగోలుదారులకు ఇక ‘పండుగే’! ప్రస్తుతం దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల ధర రూ. 11,000–13,000 మధ్య ప్రారంభమవుతోంది. కొన్ని ఫోన్ బ్రాండ్లు అప్పుడప్పుడు ప్రమోషనల్ ఆఫర్లను అందిస్తుండటంతో ధర కొంచెం తగ్గుతోంది. అయితే, చిప్ తయారీ సంస్థలు చౌక 5జీ చిప్సెట్లను అందుబాటులోకి తెస్తుండటంతో ఫోన్ రేట్లు భారీగా దిగిరానున్నాయి. చిప్.. చిప్.. హుర్రే! తాజాగా భారత్ కోసం చైనా చిప్సెట్ బ్రాండ్ యూనిసాక్ ‘టీ760’ చిప్సెట్ను విడుదల చేసింది. ప్రధాన మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు అందుబాటు ధరల్లో 5జీ ఫోన్ల విడుదలకు చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. దీంతో రూ. 10,000 లోపు ధరల్లో 5జీ ఫోన్లకు మార్గం సుగమం కానుంది. యూనిసాక్ బాటలోనే మొబైల్ చిప్సెట్లలో దిగ్గజ బ్రాండ్లైన క్వాల్కామ్, మీడియాటెక్ కూడా చౌక 5జీ చిప్సెట్లను అందించనున్నాయి. ‘అతి త్వరలోనే’ బడ్జెట్, ఎంట్రీలెవెల్ 5జీ హ్యాండ్సెట్ల కోసం చిప్సెట్లను తీసుకొస్తామని క్వాల్కామ్ కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. మీడియాటెక్ ‘డైమెన్సిటీ 6000 సిరీస్’ ఎంట్రీలెవెల్ చిప్సెట్ చౌకగా స్మార్ట్ ఫోన్లను అందించేందుకు వీలుకల్పిస్తుందని ఆ కంపెనీ డిప్యూటీ డైరెక్టర్ అనూజ్ సిద్ధార్థ్ చెప్పా రు. ‘2జీ, 4జీ విభాగాల్లో యూనిసాక్ చిప్సెట్ల వాటా పటిష్టంగా ఉంది. టీ760తో భారత్లో అందరికీ చౌక 5జీ ఫోన్లను అందించడమే మా లక్ష్యం. దీనికోసం కీలక ఫోన్ తయారీదారులతో జట్టు కడుతున్నాం. టీ760 చిప్సెట్ మెరుగైన పనితీరుతో భారత్ 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తాం’ అని యూనిసాక్ కంపెనీ పేర్కొంది. ఇక 5జీ మార్కెట్ జోరు... చిప్సెట్ల రేట్లు దిగిరావడం, చౌక ఫోన్ల లభ్యతతో ఈ ఏడాది చివరికల్లా 5జీ ఫోన్ల మార్కెట్ వాటా రెండంకెల స్థాయికి చేరుకోవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘రూ. 10,000 విభాగంలో 5జీ ఫోన్ల వాటా ఈ ఏడాది మే నాటికి కేవలం 1.4 శాతం మాత్రమే ఉంది. చౌక చిప్సెట్ల ప్రభావంతో డిసెంబర్ నాటికి ఈ వాటా 10 శాతానికి చేరుకోనుంది’ అని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ పేర్కొన్నారు. ట్రాన్సియన్ హోల్డింగ్స్ (టెక్నో, ఇన్ఫినిక్స్, ఐటెల్ తదితర మొబైల్ బ్రాండ్స్), హెచ్ఎండీ గ్లోబల్ (నోకియా బ్రాండ్), రియల్మీ, రెడ్మీ వంటి కంపెనీలు దసరా, దీపావళి పండుగ సీజన్లో చౌక 5జీ హ్యాండ్సెట్లను ప్రవేశపెట్టే సన్నాహాల్లో ఉన్నాయి. ‘ట్రాన్సియన్ వంటి కీలక తయారీదారు భారీ ప్రణాళికల్లో ఉండటంతో రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల మార్కెట్ దూసుకుపోనుంది. 5జీ ఫోన్ల విడుదలకు సంబంధించి మార్కెట్ను అధ్యయనం చేస్తున్నాం’ అని ట్రాన్సియన్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరిజీత్ తలపాత్ర పేర్కొన్నారు.ఈ ఏడాది మే నాటికి రూ.10,000 లోపు 5జీ హ్యాండ్సెట్ల అమ్మకాల వాటా: 1.4% డిసెంబర్ కల్లా దేశీ ఫోన్ల మార్కెట్లో 5జీ మొబైల్స్ సేల్స్ పరిమాణం (కౌంటర్ పాయింట్ అంచనా): 10% ఎంట్రీలెవెల్ 5జీ సెగ్మెంట్లో టాప్ కంపెనీలు: ట్రాన్సియన్, హెచ్ఎండీ గ్లోబల్, రియల్మీ, రెడ్మీ – సాక్షి, బిజినెస్ డెస్క్ -
కొత్త ప్లాన్లు తీసుకొచ్చిన జియో
రిలయన్స్ జియో ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించింది. ఈ క్రమంలోనే కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్న యూజర్లు అదనపు డేటా కోసం వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్లు ఉత్తమమైనవి. మూడు ప్లాన్లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే, ఇవన్నీ అపరిమిత 5G డేటాతో వస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్ల చెల్లుబాటు యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది.జియో వెబ్సైట్లో ట్రూ అన్లిమిటెడ్ అప్గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్లు లిస్ట్ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్లకు అనుకూలంగా లేవు. మూడింటిలో చౌకైనది. రూ. 51 ప్లాన్. 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. మీరు 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు. -
4జీ, 5జీ సర్వీసులు లేకుంటే కష్టమే.!
న్యూఢిల్లీ: 4జీ, 5జీ సర్వీసులు లేకపోవడం వల్లే ప్రైవేట్ టెల్కోలతో ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ పోటీపడలేకపోతోందంటూ ఆ సంస్థ ఉద్యోగుల యూనియన్ వ్యాఖ్యానించింది. గతంలో బీఎస్ఎన్ఎల్ నుంచి పోటీ వల్ల ప్రైవేట్ సంస్థలు టారిఫ్లను అడ్డగోలుగా పెంచకుండా కాస్త సంయమనం పా టించేవని, కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని తెలిపింది. అవి లాభాల్లోనే ఉన్నప్పటికీ తాజాగా రేట్లను పెంచడం సరికాదని పేర్కొంది. కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల యూనియన్ ఈ మేరకు లేఖ రాసింది. మూడు టెల్కోలు – రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా – టారిఫ్లను 10–27 శాతం మేర పెంచిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీ యూ) తక్కువగా ఉండటం వల్లే టారిఫ్లను పెంచాల్సి వచి్చందంటూ ప్రైవేట్ టెల్కోలు తప్పుదారి పట్టిస్తున్నాయని యూనియన్ ఆరోపించింది. 2023–24లో జియో రూ. 20,607 కోట్లు, ఎయిర్టె ల్ రూ. 7,467 కోట్ల లాభాలు ఆర్జించాయని, ఈ నే పథ్యంలో సామాన్యులపై భారం పడేలా టారి ఫ్లను పెంచడం సరికాదని పేర్కొంది. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సత్వరం తగు చర్యలు తీసుకోవాలని, సామా న్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని కోరింది. -
సైన్యానికి సేవలందించే చిప్ ఆధారిత 4జీ బేస్ స్టేషన్
భారత సైన్యం తొలిసారిగా స్వదేశీ చిప్ ఆధారిత 4జీ మొబైల్ బేస్ స్టేషన్ను ప్రవేశపెట్టింది. బెంగుళూరుకు చెందిన ‘సిగ్నల్ట్రాన్’ అనే సంస్థ దీన్ని తయారుచేసింది. ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా బిడ్ను దక్కించుకుని దీన్ని రూపొందించినట్లు సిగ్నల్ట్రాన్ తెలిపింది. ఈ ‘సహ్యాద్రి’ ఎల్టీఈ బేస్ స్టేషన్లో ఉపయోగించే చిప్ను కంపెనీ ఆధ్వర్యంలోని ‘సిగ్నల్ చిప్’ బృంద్రం అభివృద్ధి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు హిమాంషు ఖాస్నిస్ తెలిపారు.హిమాంషు, తన బృందం 2010లో 4జీ, 5జీ నెట్వర్క్ చిప్లను తయారు చేయడానికి ఈ కంపెనీను స్థాపించారు. ఈ సందర్భంగా హిమాంషు మాట్లాడుతూ..‘దేశంలోనే మొదటిసారి చిప్ ఆధారిత 4జీ, 5జీ నెట్వర్క్ల కోసం ప్రత్యేక వ్యవస్థను తయారుచేశాం. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించాం. సంక్లిష్ట కమ్యూనికేషన్ టెక్నాలజీ కోసం దేశీయ చిప్ ఆధారిత నెట్వర్క్ను భారతీయ సైన్యంలోకి ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. గతేడాది 4జీ ఎల్టీఈ నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్(ఎన్ఐటీ) సాంకేతికత కోసం భారతీయ సైన్యం గవర్నమెంట్ ఇ-మార్కెట్ప్లేస్లో బిడ్లను పోస్ట్ చేసింది. దాంతో సిగ్నల్ట్రాన్ ఈ బిడ్ను దక్కించుకుంది. కేవలం 7 కిలోల బరువున్న ఈ సహ్యాద్రి నెట్వర్క్ ఇన్ ఎ బాక్స్ (ఎన్ఐబీ) వ్యవస్థ అధిక నాణ్యత కలిగిన వైర్లెస్ కమ్యూనికేషన్ను అందిస్తుంది. ఆడియో, వీడియో, డేటా అప్లికేషన్ల సరఫరాలో సమర్థంగా పనిచేస్తుంది. సైనికులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారితో కమ్యూనికేషన్ చేయడానికి వీలవుతుంది. భారత్ సైన్యానికి కంపెనీ 20 యూనిట్లను సరఫరా చేసింది’ అని చెప్పారు.‘ఈ బేస్ స్టేషన్లను ఎప్పుడు, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలనే దానిపై సైన్యం నిర్ణయం తీసుకుంటుంది. అవి తేలికపాటి, మొబైల్ యూనిట్లు కాబట్టి వారి అవసరాలకు అనుగుణంగా ఎక్కడికైనా మార్చుకునే సౌలభ్యం ఉంటుంది. దేశంలోని బేస్ స్టేషన్లల్లో ఎక్కువ భాగం స్థానికంగా తయారు చేసినవికావు. కొన్నింటిలో స్వదేశీ చిప్లు కూడా లేవు. ప్రస్తుతం ఆధునిక సెమీకండక్టర్ చిప్ల తయారీకి దేశంలో ఫ్యాబ్రికేషన్ సౌకర్యం లేదు. ఎన్విడియా, క్వాల్కామ్, మీడియాటెక్ వంటి ప్రముఖ సెమీకండక్టర్ కంపెనీలకు సమానమైన మోడల్లో సిగ్నల్చిప్ ఈ టెక్నాలజీని రూపొందించింది. 2029 నాటికి భారతీయ బేస్ స్టేషన్ మార్కెట్ విలువ సుమారు రూ.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా’ అని ఖాస్నిస్ వివరించారు. -
5జీ స్పెక్ట్రమ్ వేలం.. రూ.11వేల కోట్ల బిడ్లు
న్యూఢిల్లీ: 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదటి రోజున మంచి డిమాండ్ కనిపించింది. మంగళవారం మొత్తం ఐదు రౌండ్లలో టెలికం ఆపరేటర్లు రూ.11వేల కోట్ల మేర బిడ్లు దాఖలు చేశారు. రూ.96,238 కోట్ల విలువ చేసే 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ను కేంద్ర ప్రభుత్వం వేలానికి ఉంచింది. 900, 1800, 2100, 2500 మెగాహెర్జ్ బ్యాండ్లలో స్పెక్ట్రమ్ కోసం ఆపరేటర్లు ఆసక్తి చూపించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వేలంలో పాల్గొన్నాయి.అత్యధికంగా రిలయన్స్ జియో రూ.3,000 కోట్లను ముందస్తుగా డిపాజిట్ చేసింది. దీంతో ఎక్కువ స్పెక్ట్రమ్ కోసం రిలయన్స్ పోటీ పడనున్నట్టు తెలుస్తోంది. భారతీ ఎయిర్టెల్ రూ.1,050 కోట్లను, వొడాఫోన్ రూ.300 కోట్ల చొప్పున డిపాజిట్ చేశాయి. 2010లో ఆన్లైన్లో బిడ్డింగ్ మొదలైన తర్వాత ఇది పదో విడత స్పెక్ట్రమ్ వేలం కావడం గమనార్హం. కేంద్ర సర్కారు చివరిగా 2022 ఆగస్ట్లో వేలం నిర్వహించింది. వేలం బుధవారం తిరిగి ప్రారంభమవుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
టెక్నోట్రీతో హెచ్సీఎల్ టెక్ జత
న్యూఢిల్లీ: ఐటీ సర్వీసుల దిగ్గజం హెచ్సీఎల్ టెక్నాలజీస్ తాజాగా ఫిన్లాండ్ సంస్థ టెక్నోట్రీ సాఫ్ట్వేర్తో చేతులు కలిపింది. తద్వారా గ్లోబల్ టెలికం కంపెనీ(టెల్కో)ల కోసం 5జీ ఆధారిత జనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనుంది.టెలికం రంగ దిగ్గజాలకు సేవలందించే టెక్నోట్రీ సహకారంతో క్లయింట్ల అవసరాలకు అనుగుణమైన తదుపరితరం సొల్యూషన్లకు తెరతీయనున్నట్లు తెలియజేసింది. ప్రధానంగా టెల్కోలు, కమ్యూనికేషన్ సర్వీసులందించే సంస్థ(సీఎస్పీ)లకు కొత్త అవకాశాలకు వీలు కల్పించడం, ఆవిష్కరణలకు ఊతమివ్వడం, సస్టెయినబుల్ గ్రోత్కు దన్నునివ్వడం వంటి సేవలను అందించనున్నాయి.తాజా భాగస్వామ్యం ఏఐ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్లో హెచ్సీఎల్ టెక్కున్న పట్టు, టెక్నోట్రీకు గల 5జీ ఏఐ ఆధారిత బీఎస్ఎస్ ప్లాట్ఫామ్ సామర్థ్యాలు కలగలసి క్లయింట్లకు పటిష్ట సేవలందించనున్నట్లు హెచ్సీఎల్ టెక్ పేర్కొంది. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త..అదనంగా
ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) తన కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా సంస్థ వీఐ నెట్ వర్క్ సబ్ స్క్రైబర్లు 4జీ, 5జీ స్మార్ట్ఫోన్ వినియోగదారుల కోసం అదనపు డేటాను అందిస్తోంది.ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం ‘వీఐ గ్యారెంటీ ప్రోగ్రామ్’ను ప్రకటించింది. 5జీ, 4జీ ఫోన్ వినియోగదారులందరికీ 130 జీబీ డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ను ఎంచుకున్న యూజర్లకు మరో ఏడాది పాటు ఈ డేటాను పొందవచ్చని వీఐ పేర్కొంది. 13 వరుస సైకిళ్లకు ప్రతి 28వ రోజు ఆటోమేటిక్గా 10జీబీ జమ అవుతుందని కంపెనీ ఒక విడుదలలో తెలిపింది.ఈ సందర్భంగా వీఐ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అవనీష్ ఖోస్లా మాట్లాడుతూ..దేశంలో చాలా మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు తగినంత డేటా లేకపోవడం వల్ల వారి 4జీ/5జీ స్మార్ట్ ఫోన్ వినియోగం సామర్థ్యాన్ని పెంచుకోవడం లేదని చెప్పారు. -
టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీ విడుదల.. ధర ఎంతంటే?
చైనా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ టెక్నో మొబైల్.. టెక్నో క్యామాన్ 30ప్రో 5జీ, క్యామాన్ 30 ప్రీమియర్ 5జీని భారత్లో విడుదల చేసింది. రెండు స్మార్ట్ఫోన్లు ఐపీ53 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ ఇస్తుంది. ఇక తాజాగా విడుదలైన టెక్నో క్యామాన్ 30 ప్రో 5జీ, క్యామన్ 30 ప్రీమియర్ 5జీ ధరలు ఇలా ఉన్నాయి. ముందుగా టెక్నో క్యామాన్ 30 5జీ 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 ఉండగా.. 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 గా ఉందిక్యామన్ 30 ప్రీమియర్ 5జీ 12 జీబీ ర్యామ్,512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999గా ఉంది. టెక్నో క్యామన్ 30 5జీ స్పెసిఫికేషన్స్:టెక్నో క్యామన్ 30 5జీ 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 1080 x 2436 పిక్సెల్ల రిజల్యూషన్తో ఎల్టీపీఎస్ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఫోన్ 360హెచ్జెడ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2160హెచ్ జెడ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్, 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. మీడియా టెక్ డైమన్సిటీ 7020 చిప్సెట్, గరిష్టంగా 12జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, స్మార్ట్ఫోన్లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీనిని 70డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్, 10డబ్ల్యూ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్కు కూడా మద్దతు ఇస్తుంది. -
రూ.30 వేలలోపు బెస్ట్ మొబైళ్లు ఇవే.. (ఫొటోలు)
-
5జీకి పెరుగుతున్న ఆదరణ.. డేటా వినియోగం ఎంతంటే..
భారత్లో 5జీ వినియోగదార్లు డేటాను విరివిగా వాడుతున్నారు. 4జీ వినియోగదార్లతో పోలిస్తే ఏకంగా 3.6 రెట్ల డేటాను వాడుతున్నట్లు టెలికాం గేర్ తయారీ కంపెనీ నోకియా తన నివేదికలో పేర్కొంది. టెలికం వినియోగదారులకు సేవలందించేందుకు కంపెనీలు నిత్యం కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబరు 2022లో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2023లో మొత్తం డేటా రద్దీలో 15 శాతం వాటా 5జీదేనని ఆ నివేదికలో తెలిపింది. నివేదికలోని కొన్ని ప్రధానంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి. 5జీ అందుబాటులోకి వచ్చాక ఆ టెక్నాలజీ కొన్నిసార్లు వాడకపోయినా 5జీ మొబైళ్లను కొనుగోలు చేస్తున్నారు. 4జీ డివైజెస్ సంఖ్యతో పోలిస్తే 17 శాతం మేర 5జీ మొబైళ్లు వాడుతున్నారు. అంటే 79.6 కోట్లలో వీటి వాటా 13.4 కోట్లుగా ఉంది. భారత్లో డేటా వినియోగం గతేడాదితో పోలిస్తే 20% వృద్ధితో నెలకు 17.4 ఎక్సాబైట్స్గా నమోదవుతోంది. 1 ఎక్సాబైట్ 100 కోట్ల జీబీకి సమానం. సగటున ఒక్కో వినియోగదారు నెలకు 24 జీబీ వాడుతున్నారు. అంటే భారత్లో డేటా వినియోగం చాలా భారీగా ఉంది. మొత్తం మొబైల్ డేటా రద్దీలో 20 శాతం వాటాకు ఇది చేరింది. ఇదీ చదవండి..హైదరాబాద్లో దూసుకెళ్తున్న రియల్టీ రంగం -
శామ్సంగ్ కొత్త ఫోన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శామ్సంగ్ భారత్లో గెలాక్సీ సిరీస్లో ఏ55 5జీ, ఏ35 5జీ స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టింది. 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, నాక్స్ వాల్ట్ సెక్యూరిటీ, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా వంటి ఫీచర్లను జోడించింది. ఈ మోడళ్లు 5జీతోపాటు వేగంగా వృద్ధి చెందుతున్న రూ.30–50 వేల ధరల విభాగంలో తమ స్థానాన్ని కన్సాలిడేట్ చేస్తాయని శామ్సంగ్ తెలిపింది. ధర రూ.27,999 నుంచి రూ.42,999 వరకు ఉంది. -
Realme 12 సిరీస్ 5G ను అన్ బాక్స్ చేసిన సంయుక్త మీనన్ (ఫొటోలు)
-
2జీ, 3జీ, 4జీ, 5జీ.. తరాల్లో మతలబు
సాంకేతిక విప్లవంలో భారత్ మరికొద్ది రోజుల్లో కీలక ముందడుగు వేయబోతోంది. టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే 5జీ టెక్నాలజీలోకి ఇప్పటికే అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన ఇతర సేవలందించేలా స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ మే 20న ప్రారంభం కాబోతోంది. ఈ ప్రక్రియ పూర్తయిన కొన్ని నెలల్లోనే దేశంలో అత్యంత వేగవంతమైన టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో సాంకేతికంగా దేశంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు సంభవించబోతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు 2జీ, 3జీ, 4జీ, 5జీ సాంకేతికల్లో తేడాలెందుకో ఈ కథనంలో తెలుసుకుందాం. మొదట్లో సెల్ఫోన్ బరువు కేజీ ఉండేది. తర్వాత కీ ప్యాడ్ ఫోన్ వచ్చింది. తర్వాత మడత పెట్టే ఫోన్లూ వచ్చాయి. ఆ తర్వాతి కాలంలో ఫోన్లు స్మార్ట్గా మారిపోయాయి. ఒకప్పుడు ఫోన్లు కేవలం కాల్స్ మాట్లాడడానికి మాత్రమే.. కానీ ఇప్పటి స్మార్ట్ఫోన్లతో దాదాపు అన్ని రకాల పనులూ చక్కెబెట్టేయొచ్చు. అలాగే టెలికాం కమ్యూనికేషన్ రంగంలోనూ ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. అలా తొలి తరం నెట్వర్క్ను 1జీ అనే వారు. ఇక్కడ G అంటే జనరేషన్ అని అర్థం. ఈ నెట్వర్క్లో కేవలం ఫోన్లు మాట్లాడడానికి మాత్రమే పరిమితం. ఆ తర్వాత తరాన్ని బట్టి ఇంటర్నెట్ అందించే వేగంలో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం 4జీ, 5జీ విస్తృత వినియోగంలో ఉన్నాయి. ఏ తరం దేనికి? 1G: 1970ల్లో జపాన్లో తొలి తరం మొబైల్ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చింది. ఈ తరంలో కేవలం ఫోన్లు చేసుకోవడానికి మాత్రమే అవకాశం ఉండేది. సౌండ్ క్వాలిటీ కూడా అంతంత మాత్రమే. 2G: టెలికాం రంగంలో చెప్పుకోదగ్గ మార్పు ఉన్న నెట్వర్క్ 2జీ. 1991లో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. తొలిసారి ఎస్సెమ్మెస్, ఎంఎంఎస్ అనేవి ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. డేటా వేగం గరిష్ఠంగా 50 కేబీపీఎస్ మాత్రమే. 3G: 2001లో ఈ సాంకేతికత పరిచయం అయ్యింది. మనం ఇప్పుడు వాడుతున్న చాలా సదుపాయాలు ఈ సాంకేతిక నుంచి మొదలైనవే. వేగవంతమైన మొబైల్ ఇంటర్నెట్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్ వంటి సదుపాయాలు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యాయి. 4G: దేశంలో చాలా వరకు వాడుకలో ఉన్న నెట్వర్క్ ఇదే. వేగవంతమైన డేటా, వీడియో స్ట్రీమింగ్, వీడియో కాలింగ్ వంటి సదుపాయాలు ఈ నెట్ వర్క్ సొంతం. ముఖ్యంగా జియో రాకతో చాలా వరకు 2జీ, 3జీ దాదాపు కనుమరుగైనప్పటికీ.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఈ నెట్వర్క్ వాడుతున్నారు. 5G: ఇప్పటికే ఈ టెక్నాలజీ కొన్ని ప్రాంతాల్లో వాడుతున్నా పూర్తిస్థాయిలో ఇంకా దాన్ని వినియోగించట్లేదు. 4జీ కంటే కొన్ని రెట్ల వేగంతో ఇంటర్నెట్ పనిచేస్తుంది. 4జీలో ఒక సినిమా డౌన్లోడ్ కావాలంటే కొన్ని నిమిషాలు పడితే.. ఇందులో రెప్పపాటులోనే అల్ట్రా హెచ్డీ సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: రూ.96వేల కోట్ల స్పెక్ట్రమ్ వేలానికి తేదీ ఖరారు.. అసలు స్పెక్ట్రమ్ అంటే.. ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే వీఆర్, ఏఆర్ సాంకేతికతలో వేగం పెరగనుంది. భద్రతతో కూడిన రవాణా వ్యవస్థ, రిమోట్ ప్రాంతాలకు ఆరోగ్యసేవలు, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, సరకు రవాణాలో డిజిటల్ సేవలు వంటి ఎన్నో అంశాల్లో 5జీ కీలకం కానుంది. రిమోట్ ఆధారిత సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
రూ.8,200కే 5జీ స్మార్ట్ఫోన్.. విడుదల ఎప్పుడంటే..
భవిష్యత్తును శాసించే టెక్నాలజీల్లో 5జీ సాంకేతికత ప్రధానమైంది. మనం ప్రస్తుతం వాడుతున్న ఇంటర్నెట్ను కంటే మరింత వేగంగా అందించేలా ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్స్ వస్తువులు 5జీ టెక్నాలజీకి అనువుగా పనిచేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సాంకేతికతకు సరిపడే మొబైల్ఫోన్లను కొనుగోలు చేయాలి. అలాంటి వారికి రిలయన్స్, క్వాల్కామ్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. తక్కువ ధరకే 5జీ చిప్ ఆధారిత స్మార్ట్ఫోన్లను విడుదల చేసే యోచనలో ఉన్నట్లు అమెరికాకు చెందిన సెమీకండక్టర్ సంస్థ క్వాల్కామ్ తెలిపింది. ధర 99 డాలర్ల లోపు (సుమారు రూ.8,200) ఉండనుంది. గిగాబిట్ 5జీ స్పీడ్కు కట్టుబడి ఉన్నామని చెబుతూ... ఈ చిప్లో 2 యాంటెనా 5జీ స్టాండలోన్ (ఎస్ఏ- 2ఆర్ఎక్స్) సొల్యూషన్ ఉందని, దీని వల్ల ఈ ధరల విభాగంలోని 4జీ కంటే కూడా 5 రెట్ల వరకు అధిక వేగం ఉంటుందని పేర్కొంది. ఇదీ చదవండి: ప్రముఖ యాప్లో కాల్రికార్డింగ్ ఫీచర్.. ఫోన్లలో ఈ చిప్ను వాడటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా 280 కోట్ల మందికి 5జీ సాంకేతికతను అందుబాటులోకి తేవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చిప్తో కూడిన మొదటి ఫోను ఈ ఏడాది చివరినాటికి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ స్థాయి చిప్ ఆధారిత స్మార్ట్ఫోన్ను అభివృద్ధి చేయడంతో భాగంగా రిలయన్స్ జియోతో పాటు ఇతర ఫోన్ల తయారీ కంపెనీలతో క్వాల్కామ్ ఒప్పందం చేసుకోనున్నట్లు తెలుస్తుంది. -
6జీ టెక్నాలజీపై పరిశోధనకు ప్రతిష్టాత్మక కంపెనీల జట్టు
టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సాంకేతిక పరికరాలను మరింత సమర్థంగా తయారుచేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వాటిలో చాలామార్పులు చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలను తీర్చేలా డేటాలోనూ, దాని వేగంలోనూ మరిన్ని పరిశోధనలు జరగాలని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం వాడుతున్న 5జీకి బదులు 6జీపై ఎన్నో సంస్థలు ఇప్పటికీ పరిశోధనలు చేస్తున్నాయి. తాజాగా సమాజంపై నేరుగా ప్రభావం చూపనున్న 6జీ సాంకేతికత, 6జీ వినియోగంపై సంయుక్తంగా పరిశోధన చేసేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), నోకియా భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులో 6జీ పరిశోధనలకు అవసరమయ్యే ల్యాబ్ను సైతం ప్రారంభించారు. రేడియో టెక్నాలజీస్, ఆర్కిటెక్చర్, ఎయిర్ ఇంటర్ఫేస్లో మెషీన్ లెర్నింగ్ యాప్ అప్లికేషన్.. ఈ మూడు విభాగాల్లో పరిశోధనలు చేస్తారని నోకియా తెలిపింది. ఐఐఎస్సీతో జట్టు కట్టడం ద్వారా భారత్లో 6జీ సాంకేతికతపై తాము ఇచ్చిన హామీని మరింత ముందుకు తీసుకెళ్లనున్నామని నోకియా పేర్కొంది. ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ పరిశోధనలు ఉంటాయని, అయితే భారత్లో సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రాధాన్యం ఇస్తామని వివరించింది. ఇదీ చదవండి: 2024లో జీతం ఎంత పెరుగుతుందో తెలుసా..? ఇంధన సామర్థ్య కమ్యూనికేషన్ వ్యవస్థలు, నెట్వర్క్ల సామర్థ్యాన్ని మెరుగపర్చడం, ఏఐ వినియోగం, రవాణా భద్రతను మెరుగుపర్చడం, ఆరోగ్య సంరక్షణ, విద్య వ్యాప్తి విస్తరణ నిమిత్తం నెట్వర్క్ సెన్సార్ సాంకేతికతలను అభివృద్ధి చేయడం లాంటి వాటిపై ఈ పరిశోధనల సాగే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్సైట్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
జియో, ఎయిర్టెల్ కొత్త రీచార్జ్.. ప్లాన్ ఒక్కటే! మరి బెనిఫిట్లు..
దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జియో రూ.666 ప్లాన్ ➥ 84 రోజుల వ్యాలిడిటీ ➥ 84 రోజుల పాటు అన్ని నెట్వర్క్లకు ఉచిత కాలింగ్ ➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు. ➥ రోజుకు 100 SMS ➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్స్క్రిప్షన్లు ఎయిర్టెల్ రూ.666 ప్లాన్ ➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు. ➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ ➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్స్క్రిప్షన్ ➥ వింక్ మ్యూజిక్తోపాటు హలో ట్యూన్స్కి ఉచిత సబ్స్క్రిప్షన్ ఈ ప్లాన్లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్టెల్కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్లలో దేనినైనా ఎంచుకోవచ్చు. -
సిమ్ కార్డ్, నెట్ లేకుండానే వీడియోలు.. ఎలాగంటే..
మొబైల్ వినియోగదారులు త్వరలో సిమ్ కార్డ్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా వీడియోలను చూడవచ్చు. సమీప భవిష్యత్తులో డైరెక్ట్ టు మొబైల్(డీ2ఎం) ప్రసారాలు అందుబాటులోకి రానున్నాయి. బ్రాడ్ కాస్టింగ్ సమ్మిట్ను ఉద్దేశించి కేంద్ర సమాచార, ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర మాట్లాడారు. దేశీయంగా అభివృద్ధి చేసిన డైరెక్ట్ టు మొబైల్ (డీ2ఎం) సాంకేతికతకు సంబంధించిన ట్రయల్స్ త్వరలో దేశంలోని 19 నగరాల్లో జరుగుతాయని చెప్పారు. ఇందుకోసం 470-582 మెగాహెర్డ్జ్ స్పెక్ట్రమ్ను కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం బ్రాడ్కాస్టింగ్లో వీడియో ట్రాఫిక్ను 25 నుంచి 30 శాతం డీ2ఎంకి మార్చడం వల్ల 5జీ నెట్వర్క్లు అన్లాగ్ అవుతాయని అపూర్వ చంద్ర అన్నారు. తద్వారా దేశ డిజిటల్ పరిణామాన్ని వేగవంతం చేసి కంటెంట్ డెలివరీని మరింత అందుబాటులోకి తీసుకురావచ్చుని అభిప్రాయపడ్డారు. గతేడాది డీ2ఎం సాంకేతికతను పరీక్షించడానికి బెంగళూరు, నోయిడా వంటి ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్ట్లు జరిగాయన్నారు. దేశంలో 69 శాతం కంటెంట్ను వీడియో ఫార్మాట్లోనే చూస్తున్నారని చెప్పారు. అయితే వీడియోలను అధికంగా వీక్షిస్తున్నపుడు మొబైల్ నెట్వర్క్ల వల్ల డేటాకు కొంత అంతరాయం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కంటెంట్ బఫర్ అవుతుందని చంద్ర తెలిపారు. సాంఖ్య ల్యాబ్స్ , ఐఐటీ కాన్పూర్ అభివృద్ధి చేసిన డీ2ఎం టెక్నాలజీను టెలికమ్యూనికేషన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో, ఆడియో, డేటా సిగ్నల్లను నేరుగా మొబైల్ లేదా స్మార్ట్ పరికరాల్లో ప్రసారం చేసే అవకాశం ఉంది. ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! దేశంలోని దాదాపు 28 కోట్ల కుటుంబాల్లో కేవలం 19 కోట్ల టెలివిజన్ సెట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 80 కోట్ల స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ డీ2ఎం సాంకేతికత అందుబాటులోకి వస్తే స్మార్ట్ఫోన్ల వినియోగం ఒక బిలియన్(100 కోట్లు)కు చేరుకుంటుందని అంచనా. ఈ టెక్నాలజీ ద్వారా డేటా ట్రాన్స్మిషన్ ఖర్చులు తగ్గుతాయని, సమర్థమైన నెట్వర్క్ లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్వర్క్తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
1.5 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..
ముంబై: టెలికం రంగంలో మానవ వనరుల కొరత తగ్గించాలన్న లక్ష్యంతో టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ (టీఎస్ఎస్సీ) వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మంది అభ్యర్థులకు టెలికం, సంబంధిత అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో శిక్షణ, ఉద్యోగావకాశాలను కల్పించాలని యోచిస్తోంది. సాంకేతిక రంగం ముఖ్యంగా 5జీ ప్రారంభంతో టెలికం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని, తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్ని కలిగి ఉంది. టెలికంలో పెరుగుతున్న ఈ డిమాండ్ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికం, సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు టీఎస్ఎస్సీ సీఈవో అరవింద్ బాలి తెలిపారు. భారత్లో మూడవ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ) ప్రవాహంలో దాదాపు 6.5 శాతం వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5జీ చందాదార్లలో భారత్ 11 శాతం వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్ధేశించిన టెక్కోజాబ్స్ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు, 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. -
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
-
10 కోట్ల మంది 5జీ యూజర్లు..
దేశవ్యాప్తంగా 738 జిల్లాల్లో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచి్చన నేపథ్యంలో సుమారు 10 కోట్ల మంది సబ్్రస్కయిబర్స్ ఈ సరీ్వసులను వినియోగించుకుంటున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ తెలిపారు. టెలికం సంస్థలు 2022లో వేలంలో కొనుక్కున్న స్పెక్ట్రం కోసం రూ. 1.5 లక్షల కోట్లు వెచి్చంచడంతో పాటు మొత్తం మీద రూ. 2 లక్షల కోట్ల మేర ఇన్వెస్ట్ చేస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా భారత్లోనే 5జీ సేవలు విస్తరించాయని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించేందుకు, లిక్విడిటీని మెరుగుపర్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత కొన్నాళ్లుగా చేపట్టిన సంస్కరణలు టెలికం రంగ వృద్ధికి తోడ్పడ్డాయని చౌహాన్ చెప్పారు. -
వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్
దేశంలోని మూడో అతిపెద్ద టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో భారత మార్కెట్లో 5జీ నెట్వర్క్ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. వొడాఫోన్ ఐడియా 5జీ 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు వొడాఫోన్ ఐడియా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. ఢిల్లీ, పూణేలోని నిర్దిష్ట ప్రాంతాల్లోని ప్రజలు ఇప్పటికే 'విఐ 5జీ రెడీ సిమ్' ఉపయోగించి కనెక్షన్ పొందవచ్చు అని పేర్కొంది. దేశంలో వొడాఫోన్ ఐడియా 5జీ సేవలకు ఊతం ఇచ్చేలా వొడాఫోన్ ఐడియా ఆగస్టులో 26జీహెచ్, 3.3జీహెచ్జెడ్ బ్యాండ్లను ఉపయోగించి పూణేలో 5G సేవలను విజయవంతంగా పరీక్షించింది. గత ఏడాది జులైలో స్పెక్ట్రమ్ వేలం అయితే, గత ఏడాది జూలై నెలలో జరిగిన 5జీ స్పెక్ట్రం వేలంలో 17 టెలికం సర్కిళ్లను సొంతం చేసుకుంది. కానీ వాటిల్లో 15 సర్కిళ్లలో 5జీ నెట్వర్క్ని అందించలేమని ఆ సంస్థ సీఈవో అక్షయ్ మూంద్రా తెలిపారు. ఆసక్తికర పరిణామాలు ఈ నేపథ్యంలో ఇండియా ముబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ఈవెంట్లో వొడాఫోన్ ఐడియా నాన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కుమార్ మంగళం బిర్లా మాట్లాడుతూ.. దేశంలో 5జీ సేవల్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాదు దశల వారీగా 4జీ, 5జీ సేవల్ని కస్టమర్లకు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ తరుణంలో వొడాఫోన్ 5జీ సేవలు రానున్నాయనే నివేదికలతో టెలికం రంగంలో ఆసక్తిర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. -
అందుబాటు చార్జీల్లో టెలికం సేవలే ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకగా టెలికం సరీ్వసులు భారత్లో అందుబాటులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించాకా ఇప్పటివరకు టెల్కోలు వాటి నుంచి పూర్తి స్థాయిలో ఆదాయాన్ని అందుకోవడం ఇంకా మొదలుపెట్టని నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ నెట్వర్క్పై చేస్తున్న పెట్టుబడులను టెల్కోలు తిరిగి రాబట్టుకోవాలంటే వచ్చే మూడేళ్లలో ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 270–300గా ఉండాలనేది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయంగా సగటున ఏఆర్పీయూ రూ. 600–850గాను, చైనాలో రూ. 580గాను ఉండగా.. భారత్లో ఇది రూ. 140–200 స్థాయిలో ఉంది. మరోవైపు, 6జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి సారథ్యం వహించే స్థాయిలో ఉండాలని టెలికం రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం పరిశ్రమ, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో భారత్ 6జీ కూటమిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో యాంటెన్నా గ్రూప్, వేవ్ఫామ్ గ్రూప్, ఎక్విప్మెంట్ గ్రూప్ అంటూ వివిధ గ్రూప్లు ఉన్నాయని, అవన్నీ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. టెలికం రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని వివరించారు. టెలికం టారిఫ్లు మరింత పెరగాలి భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ వ్యాఖ్యలు భారత్లో టెలికం టారిఫ్లు అత్యంత చౌకగా ఉన్నాయని, ఇవి ఇంకా పెరగాల్సి ఉందని భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం పరిశ్రమ లాభదాయకంగా మారాల్సిన అవసరం ఉందని ఇన్వెస్టర్లతో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘పెట్టుబడులను కొనసాగించాలన్నా, భారత్ నిర్దేశించుకున్న డిజిటల్ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడాలన్నా టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి. సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయంపరంగానైనా (ఆర్పు), ప్రతి జీబీకి రేటుపరంగానైనా భారత్లో టారిఫ్లు చాలా చౌకగా ఉన్నాయి. ఇవి పెరగాల్సిన అవసరం ఉంది. టారిఫ్లు పెరుగుతాయా లేదా అనేది కాదు ప్రశ్న.. ఎప్పుడు పెరుగుతాయనేదే ప్రశ్న. అయితే, ఇదంతా మా చేతుల్లో లేదు. వేచి చూడటం తప్ప‘ అని ఆయన పేర్కొన్నారు. 5జీ విషయానికొస్తే నాణ్యమైన సర్వీసులను అందుబాటు ఉంచుతూనే ఓవరాల్గా టారిఫ్ల పెంపు కొనసాగించాలనేది తమ ఉద్దేశమని విఠల్ తెలిపారు. 5జీ నెట్వర్క్ను అత్యంత వేగంగా, అత్యధికంగా ఏర్పాటు చేసామంటూ దండోరా వేసుకునేందుకు తామేమీ పోటీపడటం లేదని విఠల్ చెప్పారు. 5జీ అనేది దీర్ఘకాలిక ప్రయాణమని, ఈ టెక్నాలజీ ఉపయోగపడే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ ఉచితంగా లభిస్తున్నందుకే వినియోగం అత్యధికంగా ఉంటోందని, టారిఫ్లు వేసినప్పటి నుంచే అసలైన వినియోగం తెలుస్తుందని విఠల్ అభిప్రాయపడ్డారు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ను ఆశించవచ్చు. ఫ్లిప్కార్ట్ బిగ్ దీపావళి సేల్లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
5జీ కోసం వీఐ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) రాబోయే త్రైమాసికాల్లో భారత్లో 5జీ సేవలు ప్రారంభించేందుకు, అలాగే 4జీ కవరేజీని విస్తరించడానికి భారీగా పెట్టుబడులు చేస్తుందని దిగ్గజ పారిశ్రామికవేత్త కుమార్ మంగళం బిర్లా ఇండియా మొబైల్ కాంగ్రెస్ వేదికగా వెల్లడించారు. ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్తోసహా క్లిష్ట, అభివృద్ధి చెందుతున్న విభాగాల్లో బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ దృష్టిని సాకారం చేయాలని కంపెనీ నిశ్చయించుకుందని ఆయన చెప్పారు. జియోస్పేస్ఫైబర్.. మారుమూల ప్రాంతాలకు హై–స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడానికి భారత్లో మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగా ఫైబర్ సేవలైన జియోస్పేస్ఫైబర్ను విజయవంతంగా ప్రదర్శించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ సేవలు అత్యంత సరసమైన ధరలలో దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ జియో పెవీలియన్లో ప్రధాని నరేంద్ర మోదీకి జియోస్పేస్ ఫైబర్తో సహా కంపెనీ అభివృద్ధి చేసిన స్వదేశీ సాంకేతికత, ఉత్పత్తుల గురించి వివరించారు. -
జియో గుడ్న్యూస్.. ఆ కస్టమర్లే టార్గెట్!
దేశంలో అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio).. కోట్లాది మంది టెలికం కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 5జీ ప్లాన్లు విస్తరిస్తున్నప్పటికీ టారిఫ్లు మాత్రం పెంచబోమని హామీ ఇచ్చింది. దేశంలోని మిగతా అన్ని టెలికమ సంస్థల కంటే తమ రీచార్చ్ ప్లాన్లు చవగ్గానే ఉంటాయని వెల్లడించింది. అసలు టార్గెట్ వారే.. టెలికం పరిశ్రమలో రిలయన్స్ జియో దూకుడును మరింత పెంచింది. రానున్న రోజుల్లో 5జీ ప్లాన్లపైన కూడా టారిఫ్లను పెంచబోమని ప్రకటించింది. అయితే దీని వెనుక అసలు టార్గెట్ వేరే ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికీ 2జీ నెట్వర్క్ను ఉపయోగిస్తున్న 24 కోట్ల మందికిపైగా ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా, బీఎస్ఎన్ఎల్/ఎమ్టీఎన్ఎల్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని ఈ "సరసమైన టారిఫ్లు" ప్రకటన చేసినట్లు అర్థమవుతోంది. అంబానీల దృష్టి కూడా అదే.. జియో ప్రెసిడెంట్ మాథ్యూ ఊమెన్ మాట్లాడుతూ.. కంపెనీ టారిఫ్లను నాటకీయంగా పెంచాలని భావించడం లేదని, యూజర్లు ఇంటర్నెట్-హెవీ, డేటా ప్లాన్లకు మారుతున్న నేపథ్యంలో కస్టమర్లను మరింత పెంచుకోవడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఛైర్మన్ ఆకాష్ అంబానీల దృష్టి కూడా అదేనని ఆయన వివరించారు. ఇదీ చదవండి: 70 hours work: ఆయనైతే 90 గంటలు పనిచేసేవారు.. భర్తకు అండగా సుధామూర్తి -
ఇప్పటికే దేశంలో 4లక్షల 5జీ బేస్స్టేషన్లు: ప్రధానిమోదీ
న్యూదిల్లీలోని ప్రగతిమైదాన్లో ఏర్పాటు చేసిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023ను శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించి మాట్లాడారు. దేశం ప్రస్తుతం 6జీ దిశగా అడుగులు వేస్తోందన్నారు. 5జీని అందుబాటులోకి తీసుకొచ్చిన ఏడాదిలోపే దేశవ్యాప్తంగా నాలుగు లక్షల 5జీ బేస్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. బ్రాడ్బ్యాండ్ వేగంలో భారత్ గతంలో 118 ర్యాంక్లో ఉండగా..ఇప్పుడు 43వ ర్యాంక్కు చేరిందని తెలిపారు. ఇటీవలే గూగుల్.. భారత్లో పిక్సెల్ ఫోన్ను తయారు చేయనున్నట్లు ప్రకటించిందన్నారు. శామ్సంగ్ ఫోల్డ్ 5, యాపిల్ ఐఫోన్ 15 ఇప్పటికే దేశంలో తయారవుతున్నాయని గుర్తచేశారు. ప్రపంచమంతా మేడ్ ఇన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తుండటం గర్వంగా ఉందని మోదీ కొనియాడారు. భారత టెక్ విప్లవంలో యువత పాత్ర కీలకమని, అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. 6జీ టెక్నాలజీలో భారత్ ప్రపంచానికి మార్గనిర్దేశంగా నిలుస్తుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. -
85 శాతం 5జీ నెట్వర్క్ మాదే: ఆకాశ్ అంబానీ
న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ సర్వీసులకు సంబంధించి 85 శాతం నెట్వర్క్ను తామే నెలకొల్పామని రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ తెలిపారు. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్ను ఏర్పాటు చేస్తున్నామని బ్రాడ్బ్యాండ్ స్పీడ్ టెస్ట్ సంస్థ ఊక్లా విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. తొలుత చెప్పిన 2023 డిసెంబర్ గడువుకన్నా ముందుగానే దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ను విస్తరించగలిగామని అంబానీ తెలిపారు. "నిబద్ధతతో కూడిన ట్రూ 5జీ రోల్అవుట్లో మా వేగం గురించి నేను ప్రత్యేకంగా గర్విస్తున్నాను. మేము వాగ్దానం చేసిన 2023 డిసెంబరు కాలపరిమితి కంటే ముందే దేశమంతటా బలమైన ట్రూ 5జీ నెట్వర్క్తో కవర్ చేశాం. భారతదేశంలో మొత్తం 5జీ నెట్వర్క్లో 85 శాతం జియో నెలకొల్పినదే. ప్రతి 10 సెకన్లకు ఒక 5జీ సెల్ని ఏర్పాటు చేస్తున్నాం" అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు. టెలికం శాఖ గణాంకాల ప్రకారం దేశీయంగా 3.38 లక్షల పైచిలుకు 5జీ నెట్వర్క్ బేస్ స్టేషన్లు ఉన్నాయి. ఊక్లా ప్రకారం.. మొత్తం తొమ్మిది స్పీడ్టెస్ట్ విభాగాల్లోనూ అవార్డులను దక్కించుకుని భారత్లో జియో నంబర్ వన్ నెట్వర్క్గా నిల్చింది. -
5జీ ఫోన్లపై ఆసక్తికర సర్వే.. ఎంత మంది అప్గ్రేడ్ అయ్యారు?
న్యూఢిల్లీ: దేశీయంగా అల్ట్రా హై–స్పీడ్ టెలికం సర్వీసుల వినియోగం వేగవంతమవుతున్న నేపథ్యంలో 5జీ స్మార్ట్ఫోన్ యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటి నుంచి డిసెంబర్ ఆఖరులోగా 3.1 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు 5జీ ఫోన్లకు అప్గ్రేడ్ కానున్నారు. ప్రస్తుతం 5జీ హ్యాండ్సెట్ యూజర్ల సంఖ్య 8 నుంచి 10 కోట్ల మధ్యలో ఉంది. స్వీడన్కు చెందిన టెలికం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ రూపొందించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వినూత్నమైన, వైవిధ్యమైన 5జీ కనెక్టివిటీ సేవల కోసం కాస్త ఎక్కువ చెల్లించేందుకు కూడా కస్టమర్లు సిద్ధంగానే ఉన్నట్లు నివేదిక తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది అక్టోబర్లో దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించారు. టెలికం సంస్థలైన రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్ గత కొద్ది నెలలుగా వీటిని విస్తృతంగా అందుబాటులోకి తెచ్చాయి. ఇటీవలి ఊక్లా నివేదిక ప్రకారం 5జీ సేవల ఆవిష్కరణతో భారత్లో మొబైల్ డౌన్లోడ్ స్పీడ్ గణనీయంగా పెరిగింది. స్పీడ్టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్లో జపాన్, బ్రిటన్, బ్రెజిల్ను కూడా దాటేసి, 72 స్థానాలు ఎగబాకి భారత్ 47వ ర్యాంకుకు చేరుకుంది. 5జీని ప్రవేశపెట్టాక భారత్లో స్పీడ్ 3.59 రెట్లు పెరిగింది. సర్వేలోని మరిన్ని ముఖ్యాంశాలు.. మనకన్నా ముందు నుంచే 5జీ సేవలను వినియోగిస్తున్న అమెరికా, బ్రిటన్, దక్షిణ కొరియా, చైనాతో పోలిస్తే భారత్లో యూజర్లు సగటున వారానికి రెండు గంటలు ఎక్కువ సమయాన్ని 5జీ సర్వీసులపై వెచ్చిస్తున్నారు. 5జీని ముందుగా అందుబాటులోకి తెచ్చిన మార్కెట్లతో పోలిస్తే భారత్లో 5జీపై సంతృప్తి స్థాయి అధికంగా ఉంది. 15 శాతం మంది వినియోగదారులు తమ 5జీ ప్లాన్లకు వీడియో ఆన్ డిమాండ్, గేమింగ్, మ్యూజిక్ వంటి అప్లికేషన్స్ను జోడించుకునేందుకు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ సర్వీసుల కోసం 14 శాతం ప్రీమియం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. నెలాఖరు వచ్చేసరికి 31 శాతం మంది 5జీ యూజర్లే తమ ప్లాన్లలో లభించే డేటాను పూర్తిగా వినియోగిస్తున్నారు. 58 శాతం మంది యూజర్ల ఖాతాల్లో 30 జీబీ పైగా డేటా మిగిలిపోతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రాధాన్యతలు, వినియోగ ధోరణులకు అనుగుణంగా డేటా వ్యూహాలను టెల్కోలు సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. -
వేగం పెంచిన ఇండియా.. గ్లోబల్ ర్యాంకింగ్లో ఇలా..
భారతదేశం టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో 5జీ సేవలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా డౌన్లోడ్ స్పీడ్ మరింత పెరుగుతోంది. దీంతో ఇండియా గొప్ప పురోగతిని చూపించి తాజాగా మంచి ర్యాంక్ సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా ప్రస్తుతం 47వ స్థానం పొందినట్లు ఊక్లా (Ookla) నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకంటే భారత్ ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కొన్ని G20 దేశాలైన మెక్సికో (90వ స్థానం), టర్కీ (68వ), యూకే (62వ), జపాన్ (58వ), బ్రెజిల్ ( 50వ స్థానం), దక్షిణాఫ్రికా (48వ స్థానం) కూడా ఇండియా కంటే వెనుకబడి ఉన్నట్లు ఊక్లా ఎంటర్ప్రైజ్ ప్రిన్సిపల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సిల్వియా కెచిచే తెలిపారు. 5జీ సర్వీస్ ప్రారంభమైన తరువాత దేశంలో ఇంటర్నెట్ వేగం దాదాపు 3.59 రేట్లు పెరిగింది. సెప్టెంబర్ 2022లో డౌన్లోడ్ స్పీడ్ 13.87 Mbpsగా ఉండేది. కాగా 2023 ఆగష్టులో డౌన్లోడ్ స్పీడ్ 50.21 Mbpsకి చేరింది. ఈ కారణంగానే గ్లోబల్ ర్యాంకింగ్లో 119 స్థానాల నుంచి 47వ స్థానానికి చేరింది. ఇప్పటికే చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నాయి. 2003లో మొబైల్ నెట్వర్క్ను ప్రారంభించిన చివరి రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ ఒకటి. ఇక్కడ భద్రతా సమస్యలు, ఇంటర్నెట్ షట్డౌన్ల కారణంగా.. మొబైల్ నెట్వర్క్ సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడేవి. నేడు అక్కడ కూడా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్క నెయిల్ పాలిష్ ఇన్ని కోట్లా..!! ఆ డబ్బుతో మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు! ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచడానికి.. ఎయిర్టెల్ 'Airtel Xstream AirFiber'ని ఢిల్లీ, ముంబైలలో ఆగస్ట్ 2023లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు జియో ఇటీవల ఎయిర్ ఫైబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, ముంబై, పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది. -
టెక్నో తొలి ఫ్లిప్ మొబైల్: ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ..ధర తక్కువే!
Tecno Phantom V Flip 5G చైనా మొబైల్ తయారీదారు టెక్నో తొలి ఫ్లిప్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీని శుక్రవారం ఆవిష్కరించింది. చక్కటి డిజైన్, బ్యూటిఫుల్ లుక్, అత్యాధునిక టెక్నాలజీతోపాటు, అందుబాటులో ధరలో యూజర్లను ఆకట్టుకోనుంది. కేవలం 15 నిమిషాల్లో 50 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే టెక్ డైమెన్సిటీ 8050 5జీ చిప్ సెట్ 64MP+13MP+32MP కెమెరా స్పెషల్ ఫీచర్గా నిలుస్తోంది. ధర లభ్యత, ప్రస్తుతానికి సింగపూర్ ఆవిష్కరించిన ఫాంటమ్ వి ఫ్లిప్ 5 జీ ఫోన్ అక్టోబర్ 1న ఇండియాలో లాంచ్ అవుతుందనీ, అదే రోజు మధ్యాహ్నం 12 గంటలనుంచి అమెజాన్ లో సేల్ షురూ అవుతుందని కూడా టెక్నో ప్రకటించింది. అంతేకాదు స్పెషల్ ఆఫర్గా ఈ ఫ్లిప్ ఫోన్ ధరను రూ. 49,900 కే అందించనుంది. మిస్టిక్ డాన్ , ఐకానిక్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభించనుంది. స్పెసిఫికేషన్లు 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ మెయిన్ స్క్రీన్ 1.3 అంగుళాల అమోల్డ్ స్క్రీన్ HiOS 13.5 ఆపరేటింగ్ సిస్టం 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 32 ఎంపీ డ్యూయల్-ఫ్లాష్ ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ 45 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్టు -
ఓటీటీలు డబ్బు కట్టకుండా 5జీని వాడుకుంటున్నాయ్
న్యూఢిల్లీ: ఓవర్ ది టాప్ (ఓటీటీ) సంస్థలు ఎలాంటి చెల్లింపులు చేయకుండా 5జీ నెట్వర్క్ను వాడుకుంటున్నాయని సెల్యులార్ ఆపరేటర్ల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఆరోపించారు. వాటిని వాడుకుంటున్నందుకు గాను ఆయా సంస్థలు తమకు వచ్చే లాభాల్లో కొంతైనా టెల్కోలకు చెల్లించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘టెల్కోలు తమ వాయిస్, డేటా ట్రాఫిక్ కోసం నెట్వర్క్ను ఉపయోగిస్తాయి. అయితే, ఓటీటీ సంస్థలు మాత్రం భారీ డేటా చేరవేత కోసం ఈ నెట్వర్క్లపై పెను భారం మోపుతున్నాయి. కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకున్న డేటాను తమ ప్లాట్ఫాం ద్వారా యూజర్లకు చేరవేస్తాయి. ఈ ప్రక్రియలో ఉపయోగించుకునే నెట్వర్క్ను ఏర్పాటు చేసిన సంస్థలకు మాత్రం పైసా చెల్లించడం లేదు‘ అని కొచర్ చెప్పారు. ఓవైపున 5జీ వంటి అధునాతన టెక్నాలజీ నెట్వర్క్ల ఏర్పాటు కోసం భారీగా పెట్టుబడులు పెట్టలేక టెల్కోలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే ఓటీటీ ప్లాట్ఫామ్లు మాత్రం వాటితో లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సదరు నెట్వర్క్లను ఏర్పాటు చేసి, నిర్వహిస్తున్నందుకు గాను టెల్కోలకు ఓటీటీలు తమకు వచ్చే లాభాల్లో సముచిత వాటాను ఇవ్వాలని కొచర్ పేర్కొన్నారు. నెట్వర్క్లు, డిజిటల్ కనెక్టివిటీ, స్మార్ట్ఫోన్ల వినియోగం మెరుగుపడిన నేపథ్యంలో భారత్లో వీడియో ఓటీటీ మార్కెట్ 2030 నాటికి 12.5 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, సోనీలైవ్ వంటి ఓటీటీ సంస్థలకు భారత్లో పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. -
జియో వినియోగదారులకు ముఖేష్ అంబానీ శుభవార్త!
జియో వినియోగదారులకు రిలయన్స్ శుభవార్త చెప్పింది. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా ఎయిర్ఫైబర్ను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జియో ఎయిర్ఫైబర్, జియో 5జీ గురించి కీలక ప్రకటన చేశారు. జియో ఎయిర్ఫైబర్ ఎలా పనిచేస్తుందంటే? జియో ఎయిర్ఫైబర్ డివైజ్ సాయంతో వైఫై తరహాలో ఎటువంటి వైర్లు లేకుండా ఇంట్లో 5జీ ఇంటర్నెట్, హాట్స్పాట్ వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్ఫైబర్ డివైజ్ను ఆఫ్, ఆన్ చేస్తే సరిపోతుంది. సులభంగా, వేగంగా ఇంట్లో, ఆఫీస్లో గిగాబైట్ (సెకనుకు వెయ్యి మెగాబైట్స్) స్పీడ్ ఇంటర్నెట్ను ఉపయోగించుకోవచ్చు. ఫైబర్ ఆప్టికల్స్ వర్సెస్ జియో ఎయిర్ఫైబర్ సాధారణంగా బ్రాండ్ బ్యాండ్ సేవలు ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్తో పాటు, మోడెమ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. జియో ఎయిర్ఫైబర్ విషయానికొచ్చేసరికి దీనికి కేబుల్స్తో పనిలేదు. ఇదో సింగిల్ డివైజ్. దగ్గర్లోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి. గత ఏడాది ఎయిర్ఫైబర్ గురించి జియో వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. అందులో ఇంట్లో జియోఫైబర్తో పిల్లలు వినియోగించే యాప్స్, వెబ్సైట్స్ను కుటుంబసభ్యులు కంట్రోల్ చేయొచ్చు. సంబంధిత వెబ్సైట్లను, యాప్స్ను ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా బ్లాక్ చేసే సౌలభ్యం ఉన్నట్లు పేర్కొంది. 5జీ నెట్వర్క్తో 1.5జీబీపీఎస్ స్పీడ్ పొందవచ్చని తెలిపింది. జియో ఎయిర్ఫైబర్ ధర గత ఏడాది అక్టోబర్లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC)లో 5జీ నెట్వర్క్తో పాటు జియో ఎయిర్ ఫైబర్ డివైజ్ గురించి ప్రస్తావించింది. తాజాగా ఆ డివైజ్ను ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. పలు నివేదికలు.. జియో ఎయిర్ఫైబర్ ధర ఎంత ఉంటుందో ఓ అంచనా వేశాయి. వాటి ఆధారంగా పోర్టబుల్ రూటర్లను (జియోఫై ఎం2ఎస్) రూ. 2,800కి, మెష్ ఎక్స్టెండర్ (వైఫై ధర రూ. 2,499), జియో ఎక్స్టెండర్ 6 మెష్ వైఫై సిస్టం ధర రూ. 9,999గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ సరి కొత్త వైర్లెస్ రూటర్ ధర రూ. 10,000 ఉంటుందని పరిశ్రమల వర్గాలు అంచనా వేస్తున్నాయి. జియో ఎయిర్ ఫైబర్ ధర ఎంతనేది అధికారంగా వెల్లడించాల్సి ఉంటుంది. -
Reliance AGM 2023: రిలయన్స్ ప్రకటనపై ఉత్కంఠ
ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం ఆగస్టు 28న జరగనుంది. 2016లో జియో టెలికాం నెట్ వర్క్ లాంఛింగ్ అనంతరం రిలయన్స్ నిర్వహించే ఏజీఎం సమావేశాలపై ఆసక్తి మొదలైంది. సామాన్యులకు కనెక్ట్ అయ్యేలా ప్రతీ ఏజీఎంలోనూ ఏదో ఒక ప్రకటన ఉంటూ వస్తోంది. దీంతో ఈసారి ఏజీఎంలో ఎలాంటి ప్రకటన ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది. టెలికాం, రిటైల్, ఎనర్జీ వంటి కీలక రంగాలపై ఈసారి ప్రకటనలు ఉండే అవకాశం ఉంది. రిలయన్స్ జియో 2016లో దేశీయ టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎన్నో సంచలనాలకు వేదికైంది. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద టెలికాం నెట్వర్క్గా అవతరించింది. గత ఏడాది 5జీ సేవల్ని ప్రారంభించింది. ఇప్పుడు జియో వెల్కమ్ ఆఫర్ కింద 5జీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఈ ఏజీఎంలో 5జీ ప్లాన్లను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 4జీ తరహాలో ఇవి ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
జియో 5జీ @ 2 జీబీపీఎస్.. న్యూ బ్యాండ్, హై స్పీడ్!
న్యూఢిల్లీ: వేగవంతమైన 5జీ సర్వీసులను 26 గిగాహెట్జ్ మిల్లీమీటర్ వేవ్ బ్యాండ్లో ఆవిష్కరించినట్లు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వెల్లడించింది. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 2 జీబీపీఎస్ (సెకనుకు గిగాబిట్స్) స్పీడ్ను సాధించినట్లు తెలిపింది. దీనితో దేశవ్యాప్తంగా మొత్తం 22 టెలికం సర్కిళ్లలోని జియో కస్టమర్లు .. 26 గిగాహెట్జ్ వేవ్ అధారిత బిజినెస్ కనెక్టివిటీని పొందుతున్నారని జియో వివరించింది. దాదాపు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా, పూర్తి సామర్ధ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు మిల్లీమీటర్ వేవ్ ఉపయోగపడగలదని తెలిపింది. తమకు నిర్దేశించిన గడువులోగానే 22 టెలికం సర్కిళ్లలో కనీస స్థాయిలో సర్వీసులను ప్రారంభించాలన్న నిబంధనను అమలు చేయగలిగినట్లు జియో తెలిపింది. 5జీని అత్యంత వేగంగా అందుబాటులోకి తెచ్చిన సందర్భాల్లో ఇది కూడా ఒకటని వివరించింది. -
అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్.. 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోయింది!
తక్కువ ధరలో లభించే స్మార్ట్ఫోన్లకు భారత్లో అత్యంత ఆదరణ ఉంటోంది. అందులోనూ 5జీ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ మంది కొనుగోలు చేస్తారు. షావోమీ ఇండియా సబ్ బ్రాండ్ అయిన పోకో ఇండియా ఇటీవల అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్ (5G Smartphone) లాంచ్ చేసింది. పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) పేరుతో మొబైల్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ ఆఫర్ ధర కేవలం రూ.9,999 మాత్రమే. చీపెస్ట్ 5జీ స్మార్ట్ఫోన్గా రికార్డ్ సృష్టించిన ఈ స్మార్ట్ఫోన్ తొలి సేల్ ఫ్లిప్కార్ట్లో ఆగస్ట్ 9న జరిగింది. అప్పుడు సేల్ ప్రారంభమైన 15 నిమిషాల్లోనే స్టాక్ మొత్తం అమ్ముడుపోయినట్లు కంపెనీ ప్రకటించింది. త్వరలోనే మళ్లీ సేల్ నిర్వహిస్తామని చెప్పిన పోకో ఇండియా పోకో ఇండియా రెండో సేల్ను ఆగస్ట్ 12న నిర్వహించింది. ఆగస్ట్ 12న మధ్యాహ్నం 12 గంటలకు పోకో ఎం6 ప్రో 5జీ సేల్ ప్రారంభం కాగా 9 నిమిషాల్లోనే స్టాక్ అయిపోంది. రెండో సేల్కు కూడా విశేష స్పందన లభించిందని, 9 నిమిషాల్లోనే ఔట్ ఆఫ్ స్టాక్ అని పోకో ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టండన్ ట్విటర్లో షేర్ చేశారు. పోకో ఎం6 ప్రో 5జీ స్మార్ట్ఫోన్ పవర్ బ్లాక్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్లో లభిస్తోంది. రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. అయితే ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే బేస్ వేరియంట్ ఫోన్ను కేవలం రూ.9,999లకే సొంతం చేసుకోవచ్చు. పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్లు 90Hz రిఫ్రెష్ రేట్తో 6.79 అంగుళాల డిస్ప్లే స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 + ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్ రెండు ఓఎస్ అప్డేట్స్, మూడేళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ర్యామ్ ఎక్స్ప్యాన్షన్ ఫీచర్తో అదనంగా మరో 6జీబీ వరకు ర్యామ్ 50 ఎంపీ ఏఐ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ Today we had the second sale of #POCOM6Pro5G and it started at 12 noon and went Out of Stock in just 9 minutes. Thanks everyone for the tremendous response. #5GDisrupter #POCOM6Pro5G pic.twitter.com/k7f8QR7JR1 — Himanshu Tandon (@Himanshu_POCO) August 12, 2023 -
‘నో జీ టూ 5జీ’ : టెలికాం రంగంలో భారత్ సాధించిన అతి పెద్ద విజయం ఇదే
ఒకప్పుడు ఒక ఫోన్ కనెక్షన్ కోసం ఎలా లైన్లు కట్టేవారో, అయినవారితో మాట్లాడడం కోసం పబ్లిక్ బూత్ దగ్గర ఎలా గంటల కొద్దీ వేచి ఉండేవారో చాలామంది తమ రాతల్లో చెబుతున్నారు. 90ల తరువాత పుట్టిన తరాలకు తెలియకపోవచ్చు. కానీ పాత తరాలకు ఇవి అనుభవమే. అలా ‘నో జీ నుంచి 5 జీ’ వరకు దేశీయ టెలికాం రంగంలో పెను మార్పులే చోటు చేసుకున్నాయి. నోజీ నుంచి 2జీ, 3జీ, 4జీ, 5జీ వరకు స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ముబైల్ విప్లవంలో సంభవించిన మార్పులు గురించి తెలుసుకునే ముందు సాక్షి పాఠకులకు 76వ స్వంతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వతంత్ర భారతదేశంలో టెలిఫోన్ అనేది ఓ విలాసవంతమైన సౌకర్యం. 90లకు ముందు కొత్త ఫోన్ కనెక్షన్ కోసం దరఖాస్తుకు నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలే పట్టేది. మరణ వార్తను ఎక్కడో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలంటే రోజుల సమయం పట్టేది. దీంతో కడ చూపు చూసుకోకుండా పోయామని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించిన సందర్భాలు అనేకం. అలా బరువెక్కిన హృదయ విదారకరమైన సంఘటనల నుంచి తేరుకొని ఎన్నో విప్లవాత్మక మార్పులలో భాగమయ్యాయి. అందుకు 1991 నుండి టెలికాం రంగంలో జరిగిన మార్పులేనని చెప్పుకోవాలి. అప్పట్లో 1000 మందికి ఆరు ఫోన్లు మాత్రమే ఉండేవి. 2015లో 1 బిలియన్ ఫోన్ల మార్కును దాటింది. 24 సంవత్సరాల వ్యవధిలో ఏప్రిల్ 2022 నాటికి 1.14 బిలియన్ కనెక్షన్లను సాధించింది. స్వాతంత్ర్యం సాధించిన సమయంలో భారత్లో కేవలం 80,000 టెలిఫోన్ కనెక్షన్లు మాత్రమే ఉన్నాయని చరిత్ర చెబుతోంది. ట్రంక్ బుకింగ్ 1990లకు ముందు, వైర్లైన్ కనెక్టివిటీ చాలా తక్కువ. సర్కిల్లలో స్థానికులతో మాట్లాడే వీలుంది. వేరే ప్రాంతానికి కాల్ చేయాల్సి వస్తే ఆ వ్యక్తి ‘ట్రంక్ కాల్’ బుక్ చేసుకోవాలి. ఇందుకోసం టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లో పనిచేసే ఆపరేటర్కు కాల్ చేయాలి. వాస్తవానికి, ఇది 1970, 1980లలో ఒక సాధారణ జాబ్. ఆపరేటర్ కాల్ చేసి సాధారణ కాల్ (సాధారణ పల్స్ రేటు), అవసరమైన కాల్ (2x పల్స్ రేటు), అత్యవసర కాల్ (8x పల్స్ రేటు) మాట్లాడాలని కోరేవారు. మీరు ఎవరితో మాట్లాడాలని అనుకుంటున్నారో..వారికి కాల్ కలిసేందుకు రోజంతా పట్టేది. అయితే అవసరమైన కాల్ సాధారణంగా నాలుగు గంటలలోపు, అత్యవసర కాల్ గంటలోపు కనెక్ట్ అయ్యేది. ఆపరేటర్ కాల్ను మాన్యువల్గా కలిపేవారు. వారి సంభాషణల్ని వినే అవకాశం ఉండేది. సబ్స్క్రైబర్ ట్రంక్ డయలింగ్ (STD) 1980ల చివరలో, 1990ల ప్రారంభంలో, టెలికాం కనెక్టివిటీ మెరుగైంది. ట్రంక్ బుకింగ్ ఆపరేటర్ వ్యవస్థ కనుమరుగైంది. సాంకేతిక విస్తృతంగా వ్యాపించింది. సిటీ కోడ్ (STD కోడ్) , ఫోన్ నంబర్ను డయల్ చేసి ఆపరేటర్తో పని లేకుండా వెంటనే కనెక్ట్ అయ్యేది. కాల్ రేట్లు రాత్రి 10 గంటల తర్వాత చేసే కాల్లకు 1/4 వ వంతు ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. సూదూర ప్రాంతాలకు ఫోన్ చేసేందుకు దేశవ్యాప్తంగా STD/ISD/PCO బూత్లను ఏర్పాటు చేయడంతో STD కాల్లు చాలా మందికి కొత్త వ్యాపారం అవకాశంగా మారాయి. అయితే, మెరుగైన కనెక్టివిటీ రావడంతో, దాదాపు 2010ల వరకు STD కాల్ రేట్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అవి దూరాన్ని బట్టి దేశంలో ఎక్కడికైనా కాల్ చేయాలంటే ఒకే ధరను చెల్లించాలని వెసలు బాటు ఉంది. అలాగే, గత దశాబ్దం ప్రారంభంలో, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ (VoIP),చౌకైన సెల్ఫోన్ టారిఫ్లు STD/ISD/PCOల వ్యాపారం చేసుకునేందుకు చెల్లించే వారు. ఇంటర్నెట్ 1986 నుండి భారతదేశంలో ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. కానీ గుర్తింపు, ఎంపిక చేసిన కొన్ని పరిశోధనా సంస్థలు, యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. 1995 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే వీఎస్ఎన్ఎల్ (విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వినియోగదారులకు ఇంటర్నెట్ని అందించింది. 1995లో ఇంటర్నెట్ కనెక్షన్కు విద్యార్థి అకౌంట్కు సంవత్సరానికి రూ. 5,000, టీసీపీఐపీ Transmission Control Protocol/Internet Protocol అకౌంట్ కోసం రూ. 15,000 ఖర్చవుతుంది. 133 కేబీబీఎస్ డయల్-అప్ మోడెమ్లు ప్రమాణంగా ఉండటంతో నేటితో పోలిస్తే వేగం చాలా నెమ్మదిగా ఉంది. సాధారణ 1ఎంబీ ఫోటోను డౌన్లోడ్ చేయడానికి అరగంట సమయం పట్టేది. ప్రస్తుతం అదే ఇంటర్నెట్ సాయంతో వాయిస్, వీడియో ,డేటా కాల్లను సజావుగా చేసుకోగలుగుతున్నాం. పేజింగ్ సేవలు 1990వ దశకం మధ్యలో ఫోన్లను ఎలాగైతే వినియోగించే వారో పేజింగ్ పరికరాలు (లేదా వన్-వే కమ్యూనికేషన్ పరికరాలు) అలా వినియోగించే వారు. వీటి ధర రూ. 2,000 నుంచి రూ. 7,000 మధ్యలో ఉన్నాయి. ఈ పేజర్లతో ప్రజలు స్వేచ్ఛగా తిరిగేవారు. మనం ఇప్పుడు స్మార్ట్ఫోన్ నుంచి ఎలా అయితే కాల్ చేస్తున్నామో అప్పుడు పేజర్లతో కాల్ చేసే వెసలుబాటు ఉంది. మొబైల్ ఫోన్ విప్లవం 1995లో అప్పటి ప్రభుత్వాలు టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల్ని ఆహ్వానించాయి. దేశంలో 20 టెలికాం సర్కిల్లుగా విభజిస్తే అందులో ఒక్కో సర్కిల్కు ఇద్దరు ఆపరేటర్లు 15 ఏళ్ల లైసెన్స్ పొందేవారు. అయితే, ప్రారంభంలో సెల్ఫోన్ టారిఫ్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్కమింగ్ కాల్స్కి కూడా నిమిషానికి రూ. 16.80కి చెల్లించేవారు. 2000 సవంత్సరం ప్రారంభంలో మాత్రమే సీపీపీ (కాలింగ్ పార్టీ పేస్) ద్వారా ఇన్కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవడం ప్రారంభమైంది. ది జనరేషన్స్ భారత్లో స్మార్ట్ ఫోన్ వాడుకలోకి రావడంతో ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చింది. 2000వ దశకం ప్రారంభంలో WAP (వైర్లెస్ యాక్సెస్ ప్రోటోకాల్) ద్వారా ఫోన్ లేదా, సాధారణ టెక్స్ట్ ద్వారా ఇమెయిల్ను యాక్సెస్ చేయవచ్చు. అదే సమయంలో స్మార్ట్ ఫోన్లలో పూర్తి బ్రౌజర్ ఆధారిత ఇంటర్నెట్ యాక్సెస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. 2జీ, 3జీ, 4జీ ఇలా లేటెస్ట్ సెల్యులార్ నెట్వర్క్లను వినియోగిస్తున్నాం. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ సెల్యులార్ కాలింగ్ ఛార్జీలు ఉన్న దేశంగా కొనసాగుతుంది. భవిష్యత్లో మానవ శ్రేయస్సుతో టెలికాం రంగం మరింత అభివృద్ది జరగాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఇదీ చదవండి : స్టార్టింగ్ శాలరీ రూ.25,500.. జాబ్ కోసం అప్లయ్ చేసుకుంది 10లక్షల మంది! -
ఎయిర్టెల్ 5జీ వైర్లెస్ వైఫై ప్రారంభం.. జియో కంటే ముందుగా..
దేశంలో ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ (Xstream AirFiber) పేరిట ఫిక్స్డ్ వైర్లెస్ 5జీ సర్వీస్లను ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో తొలి 5జీ టెక్నాలజీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవలను ప్రారంభించింది. నెట్వర్క్ అందుబాటులోని మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించే ఉద్దేశంతో ఈ టెక్నాలజీ 5జీ వైర్లెస్ సేవలు అందుబాటులోకి తీసువచ్చినట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ ఎక్స్ట్రీమ్ ఎయిర్ ఫైబర్ వైర్లెస్గా 100 Mbps వేగంతో ఇంటర్నెట్ అందిస్తుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ అనేది స్వతంత్రంగా పనిచేసే ఓ ప్లగ్ అండ్ ప్లే పరికరం. వైఫై 6 ప్రమాణాలతో అంతరాయం లేకుండా విస్తృత నెట్వర్క్ కవరేజీని అందిస్తుంది. దీని ద్వారా ఏకకాలంలో 64 ఫోన్లు లేదా ల్యాప్టాప్లకు హై స్పీడ్ ఇంటర్నెట్ను పొందవచ్చు. ఈ పరికరానికి సంబంధించిన హార్డ్వేర్ పరికరాలన్నీ భారత్లోనే తయారైనట్లు కంపెనీ పేర్కొంది. గత మూడు నాలుగేళ్లుగా ఇళ్లలో ఉపయోగించే వైఫై సేవలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, ఎక్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్తో ఫిజికల్ ఫైబర్ నెట్వర్క్ సదుపాయం లేని ప్రాంతాలకు కూడా వేగవంతమైన వైఫై ఇంటర్నెట్ సేవలు అందిస్తామని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం డిల్లీ, ముంబై నగరాల్లోనే ఈ సేవలు ప్రారంభించినప్పటికీ రాబోయే రోజుల్లో దేశమంతటా విస్తరించాలని యోచిస్తోంది. 5జీ ఆధారిత ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సర్వీస్ను అధికారికంగా ప్రారంభించిన మొదటి కంపెనీ ఎయిర్టెల్. అయితే కొన్ని నెలల క్రితం జియో కూడా జియో ఎయిర్ఫైబర్ పేరుతో ఇటాంటి సర్వీసునే తీసుకురాన్నుట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి జియో ఎయిర్ఫైబర్ ధరలు ఎంత ఉంటాయి.. అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారు? అన్న వివరాలపై సమాచారం లేదు. ఎయిర్టెల్ ఎయిర్ఫైబర్ ప్లాన్ వివరాలు ఎయిర్టెల్ ఎక్స్స్ట్రీమ్ ఎయిర్ఫైబర్ నెలకు రూ. 799. హార్డ్వేర్ కాంపోనెంట్ కోసం సెక్యూరిటీ డిపాజిట్గా అదనంగా రూ. 2,500 చెల్లించాలి. మొత్తం ఆరు నెలల ప్యాకేజ్ 7.5 శాతం తగ్గింపుతో రూ. 4,435లకే అందిస్తోంది. అయితే ఎయిర్టెల్ అపరిమిత డేటాను ఆఫర్ చేస్తుందా లేదా మిగిలిన బ్రాడ్బ్యాండ్ ప్లాన్ల మాదిరిగానే పరిమితి ఉంటుందా అనేది స్పష్టత లేదు. -
అన్ని సర్కిళ్లకు జియో 5జీ విస్తరణ పూర్తి
న్యూఢిల్లీ: అన్ని సర్కిళ్లలోనూ 5జీ విస్తరణ ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేసినట్లు టెలికం సంస్థ రిలయన్స్ జియో వెల్లడించింది. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. తదుపరి టెస్టింగ్ కోసం 10% సైట్లను టర్మ్ సెల్ ఎంపిక చేయనున్నట్లు టెలికం శాఖ (డాట్) వివరించాయి. వీటి ఫలితాలు వచ్చిన తర్వాత సేవల విస్తరణ నిబంధనలను పూర్తి చేసినట్లుగా సరి్టఫికెట్ జారీ అవుతుందని పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా జూలై 7 నాటికి టెల్కోలు 2.81 లక్షల పైచిలుకు 5జీ టవర్లను (బీటీఎస్) ఏర్పాటు చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ ఇటీవల తెలిపారు. -
రూ.10 వేల ధరలో షావొమీ 5జీ!
న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది. షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు. -
ఇండియాలో రూ. 15 వేల లోపు లభించే 5జీ స్మార్ట్ ఫోన్లు
-
తక్కువ ధరలో సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అతితక్కువ ధరకే ఇన్ఫినిక్స్ హాట్ 30 పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 5జీ తోపాటు, భారీ బ్యాటరీ ఇతర ఆకర్షణీయమైన ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12 వేలకే లభ్యం కానుంది. బడ్జెట్ ఫోన్లతో ఆకట్టుకుంటున్న ఇన్ఫినిక్స్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ హాట్ 30 ఫోను సేల్ జులై 18 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్కార్ట్లో హాట్ 30 సేల్ షురూ అవుతుందని సంస్థ వెల్లడించింది. రెండు వేరియంట్లలో ఇది లభించనుంది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ.12,499 కాగా, 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ.13,499 గా నిర్ణయించింది. ఇక ఆఫర్ విషయానికి వస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టాంట్ డిస్కౌంట్తో పాటు, రూ. నెలకు 2,250 చొప్పున నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 30 స్పెసిఫికేషన్లు 6.78 ఇంచెస్ ఫుడ్ హెచ్డీ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్ 50 + 2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ -
రియల్మీ నార్జో సిరీస్ 5 జీ స్మార్ట్ఫోన్లు: 100ఎంపీ కెమెరా, ధర, ఇతర ఫీచర్లు
సాక్షి, ముంబై: రియల్మీ నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు వచ్చేశాయ్. రియల్మీ నార్జో 60, రియల్మీ నార్జో 60 ప్రొ భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ రెండు డివైజ్లు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లతో పాటు అమెజాన్ , రియల్మీ ఇండియా వెబ్సైట్ ద్వారా జూలై 15 నుంచి అందుబాటులో ఉంటాయి. రియల్మీ నార్జో 60 ప్రొ ప్రారంభ ధర రూ. 23,999, రియల్మీ నార్జో 60 ప్రారంభ ధర రూ.17,999గా ఉంటాయి. రియల్మీ నార్జో 60 రెండు స్టోరేజ్ మోడల్స్లో లభ్యం. బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్, , 128 జీబీ స్టోరేజ్ రూ. 17,999. 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 19,999 గా ఉంటుంది. రియల్మీ నార్జో 60 ప్రొ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 23,999 12జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999. రియల్మీ నార్జో 60 ప్రొ స్పెసిఫికేషన్స్ 6.9-అంగుళాల కర్వ్డ్ స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్ MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ Android 13 ఆపరేటింగ్ సిస్టమ్ 100 ఎంపీ+ 2ఎంపీ రియల్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 5,000mAh బ్యాటరీతో 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రియల్మీ నార్జో 60 స్పెసిఫికేషన్స్ 6.43-అంగుళాల AMOLED స్క్రీన్ ,90Hz రిఫ్రెష్ రేట్ 64+2ఎంపీ రియర్ కెమెరా 16ఎంపీ సెల్ఫీకెమెరా 5,000mAh బ్యాటరీ, 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రీ-ఆర్డర్ ఆఫర్: నార్జో 60 5జీ కొనుగోలుపై 1,000 కూపన్ లభ్యం. దీంతోపాటు ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి నార్జో 60 Pro 5జీ ని కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ రూ. 1,500 తక్షణ తగ్గింపు. -
ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ఫోన్!
Oppo Reno 8 5G: సరసమైన ధరలో బెస్ట్ ఫీచర్స్, 5జీ నెట్వర్క్కు సపోర్ట్ చేసే స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలని ఎదురు చూస్తున్నవారికి ఫ్లిప్కార్ట్ ఒక అద్భుతమైన ఆఫర్ తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ కింద రూ. 38,999 విలువైన 'ఒప్పో రెనొ 8 5జీ' సరసమైన ధరలోనే కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో ఒప్పో కంపెనీ విక్రయిస్తున్న అత్యుత్తమ మొబైల్ ఫోన్స్లో ఒకటి 'రెనొ 8 5జీ'. ఇది దేశీయ విఫణిలో 2022 జులైలో విడుదలైంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్ఫోన్ 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ లేదా 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్స్లో లభిస్తుంది. 90 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.4 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే కలిగిన ఈ మొబైల్ వెనుకవైపు 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనో క్రోమ్ కెమెరా పొందుతుంది. సెల్ఫీలు లేదా వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీ 4500 mAh. (ఇదీ చదవండి: జీతగాడి స్థాయి నుంచి స్టార్ హీరోలకు మేనేజర్గా.. బిజినెస్తో కోట్ల సంపాదన - సాధారణ వ్యక్తి సక్సెస్ స్టోరీ!) అడ్వాన్స్డ్ ఫీచర్స్ కలిగి.. 5జీ నెట్వర్క్తో లభిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మీద ఫ్లిప్కార్ట్ రూ. 29,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ అందిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే దీనిని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1250 వరకు, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. -
డిజిటల్ ఇండియా ఇక నుండి 5G ఇండియా
-
త్వరలో భారీ కొనుగోళ్లు.. రూ.13 వేల కోట్ల రుణాల కోసం ముఖేష్ అంబానీ చర్చలు!
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ అధినేత ముఖేష్ అంబానీ తర్వలో భారీ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం సుమారు 1.6 బిలియన్ల మేర రుణాల్ని సమీకరించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం..అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా నుంచి ఎక్విప్మెంట్ కొనుగోలు నిమిత్తం భారీ ఎత్తున లోన్ రూపంలో రిలయన్స్ నిధుల్ని సమకూర్చుకోనుంది. కొనుగోలు ఒప్పందం గడవు సమీపిస్తున్న తరుణంలో సిటీ గ్రూప్ ఐఎన్సీ, హెచ్ఎస్బీసీ హోల్డింగ్, జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో’ సంస్థల నుంచి ఈ మొత్తాన్ని తీసుకోనున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో ప్రతినిధులు పైన పేర్కొన్న సంస్థల అధినేతలతో చర్చించనున్నారని, ముఖేష్ అంబానీ 15 కాల పరిమితితో రుణాన్ని తీసుకోనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి, ఇరు సంస్థల మధ్య జరుగుతున్న చర్చలు కొలిక్కిరాలేదు. అయితే, ఫిన్ల్యాండ్కు చెందిన ఎక్స్పోర్ట్ క్రెడిట్ ఏజెన్సీ ఫిన్వెరా రిలయన్స్ తీసుకునే లోన్ మొత్తానికి గ్యారెంటీ కవర్కు ముందుకు వచ్చింది. గత ఏడాది అక్టోబర్లో ఎలక్ట్రానిక్ దిగ్గజం నోకియా .. దేశీయ టెలికాం దిగ్గజం జియో 5జీ నెట్వర్క్ను అందించేందుకు కావాల్సిన పరికరాల్ని అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. జియో సైతం స్ప్రెక్టం కొనుగోలు కోసం బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టిన సంస్థగా చరిత్రకెక్కింది. కాగా, రిలయన్స్ సంస్థ రుణాల కోసం తమతో సంప్రదింపులు జరుపుతున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదికల్ని జేపీ మోర్గాన్, సిటీ బ్యాంక్, హెచ్ఎస్బీసీలు ఖండించాయి. నోకియా అధికార ప్రతినిధి,రిలయన్స్ సైతం ఇదే తరహాలో స్పందించాయి. చదవండి👉 ఈషా అంబానీకి సరికొత్త వెపన్ దొరికిందా? -
విడుదలకు ముందే జియో 5జీ ఫోన్ ఫోటోలు లీక్, ధర మరీ ఇంత తక్కువా?
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో త్వరలో 5జీ ఫోన్ను విడుదల చేయనుంది. విడుదలకు ముందే ఆ ఫోన్ ఫోటోలు లీకయ్యాయి. అయితే, లీకైన ఫొటోల్లానే జియో ఫోన్ ఉంటుందా? ఏవైనా మార్పులుంటాయనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆన్లైన్లో చక్కెర్లు కొడుతున్న ఫోటోలు జియో అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ట్విటర్ యూజర్ అర్పిత్ నహిమిలా పోస్ట్ చేసిన ఆ ఫోటొల్ని పరీక్షిస్తే జియో ఫోన్ డ్యూయల్ రేర్ కెమెరా, బ్లాక్ కలర్ వేరియంట్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు 13 మెగా పిక్సెల్ ఏఐ కెమెరా, 2 మెగా పిక్సెల్ సెకండరీ లెన్స్, కెమెరా ముందు భాగం 5 మెగా పిక్సెల్ షూటర్తో వాటర్డ్రాప్ స్టైల్ నాచ్, ఫోన్ బాడీ ఫైబర్ ప్లాస్టిక్తో తయారైంది. 5జీ యూనిసాస్ ప్రాసెసర్, డైమన్సిటీ 700 ఎస్ఓఎస్గా ఉంది. ఇక, ఈ ఏడాది దివాళి లేదా కొత్త ఏడాది మధ్య కాలంలో విడుదల కానున్న జియో 5జీ ఫోన్ ధర రూ.10,000 ఉండనున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. గతంలో వెలుగులోకి వచ్చిన రిపోర్ట్లలో జియో ఫోన్ 5జీ 4జీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 480 ఎస్ఓఎస్ను పొందవచ్చని పేర్కొంది. 5జీ ఫోన్ 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.5-అంగుళాల హెచ్ప్లస్ ఎల్సీడీ డిస్ప్లేని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 సపోర్ట్తో జియో 18 డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్నట్లు ఆ నివేదికలు హైలెట్ చేశాయి. స్మార్ట్ఫోన్ ధర రూ. 8,000 నుంచి రూ. 12,000 ఉండనున్నట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్ గత సంవత్సరం అంచనా వేసింది. ఫోన్ గూగుల్ మొబైల్ సర్వీసెస్, జియో యాప్స్తో ఇన్ బిల్ట్ అయి వస్తున్నాయి. ఇందుకోసం గత ఏడాది జియో గూగుల్తో కలిసి పనిచేస్తున్నట్లు ధృవీకరించింది. ఫోన్లతో పాటు అతితక్కువ ధరకే ల్యాప్ట్యాప్లను జియో అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1.6-అంగుళాల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 665 ఎస్ఓఎస్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ల్యాప్ ట్యాప్ను విడుదల చేసింది. దీని ధర రూ. 15,799. Exclusive!!🔥Here's a sneak-peek at the upcoming unreleased JioPhone 5G. The phone is expected to release between Diwali and New Year. The expected price is under ₹10k. Not much specs known but possibly a Unisoc 5G or a Dimensity 700 processor. 13+2MP Rear 5MP Front camera. pic.twitter.com/bzRRIH8Sdn — Arpit 'Satya Prakash' Patel (@ArpitNahiMila) June 22, 2023 చదవండి : రిలయన్స్తో ఒప్పందం.. భారత్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్న చైనా కంపెనీ? -
దేశంలో 5జీ హవా.. వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్గా భారత్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 2028 చివరి నాటికి మొబైల్ చందాదార్లలో దాదాపు 57 శాతం వాటా 5జీ కైవసం చేసుకోనుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న 5జీ మార్కెట్గా భారత్ అవతరిస్తుందని ఎరిక్సన్ మొబిలిటీ నివేదిక వెల్లడించింది. ‘2022 డిసెంబర్ చివరినాటికి దేశంలో 5జీ చందాదార్లు ఒక కోటి ఉన్నట్టు అంచనా. భారత్లో 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద భారీ నెట్వర్క్ విస్తరణ జరుగుతోంది’ అని ఎరిక్సన్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయంగా 150 కోట్లు.. కొన్ని మార్కెట్లలో భౌగోళిక రాజకీయ సవాళ్లు, స్థూల ఆర్థిక మందగమనం ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీలో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. 2023 చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మొబైల్ చందాదార్లు 5జీ వేదికపైకి రానున్నారు. ఉత్తర అమెరికాలో 5జీ చందాదార్ల వృద్ధి గత అంచనాల కంటే బలంగా ఉంది. ఈ ప్రాంతంలో 2022 చివరి నాటికి 5జీ విస్తృతి 41 శాతం ఉంది. ఈ ఏడాది చివరి నాటికి ప్రతి స్మార్ట్ఫోన్కు నెలవారీ అంతర్జాతీయ సగటు డేటా వినియోగం 20 జీబీ కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా’ అని నివేదిక వివరించింది. -
భారీగా ఉపాధి అవకాశాలు.. ఎక్కడో తెలుసా?
ముంబై: 5జీ టెక్నాలజీ రాకతో ఉద్యోగాలకు సంబంధించి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. దేశీ టెక్నాలజీ నిపుణులకు అపార అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల రంగాల్లో ఉద్యోగాల కల్పన, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ తదితర అంశాలపరంగా 5జీ టెక్నాలజీ సానుకూల ప్రభావం చూపనుంది. స్టాఫింగ్ సేవల కంపెనీ టీమ్లీజ్ సర్వీసెస్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. (ఫాక్స్కాన్ రంగంలోకి: రాయిల్ ఎన్ఫీల్డ్, ఓలా ఏమైపోవాలి? ) ఉద్యోగాల కల్పన, వ్యవస్థ మీద 5జీ ప్రభావాలపై నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 247 పైచిలుకు సంస్థలు అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందింది. ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద టెలికం రంగానికి రూ. 12,000 కోట్లు కేటాయించడం, ఇందులో 25 శాతం మొత్తాన్ని కొత్తగా ఉద్యోగాల కల్పన కోసం పక్కన పెట్టడం తదితర అంశాలు ఉపాధి కల్పన, నైపుణ్యాల్లో శిక్షణ విషయంలో సానుకూల ప్రభావం చూపగలవని టీమ్లీజ్ సర్వీసెస్ సీఈవో (స్టాఫింగ్ విభాగం), కార్తీక్ నారాయణ్ తెలిపారు. 5జీ సామర్ధ్యాలను పూర్తిగా వెలికితీసేందుకు, అసాధారణ స్థాయిలో ఉద్యోగాలను సృష్టించేందుకు, నవకల్పనలకు తోడ్పాటు ఇచ్చేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► 5జీతో బీఎఫ్ఎస్ఐ రంగంపై 60 శాతం మేర, విద్య (48 శాతం), గేమింగ్ (48 శాతం), రిటైల్ .. ఈ–కామర్స్ 46 శాతం మేర సానుకూల ప్రభావం పడనుంది. ► 5జీ వినియోగం ప్రారంభించిన తొలి ఏడాదిలో భారీగా ఉద్యోగాల కల్పన జరగగలదని 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► టెల్కోలు 5జీ నెట్వర్క్ను అప్గ్రేడ్ చేయడం, నెట్వర్క్ భద్రతను పెంచుకోవడం మొదలైన అంశాల వల్ల స్పెషలైజ్డ్ ఉద్యోగాల్లో నియామకాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనితో టెక్నికల్ కంటెంట్ రైటర్లు, నెట్వర్కింగ్ ఇంజినీర్లు, ఏఐ/ఎంఎల్ నిపఉణులు, యూఎక్స్ డిజైనర్లు, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజినీర్లు, సైబర్సెక్యూరిటీ స్పెషలిస్టులు, డేటా సైన్స్ .. అనలిటికల్ నిపుణులు మొదలైన వారికి డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం టెలికం పరిశ్రమలో డిమాండ్–సరఫరా మధ్య 28 శాతం మేర వ్యత్యాసం ఉంది. దీంతో సమగ్ర స్థాయిలో అత్యవసరంగా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించాల్సి ఉంటోంది. ఇదీ చదవండి: అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్, నెట్వర్త్ గురించి తెలుసా? -
సగ భాగం 5జీ ఫోన్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు. మూడు పునాదులు.. ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు. -
బీఎస్ఎన్ఎల్కు రూ.89,047 కోట్ల ప్యాకేజీ
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్రైవేటు కంపెనీలకు దీటుగా దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవల ప్రారంభించేందుకు కీలక అడుగు పడింది. స్పెక్ట్రమ్ కేటాయింపులతో కూడిన రూ.89,047 కోట్ల విలువ చేసే మరో పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈక్విటీ రూపంలో బీఎస్ఎన్ఎల్కు 4జీ, 5జీ స్పెక్ట్రమ్ కేటాయింపు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంది. రూ.46,338 కోట్లు విలువ చేసే 700 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్, 3300 మెగాహెర్జ్ బ్యాండ్లో 70 మెగాహెర్జ్ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ (రూ.26,184 కోట్లు), 26 గిగాహెర్జ్ బ్యాండ్లో స్పెక్ట్రమ్ (రూ.6,565 కోట్లు), 2500 మెగాహెర్జ్ బ్యాండ్ స్పెక్ట్రమ్ (రూ.9,428 కోట్లు) కేటాయించనుంది. దీంతో బీఎస్ఎన్ఎల్ అధీకృత మూలధనం రూ.1,50,000 కోట్ల నుంచి రూ.2,10,000 కోట్లకు పెరగనుంది. ఈ స్పెక్ట్రమ్ కేటాయింపులతో బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ, 5జీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోనూ అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 2019లో మొదటిసారి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్కు రూ.69,000 కోట్ల విలువ చేసే ప్యాకేజీ ప్రకటించింది. 2022లో మరో రూ.1.64 లక్షల కోట్ల ప్యాకేజీని ఇచ్చింది. కేంద్రం సాయంతో బీఎస్ఎన్ఎల్ రుణ భారం రూ.22,289 కోట్లకు దిగొచ్చింది. -
రెడ్మీ నోట్ 12 5జీపై భారీ డిస్కౌంట్, రూ.12,999కే కొనుగోలు చేయొచ్చు!
ఈ ఏడాది జనవరిలో విడుదలైన 5జీ స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 12 5జీ ఫోన్పై ప్రముఖ ఫోన్ తయారీ సంస్థ షావోమీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. వీటితో పాటు రెడ్మీ నోట్ 12ప్రో 5జీ, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీ రేట్లను సవరించింది. అమెజాన్, ఎంఐ.కామ్ డిస్కౌంట్లలో ఫోన్ను కొనుగోలు చేయొచ్చని తెలిపింది. విడుదల సమయంలో రెడ్మీ నోట్ 5జీ స్మార్ట్ఫోన్ 4జీబీ ర్యామ్ ప్లస్ 128 స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ.17,999 ఉండగా.. తాజాగా ఆఫోన్ ధరను వెయ్యిరూపాయలు తగ్గించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలు చేసిన కస్టమర్లు రూ.2,000 వరకు డిస్కౌంట్ను సొంతం చేసుకోవచ్చు. ఆ ఫోన్ ధర రూ.14,999కే తగ్గుతున్నట్లు షావోమీ కంపెనీ పేర్కొంది. కొనుగోలు దారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి ఈఎంఐ ఆప్షన్ను ఎంపిక, ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫోన్ను కొనుగోలు చేస్తే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్, మరో రెండు వేలు ఎక్ఛేంజ్ బోనస్ను పొందవచ్చు. ఇలా రూ.17,999 ఉన్న ఫోన్ ధర రూ.12,999కి తగ్గుతుంది. అలాగే, 6జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ మోడల్ రెడ్మీ నోట్ 12 5జీ ధర రూ.18,999 ఉండగా 8జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999గా ఉంది. ఇప్పుడు ఆ రెండు వేరియంట్ ఫోన్ ధరల్ని షావోమీ తగ్గించడంతో బ్యాంక్ డిస్కౌంట్తో కలిపి రూ.16,999, 18,999కే లభిస్తుంది. రెడ్మీ నోట్ 12 5జీ స్పెసిఫికేషన్లు రెడ్మీ నోట్ 12 5జీ (1,080*2,400) పిక్సెల్స్తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేతో 120 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 ఏఎంహెచ్ బ్యాటరీ, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4జెనరేషన్ 1 ఎస్ఓఎస్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగా పిక్సెల్ సెల్ఫీ సెన్సార్, 128 జీబీ స్టోరేజ్, 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ! -
అమెజాన్ సేల్.. 5జీ స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్.. సమ్మర్ ఆఫర్ గురూ!
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ 5జీ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మే 27 నుంచి మే 31 వరకు జరిగే ఈ సేల్లో 5జీ స్మార్ట్ఫోన్లు వన్ప్లస్, రియల్మీ, శాంసంగ్తో పాటు ఇతర బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. కొనుగోలు దారులు ఈ ప్రత్యేక సేల్లో రూ.1,666 నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ ృపొందవచ్చని వెల్లడించింది. అదనంగా, అమ్మకాలు జరిగే సమయంలో ఎక్ఛేంజ్ ఆఫర్లో రూ.10,000 వేల వరకు బోనస్ పొందవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్ యూజర్లకు 24 నెలల పాటు ఎంపిక చేసుకున్న ఫోన్లపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఐక్యూ 11 5జీ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 2ప్రాసెసర్ అందుబాటులో ఉన్న ఐక్యూ 11 5జీ స్మార్ట్ ఫోన్పై రూ.5వేల వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు. 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఈ ఫోన్ 2కే ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 1800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. రెడ్మీ నోట్15 జీ రెడ్మీ నోట్12 5జీ కొనుగోలు దారులకు రూ.2,000 వరకు ఎక్ఛేంజ్ డిస్కౌంట్తో పాటు పలు బ్యాంక్లు అందించే ఆఫర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ రెడ్మీ 5జీ ఫోన్ 120 హెచ్జెడ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4జనరేషన్ 1 5జీ ప్రాసెసర్, 48 ఎంపీ ఏఐ ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. షావోమీ 13 ప్రో షావోమీ 13 ప్రో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2, 4 ఎన్ఎం ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. రూ.71,999 ఖరీదైన ఈ ఫోన్ను అమెజాన్, బ్యాంక్లు ఇచ్చే మొత్తం ఆఫర్లను కలుపుకొని ఎక్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ.10,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్లో 6.73 అంగుళాల 2కే 120 హెచ్జెడ్ ఈ6 అమోలెడ్ డిస్ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వన్ప్లస్ 10 ప్రో 5జీ వన్ప్లస్ 10 ప్రో 5జీ ఫోన్ ధర రూ.55,499 కొనుగోలు చేయొచ్చు. బ్యాంక్ ఆఫర్లు, ఎక్ఛేంజ్ బోనస్ కింద రూ.10,000 వరకు తగ్గింపు ఆఫర్ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 9 నెలల పాటు నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఈ ఫోన్లో 48 ఎంపీ మెయిన్ కెమెరా, 50 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8ఎంపీ టెలిఫోటో లెన్స్లు ఉన్నాయి. వన్ ప్లస్ 10 ఆర్ 5జీ వన్ ప్లస్ 10 ఆర్ 5జీ ధర రూ. 32,999గా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న అమెజాన్ సేల్లో ఈ ఫోన్పై రూ. 3వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్తో పాటు 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్ లభిస్తుంది. 50ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా ఫోన్ వెనుక భాగంలో ఉంది. శాంసంగ్ ఎం14 5జీ శాంసంగ్ ఎం14 5జీ 6.6 ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 5ఎన్ఎం ప్రాసెసర్, 50ఎంపీ ట్రిపుల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అమెజాన్లో ఈ ఫోన్ రూ. 15,490 కి కొనుగోలు కొనుగోలు చేయొచ్చు. రూ. 500 ఎక్స్చేంజ్ ఆఫర్లతో పాటు బ్యాంక్లు అందించే ఆఫర్లు ఉన్నాయి . రియల్మీ నార్జో 50 5జీ రియల్మీ నార్జో 50 5జీ 6.6 అంగుళాల ఎఫ్హెచ్డీ ప్లస్ డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 5జీ, పవర్ ఫుల్ గేమింగ్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్తో 3,000 డిస్కౌంట్ లభిస్తుండగా.. రూ.14,249 కే కొనుగోలు చేయొచ్చు. చదవండి👉 అంతా బాగుంది అనుకునేలోపు యూట్యూబర్లకు ఊహించని షాక్! -
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్ ఆప్షన్!
సాక్షి, ముంబై: లావా అగ్ని-2 5జీ స్మార్ట్ఫోన్పై తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో బుధవారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) లావా అగ్ని 2 5జీ ఫీచర్లు 6.78-అంగుళాల FHD+ స్క్రీన్, మీడియా టెక్ సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా 1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్తో 50ఎంపీ క్వాడ్ కెమెరా 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 6W ఛార్జర్తో 4700mAh బ్యాటరీ ఫోన్ ధర రూ. 21,999 వద్దర ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో రూ. 19,999 లభించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!) ఇదీ చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు -
మార్కెట్లో మరో కొత్త 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్ - ధర ఎంతో తెలుసా?
iQoo Z7s 5G: దేశీయ మార్కెట్లో 'ఐకూ జెడ్7ఎస్ 5జీ' (iQoo Z7s 5G) స్మార్ట్ఫోన్ విడుదలైంది. రెండు వేరియంట్లలో విడుదలైన ఈ మొబైల్ ఆధునిక డిజైన్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఈ లేటెస్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు.. ఐకూ జెడ్7ఎస్ మొబైల్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 18,999 & రూ. 19,999. ఇవి రెండూ ఈ-కామర్స్ సైట్ అమెజాన్, ఐకూ అధికారిక వెబ్సైట్లో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. కావున కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డుతో రూ. 1,500 డిస్కౌంట్ ఆఫర్తో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్స్.. నార్వే బ్లూ, పసిఫిక్ నైట్ కలర్ ఆప్షన్లో లభించే ఈ మొబైల్ 6.38 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. ఇందులో 2.5 GHz, ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆప్షన్ కూడా ఇందులో లభిస్తుంది. (ఇదీ చదవండి: ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్.. ఇక మార్కెట్లో రచ్చ రచ్చే!) కెమరా ఆప్షన్స్ విషయానికి వస్తే.. ఇందులో రెండు రియర్ కెమెరాలు ఉంటాయి. అవి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా. అదే సమయంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. 4,500mAh బ్యాటరీ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కావున ఇది కేవలం 24 నిముషాల్లో 50 శాతం ఛార్జ్ చేసుకోగలదు. అంతే కాకుండా ఇది ఐపీ54 రేటింగ్ కలిగి ఉండటం వల్ల నీటి తుంపర్ల నుంచి కూడా రక్షణ పొందుతుంది. -
ఒప్పో ఎఫ్ 23 5జీ స్మార్ట్ఫోన్ లాంచ్, ధర, ఫీచర్లు తెలుసుకోండి!
సాక్షి,ముంబై: స్మార్ట్ఫోన్ మేకర్ ఒప్పో కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్చేసింది. ఒప్పో ఎఫ్23 పేరుతరు 5జీ మొబైల్ను తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో 64 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. బోల్డ్ గోల్డ్ , కూల్ బ్లాక్ రెండు రంగులలో మే 18 నుంచి ఒప్పో Oppo స్టోర్, అమెజాన్ , మెయిన్లైన్ రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఎఫ్23 5జీ స్పెసిఫికేషన్స్ 6.72-అంగుళాల 3D కర్వ్డ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ 91.4% స్క్రీన్-టు-బాడీ రేషియో క్వాల్కం స్నాప్డ్రాగన్ సాక్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ 1 టీబీ వరకు విస్తరించుకునే అవకాశం 64 ఎంపీ ఏఐ కెమెరా 2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 5000mAh బ్యాటరీ 67W SUPERVOOCTM ఫ్లాష్ ఛార్జింగ్ ఇది కేవలం 18 నిమిషాల్లో ఫోన్ను 50శాతం వరకు ఛార్జ్, 5 నిమిషాల ఛార్జ్ గరిష్టంగా 6 గంటల ఫోన్ కాల్లను లేదా 2.5 గంటల YouTube వీడియోలు చూడొచ్చు. పూర్తిగా ఛార్జ్ చేస్తే, 39 గంటల ఫోన్ కాల్స్ , 16 గంటల యూట్యూబ్ వీడియో లు చూడొచ్చని కంపెనీ వెల్లడించింది. -
త్వరలో వన్ ప్లస్3 5జీ ఫోన్ విడుదల, ధర ఎంతంటే?
5జీ స్మార్ట్ ఫోన్ ప్రియులకు శుభవార్త. భారత్లో భారత్ మార్కెట్లోకి వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2021 జూలైలో మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ నార్డ్ 2 ఫోన్ కొనసాగింపుగా ఈ ఫోన్ వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇదే నెలలో వన్ ప్లస్ నార్డ్3 5జీతో పాటు వన్ ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ రిలీజ్ కానుంది. ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. 6.7 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000 5జీ ఎస్వోసీ చిప్ సెట్, 16 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్తో విడుదల కానుంది. వన్ ప్లస్ నార్డ్3 5జీ ఫోన్.. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్, 2-మెగా పిక్సెల్ సెన్సర్ తోపాటు సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ ఉంటుందని భావిస్తున్నది. దీని ధర రూ.30,000-40,000 మధ్య పలుకుతుందని అంచనా. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. -
భారత్లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఏదో తెలుసా?
ముంబై: దేశీయంగా ఉత్తమ 5జీ స్మార్ట్ఫోన్ బ్రాండ్గా మోటరోలా నిల్చింది. టెక్నాలజీ రీసెర్చ్, కన్సల్టింగ్ సంస్థ టెక్ఆర్క్ రూపొందించిన సర్వే రూ. 10,000–30,000 ధర శ్రేణిలోని ఫోన్ల కేటగిరీలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్రధానంగా కనెక్టివిటీ, కవరేజీ, సామర్థ్యాలు అనే మూడు కీలక అంశాల ప్రాతిపదికన ఈ సర్వేలో ర్యాంకులను కేటాయించినట్లు మోటరోలా తెలిపింది. ఈ మూడు విభాగాల్లోనూ తమ స్మార్ట్ఫోన్లు మెరుగైన పనితీరు కనపర్చినట్లు వివరించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్.. డబుల్ శాలరీలను ఆఫర్ చేస్తున్న కంపెనీలు! -
మార్కెట్లో విడుదలైన కొత్త స్మార్ట్ఫోన్ - మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్..
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ పోకో (Poco) భారతీయ మార్కెట్లో ఎఫ్ సిరీస్లో తన పవర్ఫుల్ మొబైల్ను 'ఎఫ్5 5జీ' లాంచ్ చేసింది. ఈ మొబైల్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. అవి 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 29,999, రూ. 33,999. ఇవి మే 16 నుంచి విక్రయానికి రానున్నట్లు సమాచారం. మార్కెట్లో విడుదలైన కొత్త పోకో ఎఫ్5 5జీ కార్బన్ బ్లాక్, ఎలక్ట్రిక్ బ్లూ, స్నో స్ట్రామ్ వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మొబైల్ ఫోన్ 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి, 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ పొందుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ లేటెస్ట్ మొబైల్ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉంటాయి. అవి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు సపోర్ట్ చేసే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగా ఫిక్సల్ ఫ్రంట్ కెమెరా లభిస్తుంది. (ఇదీ చదవండి: 17 సార్లు ఫెయిల్.. ఇప్పుడు రూ. 40వేల కోట్ల సామ్రాజ్యం - ఇది కదా సక్సెస్ అంటే!) కొత్త పోకో ఎఫ్5 మొబైల్లో 5,000mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ టర్బో ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా కేవలం 0 నుంచి 100 శాతానికి ఛార్జ్ కావడానికి కేవలం 45 నిముషాలు మాత్రమే పడుతుంది. అదే సమయంలో డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఇందులో ఉంటాయి. హీట్ కంట్రోల్ అయ్యేలా వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్, 14 లేయర్స్ గ్రాఫైట్ సిస్టమ్ ఈ మొబైల్లో ఉంటాయి.