జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు | Gold Jewellery Hallmarking Mandatory From June 1 | Sakshi
Sakshi News home page

జూన్ 1 తర్వాత ఆ బంగారం అమ్మలేరు

Published Sun, Mar 21 2021 5:45 PM | Last Updated on Sun, Mar 21 2021 6:10 PM

Gold Jewellery Hallmarking Mandatory From June 1 - Sakshi

ఇక జూన్ 1 నుంచి బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. హాల్‌మార్క్ లేకుండా బంగారు ఆభరణాలను 1 జూన్ 2021 తర్వాత అమ్మలేము. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) రిజిస్టర్డ్ జ్యువెలర్స్ అందరికీ ఆదేశాలు జారీ చేసింది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు గల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. దీనివల్ల కస్టమర్, స్వర్ణ కారుడు ఇద్దరూ ప్రయోజనం పొందుతారని తెలిపింది. బంగారం నాణ్యత గురించి ఇరు వర్గాలకు ఎటువంటి సందేహం ఉండదని పేర్కొంది.

ఇప్పటి వరకు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ తప్పని సరికాదు. కానీ, ప్రభుత్వం గతంలో 15 జనవరి 2021 లోపు బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్ ఉండాలని పేర్కొంది. జ్యువెలర్స్ అసోసియేషన్ డిమాండ్ మేరకు ఆ గడువును 2021 జూన్ 1కి పెంచారు. ఆభరణాల హాల్‌మార్కింగ్ ప్రక్రియలో బీఐఎస్ ఎ అండ్ హెచ్ సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తాయి. ఇక్కడ పరీక్షించిన తర్వాత ఎ అండ్ హెచ్ సెంటర్‌లో ఆభరణాలపై హాల్‌మార్క్‌ను ముద్రిస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పుడు ఇంటి నుంచి ఆన్‌లైన్‌లో చేయవచ్చు. దీనికోసం ఈ-బీఐఎస్(www.manakonline.in) వెబ్‌సైట్‌ కు వెళ్లండి. ఇక్కడ సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత దరఖాస్తుదారుడు బీఐఎస్ రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. బీఐఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా చాలా తక్కువగా నిర్ణయించింది. ఒక ఆభరణాల టర్నోవర్ 5 కోట్ల కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు 7500 రూపాయలు, రిజిస్ట్రేషన్ ఫీజు 5 వేల కోట్ల నుంచి 25 కోట్ల మధ్య వార్షిక టర్నోవర్‌కు 15 వేల రూపాయలు, 25 కోట్లకు పైగా టర్నోవర్‌కు 40 వేల రూపాయలు. ఒక ఆభరణాల టర్నోవర్ 100 కోట్లకు మించి ఉంటే, ఈ రుసుము 80 వేల రూపాయలుగా నిర్ణయించారు.

చదవండి:

బంగారం ధరలు మరింత తగ్గుతాయా?!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement