ఏప్రిల్‌ 1 నుంచి ఎక్స్‌రే మెషిన్లపై సుంకాలు పెంపు | Govt hikes duty on X-ray machine imports to 15percent from April 1 | Sakshi

ఏప్రిల్‌ 1 నుంచి ఎక్స్‌రే మెషిన్లపై సుంకాలు పెంపు

Published Mon, Mar 27 2023 4:05 AM | Last Updated on Mon, Mar 27 2023 4:05 AM

Govt hikes duty on X-ray machine imports to 15percent from April 1 - Sakshi

న్యూఢిల్లీ: ఎక్స్‌రే మెషిన్లపై దిగుమతి సుంకాలను పెంచుతూ కేంద్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దిగుమతి చేసుకునే ఎక్స్‌రే మెషిన్లు, నాన్‌ పోర్టబుల్‌ ఎక్స్‌ రే జనరేటర్లపై సుంకాన్ని ఏప్రిల్‌ 1 నుంచి 15 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం వీటిపై 10 శాతం సుంకం అమల్లో ఉంది. ఫైనాన్స్‌ బిల్లు, 2023లో ఈ మేరకు మార్పులు చేశారు. లోక్‌ సభ శుక్రవారం దీన్ని ఆమోదించింది. ప్రభుత్వ నిర్ణయం భారత్‌ లో తయారీని ప్రోత్సహిస్తుందని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుందని ఏఎంఆర్‌జీ అండ్‌ అసోసియేట్స్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రజత్‌ మోహన్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement