మంచు కొండల్లో మేఘా అద్భుతం | MEIL Told That Zojila Tunnel Work Progress | Sakshi
Sakshi News home page

మంచు కొండల్లో మేఘా అద్భుతం

Published Tue, Nov 23 2021 8:41 AM | Last Updated on Tue, Nov 23 2021 9:38 AM

MEIL Told That  Zojila Tunnel Work Progress - Sakshi

న్యూఢిల్లీ: జోజిలా సొరంగ మార్గం పనులు వేగవంతంగా చేస్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) వెల్లడించింది. ఇందులో భాగంగా టనల్‌ 1లోని ట్యూబ్‌ 2 తవ్వకం పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. దీని పొడవు సుమారు 472 మీటర్లు. ఇప్పటికే సుమారు 448 మీటర్ల పొడవున్న ట్యూబ్‌ 1 పనులు పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. 2వ టనల్‌ పనులు జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది.

దట్టమైన మంచు పేరుకుపోవడంతో దాదాపు ఆరు నెలల పాటు లడఖ్‌–శ్రీనగర్‌ మధ్య రాకపోకలు కష్టతరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అన్ని సీజన్‌లలోనూ ప్రయాణాలకు వీలు కల్పించే జోజిలా టనల్‌ ప్రాజెక్టును ఎంఈఐఎల్‌ 2020 అక్టోబర్‌లో దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 4,600 కోట్లు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement