Himalayas
-
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
‘అమ్మో’ అన్నవారే ‘ఆహా’ అంటున్నారు! ఇతిషా మహిమే!
అస్సాంలోని గౌహతికి చెందిన ఇతిషా సారా పుణెలోని ‘సింబయాసిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో చదువుకుంది. దిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో ‘సోషల్ డిజైన్’ కోర్సు చేసింది. ‘ఈ కోర్సు వల్ల తరగతి బయట అడుగు పెట్టడానికి, ప్రజలతో నేరుగా మాట్లాడడానికి, రోజువారీ సమస్యలకు పరిష్కారాలను కనుక్కోవడానికి నాకు అవకాశం వచ్చింది’... గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఇతిషా.తన పరిశోధన అంశానికి ఈ–వ్యర్థాలను ఎంచుకుంది. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై పరిశోధనలు చేసిన వారు తక్కువ. ఈ–వ్యర్థాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు చదవడంతో పాటు దిల్లీ చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ వ్యర్థాలు రీసైకిలింగ్ జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి పరిశీలించేది. ఈ క్షేత్రస్థాయి అధ్యయనంలో ఎన్నో విషయాల గురించి అవగాహన చేసుకుంది. ‘రీసైకిలింగ్’పై ఇతిషాకు ఉన్న అవగాహన సాంగ్టీని మార్చడానికి ఉపయోగపడింది.అరుణాచల్ప్రదేశ్లోని సాంగ్టీలో అద్దె ఇంట్లో ఉంటూ, హిమాలయ ప్రాంతాల్లో పర్యావరణ స్పృహను రేకెత్తించ డానికి గ్రామస్తులతో కలిసి పనిచేసింది. వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడి ఉండకుండా ఒకేచోట ఉండేలా వెదురుతో ప్రత్యేక నిర్మాణాలు చేయించింది.కమ్యూనిటీల నిర్వహణలోని ‘వేస్ట్ మేనేజ్మెంట్ గ్రూప్’ లతో సాంగ్టీ ప్రాంతంలో ఎంతో మార్పు వచ్చింది. ఈ గ్రూప్లు స్థానిక సంస్కృతి, సాహిత్యాలను ప్రతిబింబించే మ్యూజిక్ ఫెస్టివల్స్ను కూడా నిర్వహిస్తున్నాయి. అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న కాలంలో కోవిడ్ దెబ్బతో పరిసరాల పరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్ మూలన పడ్డాయి. లాక్డౌన్ తరువాత ఈ ప్రాంతానికి తిరిగి వచ్చిన ఇతిషా వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను పునరుద్ధరించడానికి కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో కమ్యూనిటీ గ్రూప్లలో ఉత్సాహవంతులైన కొత్త సభ్యులను చేర్చుకున్నారు.ఇళ్ల నుంచి వ్యర్థాల సేకరణను పర్యవేక్షించేందుకు నలుగురు మహిళలు, నలుగురు పురుషులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు వంతుల వారీగా వ్యర్థాలను సేకరించి మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ(ఎంఆర్ఎఫ్) సెంటర్లకు తరలిస్తారు. ఒకప్పుడు సాంగ్టీ పేరు వినబడగానే ‘బాబోయ్’ అనుకునేవారు. ఇప్పుడు అలాంటి గ్రామం ‘జీరో వేస్ట్ విలేజ్’గా మారి ఎన్నో గ్రామాలకు స్ఫూర్తిని ఇస్తోంది. వారిలో ఒకరిగా...అప్పుడప్పుడూ వస్తూ, పోతూ పని చేయడం కంటే సాంగ్టీలోనే ఉండి పనిచేయాలనుకున్నాను. ఆ గ్రామస్థులలో ఒకరిగా కలిసి పనిచేయడం వల్ల అందరూ సహకరించారు. నన్ను వారిలో ఒకరిగా చూసుకున్నారు. ‘జీరో వస్ట్ విలేజ్’గా సాంగ్టీని నిలబెట్టే క్రమంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదురయ్యాయి. అయినా సరే వెనకడుగు వేయలేదు. వేస్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రతి ఇంటిలో అవగాహన కలిగించడంలో విజయం సాధించాం. - ఇతిషా సారా View this post on Instagram A post shared by Northeast Waste Collective (@northeastwastecollective) -
Mahima Mehra: స్వచ్ఛందాల మహిమాలయం
హిమాలయాలు అంటే మంచు అందాలు గుర్తు రావచ్చు. ఆధ్యాత్మిక సౌరభం వెల్లివిరియవచ్చు. మరోవైపు చూస్తే... అందమైన హిమాలయప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలలో పేదరికరం ఉంది. నిరక్షరాస్యత ఉంది. నిరుద్యోగం ఉంది. వ్యసనాలు ఉన్నాయి. చుట్టపు చూపుగా హిమాలయాలకు వెళ్లాలనుకోలేదు మహిమ మెహ్ర.వారిలో ఒకరిగా బతకాలనుకుంది. వారి బతుకు బండికి కొత్త దారి చూపాలనుకుంది.పుణె, దుబాయ్లలో బోధన రంగంలో దశాబ్దకాలం పనిచేసింది మహిమ మెహ్ర. పుణెలోని ‘స్పెక్ట్రమ్’ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, క్యాన్సర్ రోగులు, నిరుపేద ప్రజల కోసం పనిచేసిన మహిమ తన సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలనుకుంది. స్కిల్ ట్రైనింగ్, కెరీర్ గైడెన్స్, పర్యావరణ స్పృహకు సంబంధించి శిక్షణా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భిన్నమైన సంస్కృతి, భిన్నమైన వాతావరణం మధ్య పనిచేయాలనే ఆసక్తి మహిమను లద్దాఖ్కు తీసుకువెళ్లింది. ఈ హిమాలయప్రాంతానికి రావడంతో ఆమె జీవితమే మారి΄ోయింది.‘ఇది నా జీవితాన్ని మార్చిన ప్రయాణం. ఇక్కడ నేను అవసరమైన వారికి అవసరమైన సహకారం అందిస్తున్నాను’ అంటుంది మహిమ. సేవాకార్యక్రమాలు చేయడానికి పట్టణాలు లేదా పల్లెలను ఎంపిక చేసుకుంటారు. హిమాలయప్రాంతం మారుమూలలో నివసిస్తున్న వారిపై తక్కువమంది దృష్టి పడుతుంది. వీరి గురించి తెలుసుకున్న తరువాత మార్పు తీసుకురావాలనే తపన మహిమలో మొదలైంది. ఆ తపనే వందలాది మంది జీవితాల్లో వెలుగు తీసుకువచ్చింది.‘నగరానికి చెందిన వారు గ్రామీణ్రపాంత ప్రజలతో కలిసి పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చినప్పుడు ఎన్నో మార్పులు చోటుచేసుకుంటారు. గ్రామీణ ప్రజలు తమలోని సామర్థ్యాన్ని గుర్తించడం ఆ మార్పులో ఒకటి’ అంటుంది మహిమ మెహ్ర.హిమాలయప్రాంతంలో నివసిస్తున్న ప్రజలతో పనిచేయాలనుకున్నప్పుడు వారి గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంది మహిమ. ఒక ఆన్లైన్ సెషన్లో మహిమకు పంకీ సూద్ పరిచయం అయ్యాడు. సూద్ ద్వారా హిమాలయప్రాంత ప్రజల గురించి మహిమకు కొంత అవగాహన వచ్చింది.‘కులు లోయలోని పిల్లల కోసం మీరు కొన్ని వర్క్షాప్లు నిర్వహిస్తే బాగుంటుంది’ అని సూచించాడు సూద్. వెంటనే అక్కడికి వెళ్లి వర్క్షాప్లు మొదలు పెట్టింది. ఈ వర్క్షాప్లకు 30 నుంచి 40 మంది వరకు పిల్లలు వచ్చేవాళ్లు. ఆ తరువాత ‘సన్షైన్ లెర్నింగ్ సెంటర్’ను మొదలుపెట్టింది. ఈ సెంటర్ కోసం ఉపాధ్యాయుల సహకారం అవసరం కావడంతో ఫేస్బుక్ పేజీ ్రపారంభించింది.వాలంటీర్లను ఆహ్వానించింది. మొదట్లో 10 ఆ తరువాత... 15...ఆ తరువాత 50 నుంచి 500 వరకు వాలెంటీర్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు ‘సన్షైన్ లెర్నింగ్’ తరఫున పనిచేయడానికి 24,500 పైగా వాలెంటీర్లు ఉన్నారు.ఈ అనూహ్యమైన స్పందనే ‘హిమాలయన్ వాలంటీర్ టూరిజం’ ఏర్పాటుకు దారి తీసింది. హిమాలయప్రాంతంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ స్పృహ, కమ్యూనిటీ డెవలప్మెంట్ అనేవి హిమాలయన్ వాలంటీర్ టూరిజం(హెచ్విటీ) లక్ష్యాలు. హిమాచల్ ప్రదేశ్లోని కులు లోయలో ‘హెచ్విటీ’ మొదటి ్రపాజెక్ట్ మొదలైంది. నాలుగు గ్రామాల నుంచి ఎంతోమంది ‘హెచ్విటీ’ వర్క్షాప్లకు హాజరయ్యారు. లెర్నింగ్ యాక్టివిటీస్లో భాగం అయ్యారు.డిగ్రీ చేసిన అమ్మాయిలు ‘సన్షైన్ లెర్నింగ్ సెంటర్’ ద్వారా ఒక సంవత్సరం పాటు శిక్షణ తీసుకొని నామమాత్రం వేతనంతో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ‘హెచ్విటీ’ హిమాలయాలలోని ఎన్నోప్రాంతాలలో స్వచ్ఛంద సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. 50 పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది. పది టాయ్ లైబ్రరీలను, 35కి పైగా పుస్తక లైబ్రరీలను ఏర్పాటు చేసింది. విద్యకు సంబంధించిన వర్క్షాప్లు మాత్రమే కాకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తోంది. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని ఆ వ్యసనం నుంచి బయటికి తీసుకురావడానికి, వృత్తి విద్యకు సంబంధించిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు హిమాలయప్రాంతంలో గణనీయమైన మార్పును తీసుకువచ్చాయి.అరుణాచల్ప్రదేశ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపడుతున్నారు. చదువుపైనే కాదు రివర్స్ మైగ్రేషన్, ఆర్థిక స్థిరత్వం, రెవెన్యూ జెనరేషన్ కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. హిమాలయప్రాంతాల్లో పనిచేయాలనే తన ఆలోచన విన్న కొందరు.... ‘అంత దూరం వెళతావా!’ అని ఆశ్చర్య΄ోయారు. అలా ఆశ్చర్య΄ోయిన వారే ఇప్పుడు ‘ఇంత మార్పు తీసుకువచ్చావా’ అని మహిమ మెహ్రను అభినందిస్తున్నారు. -
పర్వత పుత్రి సాహు శ్రద్ధాంజలి సాహు...
ఒడిశాలో పుట్టి, హైదరాబాద్లో పెరిగిన పంతొమ్మిదేళ్ల అమ్మాయి. బీటెక్ ఫైనలియర్. చదివేది సాఫ్ట్వేర్ కోర్సే అయినా తన పరిజ్ఞానాన్ని దేశ రక్షణరంగం కోసం అంకితం చేయాలనుకుంటోంది. ‘ఆ కల కోసమే ఎన్సీసీలో చేరాను, ఆ కల నెరవేర్చుకునే క్రమంలో నన్ను నేను నిరూపించుకోవడం కోసమే పర్వతాన్ని అధిరోహించాను’ అంటోంది. గత జూన్ నెల 21వ తేదీన కాంగ్ యాత్సే 2 పర్వతాన్ని అధిరోహించి, శిఖరం మీద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించింది. ‘నా కల చాలా పెద్దదని నాకు తెలుసు. ఆ కలను సాకారం చేసుకోవడానికి శ్రద్ధగా ఒక్కో అడుగు వేస్తున్నాను’ అంటూ ‘సాక్షి ఫ్యామిలీ’తో తన పర్వతారోహణ అనుభవాల్ని పంచుకుంది శ్రద్ధాంజలి సాహు. కాంగ్ యాత్సే పర్వతశ్రేణి హిమాలయాల్లో లధాక్ రీజియన్లో ఉంది. కాంగ్ యాత్సే పర్వత శిఖరం ఎత్తు 6,250 మీటర్లు. నా మౌంటెనీరింగ్ జర్నీ చాలా తమాషాగా జరిగి΄ోయింది. ఎయిత్లోనో, నైన్త్ క్లాస్లోనో గుర్తులేదు. హిందీలో ‘ఎవరెస్ట్ మేరీ శిఖర్’ అనే ΄ాఠం ఉండేది. మా హిందీ టీచర్ ఆ ΄ాఠాన్ని ఎంత అద్భుతంగా చె΄్పారంటే... బచేంద్రి΄ాల్లాగ నేను కూడా పర్వతారోహణ చేయాలనుకున్నాను. పర్వతాల గురించి తెలుసుకోవడం కూడా అప్పటి నుంచే మొదలైంది. గత ఏడాది ఏప్రిల్లో ఎన్సీసీ, హైదరాబాద్ కమాండర్ కల్నల్ అనిల్ ఆధ్వర్యంలో మౌంటెనీరింగ్ అవకాశం రాగానే మరేమీ ఆలోచించకుండా ట్రైనింగ్కి వెళ్లాను. హెచ్ఎమ్ఐ (హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్) ఆధ్వర్యంలో డార్జిలింగ్లో నెల రోజులు బేసిక్ ట్రైనింగ్, ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో అడ్వాన్స్డ్ ట్రైనింగ్, సెర్చ్ అండ్ రెస్యూ్క మెథడ్స్ ట్రైనింగ్ ఉత్తరాఖండ్లో పూర్తి చేసుకుని ఎక్స్పెడిషన్కు సిద్ధమయ్యాను. అమ్మకు దూరంగా యాభై రోజులుఢిల్లీలో మే 28న ఫ్లాగ్ ఆఫ్, జూన్ 29న ఫ్లాగ్ ఆన్ జరిగింది. ముందు, వెనుక ప్రయాణాలన్నీ కలిపి యాభై రోజులు ఇంటికి దూరంగా ఉండడం అదే మొదటిసారి. అమ్మానాన్నల దగ్గర ఉన్నప్పుడు వాళ్ల ప్రేమను ఆస్వాదిస్తూ ఉంటాం. వాళ్లకు దూరంగా ఉండడం ఎంత కష్టమో దూరంగా ఉన్నప్పుడే తెలుస్తుంది. అమ్మానాన్నల ప్రేమ ఎంత అమూల్యమైనదో తెలిసి వచ్చిన క్షణాలవి. ఎయిర్ఫోర్స్లో ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు అమ్మ ఒప్పుకోలేదు. మౌంటెనీరింగ్కీ ఒప్పుకోలేదు. అమ్మను ఒప్పిస్తే నాన్న ఆటోమేటిగ్గా ఒప్పుకుంటాడని, అమ్మను బాగా కన్విన్స్ చేశాను. ఈ టాస్క్ను విజయవంతంగా పూర్తి చేశాను. ఇక రక్షణరంగాన్ని కెరీర్గా ఎంచుకోవడం గురించి ఒప్పించి, నాకున్న డిఫెన్స్ యూనిఫామ్ కల నెరవేర్చుకోవాలి. ఇప్పుడు ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. ఆరోహణలో అవరోధాలు కాంగ్ యాత్సే 2 పర్వతారోహణ మర్ఖా వ్యాలీ దగ్గర మొదలవుతుంది. మౌంటెనీరింగ్ బూట్స్, క్రాంపన్స్లలో ఐదు కేజీల బరువులుంటాయి. అవసరమైన వస్తువులతో ఇరవై కేజీల బ్యాగ్ మోస్తూ నడక మొదలవుతుంది. ఐదువేల మీటర్లు దాటిన తర్వాత బేస్క్యాంప్ ఉంటుంది. అక్కడి వరకు మన అన్నం, పప్పు ఉంటాయి. ఆంతకు పైకి వెళ్లే కొద్దీ అన్నం ఉడకదు, చ΄ాతీలు కాల్చడం కుదరదు. డ్రై రేషన్... అంటే డ్రై ఫ్రూట్స్, నట్స్, చాక్లెట్లు, న్యూట్రిషన్ బిస్కట్లు, ఓఆర్ఎస్ ΄్యాకెట్లతో ప్రయాణం కొనసాగుతుంది. నడక... నడక... ధ్యానంలాగ తదేక దీక్షతో సాగుతుంది. అడుగు పడిన చోట గట్టిగా ఉందా జారుతోందా అని మన ముందు వాళ్ల అడుగులను గమనిస్తూ వెళ్లాలి. ఈ నడక సమయంలో అనేక ఆలోచనలు వస్తాయి. ముందుకెళ్లి ఏం సాధిస్తాం, వెనక్కి వెళ్తే నష్ట΄ోయేదేముంది... అని కూడా అనిపిస్తుంది. ఆరోహణ పూర్తయ్యేటప్పటికి ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారుతాం. పరస్పరం సహకరించుకోవడంతో΄ాటు ఉద్వేగాలకు లోనుకాకుండా ప్రశాంతంగా ఉండడం, ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం కూడా అలవడుతుంది. శిఖరాన్ని చేరినప్పుడు సమయం ఉదయం ఏడున్నర. సూర్యోదయం అయింది. చుట్టూ తెల్లని వలయం ఆవరించినట్లు ఉంది. వైట్ అవుట్ అంటారు. మేఘాలు ఆవరించి ఉంటాయి. పది మీటర్ల దూరాన ఉన్న మనిషి కూడా కనిపించడు. శిఖరాన్ని అధిరోహించినప్పుడు కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించగలిగినంత సాహిత్యాన్ని చదవలేదు’’ అని నవ్వుతూ ముగించింది శ్రద్ధాంజలి సాహు. మౌంటెనీరింగ్లో వచ్చే ఏడాది జరిగే మౌంట్ ఎవరెస్ట్ ఇంటర్నేషనల్ ఎక్స్పెడిషన్కు ఆమెకు ఆహ్వానం వచ్చింది. ఎంపిక ప్రక్రియ మొదలు కావాల్సి ఉంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
కేదార్నాథ్ సమీపంలో భారీ హిమపాతం
రుద్రప్రయాగ్: కేదర్నాథ్లో దైవదర్శనం కోసం విచ్చేసిన భక్తులకు అద్భుత దృశ్యం ఆహ్వానం పలికింది. హిమాలయ పర్వత శిఖరాల నుంచి భారీ ఎత్తున మంచు కిందకు కూలుతున్న ‘హిమపాతం’ దృశ్యం అక్కడి వారిని ఆశ్చర్యం, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఆదివారం ఉదయం ఉత్తరాఖండ్లోని కేదర్నాథ్ ఆలయం వెనకవైపు నాలుగు కిలోమీటర్లదూరంలోని పర్వతం నుంచి ఒక్కసారిగా భారీ ఎత్తున మంచు విరిగిపడటం ప్రారంభమైంది. భక్తులు ఒకింత భయపడుతూనే ఆ దృశ్యాలను మొబైళ్లలో బంధించేందుకు పోటీపడ్డారు. మేరు–సుమేరు పర్వతశ్రేణుల్లోని చోరాబారీ హిమానీనదం పరిధిలో గాంధీ సరోవర్పై హిమపాతం పడింది. మంచంతా లోయలో పడిపోవడంతో కేదర్నాథ్ ఆలయం దాకా దూసుకురాలేదు. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. దాదాపు ఐదు నిమిషాలపాటు గుట్టలకొద్దీ మంచు కిందకు పడుతున్న వీడియో వైరల్గా మారింది. -
హిమాలయాల్లో విషాదం.. తొమ్మిదికి చేరిన మృతులు
యశవంతపుర: ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వతాలలో విహారయాత్రకు వెళ్లి ఉత్తరకాశీ జిల్లా సహస్ర తాల్ వద్ద మంచు తుపానులో చిక్కుకున్న కన్నడిగుల విషాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. సుమారు 18 మంది బెంగళూరు గత నెలాఖరులో హిమాలయాల ట్రెక్కింగ్కు వెళ్లారు. కానీ మంగళవారం సంభవించి మంచు తుపానులో 5 మంది మరణించి, 9 మంది గల్లంతయ్యారు. గురువారానికి మృతుల సంఖ్య 9 కి పెరిగింది.కన్నడిగుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో బెంగళూరుకు తీసుకొచ్చే విషయంపై ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మంత్రి కృష్ణబైరేగౌడ చర్చలు జరిపారు. గురువారం ఉదయం 11 గంటలకు 9 మృతదేహాలకు ఉత్తరకాశీలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. అక్కడి నుంచి విమానంలో డెహ్రాడూన్కు తరలించారు. మరణించిన తొమ్మిది మంది ట్రెక్కర్ల మృతదేహాలలో ఐదుగురి మృతదేహాలు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్నాయి. మిగిలిన నాలుగు మృతదేహాలు మరో విమానంలో చేరుకోనున్నాయి.Update on Uttarakhand Trekkers: After a continuous two-day rescue operation, the bodies of five out of the nine deceased trekkers have arrived at Bangalore Airport. The remaining four bodies will be arriving on the next flight. We paid homage to these trekkers, who succumbed to… pic.twitter.com/ZkltXtLWR9— Krishna Byre Gowda (@krishnabgowda) June 7, 2024 మృతులు వీరే మృతుల్లో ముగ్గురు పురుషులు, ఆరుమంది మహిళలు ఉన్నారు. ఇందులోనే మృతుడు సుధాకర్ (71) ఉన్నారు. ఆయనే కర్ణాటక మౌంటెనీరింగ్ సంఘం (కేఎంఏ)ని స్థాపించి తరచూ ఔత్సాహికులను హిమాయల పర్వతాల అధిరోహణకు తీసుకెళ్లేవారని తెలిసింది. మిగతా మృతుల వివరాలు.. సింధు వకీలం (44), సుజాత ముంగుర్వాడి (52), ఆమె భర్త వినాయక్.బి (52), చిత్రా ప్రణీత్ (48), కె.వెంకటేష్ ప్రసాద్ (53), కేపీ పద్మనాభ (50), అనితా రంగప్ప (55), పద్మిని హెగ్డే (34) ఉన్నారు. వీరందరూ బెంగళూరు వాసులే. తమవారు ఇక లేరని తెలిసి వారి పిల్లలు, జీవిత భాగస్వాములు తీవ్ర శోకంలో మునిగిపోయారు. -
Aurora borealis: వినువీధిలో రంగుల వలయాలు
చుట్టూరా తెల్లగా పరుచుకున్న హిమాలయాలు. పైన లేత ఎరుపు రంగు కాంతులు. ఈ వింత వెలుగులు లద్దాఖ్లోని హాన్లే వినువీక్షణ కేంద్రం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆకాశ వీధిలో ఇలా కనువిందు చేశాయి. చూపరులను కన్ను తిప్పుకోనివ్వకుండా కట్టిపడేశాయి. భూ అయస్కాంత క్షేత్రం గుండా ప్రసరించే కాంతి సౌర తుఫాన్ల కారణంగా చెదిరిపోవడం వల్ల ఆకాశంలో ఇలాంటి అందమైన కాంతులు ఏర్పడుతుంటాయి. ఆర్కిటిక్, అంటార్కిటిక్ల్లోని ఎత్తైన ప్రాంతాల నుంచి అత్యంత స్పష్టతతో కని్పంచే ఈ అద్భుత కాంతి వలయాలకు అరోరా అని పేరు. ఇవి ఏర్పడే దిక్కును బట్టి అరోరా బొరియాలిస్ (ఉత్తర కాంతులు), అరోరా ఆస్ట్రలిస్ (దక్షిణ కాంతులు) అని పిలుస్తారు. ఇవి చాలా రంగుల్లో అలరిస్తాయి. అయితే లద్దాఖ్లో కనువిందు చేసినవి అత్యంత అరుదైన ఎరుపు రంగు కాంతులు. అత్యంత మనోహరంగా ఉండటమే గాక ఎక్కువసేపు స్థిరంగా కని్పంచడం ఈ ఎరుపు కాంతుల ప్రత్యేకత. లద్దాఖ్తో పాటు అమెరికా, రష్యా, ఆ్రస్టేలియా, యూరప్లో జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, పోలండ్ తదితర దేశాల్లో అరోరాలు కనువిందు చేశాయి.ఐదు తీవ్ర సౌర తుపాన్లు సూర్యుని ఉపరితలంపై ఏఆర్13664గా పిలిచే చోట గత బుధవారం నుంచి అత్యంత తీవ్రతతో కూడిన ఐదు తుపాన్లు సంభవించాయి. తద్వారా అపార పరిమాణంలో విడుదలైన శక్తి కణాలు ఈ వారాంతం పొడవునా సౌరవ్యవస్థ గుండా ప్రయాణించనున్నాయి. ఆ క్రమంలో భూ అయస్కాంత క్షేత్రంతో ప్రతిచర్య జరిపే క్రమంలో అవి చెదిరిపోతూ ఆకాశంలో ఈ అందాల కాంతి వలయాలను సృష్టించాయి. గత రెండు దశాబ్దాల్లో అత్యంత తీవ్రతతో కూడిన సౌర తుపాన్లు ఇవేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీన్ని అసాధారణ పరిణామంగా అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అటా్మస్పియరిక్ అడ్మిని్రస్టేషన్ అభివరి్ణంచింది. 2003లో ఇలాంటి సౌర తుపాన్ల కారణంగా స్వీడన్లో పలు ప్రాంతాల్లో విద్యుదుత్పత్తి, సరఫరాలకు అంతరాయం కలిగింది. దక్షిణాఫ్రికాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు పాడైపోయాయి. – వాషింగ్టన్ -
అంత ఎత్తు ఎలా అయ్యాయి?
హిమాలయాలు ప్రపంచంలోనే ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్టు శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనదని అందరూ అనుకుంటారు. అది నిజమా, కాదా అన్న చర్చ ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఇంతకు హిమాలయాలు అంత ఎత్తుకు ఏ రకంగా ఎదిగాయి అన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఒక జవాబు ఉంది. అదీ నిజమా, కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు పరిశోధకులకు కూడా తెలియదు. అయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సంగతి ఏమిటంటే ఇప్పటివరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి గల కారణం గురించి తెలిసిన సంగతులు అంతగా నిజం కాదని! భూమి ఉపరితలం టెక్టానిక్ ప్లేట్స్ అనే విడిభాగాల రూపంలో ఉంది. ఆ భాగాలు కదులుతూ ఉంటాయి. అలా కదిలే ఒక భాగం వచ్చి తగిలినందుకు హిమాలయాలు అంత ఎత్తుకు ఎగిశాయని అందరూ అనుకుంటున్నారు. హిమాలయాలలో అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ప్రస్తుతం 8,849 మీటర్ల ఎత్తు ఉన్నది. కొత్తగా జరిగిన పరిశోధనల ప్రకారం, హిమాలయాలు కానీ, అందులోని ఎవరెస్టు కానీ అంత ఎత్తుకు చేరడానికి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడం కారణం కానే కాదనీ, అంతకుముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయనీ తెలిసింది. ప్లేట్లు గుద్దుకున్నందుకు హిమాలయాల ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికే అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి, అందుకు కారణం ఏమిటి అన్నది ఎవరికీ తెలియదంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి ఇంకొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలాకాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు. యూఎస్లోని ‘బ్రౌన్ విశ్వవిద్యాలయం’లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న డేనియల్ ఇబారా బృందం వారు ఈ మధ్యన ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రాన్ని వెలువరించారు. ‘నేచర్ జియోసైన్సెస్’ అనే ప్రఖ్యాత వైజ్ఞానిక పత్రికలో ఆ పత్రం ప్రచురించబడింది. ఈ పత్రం కారణంగా ఆ రంగంలోనే కొత్త మలుపులు వచ్చాయనీ, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందనీ ప్రపంచమంతటా నిపుణులు అంటున్నారు. అమెరికా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందానికి చైనాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్’ వారు కూడా ఈ పరిశోధనలో సహకరించారు. ‘సెడిమెంటరీ శిలల’ నిర్మాణాల ఎత్తు గతంలో ఉండిన తీరు గురించి పరీక్షించడానికి వీరంతా కలిసి ఒక కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఒక పద్ధతిని ఈ పరిశోధకులు ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టారు. హిమాలయాలలోని శిలల్లో ఉన్న ఐసోటోపుల కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఒకే రసాయనం తాలూకు వేరువేరు రకాలు. ఈ పద్ధతి గురించి మరింత చెబితే అది చాలా సాంకేతికంగా ఉండవచ్చు. కొండకు వెచ్చని గాలి తగిలి అది పైకి లేచి కొండకు ఆవలి భాగంలోకి ప్రవేశించి చల్లబడుతుంది. అప్పుడది వర్షం గానూ, మంచు గానూ కిందకు రాలుతుంది. గాలి పైకి వెళ్ళిన కొద్దీ అందులోని రసాయనాల తీరు మారుతుంది. ఎక్కువ న్యూట్రాన్లు గల ఆక్సిజన్ వంటి రసాయనాలు, అంటే ఐసోటోపులు బరువుగా ఉండి, మేఘాల నుంచి ముందే కిందకు జారుతాయి. ఇక తేలిక ఐసోటోపులు కొండపై కొమ్ము మీద ఆ తరువాత వచ్చి రాలుతాయి. మూడు సంవత్సరాల పాటు ఈ ఐసోటోపులను పరిశీలించిన తరువాత టెక్టానిక్ ప్లేట్ అంచులో ఉన్న హిమాలయ పర్వతాలు అప్పటికే 3,500 మీటర్ల కన్నా ఎత్తు లేదా ఇంచుమించు అంత ఎత్తులో ఉన్నాయని గమనించారు. అంటే ప్రస్తుతం ఉన్న ఎత్తులో ఇది 60 శాతం కన్నా ఎక్కువన్నమాట. ఈ రకంగా చూస్తే హిమాలయాల చుట్టుపక్కల గల పాతకాలపు వాతావరణ వివరాలు మరొకసారి పరిశీలించవలసిన అవసరం ఉన్నట్టు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెట్లోని ప్రాచీన కాలపు శీతోష్ణస్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి. ఇదే పద్ధతిలో ఆండీస్, సియెరా నెవాడా పర్వతశ్రేణులనూ, అక్కడి ప్రాచీన వాతావరణ పరిస్థితులనూ మరొకసారి విశ్లేషించే అవకాశం కూడా ఉంది. గతంలోని శీతోష్ణస్థితులను గురించి ఉన్న సిద్ధాంతాల తీరు మారనుందనీ, ఆయా ప్రాంతాలలోని గత కాలపు శీతోష్ణస్థితులను గురించిన సిద్ధాంతాలూ, ఆలోచనలూ కొత్తదారి పట్టే పద్ధతి కనబడుతున్నదనీ, అక్కడి జీవవైవిధ్యం గురించి కూడా అవగాహనలు మారుతాయనీ అంటారు ఇబారా. కొన్ని విషయాలు తెలుసుకున్నందుకు తక్షణం ఏ ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ ప్రపంచం, దాని గురించి అవగాహన కలిగించే సైన్సు క్రమంగా మారుతున్నాయని అర్థం కావడం మాత్రం అసలైన నిజం! కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ రచయిత -
India Environment Report – 2024: హిమగిరులకు పెనుముప్పు!
భారతదేశానికి పెట్టని కోటలాగా రక్షణ కవచంగా ఉన్న సుందర హిమాలయాలు కనుమరుగు కానున్నాయా? భూమిపై ఉష్ణోగ్రతల పెరుగుదలను అడ్డుకోకపోతే కచి్చతంగా ఇదే జరుగుతుందని ఇండియా పర్యావరణ నివేదిక–2024 తేలి్చచెప్పింది. 2100 నాటికి హిమాలయ పర్వతాల్లోని 75 శాతం మంచు కరిగిపోయే ప్రమాదం ఉందని స్పష్టంచేసింది. తద్వారా వరదలు, విపత్తులు సంభవిస్తాయని, పర్యావరణం, జీవజాలం, వృక్షజాతులకు ముప్పు సంభవిస్తుందని వెల్లడించింది. ఆసియాలో 200 కోట్ల మంది తీవ్రంగా ప్రభావితం అవుతారని పేర్కొంది. భూగోళంపై అత్యధికంగా మంచు నిల్వ ఉన్న మూడో అతిపెద్ద ప్రాంతం హిమాలయాలే. కాలుష్యం, ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల ఇక్కడి హిమానీనదాలు(గ్లేసియర్స్) వేగంగా కరిగిపోతున్నాయి. ఎగువ హిమాలయాల్లో ఇప్పటికే మంచు చాలావరకు మాయమైంది. 2013 నుంచి 2022 వరకు ఇండియాలో 44 శాతం ప్రకృతి విపత్తులకు హిమగిరుల్లో మంచు కరగడమే కారణమని ఇండియా పర్యావరణ నివేదిక–2024 వివరించింది. ఉత్తరాది రాష్ట్రాల్లో, ప్రధానంగా హిమాలయ రాష్ట్రాల్లో వరదలు, పెను తుఫాన్లు, కొండ చరియలు విరిగిపడడం వంటి విపత్తులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నట్లు ఈ నివేదిక గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. మనమంతా పర్యావరణ సంక్షోభం అంచున ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. హిమాలయాల్లో మంచు కరిగిపోతుండడంతో విలువైన వృక్ష సంపద అంతరించిపోతున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. ప్రతి పదేళ్లకు 54 మీటర్ల మేర వృక్షాలు కనుమరుగు అవుతున్నట్లు వెల్లడయ్యింది. నిత్యం మంచుతో గడ్డకట్టుకొని ఉండే ప్రాంతాలు సైతం మాయమవుతున్నాయి. ముఖ్యంగా పశి్చమ భాగంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. 2004 నుంచి 2020 వరకు 8,340 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మంచు కరిగింది. అదంతా మైదాన ప్రాంతంగా మారిపోయింది. హిమాలయాల్లో 40 శాతం మంచు ఇప్పటికే కరిగిపోయిందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి 75 శాతం మంచు కనిపించకుండా పోతుందని ఇండియా పర్యావరణ నివేదిక హెచ్చరించింది. ఈ మహావిపత్తును నివారించాలంటే వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెడ్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇజబెల్లా కొజీల్ సూచించారు. అత్యవసర, నిర్ణయాత్మక కార్యాచరణ అవసరమని పేర్కొన్నారు. హిమాలయ పర్యావరణ, జీవావరణ వ్యవస్థపై కోట్ల మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుచేశారు. మన ప్రభుత్వాలు చురుగ్గా వ్యవహరించాలని, హిమాలయాలను కాపాడుకోకపోతే మానవాళి మనుగడకు ప్రమాదం తప్పదని స్పష్టం చేశారు. ప్రమాదంలో డూమ్స్ డే గ్లేసియర్ అంటార్కిటికా ఖండం పశి్చమ భాగంలోని డూమ్స్ డే హిమానీనదం(థ్వాయిట్స్ గ్లేసియర్) మనుగడ ముప్పును ఎదుర్కొంటోంది. గత 80 ఏళ్లలో ఏకంగా 50 బిలియన్ టన్నుల మంచును కోల్పోయింది. ప్రస్తుతం 130 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ గ్లేసియర్ క్రమంగా కరిగిపోతోంది. కొత్తగా వచి్చచేరే మంచు కంటే కరిగిపోతున్నదే ఎక్కువ. మరికొన్నేళ్లలో పూర్తిగా అంతమైనా అశ్చర్యం లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవలే ఈ హిమానీనదంపై అధ్యయనం చేశారు. నమూనాలు సేకరించి విశ్లేషించారు. ఎల్–నినో ప్రభావం కారణంగా భూమి వేడెక్కుతుండడంతో డూమ్స్డే గ్లేసియర్ కరిగిపోతున్నట్లు గుర్తించారు. ఈ పరిణామం 80 సంత్సరాల క్రితం.. 1940వ దశకంలోనే మొదలైందని, 1970వ దశకంలో వేగం పుంజుకుందని తేల్చారు. అంటార్కిటికా ఖండంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండడంతో హమానీనదం కరిగిపోయే రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నట్లు సైంటిస్టులు స్పష్టం చేశారు. పశి్చమ అంటార్కిటికాలో మంచు ఫలకాల స్థిరత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం తోడ్పడుతుందని భావిస్తున్నారు. డూమ్స్ డే గ్లేసియర్ కీలకమైన ప్రదేశంలో ఉంది. ఇది పూర్తిగా కరిగిపోతే పశి్చమ అంటార్కిటికా నుంచి సముద్రంలోకి మరింత నీరు చేరుతుంది. ఫలితంగా సముద్ర మట్టం 65 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయి. జల విధ్వంసం తప్పదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నటుడి నగ్న ఫోటోలు.. మీరు అలా ఎందుకు చేయకూడదు?
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నగ్నంగా ఓ మేగజైన్ కవర్ ఫోటోగా ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ విషయంపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అయితే ఆయన బాటలోనే మరో బాలీవుడ్ నటుడు కనిపించి అందరికీ షాకిచ్చాడు. గతేడాది విద్యుత్ జమ్వాల్ తన పుట్టిన రోజు సందర్భంగా హిమాలయల్లో నగ్నంగా కనిపిస్తూ ఉన్న ఫోటోలను పంచుకున్నారు. అతని ఫోటోలపై సోషల్ మీడియాలో భిన్నమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు విమర్శించగా.. మరికొందరు మద్దతుగా పోస్టులు పెట్టారు. తాజాగా విద్యుత జమ్వాల్ ఆ ఫోటోలపై స్పందించారు. అలా ఉండడం తనకు చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్ జమ్వాల్ మాట్లాడుతూ..' నాకు సొంత పనులు చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చినట్లు లైఫ్ను ఎంజాయ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. ఇష్టమైన పుస్తకాన్ని చదవడం చాలా ఇష్టం. మీరు చూసిన ఈ ఫోటోలు నేను గత 14 ఏళ్లుగా సందర్శించిన వాటిలో ఒక భాగం మాత్రమే. ఈ విషయంలో నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నగ్నంగా ఉండి తమ కోసం సమయం ఎందుకు కేటాయించకూడదు. మీరు అలా చేస్తే ఈ ప్రపంచంలో సిగ్గుపడని ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.' అని అన్నారు. మీ నగ్న చిత్రాలపై వచ్చిన కామెంట్స్ బాధించాయా అని ప్రశ్నించగా.. 'ఇలాంటి చిన్న విషయాలు కేవలం దోమ కుట్టినట్లుగా మాత్రమే అనిపిస్తాయని అన్నారు. ఇలాంటి విమర్శలు నన్ను ఏ విధంగా బాధించవని చెప్పారు. ఎందుకంటే అది తన గురించి ఒకరి అభిప్రాయం మాత్రమేనని కొట్టిపారేశారు. కాగా.. విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం క్రాక్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. My retreat to the Himalayan ranges - “the abode of the divine” started 14 years ago. Before I realised, it became an integral part of my life to spend 7-10 days alone- every year. pic.twitter.com/HRQTYtjk6y — Vidyut Jammwal (@VidyutJammwal) December 10, 2023 -
Sadhvi Bhagawati Saraswati: హాలీవుడ్ టు హిమాలయాస్
‘క్షమించకపోతే మీరు గతంలోనే ఉండిపోతారు’ అంటారు సాధ్వి భగవతి సరస్వతి. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ యూదురాలు పాతికేళ్లుగా హృషికేశ్లో జీవిస్తూ ఆధ్యాతికత సాధన చేయడమే కాదు సామాజిక సేవలో విశేష గుర్తింపు పొందారు. ‘ఆధునిక జీవితంలో పరుగు పెడుతున్నవారు ఆనందాలంటే ఏమిటో సరిగ్గా నిర్వచించుకోవాలి’ అన్నారామె. ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో వెలువడి బెస్ట్ సెల్లర్గా నిలిచిన తన ఆత్మకథ గురించి ‘జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్’లో మాట్లాడారు. ఆమె ఒక కథతో మొదలెట్టింది. ‘ఒక ఊరిలో కోతుల బెడద ఎక్కువైంది. వాటిని పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలి. ఏం చేశారంటే కొబ్బరి బోండాలకి కోతి చేయి పట్టేంత చిన్న చిల్లి చేసి వాటిలో కోతులకు ఇష్టమైన హల్వాను పెట్టారు. కోతులు ఆ హల్వా కోసం లోపలికి చేయి పెట్టి పిడికిలి బిగిస్తాయి. కాని చేయి బయటకు రాదు. కొబ్బరి బోండాంలో ఇరుక్కున్న చేతితో అది ఎక్కువ దూరం పోలేదు. అప్పుడు దానిని పట్టుకుని అడవిలో సులభంగా వదలొచ్చు. ఇక్కడ తెలుసుకోవాల్సిందేమంటే కోతి గనక పిడికిలి వదిలేస్తే చేయి బయటకు వచ్చేస్తుంది. కాని అది వదలదు. హల్వా కావాలి దానికి. మనిషి కూడా అంతే. తనే వెళ్లి జంజాటాల్లో చిక్కుకుంటాడు. పిడికిలి వదిలితే శాంతి పొందుతాడు’ అందామె. హృషికేశ్లోని గంగానది ఒడ్డున పరమార్థ్ ఆశ్రమ్లో గత పాతికేళ్లుగా జీవిస్తున్న సాధ్వి భగవతి సరస్వతి నిజానికి భారతీయురాలు కాదు. భారతదేశంతో ఏ సంబంధమూ లేదు. ఆమె అమెరికాలో జన్మించిన యూదురాలు (అసలు పేరు చెప్పదు). స్టాన్ఫర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేసి ఆ తర్వాత సైకాలజీలో íపీహెచ్డీ చేసింది. హాలీవుడ్ ఉండే లాస్ ఏంజిలస్లో ఎక్కువ కాలం నివసించిన ఆమె హాలీవుడ్లో పని చేసింది కూడా. కాని 1997లో భర్తతో కలిసి తొలిసారి ఇక్కడకు వచ్చినప్పుడు గంగానది చూసి ఆమె పొందిన ప్రశాంతత అంతా ఇంతా కాదు. ప్రశాంతమైన జీవన విధానం భారతీయ తత్త్వ చింతనలో ఉందని విశ్వసించి అప్పటినుంచి ఇక్కడే ఉండిపోయింది. విచిత్రమేమంటే ఈ దేశ జీవన విధానాన్ని మరచి ఆధునికవేగంలో కూరుకుపోయిన వారికి ఆమె పరిష్కార మార్గాలు బోధిస్తున్నది. సంతోషానికి నిర్వచనం ఏమిటి? ‘బిడ్డ పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు ఆ బిడ్డ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతుంటారు. బాగా చదవాలి, బాగా మార్కులు తెచ్చుకోవాలి, ఈ కోర్సులోనే చేరాలి, ఈ దేశమే వెళ్లాలి, ఫలానా విధంగా పెళ్లి చేసుకోవాలి, ఫలానా విధంగా డబ్బు వెనకేసుకోవాలి... ఇంత ప్రయాస పడితే తప్ప మనిషి సంతోషంగా ఉండలేడన్న భావన తలలో నిండిపోయి ఉంది. అయితే డబ్బు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండగలమా? సంతృప్తిగా జీవించడంలో సంతోషం ఉంది. జీవితంలో అనుక్షణం సంతోషం పొందడం నేర్చుకోవడం లేదు. ఎప్పుడో ఏదో సంతోషం దొరుకుతుందనే తాపత్రయంతో ఈ క్షణంలోని సంతోషం పొందకుండా మనిషి పరిగెడుతున్నాడు’ అంటుందామె. హాలీవుడ్ను వదిలి సాధారణంగా చాలామంది అమెరికాలో స్థిరపడి సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటారు. కాని సాధ్వి భగవతి అమెరికాను విడిచి గంగానది ఒడ్డున ప్రశాంతంగా జీవించడంలో సంతోషం ఉందని ఇక్కడ ఉండిపోయింది. ‘నా భర్త నాకు భారతదేశం గురించి చెప్పాడు. అతనే నన్ను ఇక్కడకు తీసుకొచ్చాడు. కానీ ఒక్కసారి ఇక్కడ గంగానదిని చూశాక, గురువును పొందాక ఇక ఎక్కడికీ వెళ్లకూడదనుకుని ఉండిపోయాను’ అని తెలిపిందామె. ఆధునిక జీవితం నుంచి ఆధ్యాత్మిక జీవనంలో తాను ఎందుకు, ఎలా ప్రయాణించిందో తెలిపే ఆత్మకథను ‘హాలీవుడ్ టు హిమాలయాస్’ పేరుతో రాసిందామె. అది బెస్ట్ సెల్లర్గా ఉంది. గత పాతిక సంవత్సరాలుగా హిమాలయాల్లో పేదవారి కోసం సామాజిక సేవ చేస్తున్నదామె. అందుకే అమెరికా ప్రెసిడెంట్ బైడన్ ఆమెను ‘లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు’తో గౌరవించాడు. ఆ పిల్లల కళ్లల్లో నిశ్చింత ‘హిమాలయాలకు మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒంటి మీద చొక్కా లేకపోయినా పిల్లల కళ్లల్లో నిశ్చింత చూశాను. లాస్ ఏంజిలస్లో అలాంటి నిశ్చింతతో పిల్లలు ఉండరు. ఆ నిశ్చింత, సంతోషం ఎందుకు పోగొట్టుకుంటున్నాం మనం? ఫిర్యాదులు, ప్రతీకారం, క్షమించకపోవడం... మనల్ని ముందుకు పోనీకుండా చేస్తాయి. ఎదుటివాళ్లు చేసిన తప్పులను మనం అంగీకరించకపోవచ్చు. కాని వాటిని దాటి ముందుకెళ్లాలంటే క్షమించడమే మార్గం. లేదంటే మనం గతంలోనే కూరుకుపోతాం. జీవితానికి ఏం మేలు చేస్తున్నావన్నది కాదు... జీవితం ద్వారా ఏం మేలు పొందుతున్నావన్నదే ముఖ్యం’ అన్నారామె. -
IAF: కార్గిల్లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
Agapi Sikkim: ప్రకృతి ఇచ్చిన ప్రేమ కానుక గెలుపు దారి
పెద్ద నగరాలలో పెద్ద ఉద్యోగం చేస్తున్నప్పటికీ రిన్జింగ్ భూటియా మనసులో ఏదో లోటు ఉండేది. విశాలమైన ప్రకృతి ప్రపంచంలో పుట్టి పెరిగిన రిన్జింగ్ రణగొణ ధ్వనులకు దూరంగా తన మూలాలను వెదుక్కుంటూ సిక్కిం వెళ్లింది. హిమాలయాలలోని అరుదైన మొక్కలతో తయారు చేసే స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ స్టార్టప్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. సొంతకాళ్ల మీద నిలబడడానికి పునరావాస కేంద్రాల్లోని మహిళల కోసం ఉచిత వర్క్షాప్లు నిర్వహిస్తోంది. సిక్కింలోని అద్భుతమైన ప్రకృతి అందాల మధ్య పుట్టి పెరిగిన రిన్జింగ్ వృత్తిరీత్యా దిల్లీ, బెంగళూరు, కోల్కత్తాలాంటి మహానగరాల్లో గడిపింది. ఆర్థిక సమస్యలు లేనప్పటికీ ఏదో లోటుగా అనిపించేది. ప్రకృతి మధ్య తాను గడిపిన కాలాన్ని గుర్తు చేసుకునేది. మరో ఆలోచన లేకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సిక్కిం బాట పట్టింది. ఎంటర్ప్రెన్యూర్ కావాలనే రిన్జింగ్ చిరకాల కల అక్కడ రెక్కలు విప్పుకుంది. ‘ఉద్యోగ జీవితానికి సంబంధించి ఏ లోటు లేకపోయినప్పటికీ పెద్ద నగరాలలో కాలుష్యం, ఇరుకు ప్రదేశాలలో నివసించాల్సి రావడంతో బాగా విసుగెత్తిపోయాను. నా బిడ్డ పచ్చని ప్రకృతి ప్రపంచంలో పెరగాలనుకున్నాను. అందుకే వెనక్కి వచ్చేశాను’ అంటుంది రిన్జింగ్. ఉద్యోగం లేదు కాబట్టి బోలెడంత ఖాళీ సమయాన్ని చర్మ సంరక్షణకు సంబంధించిన పరిశోధనకు కేటాయించింది. ప్రకృతిలోని ఎన్నో వనమూలికల గురించి లోతుగా అధ్యయనం చేసింది. హిమాలయాలలో లభించే అరుదైన మొక్కలతో హ్యాండ్ క్రాఫ్టెడ్ స్కిన్కేర్ ప్రాడక్ట్స్కు సంబంధించిన ‘అగాపి సిక్కిం’ అనే అంకుర సంస్థను ఆరంభించింది. ‘అగాపి’ అనేది గ్రీకు పదం. దీని అర్థం... ప్రేమ. సిక్కింలోని అనేక ప్రాంతాలలో చర్మవ్యాధులకు ఔషధంగా తమ చుట్టుపక్కల ఉండే మొక్కలను ఉపయోగించడం అనేది తరతరాలుగా జరుగుతోంది. ఈ సంప్రదాయమే తనకొక దారి చూపింది. చర్మవ్యాధులను తగ్గించే ఎన్నో ఔషధాల వాడకం పరంపరగా వస్తున్నప్పటికీ వాటి గురించి స్కిన్కేర్ ఇండస్ట్రీకి తెలియదు. బిజినెస్ మోడల్ను డిజైనింగ్ చేసుకున్న తరువాత కబీ అనే ప్రాంతంలో తొలిసారిగా ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది రిన్జింగ్. ఇరవైమందికి పైగా మహిళలు హాజరయ్యారు. ఈ ఉత్సాహంతో మరిన్ని ప్రాంతాలలో మరిన్ని ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించింది.‘మా వర్క్షాప్లో శిక్షణ తీసుకున్న పదిమందికి పైగా మహిళలు సొంత ప్రాజెక్ట్లు మొదలు పెట్టడం సంతోషంగా అనిపించింది. ఏదో సాధించాలనే పట్టుదల వారిలో కనిపించింది. వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాను’ అంటుంది రిన్జింగ్. మాదక ద్రవ్యాలు, మద్యవ్యసనంతో శిథిలం అవుతున్న వారికి ఆ వ్యసనాల నుంచి బయటకు తీసుకువచ్చే సాధనంగా వర్క్షాప్లను ఉపయోగించుకుంటోంది రిన్జింగ్. పునరావాస కేంద్రాల్లో కూడా వర్క్షాప్లు నిర్వహించి వారిలో ఆర్థికస్థైర్యాన్ని నింపింది. మాస్కులు, షాంపులు, స్క్రబ్లు, ఫేషియల్ ఆయిల్... మొదలైనవి ఎన్నో ఉత్పత్తి చేస్తుంది అగాపి సిక్కిం. స్థానిక రకాల కలబంద, జనపనార... మొదలైన వాటిని తమ ఉత్పత్తులకు ముడిసరుకుగా ఉపయోగించుకుంటోంది. మొదట సిక్కిం చుట్టుపక్కల నగరాలలో ప్రాడక్ట్స్ను విక్రయించేవారు. ఆ తరువాత బెంగళూరు, కోల్కతాతో పాటు దేశంలోని ఎన్నో ప్రాంతాలకు మార్కెట్ విస్తరించింది. ‘అగాపి’ చెప్పుకోదగిన బ్రాండ్గా ఎదిగినప్పటికీ ‘ఇక చాలు’ అనుకోవడం లేదు రిన్జింగ్. స్కిన్ కేర్ సైన్స్కు సంబంధించి ఎప్పటికప్పుడు తన పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంగ్లాండ్లోని ‘ఫార్ములా బొటానికా’కు సంబంధించి ఆన్లైన్ కోర్సులు చేస్తోంది. ప్రాచీన ఔషధాలపై కొత్త వెలుగు ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సంప్రదాయ ఔషధాలు వెలుగు చూసేలా, ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తోంది రిన్జింగ్. తాను కంపెనీ స్థాపించడమే కాదు ఇతరులు కూడా స్థాపించేలా వర్క్షాప్లు నిర్వహిస్తోంది. ‘ఇక్కడ అడుగు పెట్టడానికి ముందు ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు వాటికి సమాధానం దొరికింది. అగాపి విజయం నాకు ఎంతో ఉత్సాహం ఇచ్చింది’ అంటుంది రిన్జింగ్ భూటియ. -
ఆ ఊరిలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులు దుస్తులు లేకుండా..
కొన్ని ఊర్లలో చాలా వింతైనా ఆచారాలు ఉంటాయి. వింటేనా చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంటాయి. అచ్చం అలానే ఇక్కడొక ఊరిలా ఓ వింత ఆచారం ఉంది. అది వింటే ఒక్కసారిగా నిర్ఘాంతపోతారు. బాబోయ్ ఇదేమి ఆచారం రా బాబు అనేస్తారు. అంత వింతగా జుగుప్సకరంగా ఉంటుంది. వివరాల్లోకెళ్తే..హిమాచల్ప్రదేశ్లోని కులు జిల్లాలోని సుందరమైన ప్రకృతి ఒడిలో పిని అనే ఓ గ్రామం ఉంది. ఇది సాంప్రదాయ జీవన విధానానికి చాలా ప్రసిద్ధి. ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఈ గ్రామంలో ఉత్సుకతను రేకెత్తించే ఓ విచిత్రమైన సంప్రదాయం ఉంది. ఆ పిని గ్రామంలో మహిళలంతా స్వచ్ఛందంగా ఏడాదిలో ఒక ఐదు రోజుల పాటు దుస్తులు ధరించడం మానేస్తారు. ఇది తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఎందుకిలా అంటే?.. గ్రామస్తులు ప్రకృతికి, స్థానిక దేవత పట్ల ప్రగాఢమైన గౌరవం, కృతజ్ఞతకి గుర్తుగా ఇలా చేస్తారట. ఐదురోజుల పాటు బట్టలు లేకుండా ప్రకృతితో గడుపుతరట. తమ గ్రామంలోని స్త్రీలు సూర్యుని కాంతి, వెలుగు, స్వచ్ఛమైన గాలిని తమ మేనిపై స్వాగతించేలా ప్రకృతిని ఆలంగినం చేసుకుంటారని అక్కడ గ్రామస్తులు చెబుతుండటం విశేషం. ఈ సంప్రదాయం వెనుకు ఉన్న ప్రధాన కారణం తమ స్థానిక దేవతకు నివాళులర్పించేందుకు ఇలా స్త్రీలు వివస్త్రగా ఉంటారట. ఇలా తమను తాము శుద్ధి చేసుకోవడమే గాక తమ కుటుంబాన్ని, గ్రామాన్ని చల్లగా చూడమని దేవతను కోరుతూ.. ఇలా బట్టలు విప్పి తమ గౌరవాన్ని చాటుకుంటారట. ఈ ఐదు రోజులూ పిని గ్రామంలోని మహిళలు బట్టలు లేకుండానే వివిధ పూజలు, వేడుకల్లో పాల్గొంటారు. వారు గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఈ ఐదు రోజులు వారికి గొప్ప ఆధ్యాత్మికతకు సంబంధించి ఒక భక్తి మార్గం అని చెప్పాలి. అంతేగాదు దుస్తులు దైవంతో అనుబంధం ఏర్పరుచుకోవడానికి అవరోధంగా అక్కడ మహిళలు భావిస్తారట కూడా. నిజమే కదా! ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే మనల్ని సృష్టించిన భగవంతుడు ముందు సిగ్గు, బిడియం ఉండకూదు. మనం చిన్నగా ఉన్నప్పుడూ మన తల్లిదండ్రలు వద్ద ఎలా ఉంటామో అలానే భగవంతుడితో ఉండాలని చెప్పకనే చెబుతున్నారు వీళ్లు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
ముగిసిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: 62వ వార్షిక అమర్నాథ్ యాత్ర గురువారంతో ముగిసింది. హిమాలయాల్లోని మంచు స్ఫటిక శివలింగం ఉన్న ఈ గుహాలయాన్ని ఈ ఏడాది 4.4 లక్షల మంది యాత్రికులు సందర్శించుకున్నారు. జూలై ఒకటో తేదీ నుంచి బల్టాల్, పహల్గామ్ మార్గాల్లో యాత్ర మొదలైంది. యాత్రికులు సహా మొత్తం 48 మంది వాతావరణ సంబంధ, సహజ కారణాలతో చనిపోగా, మరో 62 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. యాత్ర ప్రశాంతంగా కొనసాగిందని, ఎటువంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు. గత ఏడాది 3.65 లక్షల మంది యాత్రికులు అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు. -
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
గంగా తరంగం.. కాదిక నిరంతరం
పావన గంగా తరంగం.. బ్రహ్మపుత్ర గాంభీర్యం.. సింధునదీ సోయగం ఇక గతమే అంటోంది ఓ అధ్యయనం. మరో ఎనభై ఏళ్ల తరువాత ఈ జీవనదుల్లో వర్షాకాలంలోనే నీటి ప్రవాహం ఉంటుందని చెబుతోంది. భారత ఉపఖండానికి హిమాలయాలే జీవగర్ర. ఇక్కడ పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర వంటి జీవనదులు ఉపఖండంలోని మెజారిటీ భాగాన్ని సస్యశ్యామలం చేస్తూ భారత దేశాన్ని ప్రపంచానికే అన్నపూర్ణగా మారుస్తున్నాయి. హిమాలయాల్లో జరిగే ప్రతి మార్పూ భారత ఉపఖండంపై పెను ప్రభావం చూపుతుంది. అటువంటి హిమాలయాలు భూతాపం కారణంగా ప్రస్తుతం సంకటస్థితిని ఎదుర్కొంటున్నాయి. ధ్రువప్రాంతాలు మినహాయిస్తే భూగోళంలో అత్యధిక హిమపాతం కనిపించే హిమాలయాల్లో మరికొన్నేళ్లలో మంచు మటుమాయమైపోతుందని తాజా అధ్యయనంలో తేలింది. సాక్షి, అమరావతి: ఉత్తరార్ధగోళంలో 1950 నుంచి 2019 వరకు ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, వర్షపాతం, హిమపాతం తదితర వాతావరణ సంబంధిత గణాంకాలపై బర్క్లీ–మిచిగాన్ యూనివర్సిటీలు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. యూరోపి యన్ సెంటర్ నుంచి సేకరించిన సమాచా రాన్ని ఈ రెండు యూనివర్సిటీల ప్రొఫెసర్లు లోతుగా విశ్లేషించారు. ఆ గణాంకాలను 2024 నుంచి 2100 వరకూ వర్తింపజేసి వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేశా రు. ఈ అధ్యయనంలో ముఖ్యాంశాలు ఇవీ.. ♦పర్యావరణ కాలుçష్యం కారణంగా వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగు తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక డిగ్రీ పెరిగితే.. ఉత్తరార్ధగోళంలో హిమాల యపర్వతాల నుంచి యూరప్లో విస్తరించిన ఆల్ప్స్ పర్వతాల వరకూ వర్షపాతం 15 శాతం పెరుగుతోంది. ఆ మేరకు హిమపాతం తగ్గుతోంది. ♦ ఉత్తరార్ధగోళంలో మన దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయాల నుంచి యూరప్లోని ఆల్ప్స్ అమెరికాలోని రాఖీ పర్వతాల వరకూ చూస్తే.. హిమాల యాల్లోనే అధిక వర్షపాతం నమోదవు తోంది. ఆ మేరకు హిమపాతం గణనీయంగా తగ్గుతోంది. ♦ హిమాలయాల్లో పుట్టిన గంగ, సింధు, బ్రహ్మపుత్ర నదులు, వాటి ఉప నదుల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం.. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు వర్షపాతం పెరగడమే. ఈ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు సారవంతమైన నేల కోతకు గురవుతోంది. ఈ ప్రభావం వల్ల హిమాలయాలకు దిగువన నివసించే కోట్లాది ప్రజల జీవనం అస్తవ్యస్తమవుతోంది. ♦హిమాలయపర్వతాల్లో ప్రధానంగా హిందూకుష్ పర్వత శ్రేణుల్లో హిమనీనదాలు (గ్లేసియర్స్) కరుగుదల ఇటీవలి కాలంలో 65 శాతం పెరిగినట్లు ఐసీఐఎంవోడీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్) సంస్థ తేల్చింది. 2100 నాటికి హిందూకుష్ పర్వతాల్లోని హిమనీనదాలు ప్రస్తుతం ఉన్న పరిమాణంలో 80 శాతం మాయం కావడం ఖాయమని ఆ సంస్థ పేర్కొంది. ♦ హిమపాతం తగ్గడం, హిమనీనదాలు వేగంగా కరుగుతుండటాన్ని బట్టి చూస్తే జీవనదులైన గంగ, బ్రహ్మపుత్ర, సింధు వంటి నదులు, వాటి ఉప నదుల్లో 2100 తరువాత వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం కనిపిస్తుంది. మిగతా సమయాల్లో ఆ జీవనదులు ఎండిపోవడం ఖాయం. దీనివల్ల భారతదేశ ప్రజల ఆహార అవసరాలు తీర్చడంలో అత్యంత కీలకమైన గంగా సింధు మైదానానికి నీటి లభ్యత కష్టమే. -
పర్వతాలు పిలిచాయి
‘అదిగో పర్వతాలు పిలుస్తున్నాయి. నేను తప్పక వెళ్లాలి’ అంటాడు ప్రకృతి ప్రేమికుడు, తత్వవేత్త జాన్ మ్యూర్. ఒకానొక సమయంలో శాలిని సింగ్కు కూడా పర్వతాల పిలుపు వినిపించింది. పర్వతాలు ఆప్యాయంగా పలకరిస్తాయి. సాహసాలు చేయమంటాయి. అనురక్తి ఉన్నచోట ధైర్యం ఉంటుంది. ఆ రెండు ఉన్నచోట అపురూపమైన సాహసం ఆవిష్కారం అవుతుంది. ఉత్తరఖండ్లోని హిమాలయప్రాంతం ఉత్తరకాశీలో అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్గా చరిత్ర సృష్టించింది లక్నోకు చెందిన శాలిని సింగ్.... లక్నోకు చెందిన బప్పశ్రీ నారాయణ్ పీజీ కాలేజీలో శాలిని సింగ్ బీఏ స్టూడెంట్. పాఠాలే కాదు పర్వతారోహకుల గురించి ఎన్నో విషయాలు విన్నది శాలిని. 19 శతాబ్దానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ పర్వతారోహకుల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విన్నది. బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, అరునిమ సిన్హా, శివాంగి పాఠక్, మాలావత్ పూర్ణ....వరకు ఎంతో మంది సాహసికులు తనలో ఉత్తేజం నింపారు. ఎన్సీసీలో చేరిన తరువాత శాలిని సింగ్ ప్రపంచం విస్తృతం అయింది. కొత్త దారులు ఎన్నో కనిపించాయి. యూపీ బెటాలియన్లో శాలిని సింగ్ సీనియర్ వింగ్ ఎన్సీసీ క్యాడెట్. అడ్వాన్స్డ్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి సత్తా నిరూపించుకోవాలనేది ఎంతోమంది కల. అయితే అది అంత తేలికైన విషయం కాదు. దానికి ముందు బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. జమ్ములోని పహల్గామ్లో గత సంవత్సరం బేసిక్ మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసిన శాలిని అడ్వాన్స్డ్ కోర్సుకు అర్హత సంపాదించింది. మౌంటెనీరింగ్ కోర్సులో భాగంగా ఎన్నో అనుభవాలను సొంతం చేసుకుంది శాలిని. అవి తన జీవితంలో విలువైన అనుభవాలు. మరిన్ని సాహసాలకు దారి చూపే అరుదైన పాఠాలు. దట్టమైన మంచుతో ఉండే హుర్రా శిఖరాన్ని అధిరోహించడం అనేది సాధారణ విషయం కాదు. కోర్సులో భాగంగా ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను తట్టుకొని డ్రింజ్ వ్యాలీలోని 15,000 అడుగుల ఎత్తయిన హుర్రాను అధిరోహించింది శాలిని. ఉత్సాహం, అంకితభావం, సాహసాలను మేళవించి ఎన్నో సవాళ్లతో కూడిన అధునాతనమైన మౌంటెనీరింగ్ కోర్సు పూర్తి చేసి, తొలి మహిళా ఎన్సీసీ క్యాడెట్గా చరిత్ర సృష్టించింది శాలిని సింగ్. ‘నువ్వు చేయగలవు. కచ్చితంగా చేస్తావు’ అంటూ శాలినిలో ఉత్సాహాన్ని నింపాడు కల్నల్ పునీత్ శ్రీవాస్తవ. ‘శాలిని విజయం ఎన్సీసీకి మాత్రమే పరిమితమైన విజయం కాదు. ఆమెలా కలలు కనే ఎంతోమందికి స్ఫూర్తిని ఇచ్చే విజయం’ అంటున్నాడు పునీత్ శ్రీవాస్తవ. ‘నా విజయం ఎంతమంది అమ్మాయిలకు స్ఫూర్తినిస్తే అంతగా సంతోషిస్తాను’ అంటుంది శాలిని సింగ్. ‘మనం యాంత్రికంగా జీవిస్తున్నామా, జీవనోత్సాహంతో ఉన్నామా అనే దానికి సాహసాలే ప్రమాణం అనే మాట ఎన్నో సార్లు విన్నది శాలిని. ఆ మాటలే సాహస బాటను ఎంచుకోవడానికి తనకు ప్రేరణ ఇచ్చాయి. సివిల్ సర్వీసెస్లో చేరాలనేది శాలిని సింగ్ కల. అయితే అంతకంటే బలమైన కల.... ప్రపంచంలోని ప్రతి శిఖరాన్ని అధిరోహించాలని! -
ఎవరెస్ట్ పైకి 27 సార్లు..!
కఠ్మాండు: ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని పసంగ్ దవా షెర్పా(46) పర్వతారోహకుడు 27సార్లు అధిరోహించారు. 8,848.86 మీటర్ల ఎత్తైన ఈ హిమాలయ శిఖరాన్ని సోమవారం ఉదయం 8.25 గంటలకు ఆయన చేరుకున్నట్టు పర్వతారోహక యాత్ర నిర్వహిస్తున్న ‘ఇమాజిన్ నేపాల్ ట్రెక్స్’ తెలిపింది. తద్వారా కమి రిటా షెర్పా రికార్డును ఆయన సమం చేశారు. ఎవరెస్ట్ రీజియన్లో జన్మించిన పసంగ్ తొలిసారి 1998లో ఎవరెస్ట్ను అధిరోహించారు. మరోవైపు 53 ఏళ్ల కమి రిటా షెర్పా ఈ సీజన్లోనే ఎవరెస్ట్ను 28వ సారి ఎక్కి పసంగ్ను అధిగమించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
Char Dham Yatra 2023: 30దాకా కేదార్నాథ్ రిజిస్ట్రేషన్ నిలిపివేత
రిషికేశ్: ఎగువ హిమాలయాల ప్రాంతం గర్వాల్ హిమాలయాల్లో వర్షం, హిమపాతం కారణంగా కేదార్నాథ్ యాత్ర కోసం రిషికేశ్, హరిద్వార్లలో జరిగే యాత్రికుల రిజిస్ట్రేషన్లను ఈ నెల 30వ తేదీదాకా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మంగళవారం తెరుచుకోనున్న సంగతి తెల్సిందే. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సంబంధిత అధికారులు తెలిపారు. బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ధామ్ల దర్శనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కొనసాగుతోంది. -
హిమానీ నదాలు శరవేగంగా కనుమరుగు! విస్మయకర వాస్తవాలు వెలుగులోకి
హిమాలయాల్లో హిమానీ నదులు శరవేగంగా కరిగిపోతున్నాయి. ఎంతగా అంటే, గత 20 ఏళ్లలో కరిగిపోయిన హిమానీ నదాల పరిమాణం ఏకంగా 57 కోట్ల ఏనుగుల బరువుతో సమానమట! అంటే హీనపక్షం 170 కోట్ల టన్నుల పై చిలుకే...! ఈ ప్రమాదకర పరిణామాన్ని పర్యావరణవేత్తలు, సైంటిస్టులు ఆలస్యంగా గుర్తించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే అతి తొందర్లోనే హిమాలయాల్లో పెను మార్పులు చూడాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు... 2000 నుంచి 2020 మధ్య కేవలం 20 సంవత్సరాల్లో హిమాలయాల్లో ప్రోగ్లేషియల్ సరస్సులు ఏకంగా 47 శాతం పెరిగాయి. సరస్సుల సంఖ్య పెరిగితే మంచిదే కదా అంటారా? కానే కాదు. ఎందుకంటే హిమానీ నదాలు కరిగిపోయి కనుమరుగయ్యే క్రమంలో ఏర్పడే సరస్సులివి! ఇవి ఎంతగా పెరిగితే హిమానీ నదాలు అంతగా కుంచించుకుపోతున్నట్టు అర్థం! ఈ పరిణామామంతా చాలావరకు భూమి పై పొరకు దిగువన జరుగుతుంది గనుక ఇంతకాలం పర్యావరణవేత్తల దృష్టి దీనిపై పడలేదు. కానీ ఈ సరస్సుల సంఖ్య బాగా పెరిగిపోతుండటంతో ఈ పరిణామంపై వాళ్లు ఇటీవలే దృష్టి సారించారు. హిమాలయాల్లో కరిగిపోతున్న హిమనీ నదాల పరిమాణాన్ని తొలిసారిగా లెక్కగట్టగా ఈ విస్మయకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిటన్లోని సెయింట్ ఆండ్రూస్, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఆస్ట్రియాలోని గ్రాజ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, కార్నిగీ మెలన్ వర్సిటీలకు చెందిన రీసెర్చర్ల బృందంలో ఇందులో పాల్గొంది. అధ్యయన ఫలితాలను నేచర్ జియోసైన్స్ జర్నల్లో ప్రచురించారు. ‘‘హిమాలయాల వద్ద భూ ఫలకాలు అత్యంత చురుగ్గా ఉంటాయి. నిత్యం కదలికలకు లోనవుతూ ఉంటాయి. దాంతో హిమానీ నదాల ప్రవాహ మార్గాలు తరచూ మారిపోతున్నాయి’’ అన్నారు. హిమాలయాల్లో 6.5 శాతం తగ్గిన మంచు ♦ తాజా అధ్యయనం పలు ఆందోళనకర అంశాలను వెలుగులోకి తెచ్చింది. వాటిలో ప్రధానమైనవి... ♦ కనుమరుగవుతున్న హిమానీ నదాల రూపంలో గ్రేటర్ హిమాలయాలు ఇప్పటికే తమ మొత్తం మంచులో 6.5 శాతాన్ని కోల్పోయాయి. ♦ మధ్య హిమాలయాల్లో హిమానీ నదాల అంతర్థానం చాలా వేగంగా కొనసాగుతోంది. ♦ గాలోంగ్ కో హిమానీ నదం ఇప్పటికే ఏకంగా 65 శాతం కనుమరుగైంది. ♦ హిమాలయాల్లో 2000–2020 మధ్య ప్రోగ్లేషియల్ సరస్సుల సంఖ్యలో 47 శాతం, విస్తీర్ణంలో 33 శాతం, పరిమాణంలో 42 శాతం చొప్పున పెరుగుదల నమోదైంది ♦ ఇందుకు కారణం హిమాలయాల్లోని హిమానీ నదుల పరిమాణం గత 20 ఏళ్లలో ఏకంగా 1.7 గిగాటన్నుల మేరకు తగ్గిపోవడమే. అంటే 1.7 లక్షల కోట్ల కిలోలన్నమాట! ఇది భూమిపై ఉన్న మొత్తం ఏనుగుల బరువుకు కనీసం 1,000 రెట్లు ఎక్కువ!! ♦ ఈ ధోరణి 21వ శతాబ్దం పొడవునా కొనసాగుతుందని పరిశోధకులు అంచనా వేశారు. ♦ ఫలితంగా హిమాలయాల్లోనే గాక ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా హిమానీ నదాలు ప్రస్తుతం భావిస్తున్న దానికంటే అతి వేగంగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పర్వత పుత్రికలు: శశి, గునిత్, అనుష.. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు సైతం
హిమాలయాలు... వింధ్య పర్వతాలు... వీటిని చూడాలని ఎవరికి ఉండదు? రాబోయే వేసవి సెలవుల్లో పర్వత సౌందర్యం చూడాలని చాలామంది అనుకుంటారు. కాని ఆరోగ్య, వయసు సమస్యలు, దివ్యాంగ పరిమితులు కొందరిని భయపెట్టవచ్చు. అయితే ఎవరికైనా సరే పర్వతాలను దగ్గరుండి చూపిస్తాం అంటున్నారు ముగ్గురు మహిళా ట్రెక్ గైడ్లు – శశి, గునిత్, అనుష. పిల్లల నుంచి వృద్ధుల వరకూ అందరికీ వీరు అపరేట్ చేస్తున్న ట్రెక్ టూర్లు అద్భుత పర్వత దర్శనం చేయిస్తున్నాయి. ‘కలగను.. కనుగొను’ అనే ట్యాగ్లైన్ ఉంటుంది అనుష, శశి, గునీత్ నడిపే ‘బొహెమియన్ అడ్వంచర్స్’ అనే ట్రెకింగ్ ఏజెన్సీకి. లోకాన్ని చూసి రావాలన్న కలను నెరవేర్చుకోవడానికి దారిని కనుగొనమని, ఆ దారి కనుగొనడంలో తాము సాయం చేస్తామని అంటారు వీరు ముగ్గురు. మన దేశంలో పూర్తిగా స్త్రీలు మాత్రమే నడుపుతున్న ట్రెకింగ్ ఏజెన్సీలలో వీరిది ఒకటి. అయితే వీరి ప్రత్యేకత అంతా పర్వతాలే. ‘డెహరాడూన్లో మా ఆఫీస్ ఉంటుంది. ఉత్తరాఖండ్లో, లద్దఖ్లో, హిమాలయాల బేస్ క్యాంప్ వరకు, వింధ్య పర్వతాల్లో మేము పర్వతారోహణకు తీసుకెళతాం. ప్రతి ముగ్గురు టూరిస్టులకు ఒక గైడ్ అనే పద్ధతిని మేము పాటిస్తాం.అందుకే వృద్ధులు, పిల్లలు, ఒంటరి స్త్రీలు... ఎవరైనా సరే క్షేమంగా మాతో పాటు ట్రెకింగ్ చేయవచ్చు. మా గైడ్లు కూడా స్ట్రీలే. అందుకే మేము నిర్వహించే పర్వత యాత్రలకు విశేషంగా టూరిస్టులు వస్తారు’ అంటుంది శశి బహుగుణ. 2013లో మొదలు బ్యాంకింగ్ రంగంలో పని చేసే శశి బహుగుణది డెహ్రాడూన్. పబ్లిషింగ్ రంగంలో పని చేసిన గునిత్ పురిది రుద్రపూర్ (ఉత్తరాఖండ్). గతంలో బిజినెస్ జర్నలిస్ట్గా పని చేసిన అనుష సుబ్రమణియన్ది ముంబై. వీరు ముగ్గురికీ పర్వతారోహణ అంటే చాలా ఇష్టం. తరచూ చేసే ట్రెక్కింగ్లో ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు. అయితే 2013లో ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు వీరు ముగ్గురిని కదిలించాయి. వెంటనే పనులన్నీ ఆపి వరద ప్రాంతాలకు చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పర్యాటకులను కాపాడారు. ఆ సమయంలోనే వారికి అనిపించింది పర్యాటకులను సురక్షితంగా ఉంచే పర్వతారోహణ యాత్రలను నడిపే సంస్థను ప్రారంభించాలని. ‘అబ్రహం లింకన్ను గుర్తు చేసుకున్నాం. పర్వతాల వలన పర్వతాల చేత పర్వతాల కొరకు ఇకపై బతకాలని నిర్ణయించుకున్నాం’ అంది శశి బహుగుణ. ట్రెకింగ్ను ఎక్కువగా శశి ప్లాన్ చేస్తుంది. గునిత్ వాహనాలు నడపడంలో ఎక్స్పర్ట్. వంటలో కూడా. అనుష మంచి గైడ్. ‘అందువల్ల మేము కారులో హిమాలయాల్లోని ప్రతి మూల తిరిగాము. మాకు తెలియని పర్వత దారులు లేవు’ అంటారు వారు. ప్రతి ఒక్కరికి హక్కుంది ‘పర్వతారోహణ అంటే వయసు, ఆరోగ్యం ఉన్నవాళ్లనే అందరూ అనుమతిస్తారు. కాని మేము ఆ నియమం పెట్టుకోలేదు. ఇన్క్లూజివ్ ట్రెకింగ్స్ను నిర్వహించాలనుకున్నాం. అనారోగ్యం ఉన్నవారిని, దివ్యాంగులను కూడా ఆరోహణకు తీసుకెళ్లాలనుకున్నాం. ఎందుకంటే పర్వతాలు అందరివి. అందరికీ వాటిని చూసే హక్కుంది. అందుకే పర్వతాలు చూడాలనుకుని వచ్చేవారి హెల్త్ హిస్టరీ అంతా చెక్ చేస్తాం. వారికి ఇవ్వాల్సిన శిక్షణ ఇస్తాం. అంధులను కూడా చేయి పట్టి 50 కిలోమీటర్ల దూరం మేరకు ట్రెకింగ్కు తీసుకెళ్లిన అనుభవం మాకు ఉంది. పార్కిన్సన్ వ్యాధి ఉన్నవాళ్లను కూడా తీసుకెళ్లాం. డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. అయితే ప్రతి దశలో ఆరోగ్యం చెక్ చేయిస్తూ తీసుకెళతాం. మరీ జటిలంగా మారితే వెంటనే హెలికాప్టర్ తెప్పించి వెనక్కు పంపించేస్తాం’ అంటారు వారు. పహాడీ గైడ్లు అనుష, శశి, గునిత్లు తాము నడుపుతున్న ట్రెకింగ్ల కోసం స్థానిక యువతులను గైడ్లుగా తీసుకుని వారికి ఉపాధి కల్పిస్తున్నారు. ‘అందరూ కొండప్రాంతం వారే. లోకల్ గిరిజన యువతులు. వారికి పర్వతాలు కొట్టిన పిండి. అందుకని వారికి తగిన శిక్షణ ఇచ్చి మా టీమ్లో కలుపుకున్నాం. మా దృష్టి ముఖ్యంగా 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీలపై ఉంటుంది. వీరు పిల్లలు ఎదిగొచ్చాక పర్యటనలకు వెళదామనుకుంటారు. అటువంటి వారికి సురక్షితమైన ఏజెన్సీలు ఉన్నాయని తెలియాలి. వారు ఊపిరి పీల్చుకుంటే కుటుంబ కార్యక్రమాల్లో మళ్లీ ఫ్రెష్గా పడతారు. మా విన్నపం ఏమంటే ఒంటరిగా తిరగాలనుకున్నా మంచి ఏజెన్సీలను చూసి వెళ్లండి వెళ్లనివ్వండి అని చెప్పడమే’ అంటారు. పర్వతాలను చూపడానికి చుక్కానులుగా మారిన ఈ ముగ్గురు అభినంద నీయులు. -
మంచుకొండల్లో మహాముప్పు.. తక్షణం అడ్డుకట్ట వేయకుంటే విధ్వంసమే
అందమైన మంచుకొండలైన హిమాలయాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఉత్తరాఖండ్లో జోషిమఠ్ కుంగిపోవడం కంటే మించిన విధ్వంసాలు ఎదురుకానున్నాయనే సంకేతాలు వెలువడుతున్నాయి. హిమానీ నదాలు కరిగిపోవడం, సరస్సులు మాయమవడం, శాశ్వత మంచు ప్రాంతాలపై ప్రభావం పడడం వంటి విపత్తులు ఎదురు కానున్నాయి. దీనికి ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు కాదు, భారత్, చైనా పోటాపోటీగా హిమాలయాల్లో నిర్మాణాలు సాగించడం కూడా ప్రధాన కారణమవుతోంది..వాణిజ్య అవసరాలు, సైనిక అవసరాల కోసం రెండు దేశాలు హిమాలయాల్లో కొండల్ని తొలుస్తున్నారు. రైల్వే ట్రాకులు, రహదారులు నిర్మిస్తున్నారు. సొరంగాలను తవ్వుతున్నారు. హిమాలయాలకి రెండు వైపులా ఈ కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతూ ఉండడం పెను ప్రమాదానికి దారి తీయబోతోందన్న ఆందోళనలు ఎక్కువైపోతున్నాయి. 2020లో గల్వాన్లో ఘర్షణల తర్వాత ఇరు దేశాలు సైనిక అవసరాల కోసం హిమాలయాల వెంబడి వంతెనలు, ఔట్పోస్టులు, హెలిప్యాడ్లు విస్తృతంగా నిర్మిస్తున్నాయి. చైనా ఏకంగా చిన్న చిన్న నగరాలనే కట్టేస్తున్నట్టు ఉపగ్రహఛాయాచిత్రాల ద్వారా వెల్లడవుతోంది. ఎల్ఏసీ వెంట అధిక ముప్పు.. భారత్, చైనా మధ్య 3,500 కి.మీ. పొడవునున్న వాస్తవాధీన రేఖ వెంబడి ముప్పు అధికంగా ఉందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఎన్హెచ్–7 జాతీయ రహదారిపై ప్రతీ కిలోమీటర్కి ఒక కొండచరియ విరిగిపడి రహదారులు మూతపడడం సర్వసాధారణంగా మారింది. ‘‘భారత్లోని హిమాలయాల్లో ఉత్తరాఖండ్లోనూ, అటు చైనా వైపు హిమాలయాల్లోనూ అత్యధిక ముప్పు పొంచి ఉంది. మౌలిక సదుపాయాల పేరిట చేపడుతున్న కార్యక్రమాలు శాశ్వత మంచు పర్వతాలను సైతం కుదేలు చేసే రోజులొచ్చేస్తున్నాయి. అవలాంచ్లు (హిమ ఉత్పాతం), కొండచరియలు విరిగిపడడం, భూకంపాలు అత్యంత సాధారణంగా మారతాయి’’అని క్రయోస్ఫియర్ జర్నల్ ఒక నివేదికలో వెల్లడించింది. చైనా నిర్మాణాలు టిబెట్ పీఠభూమిలో ► 9,400 కి.మీ. మేరకు రోడ్డు నిర్మాణం. ళీ 580 కి.మీ. పొడవున రైల్వేలు చెంగ్డూ నుంచి లాసా వరకు రైల్వే నిర్మాణం ► సముద్రానికి 13 వేల అడుగుల ఎత్తులో పూర్తిగా మంచుతో నిండి ఉన్న 21 పర్వతాల మీదుగా 14 అతి పెద్ద నదుల్ని దాటుకుంటూ సియాచిన్–టిబెట్ రైల్వే లైన్ నిర్మాణం ► 2,600 కి.మీ. పొడవున విద్యుత్ లైన్లు ళీ వేలాది సంఖ్యలో భవనాలు ► అస్సాంలో బ్రహ్మపుత్ర నది నుంచి ఉత్తర చైనాకు నీటిని మళ్లించడానికి డ్యామ్లు ► 2050 నాటికి మంచుకొండల్లో 38.14%రోడ్లు, 38.76% రైల్వేలు ► 39.41% విద్యుత్ లైన్లు, 20.94% భవనాలే కనిపిస్తాయి. ► సరిహద్దు సమస్యల పరిష్కారం కోసం 624 భవనాల నిర్మాణం నేపాల్ వైపు ► చైనా బెల్డ్ అండ్ ఓడ్ ఇనీషియేటివ్ కింద రాసువగాఢి హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు ► ఉద్యాన వనాలు ► హైడ్రోపవర్ ప్రాజెక్టులు ► 240 కోట్ల డాలర్ల విలు వైన ప్రాజెక్టులు ► పాంగాంగ్ సరస్సుపై సైనిక అవసరాల కోసం వంతెన భారత్ నిర్మాణాలు ► హిమాలయాల్లో 30 అతి పెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ► అరుణాచల్ప్రదేశ్, సిక్కిమ్లలో వాయువేగంతో సాగుతున్న హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణాలు ► 900 కి.మీ. పొడవునా గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బదిరీనాథ్లను కలిపేలా చార్ధామ్ ప్రాజెక్టు ► 283 కి.మీ. పొడవునా నిమ్ము–పదమ్–దర్చా (ఎన్పీడీ)హైవే ► చైనాతో వివాదంలో ఉన్న 3,500 కి.మీ. సరిహద్దుల పొడవునా రోడ్లు, టన్నెల్స్, వంతెనలు, ఎయిర్ఫీల్డ్స్, హెలిప్యాడ్స్ నిర్మాణం ► చైనాతో వ్యూహాత్మకంగా ప్రాధాన్యం కలిగిన 73 ప్రాంతాల్లో రహదారుల నిర్మాణం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? ► అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్ రాష్ట్రాల్లో వర్షాకాలాలు బీభత్సంగా మారనున్నాయి. ► సింధు నదికి సమీపంలో చిలాస్లో డ్యామ్లు కట్టడంతో ఒక నెలలో దాని పరిసర ప్రాంతంలో 300 సార్లు భూకంపం సంభవించింది. ► సరిగ్గా అలాంటి ముప్పే హిమాలయాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. ► అవలాంచ్లు ముంచెత్తి సరస్సులు విస్ఫోటనం చెందుతాయి ► కొండచరియలు విరిగిపడి నిర్మాణంలో ఉన్నవన్నీ కూడా ధ్వంసమయ్యే ప్రమాదముంది. టిబెట్లోని బొమి ప్రాంతంలో దశాబ్దాల క్రితం కట్టిన వంతెనలు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలన్నీ కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. ► ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవన్నీ పూర్తవకుండానే భూకంపాలు, కొండచరియలు, అలవాంచ్లతో అవన్నీ ధ్వంసమయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయని, మరింత ప్రమాదంలోకి హిమాలయాలు వెళ్లిపోయాయని ఓల్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అండ్రూస్ కాబ్ అంచనా వేస్తున్నారు. ► భారత్లో 23 హిమానీనదాలతో అత్యంత ప్రమాదముందని నిపుణులు గుర్తించారు. ► భారత్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదాల్లో 85% హిమాలయాల్లోనే సంభవిస్తున్నాయి. కొండచరియలు ముప్పు కలిగిన టాప్–5 దేశాల్లో చైనా, భారత్లు ఉన్నాయి. ► హిమాలయాల్లో ఉన్న హిమానీ నదాలు 2035 నాటికి మాయమైపోయే ఛాన్స్ ఉంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తుర్కియే, సిరియాల్లో భూకంపం.. ఆందోళనలో భారత్.. ముప్పు ఎంత?
హిమాలయాల్లో భూమి పొరల్లో పెరిగిపోతున్న ఒత్తిడి మనల్ని భయపెడుతోంది. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన నెలకొంది. తుర్కియే, సిరియాల్లో భూకంపం మన దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారత్లను త్వరలోనే పెను భూకంపం అతలాకుతలం చేస్తుందన్న అంచనాలున్నాయి. ఇంతకీ భారత్కి ఉన్న ముప్పు ఎంత ? నేలకింద భూమి ఉన్నట్టుండి కదిలిపోతే, మిన్ను విరిగి మీదపడినట్టు ఆకాశన్నంటే భవనాలు కుప్పకూలిపోతే, మన నివాసాలే సమాధులుగా మారి మనల్ని మింగేస్తే ఆ ప్రకృతి విలయం ఎంత భయంకరం..? తుర్కియే, సిరియాల్లో కుదిపేసిన పెను భూకంపంతో భారత్కు భూకంపం ముప్పు ఎంత అనే చర్చ జరుగుతోంది. తుర్కియే భూకంపాన్ని ముందే అంచనా వేసిన డచ్ అధ్యయనకారుడు ఫ్రాంక్ హూగర్బీట్స్ భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్లలో త్వరలో భూకంపం వస్తుందని హెచ్చరించడం గుబులు రేపుతోంది. మన దేశంలో 60శాతం భూభాగం భూకంపం ముప్పు జోన్లో ఉన్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ 2022 డిసెంబర్లో పార్లమెంటులో వెల్లడించింది. మన దేశంలో భూకంప ముప్పు వచ్చే ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ అయిదులో ఉంటే అత్యంత ప్రమాదకరమని, రెండో జోన్లో ఉంటే ముప్పు అత్యంత స్వల్పంగా ఉంటుంది. తీవ్ర ముప్పులో ఢిల్లీ ఢిల్లీ, దాని పక్కనే ఉన్న గురుగ్రామ్కు భూకంప ముప్పు అత్యంత ఎక్కువని భూగర్భ శాస్త్రవేత్తలు ఎప్పట్నుంచో హెచ్చరిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ హిమాలయాలకు దగ్గరగా ఉండడంతో ప్రమాదం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా భూపొరల్లో ఫలకాల రాపిడికి ఏర్పడే ఫాల్ట్ లైన్లు యాక్టివ్గా ఉన్న సొహనా, మథుర, ఢిల్లీ–మొరాదాబాద్ వల్ల కూడా ఢిల్లీ ప్రమాదంలో ఉంది. హిమాలయాలు యమాడేంజర్ ప్రపంచంలో వివిధ ఖండాల్లో ఉన్న దేశాలను పెను భూకంపంతో అతలాకుతలం చేసే భూకంప కేంద్రం హిమాలయాలేనని శాస్త్రవేత్తలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ దేశాల్లో భూకంప ముప్పు అధికంగా ఉండే ప్రాంతం హిమాలయాలే అని ఎన్నో ఘటనలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో 2,400 కి.మీ. పొడవునా హిమాలయాల్లో ఎక్కడైనా భూకంప కేంద్రం ఉండే అవకాశం ఉంది. హిమాలయ భూమి పొరల్లో టెక్టానిక్ ప్లేట్స్పై 700 ఏళ్లుగా అత్యంత ఒత్తిడి ఉంది. ఫలకాలు కదులుతూ ఉండడం వల్ల అంచులపై ఒత్తిడి పెరిగిపోతూ వస్తోంది. దీంతో ఏ క్షణంలోనైనా భూకంపం రావొచ్చు లేదంటే 200 ఏళ్ల తర్వాత తర్వాతైనా రావచ్చునని, ఇది మధ్య హిమాలయాలపై పెను ప్రభావం చూపిస్తుందని 2016లోనే శాసవ్రేత్తలు హెచ్చరించారు. హిమాలయాల్లో కంగారాలో 1905లో భూకంపం వచ్చింది. 1934లో హిమాలయ కేంద్రంగా నేపాల్, బిహార్లో భూకంపానికి 10 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 1991లో ఉత్తరకాశిలో వచ్చిన భూకంపంలో 800 మంది మరణించారు. ఇక 2005లో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సంభవించిన భూకంపానికి 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాలయాలు కాకుండా 2001లో గుజరాత్లో కచ్లో వచ్చిన భూకంపంలో 20 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం. భారత్, యూరోషియన్ ప్లేట్స్ తరచూ రాపిడి కారణంగా చిక్కుకుపోతూ ఉండడంతో హిమాలయాలకు ముప్పు ఎక్కువగా ఉంటోందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియోలజీలో జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ వివరించారు. జోన్ 5 ► వెరీ హై రిస్క్ జోన్ : రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 9 అంతకంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 11% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో కొన్ని ప్రాంతాలు హిమాచల్ ప్రదేశ్ పశ్చిమ భాగం, ఉత్తరాఖండ్ తూర్పు ప్రాంతం, గుజరాత్లో రణ్ ఆఫ్ కచ్, ఉత్తర బిహార్, ఉత్తరాది రాష్ట్రాలు, అండమాన్ నికోబర్ దీవులు జోన్ 4 ► హైరిస్క్ జోన్ : భూకంప తీవ్రత 8 వరకు నమోదయ్యే అవకాశం ► ఈ జోన్లో ఉన్న ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 8 వరకు వచ్చే ఛాన్స్ ► దేశ భూభాగంలో ఇది 18% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కశ్మీర్లో మిగిలిన ప్రాంతం, లద్దాఖ్, హిమాచల్లో మిగిలిన భాగాలు పంజాబ్, హరియాణా లో కొన్ని భాగాలు, ఢిల్లీ, సిక్కిమ్, యూపీæ ఉత్తర ప్రాంతం, బిహార్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రలో కొన్ని భాగాలు, పశ్చిమ రాజస్థాన్ జోన్ 3 ► మధ్య తరహా ముప్పు: ఈ జోన్లో భూకంప తీవ్రత 7 వరకు వచ్చే అవకాశం ► దేశ భూభాగంలో ఇది 31% ► ఈ జోన్లోని ప్రాంతాలు: కేరళ, గోవా, లక్షద్వీప్ దీవులు, ఉత్తరప్రదేశ్, హరియాణాలో కొన్ని ప్రాంతాలు, గుజరాత్లో మిగిలిన ప్రాంతాలు, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశాలో కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. తమిళనాడు, కర్ణాటకలో కొన్ని ప్రాంతాలు కూడా జోన్ 3లోకి వస్తాయి జోన్ 2 ► లో రిస్క్ జోన్ : భూకంప తీవ్రత 6 అంతకంటే తక్కువగా నమోదయ్యే ప్రాంతాలు ► దేశ భూభాగంలో ఇది 40% ► ఈ జోన్లోని ప్రాంతాలు: రాజస్థాన్, హరియాణా, ఎంపీ, మహారాష్ట్ర, ఒడిశా, ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో మిగిలిన ప్రాంతాలకు ముప్పు పెద్దగా లేదనే చెప్పొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా?
అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ స్పందన.. జోషిమత్లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం. జోషిమత్లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్, గాంధీనగర్, మనోహర్బాగ్, సింగ్ధర్, పర్సారీ, ఉప్పర్బజార్, సునీల్, మార్వాడీ, లోయర్ బజార్.. ఇలా జోషిమత్లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్ జోషిమత్ కమిటీ కన్వీనర్ అతుల్ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కారణాలు అవేనా? అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ చెబుతున్నారు. కానీ, జోషిమత్ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్ జోన్(జోన్-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జోషిమత్కు పరమ పవిత ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్(జ్యోతిర్మఠ్). ఉత్తరామ్నాయ మఠ్ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, తపోవన్, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్ను బేస్ క్యాంప్గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా. -
మత ప్రాముఖ్య స్థలాలపై నిర్లక్ష్యం
డెహ్రాడూన్: మత ప్రాముఖ్యమున్న దర్శనీయ ప్రాంతాలెన్నింటినో గత ప్రభుత్వాలు దశాబ్దాల పాటు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయంటూ కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. బానిస మనస్తత్వమే ఇందుకు ఏకైక కారణమంటూ దుయ్యబట్టారు. ఇది కోట్లాది మంది శ్రద్ధాళువుల విశ్వాసాలను గాయపరచడమే తప్ప ఇంకోటి కాదంటూ ఆక్షేపించారు. మహిమాన్విత పూజనీయ స్థానాల గత వైభవాన్ని తాము ఒక్కొక్కటిగా పునరుద్ధరిస్తూ వస్తున్నామని చెప్పారు. కాశీ విశ్వనాథాలయం, అయోధ్య, ఉజ్జయినీ ఆలయాల్లో భారీ ఎత్తున చేపట్టిన పునర్నిర్మాణ పనులే ఇందుకు ఉదాహరణ అన్నారు. ‘‘కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలను కూడా నేరమన్నట్టుగా మాట్లాడేంతగా కొందరిలో బానిస మనస్తత్వం వేళ్లూనుకుపోయింది. ఇతర దేశాల్లో ఉండే ఇలాంటి పూజనీయ స్థానాలను ప్రశంసించేదీ వాళ్లే. మన దేశంలో మాత్రం అలాంటి వాటిని చిన్నచూపు చూసేదీ వాళ్లే. నిజానికి మన ఘన వారసత్వం మనకెంతో గర్వకారణం. వాటి పునరుద్ధరణకు చేసే ప్రయత్నాలు 21వ శతాబ్దపు నయా భారత్కు పునాది వంటివి’’ అన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం ఉత్తరాఖండ్ చేరుకున్న ఆయన ప్రఖ్యాత యాత్రా స్థలాలైన కేదార్నాథ్, హేమ్కుండ్ సాహిబ్కు రోప్వే ప్రాజెక్టులకు పునాదిరాయి వేశారు. అనంతరం చైనా సరిహద్దుల సమీపంలో మనా గ్రామంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మన ఆలయాలు కేవలం భౌతిక నిర్మాణాలు మాత్రమే కాదు. వేలాది ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ వస్తున్న ఘనమైన మన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలు. అవి మన జీవనాడులు’’ అని అభిప్రాయపడ్డారు. కేదార్నాథ్లో కొన్నేళ్లుగా చేపట్టిన పునర్నిర్మాణ పనుల వల్ల ఎన్నడూ లేనంత ఎక్కువ సంఖ్యలో భక్తులు దర్శించుకోవడానికి వీలవుతోందని చెప్పారు. ‘‘కేదార్నాథ్కు గతంలో ఏటా మహా అయితే నాలుగైదు లక్షల మంది మాత్రం వచ్చేవాళ్లు. ఈ ఏడాది గత రికార్డులన్నింటినీ తుడిచిపెడుతూ ఇప్పటికే ఏకంగా 45 లక్షల మంది దర్శించుకున్నారు’’ అని అన్నారు. ఉపాధికీ మార్గాలు హిమాలయాల్లోని ఆలయాల అభివృద్ధి పనులు అక్కడికి యాత్రను సరళతరం చేయడమే గాక స్థానికులకు విరివిగా ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయని మోదీ చెప్పారు. స్థానికంగా వర్తక, వాణిజ్యాలకు కూడా ఎంతగానో ఊతమిస్తున్నాయన్నారు. ఈ సరిహద్దు ప్రాంతాల ఆలయాల సందర్శనకు వచ్చే పౌరులంతా తమ బడ్జెట్లో కనీసం 5 శాతం స్థానిక ఉత్పత్తులు కొనేందుకు వెచ్చించాలని కోరారు. ఈ చిన్న చర్య ఎంతోమంది స్థానికుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ‘‘దట్టమైన మంచులో నెలకొన్న ప్రఖ్యాత హేమ్కుండ్ సాహిబ్కు రోప్వే నిర్మాణం దేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సిక్కు సోదరుల వరప్రసాదం కానుంది. ఉత్తరాన మన దేశంలో చిట్టచివరి గ్రామం ‘మన’. కానీ నా వరకూ దేశంలో ప్రతి గ్రామమూ ప్రగతికి బాటలు పరిచే తొట్టతొలి గ్రామమే. పాతికేళ్ల క్రితం ఉత్తరాఖండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ భేటీని కూడా నేను మన గ్రామంలోనే జరిపాను. కొండ సానువుల్లో కష్టతరమైన ప్రయాణం చేసి భేటీకి వచ్చేందుకు అప్పట్లో మావాళ్లు గొణుక్కున్నారు కూడా. కానీ పర్వత ప్రాంతీయులు కష్టజీవులు. నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. అభివృద్ధి వారికి అందని ద్రాక్ష కాకూడదు. మిగతా దేశవాసులకందే అన్ని సౌకర్యాలూ అందుకునే హక్కు వారికి ఉంది’’ అన్నారు. అంతకుముందు ప్రఖ్యాత కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల్లో మోదీ పూజలు జరిపారు. కేదార్నాథ్లో ఆది శంకరుల సమాధి స్థలిని దర్శించుకున్నారు. శుక్రవారం రాత్రి బద్రీనాథ్లో గడిపారు. ప్రధాని హోదాలో మోదీ కేదార్నాథ్ను దర్శించడం ఇది ఆరోసారి. కాగా బద్రీనాథ్కు రావడం రెండోసారి. రోప్వే ప్రాజెక్టుల విశేషాలు... కేదార్నాథ్ రోప్వే: రుద్రప్రయాగ్ జిల్లాలో గౌరీకుండ్ నుంచి కేదార్నాథ్ ఆలయం దాకా 9.7 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ప్రాజెక్టు పూర్తయ్యాక గౌరీకుండ్ నుంచి ఆలయానికి కేవలం అరగంటలో చేరుకోవచ్చు. ఎత్తైన హిమ సానువుల్లో అత్యంత కష్టతరంగా భావించే ఈ ప్రయాణానికి కనీసం 6 నుంచి 7 గంటలు పడుతోంది. హేమ్కుండ్ సాహిబ్ రోప్వే: గోవింద్ ఘాట్ నుంచి ఏడాది పొడవునా మంచుతో కూరుకుపోయి ఉండే హేమ్కుండ్ సాహిబ్ వెళ్లే దారి అత్యంత క్లిష్టమైనది. అందుకు కనీసం ఒక రోజుకు పైగా పడుతుంది. ఇప్పుడు వాటి మధ్య 12.4 కిలోమీటర్ల పొడవైన రోప్వే నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే ప్రయాణం కేవలం 45 నిమిషాల్లో ముగుస్తుంది. అంతేగాక ప్రపంచ ప్రఖ్యాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కు ముఖద్వారంగా చెప్పే ఘంగారియాను కూడా రోప్వే అనుసంధానించనుంది. -
‘అద్భుతం మహా అద్భుతం’ ,హిమాలయాల్లో అరుదైన మూలికలు
హరిద్వార్: ఆచార్య బాలకృష్ణ నేతృత్వంలోని పతంజలి బృందం హిమాలయాల్లో అరుదైన మూలికలను కనుగొంది. హిమాలయాలలోని కొన్ని అధిరోహించలేని, చేరుకోలేని శిఖరాలను సైతం ఎక్కి ఈ మూలికలను గుర్తించినట్లు ఈ మేరకు విడుదలైన ఒక ప్రకటన తెలిపింది. హిమాలయాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, పతంజలి విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి ఏర్పాటైన ఒక స్వాగత కార్యక్రమం చిత్రాన్ని తిలకించవచ్చు. ఈ కార్యక్రమంలో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం)ప్రిన్సిపాల్ కల్నల్ అమిత్ బిష్త్తో సహా పలువురు పాల్గొన్నారు. అరుదైన విజయాన్ని సాధించినందుకుగాను పతంజలి బృందాన్ని పలువురు ప్రశంసించారు. ఇది గర్వకారణ చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. -
కేదార్నాథ్ గోడలకు బంగారు తాపడం వద్దు
డెహ్రాడూన్: హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయ గర్భగుడి లోపలి గోడలకు బంగారు రేకుల తాపడం చేయడంపై తీర్థపురోహితుల్లో భేదాభిప్రాయాలు తలెత్తాయి. వెండి రేకుల స్థానంలో బంగారు రేకులను తాపడం చేయిస్తానంటూ మహారాష్ట్రకు చెందిన ఓ భక్తుడు ముందుకు రాగా ఆలయ కమిటీ అనుమతించింది. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఇది ఆలయ ఆచారాలకు విఘాతమంటూ కొందరు వ్యతిరేకిస్తున్నారు. బంగారు రేకుల తాపడం కోసం చేపట్టే డ్రిల్లింగ్తో గర్భాలయ గోడలకు నష్టమన్నది వారి ఆందోళన. దీన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయేంద్ర అజయ్ కొట్టిపారేశారు. ‘‘బంగారు తాపడంలో తప్పేముంది? దీన్ని కావాలనే వ్యతిరేకిస్తున్నారు’’ అన్నారు. -
Himalayas: హిమాలయాలను కాపాడుకోవాలి
మళ్లీ హిమాలయ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. హిమాలయాలలో తరచూ జరిగే నష్టాలే ఇవి. పర్యావరణం మీద మానవుల అశ్రద్ధ దీనికి కారణం కావచ్చు. నష్టాల నివారణకు తీసుకోవలసిన చర్యలను తెలుసుకోవడం ఈ సందర్భంగా చాలా ముఖ్యం. హిమాలయాల నిర్మాణం మిలియన్ల ఏళ్లుగా కొనసాగుతోంది. అందుకే ప్రతి ఏడాదీ హిమాలయాలు, కొన్ని సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతున్నాయి. ఈ పర్వతాల్లో జన్మించిన నదుల ద్వారా కొట్టుకువచ్చిన రాళ్లు, ఒండ్రు వంటి వాటితో దిగువన ఉన్న తక్కువ లోతైన టెథిస్ సముద్రం నిండి పోయి ప్రపంచంలోనే అతిపెద్ద సారవంతమైన గంగా–సింధు మైదానం ఏర్పడింది. హిమాలయాలు దేశానికి పెట్టని గోడల్లాగా, ఉత్తర దిశలో నేలమార్గంలో వచ్చే శత్రువులనుండి కాపాడుతున్నాయి. సైబీరియా నుండి వచ్చే అతి శీతల గాలుల నుండి భారత ద్వీపకల్పాన్ని కాపాడుతున్నాయి. సింధు, గంగ, బ్రహ్మపుత్ర జీవనదులకు జన్మనిచ్చి; 40 శాతం భారతీయుల తాగు నీరు, సాగునీరు, పరిశ్రమలకు కావలసిన నీటి అవసరాలు తీరుస్తున్నాయి. ఆపిల్ పండ్లనూ, న్యూస్ ప్రింట్, ఆయుర్వేద మూలికలనూ అందించే అడవులనూ దేశానికిస్తున్నాయి. ప్రపంచంలోనే అందమైన పర్యాటక ప్రదేశాలు కశ్మీర్, కులూ, మనాలి, సిమ్లా, ముస్సోరీ, డార్జిలింగ్లకు పుట్టినిల్లుగా ఉన్నాయి. ఋతుపవనాలకు సహాయం చేస్తున్నాయి. ఇటువంటి హిమాలయాలు లేకపోతే భారతదేశం లేదనటంలో అతిశయోక్తి లేదు. అయితే హిమాలయాల్లో అభివృద్ధి పేరిట, పుణ్యస్థలాల పేరిట, పర్యాటకం పేరిట; రోడ్లు వెడల్పు చేయటం, రైల్వేవంతెనలు, జలవిద్యుత్ కేంద్రాలు, సొరంగాలు (టన్నెళ్లు) వంటి వాటిని నిర్మించడం కోసం భారీ బ్లాస్టింగ్లు చేస్తున్నారు. హిమాలయాల్లో ఉన్న రాయి దక్కన్ పీఠభూమిలో ఉన్న గ్రానైట్ రాయిలాగా గట్టిది కాదు. బలహీనమైన మట్టిదిబ్బలు. లూజు రాళ్లు రప్పలతో ఏర్పడిన ఈ ముడుత పర్వతాల చరియలు భారీ పేలుళ్ల కారణంగా విరిగిపడుతున్నాయి. (క్లిక్: గొంతు చించుకొని అడగాల్సిందే!) మానవుడు సృష్టిస్తున్న శక్తిమంతమైన విస్ఫోటనాలు హిమాలయాల భౌతిక స్వరూపాన్నే మార్చేలా తయారయ్యాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఊహించని విపత్తులు ఎన్నయినా సంభవించే ఆస్కారం ఉంది. పర్యావరణ ప్రేమికులూ, భూ శాస్త్రవేత్తలూ; ఆ ప్రాంత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంపై విషయాలను సానుకూలంగా ఆలోచించి నష్టనివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. తద్వారా హిమాలయాలనూ, అక్కడి పుణ్యక్షేత్రాలనూ, పర్యాటక ప్రదేశాలనూ... చివరగా దేశాన్నీ కాపాడుకుందాం. - మరింగంటి శ్రీరామ రిటైర్డ్ చీఫ్ జీఎం, సింగరేణి కాలరీస్, కొత్తగూడెం -
మహా విపత్తుకు ముందస్తు సూచికే.. అడ్డుకోకపోతే వినాశనమే!
వాతావరణ మార్పులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. హిమాలయాల్లో మంచు శరవేగంగా కరిగిపోతోంది. పాకిస్తాన్లో వరద బీభత్సం, చైనాలో కరువు కాటకాలు, భారత్లో కనీవినీ ఎరుగని వాతావరణ మార్పులు... వీటన్నింటికీ అదే కారణమని భారతీయ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. హిమాచల్ ప్రదేశ్లోని చోటా షిగ్రి హిమానీ నదాన్ని వారు కొన్నేళ్లుగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఈ ఏడాది రికార్డు స్థాయిలో మంచు కరిగిపోయినట్టు వెల్లడైంది. గత జూన్లో ఏర్పాటు చేసిన డిశ్చార్జ్ మెజరింగ్ వ్యవస్థ ఆగస్టుకల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్ట్ మహమ్మద్ ఫరూక్ ఆజం చెప్పారు. ‘‘గత మార్చి, ఏప్రిల్లో మన దేశంలో ఉష్ణోగ్రతలు 100 ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టాయి. హిమానీ నదాలు కరిగిపోవడమే అందుకు కారణం. గత వారం మా బృందమంతా షిగ్రి దగ్గరే ఉండి పరీక్షించాం. మంచు భారీగా కరిగిపోతోంది’’ అంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ‘‘అరేబియా సముద్రంలో అత్యధిక వేడిమి కారణంగా నీరంతా ఆవిరి మేఘాలుగా మారి ఎడతెరిపి లేకుండా వానలు కురిసి లానినో ప్రభావం ఏర్పడింది. దాంతో వాతావరణమే విపత్తుగా మారి పాక్ను అతలాకుతలం చేస్తోంది’’ అన్నది శాస్త్రవేత్తల వివరణ. హిమాలయాలు కరిగిపోతే...? గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు హిమాలయాల్లో మంచు గత నాలుగు దశాబ్దాల్లో కరిగిన దాని కంటే 2000–2016 మధ్య ఏకంగా 10 రెట్లు ఎక్కువగా కరిగిపోయింది! దక్షిణాసియా దేశాలకు ఇది పెను ప్రమాద హెచ్చరికేనంటున్నారు. కారకోరం, హిందూకుష్ పర్వత శ్రేణుల్లో 55 వేల హిమానీ నదాలున్నాయి. హిమాలయ నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర 8 దేశాల్లో 130 కోట్ల మంది మంచినీటి అవసరాలు తీరుస్తున్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్లలో వ్యవసాయ భూములకు నీరందిస్తున్నాయి. 26,432 మెగావాట్ల సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ స్టేషన్లున్నాయి. హిమాలయాల్లో మంచు కరిగిపోతే వీటన్నింటిపైనా ప్రభావం పడటమే గాక 2050 నాటికి దక్షిణాసియా దేశాల్లో 170 కోట్ల మందికి నీటికి కటకట తప్పదని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. దేశాల మధ్య నీటి కోసం యుద్ధాలూ జరగవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో పాకిస్తాన్ వాటా కేవలం 1 శాతమే. కానీ వాతావరణ మార్పులు ఇప్పుడు ఆ దేశాన్ని బలి తీసుకుంటున్నాయి. చైనాలో కరువు సంక్షోభం ► 17 ప్రావిన్స్లలో వరసగా 70 రోజుల పాటు ఎండలు దంచిగొట్టాయి. వడగాడ్పులకి 90 కోట్ల మంది అవస్థలు పడ్డారు ► చైనాలో ఏకంగా సగ భాగంలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి ► చైనాలో అతి పెద్ద నది యాంగ్జె ఎండిపోయిన పరిస్థితి వచ్చింది. 1865 తర్వాత ఈ నది నీటిమట్టం బాగా తగ్గిపోవడం మళ్లీ ఇప్పుడే. ► చైనాలోని దక్షిణ ప్రావిన్స్లైన హుబై, జియాంగ్జీ, అన్హుయాయ్, సిచుయాన్లలో నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడుతున్నాయి ► చైనాలో జల విద్యుత్లో 30శాతం సిచుయాన్ ప్రావిన్స్ నుంచే వస్తుంది. ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సగానికి సగం తగ్గిపోయింది ► చైనాలో కరువు పరిస్థితులు 25 లక్షల మందిపై తీవ్ర ప్రభావం చూపిస్తే, 22 లక్షలకు పైగా హెక్టార్లలో వ్యవసాయ భూమి ఎండిపోయింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ముంచుకొస్తున్న మరో ముప్పు.. పాక్ జలసమాధి కానుందా?
దాయాది దేశం పాక్కు మరో ఉపద్రవం వచ్చి పడనుంది. ఇది ఊహ కాదు.. తీవ్ర హెచ్చరికలు. ఇప్పటికే తీవ్ర వర్షాలు, భారీ వరదలతో మూడింట వంతు పాక్ నీటిలోనే ముగినిపోయి ఉంది. వెయ్యి మందికిపైగా ప్రాణాలు.. మూడు కోట్ల మంది నిరాశ్రయలు అయ్యారు. అయితే.. రాబోయే రోజుల్లో మరో భారీ ముప్పు పాక్కు పొంచి ఉందని భారత సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఇది భారత్కు సైతం పరోక్ష హెచ్చరికగా పేర్కొంటున్నారు. సాధారణంగా వర్షాకాలపు సీజన్ కంటే.. ఈసారి పదిరెట్లు అధికంగా అక్కడ వర్షాలు కురిశాయి. దీంతో పాక్ సగానికి కంటే ఎక్కువ భాగం నీటమునిగింది. సహాయక చర్యల్లో భాగంగా.. హెలికాఫ్టర్లు ల్యాండ్ అయ్యేందుకు భూభాగం కూడా దొరకట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలడం.. ఇతర సమస్యలతో పాక్ ప్రజలు అరిగోస పడుతున్నారు. ఇప్పట్లో కోలుకోలేనంతగా నష్టం వాటిల్లింది అక్కడ. అలాంటిది పుండు మీద కారంలాగా.. ఇప్పుడు హిమనీ నదాలతో పెను ప్రమాదం పొంచి ఉంది ఆ దేశానికి!. ఇండోర్ ఐఐటీ పరిశోధకుల ప్రకారం.. ఇండోర్ ఐఐటీ గ్లేసియాలజిస్టుల బృందం వెల్లడించిన నివేదికల ప్రకారం.. గత వందేళ్ల రికార్డును తుడిచిపెట్టేసి మార్చి, ఏప్రిల్లో ఉష్ణోగ్రతల కారణంగా వేడి గాలులు సంభవించాయి. ఈ ప్రభావంతో.. హిమాలయాల్లో రికార్డుస్థాయిలో హిమానీనదం కరిగిపోయి.. ఇప్పటికే వరదల్లో మునిగి ఉన్న పాక్ను ప్రళయ రూపేణా మరింతంగా ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఎల్ నినా ప్రభావం పాకిస్తాన్లో తీవ్రమైన రుతుపవనాల కారణంగా పరిస్ధితి దారుణంగా మారింది. వేడెక్కుతున్న అరేబియా సముద్రం, లా నినా ప్రభావంతో ఈ పరిస్థితి నెలకొందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. హిమాలయ హిమానీనదం కరిగిపోయే ప్రభావం.. పాక్ భూభాగంలో ఉన్న 7,000 హిమానీనదాలపై ప్రభావాన్ని చూపెట్టనుందని అంటున్నారు. ఆ వెంటనే మరొకటి వరదల రూపంలో మహా ప్రళయం ముంచెత్తి.. పాక్ను ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలియదు. కానీ, ఆ తర్వాత తీవ్రమైన కరువు కచ్చితంగా పాక్ను మరింతగా దిగజారస్తుంది అని చెప్తున్నారు ఇంటర్నేషనల్ వాటర్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో పాక్ ప్రతినిధి మోషిన్ హఫీజ్. క్లైమేట్ చేంజ్ విషయంలో ప్రపంచంలోనే ఎనిమిదవ దుర్బలమైన(హాని పొందే అవకాశం ఉన్న) దేశం. అలాంటి భూభాగంలో.. వాతావరణ మార్పులతో వరదలు, కరువు వెనువెంటనే సంభవించే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. ► హిమాచల్ ప్రదేశ్లో హిమాలయాలపై ఛోటా షిగ్రీ గ్లేసియర్పై అధ్యయనంలో భాగంగా.. గత పదిహేను సంవత్సరాల పరిస్థితులను ఆధారంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు ఇండోర్ ఐఐటీ సైంటిస్టులు. విశేషం ఏంటంటే.. హిమానీనదం కరిగిన ప్రభావంతో.. పరిశోధనా కేంద్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ఈ కేంద్రాన్ని జూన్లో ఏర్పాటు చేస్తే.. ఆగస్టులో వరదలకు నామరూపాలు లేకుండా పోయింది. ► గ్లోబల్ వార్మింగ్.. ఊహించని స్థాయిలో వడ గాల్పుల ప్రభావం యూరప్ ఆల్ఫ్స్తో పాటు హిమాలయ పరిధిలోని మంచును సైతం కరిగించేస్తోంది. అయితే హిమాలయాల్లో గ్లేసియర్లు సైంటిస్టుల ఊహకంటే దారుణంగా కరిగిపోతూ వస్తున్నాయి. ► ఈ ప్రభావం పాక్పైనే ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే నగరాలు, పంటపొలాలతో సహా అంతా ముగినిపోగా.. రాబోయే విపత్తులను తల్చుకుని పాక్ ప్రజలు వణికిపోతున్నారు. ► హిమాలయాల నీరు.. ఎనిమిది దేశాలు.. 1.3 బిలియన్ల ప్రజలకు తాగు-సాగు నీటిని అందిస్తోంది. ► టిబెట్ నుంచి మొదలయ్యే సింధు నదీ పరీవాహక ప్రాంతం.. పాక్ గుండా ప్రవహించి కరాచీ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రాన్స్ కంటే రెండింతల పరిమాణంలో ఉండి.. పాక్కు 90 శాతం ఆహారోత్పత్తులను అందిస్తోంది. ► బేసిన్ వరదలు వచ్చినప్పుడు, చాలా నీరు మట్టిలోకి ప్రవేశించకుండా సముద్రంలోకి ప్రవహిస్తుంది. కాబట్టి.. నీటి కొరత ఏర్పడుతుంది. 2050 నాటికి దక్షిణాసియాలో 1.5 బిలియన్ల నుండి 1.7 బిలియన్ల మంది ప్రజలకు నీటి సరఫరా క్షీణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యయనం అంచనా వేసింది. ► వాతావరణ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను పెంపొందించేందుకు పాకిస్థాన్ మరింత మెరుగ్గా వ్యవహరించాలి. విపత్కర పరిస్థితుల్లో స్పందించేందుకు కఠిన చర్యలు చేపట్టాలి. అయితే తనంతట తానుగా వ్యవహరించే సత్తా పాక్కు లేదని మోషిన్ హఫీజ్ చెప్తున్నారు. ► వరదలు, కరువు ఏనాటి నుంచో మనిషి మనుగడపై ప్రభావం చూపెడుతున్నాయి. కానీ, భూమి వేడెక్కడం అనే వ్యవహారంతో పెరిగిపోవడం మాత్రం మానవ తప్పిదాలతోనే అనే వాదనను మరింతగా వినిపిస్తోంది. ► ప్రకృతి విపత్తుల నుంచి ఉపశనమం పొందేందుకు పాక్కు సాయం అందొచ్చు. కానీ, ఆర్థిక సమస్యలు మాత్రం ఇప్పట్లో వీడే అవకాశాలు కనిపించడం లేదు. ► ఈ సంవత్సరం వేడిగాలుల ప్రభావం, పాకిస్తాన్లో భారీ వరదలు.. ఒక హెచ్చరిక లాంటిది.. మనిషి వెనక్కి తిరిగి చూస్కోవాల్సిన తరుణం అని భారత్కు చెందిన హిమానీనద శాస్త్రవేత్త(గ్లేసియోలజిస్ట్) ఆజం చెప్తున్నారు. ► నేపాల్లో ఉన్న ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటీగ్రేటెడ్ మౌంటెయిన్ డెవలప్మెంట్ కేంద్రం.. 2100 సంవత్సరాల నాటికి హిమాలయాలు 60 శాతం కరిగిపోతాయని అంచనా. ► భారత దేశంలో 16 శాతం హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. దాదాపు 33% థర్మల్ విద్యుత్, 52% జలవిద్యుత్ హిమాలయలో పుట్టే నదుల నీటిపై ఆధారపడి ఉంది. మంచు కరగడం వల్ల ఈ నదులు తమ నీటిలో గణనీయమైన భాగాన్ని పొందుతున్నాయి, హిమానీనదాలు భారతదేశ ఇంధన భద్రతలోనూ అనివార్యమైన భాగంగా ఉన్నాయి. అలాంటిది హిమాలయాలు మాయమైపోతే!.. నష్టం ఊహించనిదిగా ఉండనుంది. ► గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో.. అడవులు తగలబడిపోవడం, మంచు కరిగిపోవడం.. భారీ వర్షాలు, చైనా కరువుకాటకాలు.. ఇవన్నీ ప్రపంచ దేశాలకు మేలు కొలుపు. 1.1 డిగ్రీ సెల్సియెస్ ఉష్ణోగ్రత పెరగడం.. లో-మీడియం ఇన్కమ్ దేశాల మీద తీవ్ర ప్రభావం చూపెడుతుందని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు. -
Ajith: బైక్పై విశాఖపట్నం నుంచి ఏకంగా హిమాలయాలకు..
అజిత్కు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన బైక్లో సుదీర్ఘ ప్రయాణాన్ని చేస్తుంటారు. అలా తాజాగా ఈసారి ఏకంగా హిమాలయాలకు వెళ్లారు. ప్రస్తుతం తన 61వ చిత్ర షూటింగ్ను పూర్తి చేశారు. ఇటీవల ఫ్యామిలీతో ఐరోపా దేశాలు చుట్టి వచ్చిన అజిత్ చెన్నైకి తిరిగి రాగానే తాను నటిస్తున్న చిత్ర షూటింగ్లో పాల్గొన్నారు. కాగా విశాఖపట్నంలో జరిగిన చిత్ర షూటింగ్ను పూర్తి చేసి, అటునుంచి అటే తన మిత్ర బృందంతో బైకులో లడక్ వెళ్లి అటు నుంచి హిమాలయాలకు చేరుకున్నారు. ఆయనతో పాటు పొల్లాచి నగరం 8వ వార్డు అన్నాడీఎంకే కౌన్సిలర్ సెంథిల్ కూడా పాల్గొనటం విశేషం. ఆయనకు అజిత్ మాదిరిగానే బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. దీంతో ఆయన అజిత్కు బాగా దగ్గర అయిపోయారు. హిమాలయాల్లో వారం పాటు బైక్ డ్రైవింగ్ చేసి ఆ తర్వాత చెన్నైకి చేరుకుంటారు. అనంతరం నటిస్తున్న చిత్ర డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. చదవండి: (మాజీ ప్రియుడిని అరెస్ట్ చేయించిన అమలాపాల్) -
Travel: భర్త రాసిన పుస్తకం.. సొంతంగా టూర్ ప్లాన్... అమ్మకు తోడుగా కొడుకు!
Kerala Mother Son Duo Travel Story: అజంతా ఎల్లోరా గుహలు... ఆమె పర్యటనల పుస్తకంలో తొలి పుట. ఆ తర్వాత జైపూర్ హవా మహల్, కేదార్నాథ్ ఆలయం, సిమ్లా మంచు తెరలు, మనాలి, రోహతాంగ్పాస్, తాజాగా కచ్, టిబెట్... పేజీలు నిండిపోతున్నాయి. విదేశీ పర్యటన కోసం కొత్త పుస్తకాన్ని మొదలు పెట్టిందామె. కేరళలో మొదలైన పర్యటన కాంక్ష హిమాలయాలను చేరింది. బహుశా ప్రపంచం మొత్తాన్ని చుట్టి తిరిగి కేరళ చేరుకునే వరకు ఆమెకు గమ్యాన్ని చేరిన భావన కలగకపోవచ్చు. ఆమెలో భ్రమణ కాంక్ష ఈ స్థాయిలో కలగడానికి కారణం ఆమె భర్త రాసిన పర్యాటక కథనాలేనంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. కానీ ఇది నిజం. ఆమె పేరు గీతా రామచంద్రన్, ఆమె భర్త పేరు ఎం.కె. రామచంద్రన్. ఎం.కె రామచంద్రన్ పేరు తెలియని మలయాళ పాఠకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయన అత్యంత ఆసక్తికరంగా రాసిన పర్యాటక కథనాల్లో ఉత్కంఠతో విహరించే వారు పాఠకులు. వాళ్లతోపాటు ఆయన భార్య గీతా రామచంద్రన్, కొడుకు శరత్ కృష్ణన్ కూడా. కేరళ, త్రిశూర్లో మొదలైన ఆయన రచనావ్యాసంగం హిమాలయాలను తాకింది. ‘తపోభూమి ఉత్తరాఖండ్, ఆది కైలాస యాత్ర, ఉత్తరాఖండిలూడి – కైలాస్ మాన్సరోవర్ యాత్ర’ వంటి యాత్రాకథనాలను వెలువరించారాయన. 2003లో ప్రచురితమైన ఉత్తరాఖండిలూడి – కైలాస్ మాన్సరోవర్ యాత్ర రచనకు గాను ఎం.కె. రామచంద్రన్ 2005లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆయన సాధించిన ఈ ఘనతలో గీతారామచంద్రన్ సహపర్యాటకురాలు కాలేకపోయారు. ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేస్తూ గృహిణిగానే జీవితంలో ఎక్కువ భాగం గడిచిపోయింది. దేశంలోని ప్రతి వైవిధ్యతనూ భర్త స్వయంగా ఆస్వాదిస్తుంటే, ఆ వైవిధ్యతలోని అందాన్ని ఆమె ఆయన రచనల్లో ఆస్వాదించేవారు. పిల్లల బాధ్యత పూర్తయిన తర్వాత కావల్సినంత విరామం దొరికింది. డయాబెటిస్ రూపంలో ఆరోగ్యం ఒక సవాల్ విసిరింది. కానీ సరిగ్గా మెయింటెయిన్ చేస్తే డయాబెటిస్తో ముప్పు ఉండదని జవాబు ఇచ్చిందామె. భర్త రాసిన ప్రదేశాలతోపాటు రాయని ప్రదేశాల్లో కూడా పర్యటిస్తోంది. కొడుకు తోడుగా ఉండడంతో క్లిష్టమైన ప్రదేశాలకు కూడా ధైర్యంగా వెళ్లగలుగుతున్నానంటోంది గీతా రామచంద్రన్. సొంతంగా టూర్ ప్లాన్ ‘‘అరవై నిండిన వాళ్లకు తీర్థయాత్రల ప్యాకేజ్లుంటాయి. నేను నా భర్త రాసిన ప్రతి అక్షరాన్ని చదివాను, ఆ ప్రదేశాల గురించి చెప్పగలిగినంతగా చదివాను. వాటన్నింటినీ ఆసాంతం చూడాలి, ఆస్వాదించేవరకు అక్కడ గడపగలగాలంటే టూర్ ప్యాకేజ్లు కేటాయించే టైమ్ సరిపోదు. అందుకే సొంతంగా టూర్ ప్లాన్ సిద్ధం చేసుకుంటాను. నా పిల్లల్లో శరత్కి పర్యటనలంటే చాలా ఇష్టం. నన్ను తనే తీసుకెళ్తాడు. ఒంటె మీద సవారీ చేయాలంటే చేయిస్తాడు, మంచులో నాతో కలిసి ఆడతాడు. బీచ్లో పరుగులు తీస్తాం. అడుగు జారుతుందేమోననే చోట చేయి పట్టి నడిపిస్తాడు. జైపూర్ వంటి కొన్ని పర్యాటక ప్రదేశాల్లో సైకిల్ రైడింగ్కి అవకాశం ఉంటుంది. అక్కడ సైకిల్ మీద ఆ ఊరంతా తిప్పి చూపిస్తాడు. మనాలి నుంచి రోహతాంగ్ పాస్కు మోటార్ బైక్ మీద తీసుకెళ్లాడు. బైక్ మీద టూర్ నాకదే మొదటిసారి. ఆ జర్నీ యూత్ఫుల్గా అనిపించింది. సిమ్లా, మనాలి ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ సాగిన ఆ జర్నీలో అపాయకరమైన మలుపులను కూడా గమనించనేలేదు. క్లిష్టమైన మలుపుల్లో భయం వేయలేదా అని శరత్ అడిగే వరకు భయమనే మాటే గుర్తు రాలేదు. నేను టూర్ ఇటెనరీ బాగా వేస్తానని మా శరత్కి గట్టి నమ్మకం. ప్రొఫెషనల్ టూర్ ఆపరేటర్లు కూడా అలా వేయలేరంటాడు. మా వారి రచనలు చదివాను, కాబట్టి నా అభిరుచికి తగినట్లు అక్కడ యాక్టివిటీస్ కోసం ఎంత సమయం అవసరం ఉంటుందో లెక్కవేసి ఆ రోజు బస ఇతర సమయాలను ప్లాన్ చేస్తుంటాను. మూడు నెలలకో టూర్ వేయకపోతే నాకు తోచదు. నాకే కాదు శరత్కి కూడా. నేను ఆలస్యం చేస్తే ‘అమ్మా నెక్ట్స్ ఎక్కడికి?’ అని అడుగుతాడు. కొత్త లోకాన్ని చూస్తున్నాననడం లేదు, కానీ లోకాన్ని కొత్తగా చూస్తున్నానని చెప్పవచ్చు. అక్షరాల్లో చదివి ఊహించుకున్న ప్రదేశాల్లో విహరించడం మాటల్లో వర్ణించలేని గొప్ప అనుభూతి అని మాత్రం చెప్పగలను’’ అంటోంది అరవై నాలుగేళ్ల గీతా రామచంద్రన్. అమ్మకు తోడు! ట్రావెల్ ప్యాకేజ్లలో పంపిస్తే అమ్మ ఆరోగ్యం, భద్రత గురించి మాకు క్షణక్షణం ఆందోళనగానే ఉంటుంది. నేను తీసుకువెళ్తే ఆ భయం ఉండదు కదా! మా అమ్మ ముఖంలో సంతోషం చూస్తే పర్యటన కోసం కేటాయించిన సమయం, డబ్బు ఏ మాత్రం వృథా కాలేదని సంతృప్తిగా ఉంటుంది. ఆమెకు అంతటి సంతోషాన్నిస్తున్న పని చేస్తున్నందుకు కొడుకుగా గర్వపడుతున్నాను. మా బాల్యంలో నాన్న ఎప్పుడూ టూర్లలోనే ఉండేవారు. నాన్నకు కావల్సినవి అమర్చిపెట్టడం, మాకు ఏ లోటూ లేకుండా చూసుకోవడంతోనే అమ్మ జీవితం గడిచిపోయింది. అప్పటి ఆ లోటు ఇప్పుడు తీరుస్తున్నాను. – శరత్ కృష్ణన్, ట్రావెలర్ చదవండి: Saudi Arabia: ‘‘మహిళలు కూడా ఉద్యోగాలు చేయవచ్చు’’.. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్స్ కూడా.. -
మాట మీద నిలబడలేకపోయిన ఆనంద్ మహీంద్రా.. కారణం ఇదే!
ఇండియన్లకు పరిచయం అక్కర్లేని ఇండస్ట్రియలిస్టు ఆనంద్ మహీంద్రా. వేల కోట్ల వ్యాపారాలతో బిజీగా ఉన్నా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ ద్వారా సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. తనకు నచ్చిన విషయాలు, దేశంలో తాను చూసిన అద్భుతమైన విషయాలను సాటి భారతీయులతో షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలో సూర్యస్తమయానికి సంబంధించిన ఓ ట్వీట్ చేస్తూ.. స్పందించమని నెటిజన్లు కోరారు. A few days ago, social media was inundated with pics of Mumbai’s clear post-shower sky & spectacular sunset. Never too late to join that bandwagon! Pic on the left was apparently somewhere in Alibaug. A Rothko painting (on the right) come to life-or is it the other way around?? pic.twitter.com/7PTepGHXxJ — anand mahindra (@anandmahindra) January 11, 2022 అరుణ వర్ణంలో ఆకాశం ఆనంద్ మహీంద్రా ఇచ్చిన పిలుపుకి దేశవ్యాప్తంగా నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కన్యాకుమారి మొదలు కశ్మీర్ వరకు చాలా మంది తమ ఊర్లు, గ్రామాలకు సంబంధించిన సన్సెట్ ఫోటోలను అరుణ వర్ణంలో మెరిసిపోతున్న ఆకాశం ఫోటోలను ట్వీట్ చేశారు. ఇందులో తనకు నచ్చిన ఫోటోలకు కామెంట్ చేస్తూ పోయారు ఆనంద్ మహీంద్ర. కొంత సమయం తర్వాత ఇదే నా ఆఖరి స్పందన అంటూ సమాధానం ఇచ్చారు. And let me make this the last RT. Because, at the end of the day, the most important & memorable sunsets are not necessarily those that are the most visually spectacular, but those that are part of our own, personal experiences.. https://t.co/g88YLVDENe — anand mahindra (@anandmahindra) January 11, 2022 బంగారుకొండ కానీ, ఆ తర్వాత కొద్ది సేపటికే భైరవీ జైన్ అనే ఓ నెటిజన్ చేసిన ట్వీట్ చూసి ఆనంద్ మహీంద్రా తన మాట మీద నిలబడలేక పోయారు. సాయంత్రం వేళ హిమలయాల్లో పంచశీల్ శ్రేణి కొండల్లో సూర్యుడు ఒదిగి పోతుంటే.. కిరణాల కాంతి పరావర్తనం చెంది తెల్లని మంచు కొండరు ఒక్కసారిగా బంగారు కొండలుగా మారిపోయాయి. ఆ ఫోటోను చూసిన ఆనంద్ మహీంద్రా తిరిగి రీట్వీట్ చేశారు. ఈ ఫోటోను రీట్వీట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇన్క్రెడిబుల్ ఇండియా అంటూ క్యాప్షన్ ఇచ్చారు ఆనంద్ మహీంద్రా. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న హిమలయాలను చూస్తే ఆనంద్ మహీంద్రా మాట తప్పడంలో తప్పేమీ లేదనిపిస్తుంది. Oh I couldn’t resist retweeting this one… Beautiful. Truly our Incredible India https://t.co/zeRJibl1I6 — anand mahindra (@anandmahindra) January 11, 2022 చదవండి: స్కార్పియో కావాలన్న కెన్యా పోలీసులు.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్ -
ఊహించనంత వేగంగా కరిగిపోతున్న గ్లేసియర్లు.. లీడ్స్ యూనివర్సిటీ హెచ్చరిక
లండన్: పలు జీవనదులకు పుట్టిల్లైన హిమాలయాల్లోని హిమానీ నదాలు (గ్లేసియర్లు) ఊహించనంత వేగంగా కరిగిపోతున్నాయని లీడ్స్ యూనివర్సిటీ నివేదిక హెచ్చరించింది. భూతాపం అనూహ్యంగా పెరుగుతుండడమే ఇందుకు కారణమని, దీనివల్ల ఆసియాలో కోట్లాది ప్రజలకు నీటి లభ్యత ప్రశ్నార్ధకం కానుందని తెలిపింది. లండన్కు చెందిన ఈయూనివర్సిటీ నివేదిక జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్లో ప్రచురించారు. 400–700 సంవత్సరాల క్రితం జరిగిన గ్లేసియర్ ఎక్స్పాన్షన్ సమయం (లిటిల్ ఐస్ ఏజ్)తో పోలిస్తే గత కొన్ని దశాబ్దాల్లో హిమాలయన్ గ్లేసియర్స్లో మంచు పదింతలు అధికంగా కరిగిపోయిందని నివేదిక తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోని హిమానీ నదాల కన్నా హిమాలయాల్లోని గ్లేసియర్లు అత్యంత వేగంగా కుంచించుకుపోతున్నట్లు హెచ్చరించింది. హిమాలయాల్లోని 14,798 గ్లేసియర్లు లిటిల్ ఐస్ ఏజ్ సమయంలో ఎలా ఉన్నాయో నివేదిక మదింపు చేసింది. అప్పట్లో ఇవి 28 వేల చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉండగా, ప్రస్తుతం 19,600 చదరపు కిలోమీటర్లకు పరిమితమయ్యాయని, అంటే దాదాపు 40 శాతం మేర కుచించుకుపోయాయని తెలిపింది. ఆ సమయంలో మంచు కరుగుదల కారణంగా ప్రపంచ సముద్ర మట్టాలు 0.92– 1.38 మీటర్ల చొప్పున పెరిగాయని, ప్రస్తుత మంచు కరుగుదల అంతకు పదింతలు అధికంగా ఉందని నివేదిక రచయిత జొనాధన్ కార్విక్ చెప్పారు. మానవ ప్రేరిత శీతోష్ణస్థితి మార్పుల కారణంగా మంచు కరిగే వేగం పెరిగిందన్నారు. మూడో అతిపెద్ద గ్లేసియర్ సముదాయం అంటార్కిటికా, ఆర్కిటికా తర్వాత హిమాలయాల్లోని గ్లేసియర్లలో మంచు అధికం. అందుకే హిమాలయాలను థర్డ్ పోల్ (మూడో ధృవం)గా పిలువడం కద్దు. ఆసియాలోని అనేక దేశాల జనాభాకు అవసరమైన పలు నదులకు ఈ హిమానీ నదాలు జన్మస్థానం. వీటి క్షీణత కోట్లాది మందిపై పెను ప్రభావం చూపుతుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. బ్రహ్మపుత్ర, గంగ, సింధుతో పాటు పలు చిన్నా పెద్ద నదులకు హిమాలయాలే జన్మస్థానం. గతకాలంలో మంచు కరుగుదల, గ్లేసియర్ల విస్తీర్ణం మదింపునకు పరిశోధక బృందం శాటిలైట్ చిత్రాలను, డిజిటల్ సాంకేతికతను ఉపయోగించింది. గతంలో గ్లేసియర్లు ఏర్పరిచిన హద్దులను శాటిలైట్ చిత్రాల ద్వారా కనుగొని, ప్రస్తుత హద్దులతో పోల్చడం ద్వారా వీటి క్షీణతను లెక్కించారు. హిమాలయాల తూర్పు ప్రాంతంలో గ్లేసియర్ల క్షీణత వేగంగా ఉంది. హిమానీ నదాలు సరస్సుల్లో కలిసే ప్రాం తాల్లో వీటి క్షీణత అధికంగా ఉంది. ఇలాంటి సరస్సుల సంఖ్య, విస్తీర్ణం పెరగడమనేది గ్లేసియర్లు కుంచించుకుపోతున్నాయనేందుకు నిదర్శనమని తెలిపింది. మానవ ప్రేరిత ఉష్ణోగ్రతా మార్పులను అడ్డుకునేందుకు తక్షణ యత్నాలు ఆరంభించాలని నివేదిక పిలుపునిచ్చింది. -
మంచు కొండల్లో మేఘా అద్భుతం
న్యూఢిల్లీ: జోజిలా సొరంగ మార్గం పనులు వేగవంతంగా చేస్తున్నట్లు మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) వెల్లడించింది. ఇందులో భాగంగా టనల్ 1లోని ట్యూబ్ 2 తవ్వకం పనులను పూర్తి చేసినట్లు తెలిపింది. దీని పొడవు సుమారు 472 మీటర్లు. ఇప్పటికే సుమారు 448 మీటర్ల పొడవున్న ట్యూబ్ 1 పనులు పూర్తయినట్లు కంపెనీ పేర్కొంది. 2వ టనల్ పనులు జరుగుతున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. దట్టమైన మంచు పేరుకుపోవడంతో దాదాపు ఆరు నెలల పాటు లడఖ్–శ్రీనగర్ మధ్య రాకపోకలు కష్టతరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అన్ని సీజన్లలోనూ ప్రయాణాలకు వీలు కల్పించే జోజిలా టనల్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ 2020 అక్టోబర్లో దక్కించుకుంది. దీని విలువ సుమారు రూ. 4,600 కోట్లు. -
మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో!
ఔలి... ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. పూర్తి పేరు ఔలి భుగ్యాల్. గర్వాలి భాషలో పచ్చికభూములు అని అర్థం. మంచు నిండిన ఈ ప్రదేశానికి పచ్చిక భూమి అనే పేరేంటో! ఇది మరీ ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుంది. తొమ్మిదిన్నర వేల అడుగుల ఎత్తులో దట్టంగా పరుచుకున్న మెత్తటి మంచు క్రమంగా గట్టిపడి బండరాళ్లకంటే గట్టిగా ఉంటుంది. మంచుతో ఆడుకోవచ్చు. స్నో స్కీయింగ్ చేయాలంటే ప్రపంచంలో ది బెస్ట్ ప్లేస్ ఇదే. ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రకృతి ఇచ్చిన ప్రతి సౌకర్యాన్ని టూరిజం అభివృద్ధికి మలుచుకుంటోంది. ఆల్ఫ్స్ పర్వతాల్లో ఉన్నటువంటి స్నో గేమ్స్ కోసం ఫ్రాన్స్ నుంచి స్నో బీటర్స్ తెప్పించి ఫ్రెంచి స్కీయింగ్ ఎక్స్పర్ట్ల సహకారంతో డెవలప్ చేశారు. స్కీ రిసార్ట్లో అయితే ఏకంగా మంచు కుర్చీలు, మంచు టేబుళ్లు తెల్లగా మెరుస్తుంటాయి. సరిహద్దు కనిపిస్తుంది! పర్యాటక ప్రదేశాల్లో కేబుల్ కార్లు సాధారణం గా పరిమితమైన దూరానికే ఉంటాయి. ఆ ప్రదేశం మొత్తాన్ని ఆకాశమార్గంలో చూడగలిగినట్లు మాత్రమే ఉంటాయి. ఔలిలో కేబుల్ కార్ చాలా పెద్దది. ఔలి నుంచి జోషిమఠ్ వరకు ఉంటుంది. ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ జర్నీలో భారత్– టిబెట్ సరిహద్దు కనిపిస్తుంది. అలాగే భారత్–టిబెట్ సరిహద్దు గ్రామాల్లో ఒకటైన ‘మాణా’ గ్రామాన్ని, నీల్కాంత్, నందాదేవి శిఖరాలను కూడా చూడవచ్చు. వీటితో సంతృప్తి చెందాల్సిందే. హిమాలయాల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి ఈ ఇరవై నిమిషాల కేబుల్ కార్ ప్రయాణం ఏ మాత్రం తృప్తినివ్వదు. మంచు బయళ్లు ఔలిలో ఎటు చూసినా మంచుశిఖరాలే. ఇలాంటి నేలకు పచ్చిక భూములనే పేరు విచిత్రంగా అనిపిస్తుంది. కానీ పైన చెప్పుకున్న చిత్రమంతా శీతాకాలం, ఎండాకాలం మాత్రమే కనిపిస్తుంది. శీతాకాలంలో పేరుకున్న మంచు మార్చి నుంచి కరుగుతుంది. జూలై నుంచి మంచును చీల్చుకుంటూ పచ్చదనం తన ఉనికిని ప్రకటిస్తుంది. మంచుతో పోటీపడి మొలిచిన మొక్కలు ఆగస్టు నాటికి మొగ్గలు తొడిగి పూలు పూస్తాయి. ఆ దృశ్యాన్ని చూస్తే మంచు– మట్టి పోటీ పడుతున్నాయేమో అనిపిస్తుంది. మంచుతో పోటీ పడి మరీ మట్టి మొగ్గ తొడుగుతుంటే... ఆ పచ్చిక కూడా మంచు తివాచీలాగ చల్లగా ఉంటుంది. ప్రకృతి చేసే అందమైన విన్యాసాల్లో ఇదొకటి. హిమాలయాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం రెండూ అద్భుతాలే. బద్దకం కొద్దీ సూర్యోదయాన్ని మిస్ అయినప్పటికీ సూర్యాస్తమయం చేసే కనువిందును జారవిడుచుకోకూడదు. చదవండి: Travel: వంద ఏళ్ల కంటే ముందు కట్టిన తొలి ఎర్రకోట -
Photo Feature: వాహనాల బారులు, హిమాలయ అందాలు
కరోనా కట్టడికి తెలంగాణలో లాక్డౌన్ కొనసాగుతోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు లాక్డౌన్ సడలింపు ఉండటంతో ఈ సమయంలో హైదరాబాద్ నగర రహదారులు కిక్కిరిపోతున్నాయి. మరోవైపు కరోనా నుంచి రక్షణ కోసం రకరకాల మాస్క్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా కాలుష్యం తగ్గడంతో హిమాలయ సానువులు స్పష్టంగా కనిపిస్తూ ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. -
హిమాలయాలకు పెడల్ తొక్కారు...
24 ఏళ్ల సబిత మహతో, 21 ఏళ్ల శ్రుతి రావత్ ఇప్పుడు హిమాలయాలతో సంభాషిస్తున్నారు. ధ్వని లేదు. కాలుష్యం లేదు. నాలుగు కాళ్లు, నాలుగు పెడల్స్... అంతే. కశ్మీరులోని పీర్ పంజిల్ శ్రేణి నుంచి నేపాల్లోని మహాభారత శ్రేణి వరకు 5,600 కిలోమీటర్ల ‘ట్రాన్స్ హిమాలయా’ను వారు 85 రోజుల్లో సైకిళ్ల మీద చుట్టేయనున్నారు. స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ‘ఒన్ బిలియన్ రైజింగ్’ కాంపెయిన్లో భాగంగా వారు ఈ సాహసకార్యం చేస్తున్నారు. ఫిబ్రవరి 2న మొదలైన వీరి యాత్ర ప్రస్తుతం సిక్కింలో కొనసాగుతోంది. వీరి పరిచయం... వన్ బిలియన్ అంటే 100 కోట్లు. ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం ఫ్రపంచ జనాభాలోని ప్రతి ముగ్గురు స్త్రీలలో ఒకరు లేదా సగటున 100 కోట్ల మంది స్త్రీలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా హింసకు లేదా అత్యాచారానికి లోనవుతున్నారు. ఆ 100 కోట్ల మంది స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకం గా చైతన్యం, ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమినిస్ట్ ‘ఈవ్ ఎన్స్లర్’ మొదలెట్టిన కార్యక్రమమే ‘వన్ బిలియన్ రైజింగ్’. ఈ కార్యక్రమం లో భాగంగా పర్వతారోహకులు సబితా మహతో, శ్రుతి రావత్లు చేస్తున్న సైకిల్ యాత్రే ‘రైడ్ టు రైజ్’. హిమాలయ పర్వత శ్రేణులలో సైకిల్ తొక్కుతూ స్త్రీ హింసకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ దాదాపు 85 రోజుల పాటు వీరు యాత్ర చేస్తారు. ఫిబ్రవరి 2న నాటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఈ యాత్రను ప్రారంభించారు. అంతేకాదు తమ రాష్ట్రానికి చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నందున లక్షన్నర రూపాయల ఆర్థికసాయం కూడా చేశారు. ఇద్దరు అమ్మాయిలు బిహార్కు చెందిన సబిత మహతో, ఉత్తరాఖండ్కు చెందిన శ్రుతి రావత్ ఈ యాత్ర చేస్తున్నారు. అట్టారి సరిహద్దు దగ్గర మొదలెట్టిన ఈ యాత్ర ‘ట్రాన్స్ హిమాలయ’గా పేరు పొందిన ఆరు హిమాలయ శ్రేణులను కవర్ చేయనుంది. పంజాబ్, జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, నేపాల్ల గుండా హిమాలయాల అంచులను తాకుతూ వీరిరువురూ సైకిళ్ల మీద కొనసాగుతారు. 5 వేల కిలోమీటర్లకు పైగా ఉండే ఈ దూరం వీరు పూర్తి చేసేందుకు మూడునెలలు పట్టొచ్చు. అయినా మాకు ఇలాంటి సాహసాలు అలవాటే అని వీరు అంటున్నారు. అనడమే కాదు ఇప్పటివరకూ విజయవంతంగా యాత్ర చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. చేపలు అమ్మే వ్యక్తి కుమార్తె సబితా మహతో ఒక చేపలు పట్టే వ్యక్తి కుమార్తె. వీళ్లది బిహార్ అయినా తండ్రి కోల్కతా వెళ్లి చేపల పని చూసుకొని వస్తుంటాడు. ‘మా నాన్న నేను పర్వతారోహణ స్కూల్లో చేరతానంటే మనకెందుకమ్మా అన్నాడు. కాని డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో నేను 2014లో చేరి పర్వతాలు ఎక్కడం మొదలెట్టాక ఎంతో సంతోషపడ్డాడు. ఇప్పుడు మా నాన్న నేను ఏ పని చేసినా మెచ్చుకుంటాడు’ అంటుంది సబితా. ఈమె ఇప్పటికే హిమాలయాల్లోని అనేక ముఖ్య శిఖరాలను అధిరోహించింది. ఎవరెస్ట్ అధిరోహించాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ‘ఎవరెస్ట్ను ఎక్కిన దారిలోనే ఎవరూ దిగరు. నేను మాత్రం ఎక్కినదారిలోనే దిగి రికార్డు సృష్టించాలనుకుంటున్నాను’ అంటుంది. ప్రస్తుతం ఆమె స్పాన్సర్ల అన్వేషణలో ఉంది. స్త్రీల కోసం భూమి కోసం ‘స్త్రీల హింస అంటే జన్మనిచ్చిన తల్లి మీద హింస చేయడం. అది పురుషుడు కొనసాగిస్తున్నాడు. అలాగే నేల తల్లి మీద కూడా కాలుష్యం, విధ్వంసంతో పీడన కొనసాగిస్తున్నాడు. మేమిద్దరం చేస్తున్న యాత్ర స్త్రీలపై హింసను మానుకోమని చెప్పడమే కాదు అందమైన ప్రకృతి స్త్రీ మీద కూడా హింస నివారించమని అందరినీ అభ్యర్థిస్తుంది. మా సైకిల్ యాత్రలో ఆంతర్యం సైకిల్ కాలుష్యం కలిగించదు. ఇలాంటి ఎరుకతో ఈ భూమి తల్లిని కాపాడుకొని భావితరాలకు అందజేయమని కోరుతున్నాం’ అన్నారు సబిత, శ్రుతి. యాత్ర ఇలా సాగుతోంది ‘మేమిద్దరం రోజూ ఉదయం 7 నుంచి సాయంత్రం 7.30 వరకూ యాత్ర కొనసాగిస్తాం. ఆ తర్వాత ఆ గమ్యంలోని హోటల్లో బస చేస్తాం. ఇప్పటివరకూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ఘటనలు జరగలేదు. దారి పొడవునా జనం మమ్మల్ని ప్రోత్సహిస్తూనే ఉన్నారు. ఎవరో ఒకరిద్దరు చెడ్డవాళ్లను చూసి మనుషులందరూ చెడ్డవాళ్లనుకోకూడదు. ఇంట్లోనే ఉంటే లోకం చాలా ప్రమాదం అనిపిస్తుంది. లోకాన్ని చూడటం మొదలెడితే ఇది కూడా ఎంతో ఆదరణీయమని అర్థమవుతుంది’ అన్నారు వారిద్దరూ. వారి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
కొన్నిరోజులు మీకు కనిపించనంటున్న బిగ్ బాస్ బ్యూటీ
యాంకర్గా కెరీర్ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారిపోయింది ఆరియానా గ్లోరీ. ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అదిరిపోయే ఆటతో పాటు తన దూకూడైన వ్యవహార శైలితో తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీగా మారిపోయింది. తాజాగా ఈ భామ కొన్ని రోజులు మీకు కనిపించను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది. నేను అక్కడికి ఒంటరిగానే వెళ్తున్న తాజాగా ఆరియానా తన ఇన్స్టాగ్రామ్లో ఓ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేసింది. అందులో ‘నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నాను, ఈ నెల 12వ తేదీ వరకు నేను కనిపించను. హిమాలయాలకు ట్రెక్కింగ్ కోసం ఒంటరిగానే వెళ్తున్నాను. ఒంటరిగా అంటే అక్కడ ట్రెక్కింగ్ గ్యాంగ్ ఉంటుంది. ఆ ప్రాంతంలో సిగ్నల్స్ కూడా ఉండదు కాబట్టి కొన్న రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండలేను. కనుక నన్నుఅర్థం చేసుకోండి. వచ్చాక అన్ని విషయాలను చెబుతానని అరియానా తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోను షేర్ చేసింది. ఈ అమ్మడు రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోతే, తెగ బాధ పడిపోతున్నారు ఆమె అభిమానులు. ఇటీవల అనారోగ్యానికి గురైన సమయంలోనూ ఇదే జరిగింది. ఈ కారణంగానే తాజాగా తన ఫాలోవర్లకు ఈ వీడియో పోస్ట్ చెసిందీ బోల్డ్ బ్యూటీ. ( చదవండి: వర్షపై బాడీషేమింగ్ చేసిన హైపర్ ఆది ) -
హిమాలయాలను చూస్తూ హాయిగా సిప్ చేయొచ్చు..
ఓ కప్పు కాఫీ కోసం పదివేల అడుగుల ఎత్తుకు వెళ్లాలా? హిమాలయాలను చూస్తూ సిప్పు చేయాలంటే తప్పదు. సరిహద్దుకు ఈవల ఉండి ఆవలి టిబెట్ను చూస్తూ... టీ తాగాలంటే ఆ మాత్రం శ్రమ తప్పదు. పాండవులు స్వర్గారోహణకు వెళ్లిన దారిలో... తాపీగా ఓ టీ తాగాలంటే అంతదూరం వెళ్లాల్సిందే. టీ తాగడమే కాదు... టీ తాగుతూ చాలా చూడవచ్చు. సరస్వతి నది మీద ద్రౌపది కోసం... భీముడు కట్టిన రాతి వంతెనను చూడవచ్చు. ఇంకా... ఇంకా... చూడాలంటే... ‘మానా’ గ్రామానికి ప్రయాణం కట్టవచ్చు. మానా అనేది చాలా చిన్న గ్రామం. ఓ వంద ఇళ్లుంటాయేమో! కొండవాలులో ఉన్న ఈ గ్రామంలో ఏది నివాస ప్రదేశమో, ఏది వ్యవసాయ క్షేత్రమో అర్థం కాదు. అంతా కలగలిసి ఉంటుంది. ఇంటి ముందు క్యాబేజీ పంటలు కనిపిస్తాయి. దుకాణం వెనుక ఒక కుటుంబం నివసిస్తుంటుంది. ఓ వైపు ధీరగంభీరంగా హిమాలయాలు, మరో దిక్కున కిందకు చూస్తే నేల ఎక్కడుందో తెలియనంత లోతులో మంద్రంగా ప్రవహించే నదులు. నింగికీ నేలకూ మధ్యలో విహరిస్తున్నామనే భావన ఊహల్లో తేలుస్తుంది. నేనూ ఉన్నానంటూ సూర్యుడు తన ఉనికిని ప్రకటించే ప్రయత్నంలో ఉంటాడు. దారి చూపే బ్యాంకు ఇక్కడ రోడ్లు తీరుగా ఉండవు. భారతీయ స్టేట్ బ్యాంకు పెట్టిన బోర్డుల ఆధారంగా వెళ్లాలి. వ్యాసగుహ 150 మీటర్లు, గణేశ గుహ 30 మీటర్లు, భీమ్పూల్– సరస్వతి దర్శన్ 100మీటర్లు, కేశవ్ ప్రయాగ 600 మీటర్లు, వసుధారా జలపాతం ఐదు కిలోమీటర్లు అని బోర్డులుంటాయి. వసుధారా జలపాతం పాండవుల స్వర్గారోహణ ప్రస్థానంలో మానా తర్వాత మజిలీ. చాయ్ ప్రమోషన్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడం వస్తే చాలు... సముద్ర తీరాన ఇసుకని అమ్మవచ్చు, నడి సముద్రంలో ఉప్పు నీటిని అమ్మనూవచ్చు. మానా గ్రామస్థులు టీ, కాఫీలు అమ్మడం చూస్తే అలాగే అనిపిస్తుంది. ‘దేశం చివరి గ్రామం ఇది. ఇక్కడ టీ తాగిన అనుభూతిని మీ ఊరికి తీసుకెళ్లండి’ అని కొత్త ఆలోచనను రేకెత్తించడంతో ప్రతి ఒక్కరికీ టీ కానీ కాఫీ కాని తాగి తీరాలనిపిస్తుంది. ప్రతి పది మీటర్లకు ఒక చాయ్ దుకాణం ఉంటుంది. ప్రతి దుకాణం మీద ‘హిందూస్థాన్ కీ అంతిమ దుకాన్’ అనే బోర్డు ఉంటుంది. వ్యాపార నైపుణ్యం అంటే అదే. అసలైన చివరి దుకాణం ఏదనే ప్రశ్నార్థకానికి సమాధానం కూడా స్టేట్ బ్యాంకు బోర్టే. స్టేట్ బ్యాంకు జోషిమ శాఖ చివరి దుకాణం దగ్గర ‘ఇదే చివరి చాయ్ దుకాణం అనే బోర్డు ఉంటుంది. మానా గ్రామం పొలిమేర అది. ఆ తర్వాత వచ్చే దారి మానా పాస్. ఆ దారిలో ముందుకు వెళ్తే సరిహద్దు సెక్యూరిటీ వాళ్లు వెనక్కి పంపేస్తారు. మానా గ్రామం... దేశం చివరిలో సరిహద్దు వెంబడి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఉత్తర ఎల్లలో హిమాచల్ ప్రదేశ్లోని చిత్కుల్ కూడా సరిహద్దు గ్రామమే. అయితే అది పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందలేదు. మానా గ్రామం భారతీయులకు సొంతూరిలాగ అనిపించడానికి కారణం ఇక్కడ మన పురాణేతిహాసాల మూలాలు కనిపించడమే. -
విషాదం: 170 మంది మరణించినట్లేనా?
డెహ్రాడూన్ : ధౌలిగంగా నది ఉగ్రరూపం ఉత్తరాఖండ్ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆకస్మికంగా సంభవించిన జల విలయం ఆరాష్ట్ర ప్రజలను తీవ్రం ఆందోళనకు గురిచేస్తోంది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన 170 మంది కార్మికుల ఆచూకీ ఇంకా లభించకపోవడం, కొంతమంది తీర ప్రాంతాలకు కొట్టుకువచ్చిన శవాలుగా మిగిలిపోవడం కలవరానికి గురిచేస్తోంది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఐటీబీపీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయ చర్యలను ముమ్మరం చేసినప్పటికీ వారి అచూకీ లభ్యంకాకపోవడంతో నది ఉధృతికి కొట్టుకుపోయిన 170 మంది మరణించినట్లుగానే ప్రభుత్వం భావిస్తోంది. నది పరివాహాక ప్రాంతాల్లో జల్లెడపడుతున్నా కొద్దీ శవాలు బయపడుతున్నాయి. ఇప్పటి వరకు 10 శవాలను గుర్తించగా.. మొత్తం 16 మందిని సహాయ బృందాలు కాపాడగలిగాయి. (ఉత్తరాఖండ్లో జల విలయం) దీనిపై సోమవారం స్పందించిన ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. గల్లంతైన వారి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోందన్నారు. రెండో తపోవన్ టన్నెల్స్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అయితే వారి అచూకీ లభించకపోవడం ఆందోళక కలిగిస్తోందన్నారు. మంచుకొండ విరిగిపడటంతో ఆదివారం అర్థరాత్రి మరోసారి ధౌలిగంగా పరివాహా ప్రాంతాల్లో నీటి మట్టం పెరిగింది. దీంతో అలకనంద, ధౌలీగంగ, రుషిగంగ నదీ ప్రాంతాల్లో విపత్తు సంభవించింది. వరద ఉధృతి భారీగా పెరగడంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ధౌలిగంగకు వరదతో రుషిగంగలో పెరిగిన నీటి ప్రవాహం భారీగా పెరిగింది. నది ఉధృతికి తీరగ్రామాల్లో చాలావరకు ఇళ్లు కొట్టుకుపోయాయి. దీంతో నది తీరప్రాంతాల గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. మరోవైపు ధైలిగంగా ఉధృతితో గంగానదీ తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఉత్తరాఖండ్, గంగానదీ తీర ప్రాంతాల్లో పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరాతీశారు. ఎప్పటికప్పుడు అక్కడి అధికారులను సంప్రదిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో యావత్దేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరదలో కొట్టుకుపోయిన వారు సురక్షితంగా బయటపడాలని ప్రార్థనలు చేస్తున్నారు. -
ఉత్తరాఖండ్లో జల విలయం
డెహ్రాడూన్: హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడంతో ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకొని విలవిలలాడుతోంది. గంగా పరివాహక ప్రాంతాలు వరద ముప్పులో బిక్కుబిక్కుమంటున్నాయి. చమోలీ జిల్లాలోని జోషిమఠ్ సమీపంలో నందాదేవి పర్వతం నుంచి హఠాత్తుగా మంచు చరియలు విరిగిపడడంతో ధౌలిగంగా నది పోటెత్తింది. ఒక్కసారిగా రాళ్లు, మంచు ముక్కలతో కూడిన నీటి ప్రవాహం కిందకి విరుచుకుపడడంతో ధౌలిగంగ ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. దీంతో తపోవన్–రేణిలో ఎన్టీపీసీ నిర్మిస్తున్న 13.2 మెగావాట్ల రిషిగంగ విద్యుత్ ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమైంది. తపోవన్–విష్ణుగఢ్ ప్రాజెక్టు కూడా దెబ్బతిందని రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. తపోవన్ వద్ద పనిచేస్తున్న 148 మంది, రిషిగంగ వద్ద 22 మంది మొత్తం 170 మంది కనిపించకుండా పోయినట్లు ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే చెప్పారు. కొన్ని వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ ఘటన జరిగిన వెంటనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) రంగంలోకి దిగి సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. నీళ్లలో మునిగిపోయిన ప్రాజెక్టు సొరంగ మార్గంలోకి ప్రాణాలకు తెగించి వెళ్లిన ఐటీబీపీ సిబ్బంది 16 మందిని కాపాడారు. మరో ఏడు మృతదేహాలను వెలికితీసినట్టుగా ఐటీబీపీ ప్రతినిధి వెల్లడించారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోనికి వస్తున్నాయని సహాయ బృందాలు వెల్లడించాయి. మృతుల సంఖ్య భారీగా ఉంటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పొంగిపొరలుతున్న గంగా ఉపనదులు గంగా నదికి ఉపనదులైన ధౌలిగంగ, రిషి గంగ, అలకనందా పోటెత్తడంతో చుట్టుపక్కల గ్రామాల్లో ఆందోళన నెలకొంది. పౌరి, తెహ్రి, రుద్రప్రయాగ, హరిద్వార్, డెహ్రాడూన్ జిల్లాల్లోని గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నింటినీ అధికారులు ఖాళీ చేయించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.‘‘చెవులు చిల్లులు పడేలా శబ్దం వినబడడంతో బయటకి వచ్చి చూశాం. ఎగువ నుంచి రాళ్లతో కూడిన నీటి ప్రవాహం అంతెత్తున ఎగిసిపడుతూ వస్తోంది. ధౌలిగంగా ఉగ్రరూపం, ఆ వేగం చూస్తే ఏం చెయ్యాలో అర్థం కాలేదు. హెచ్చరించడానికి కూడా సమయం లేదు. నీటి ప్రవాహం పూర్తిగా ముంచేసింది. మేము కూడా కొట్టుకుపోతామనే భయపడ్డాం. దేవుడి దయ వల్ల బయట పడ్డాం’’అని సంజయ్ సింగ్ రాణా అనే ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఉత్తరాఖండ్ కోసం దేశం ప్రార్థిస్తోంది: ప్రధాని ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని సమీక్షిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న ఆయన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్తో మాట్లాడుతున్నానని తెలిపారు. దేశం యావత్తూ ఉత్తరాఖండ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తోందని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితుల్ని సమీక్షిస్తున్నారు. రూ. 4 లక్షల నష్టపరిహారం రిషిగంగ ప్రాజెక్టు టన్నెల్స్లోని నీటి ప్రవాహంలో చిక్కుకొని మరణించిన కార్మికుల కుటుంబాలకు ఉత్తరాఖండ్ సీఎం రావత్ రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లో గంగా పరివాహక ప్రాంత గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. వరద నీరు దిగువకి వస్తే సహాయ చర్యలపై యూపీ సర్కార్ చర్చించింది. రూ.2 లక్షల చొప్పున కేంద్ర పరిహారం ఉత్తరాఖండ్ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్స్ నేషనల్ రిలీఫ్ ఫండ్(పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ అంగీకరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్వీట్ చేసింది. క్షతగాత్రులకు 50వేల చొప్పున ఇవ్వనున్నట్లు వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టండి: సోనియా ఉత్తరాఖండ్ దుర్ఘటనలో గాయపడిన వారికి తక్షణమే సహాయం అందించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు, స్వచ్ఛంద సేవలకు విజ్ఞప్తి చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కోరారు. మంచు చరియలు విరిగిపడి భారీగా ప్రాణనష్టం సంభవించడం పట్ల ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మిగిలిన వారంతా క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా సంతాపం తెలిపారు. నిలిచిపోయిన 200 మెగావాట్ల విద్యుత్ మంచు చరియలు విరిగిపడడంతో ముందు జాగ్రత్తగా ఉత్తరాఖండ్లోని తెహ్రీ, కోటేశ్వర్ హైడ్రో పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో 200 మెగావాట్ల కరెంటు గ్రిడ్కు అందలేదు. నేడు ఘటనా స్థలానికి గ్లేసియాలజిస్టులు మంచు చరియలు విరిగిపడడానికి గల కారణాలను అన్వేషించడానికి సోమవారం రెండు గ్లేసియాలజిస్టుల బృందాలు జోషీమఠ్–తపోవన్కు చేరుకోనున్నాయని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ తెలిపారు. రెట్టింపు వేగంతో కరుగుతున్న హిమాలయాలు హిమాలయాల్లో నందాదేవి మంచు చరియలు విరిగిపడి ఉత్తరాఖండ్ జల ప్రళయంలో చిక్కుకోవడానికి కారణాలెన్ని ఉన్నప్పటికీ భారత్ సహా వివిధ దేశాలు మంచు ముప్పులో ఉన్నట్టుగా రెండేళ్ల క్రితమే ఒక అధ్యయనం హెచ్చరించింది. హిమాలయాల్లో మంచు రెట్టింపు వేగంతో కరిగిపోతున్నట్టుగా ఆ అధ్యయనం వెల్లడించింది. 21వ శతాబ్దంలోకి అడుగు పెట్టిన దగ్గర్నుంచి ఏడాదికేడాది హిమాలయాల్లోని మంచు కొండలు నిట్టనిలువుగా ఒక అడుగు వరకు కరిగిపోతున్నట్టుగా 2019 జూన్లో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ అ«ధ్యయనాన్ని జర్నల్ సైన్స్ అడ్వాన్సెస్ ప్రచురించింది. 1975 నుంచి 2000 మధ్య కాలంలో కాస్త కాస్త కరిగే మంచు 2000 సంవత్సరం తర్వాత నిలువుగా ఉండే ఒక అడుగు మందం వరకు కరిగిపోతూ ఉండడంతో భవిష్యత్లో భారత్ సహా వివిధ దేశాలు జల ప్రళయాలు ఎదుర్కోవలసి ఉంటుందని ఆ అధ్యయనం హెచ్చరించింది. దాదాపుగా 40 ఏళ్ల పాటు భారత్, చైనా, నేపాల్, భూటాన్ తదితర దేశాల్లోని ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనకారులు పరిశీలించారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా 2వేల కి.మీ. పరిధిలో విస్తరించి ఉన్న 650 మంచుపర్వతాలకు సంబంధించిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను అధ్యయనం చేసి హిమాలయాల్లో మంచు ఏ స్థాయిలో కరిగిపోతోందో ఒక అంచనాకి వచ్చారు. 1975–2000 సంవత్సరం నాటి కంటే 2000–2016 మధ్య ఉష్ణోగ్రతలు సగటున ఒక్క డిగ్రీ వరకు పెరిగాయి. అయితే మంచు మాత్రం రెట్టింపు వేగంతో కరిగిపోవడం ప్రారంభమైందని అధ్యయన నివేదికను రచించిన జోషా మారర్ వెల్లడించారు. అంతేకాదు 21వ శతాబ్దం ప్రారంభం నాటికి ముందు ఏడాదికి సగటున 0.25 మీటర్ల మంచు కరిగితే అప్పటుంచి 0.5 మీటర్ల మంచు కురుగుతున్నట్టు తేలిందని చెప్పారు. 80 కోట్ల మంది వరకు వ్యవసాయం, హైడ్రోపవర్, తాగు నీరు కోసం హిమాలయాలపై ఆధారపడి జీవిస్తున్నారు. భవిష్యత్లో తీవ్రం నీటి కొరత ఉంటుందని హెచ్చరించింది. మంచు చరియలు ఎందుకు విరిగిపడతాయ్ ..? హిమాలయాల్లో మంచు చరియలు విరిగిపడడానికి ఎన్నో కారణాలుంటాయి. మంచు కొండలు కోతకు గురి కావడం, అడుగు భాగంలో ఉన్న నీటి ఒత్తిడి పెరగడం, హిమనీ నదాల కింద భూమి కంపించడం వంటి వాటి కారణాలతో ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడతాయి. హిమనీ నదాల్లో నీటి ప్రవాహం భారీ స్థాయిలో అటు ఇటూ మళ్లినప్పుడు కూడా మంచు చరియలు విరిగిపడుతూ ఉంటాయి. నందాదేవి గ్లేసియర్లో సరస్సు ఉన్నట్టుగా ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా తెలుస్తోందని, ఆ సరస్సు పొంగి పొరలడంతో మంచు చరియలు విరిగి పడి ఉండవచ్చునని ఇండోర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరూక్ అజామ్ చెప్పారు. భారత్లోని హిమాలయాల్లో అత్యంత ఎల్తైన పర్వత ప్రాంతం కాంచనగంగలో ఈ నందాదేవి హిమనీనదం ఉంది. నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఇది ప్రపంచంలోనే 23వ ఎత్తయిన పర్వత ప్రాంతం. వాతావరణంలో కలిగే విపరీత మార్పుల వల్ల కూడా నందాదేవిలో మంచు చరియలు విరిగిపడవచ్చునని నిపుణులు భావిస్తున్నారు. చమోలీ వద్ద రక్షణ చర్యల్లో నిమగ్నమైన భద్రతా బలగాలు చమోలీ వద్ద కొట్టుకుపోయిన జల విద్యుత్ ప్రాజెక్టు ప్రాంతం తపోవన్ వద్ద క్షతగాత్రులను మోసుకొస్తున్న ఐటీబీపీ జవాన్లు -
అరుదైన చిత్రాన్ని ఇన్స్టాలో పోస్ట్ చేసిన నాసా
అమెరికా: ప్రపంచంలోనే ఎత్తైన పర్వతశ్రేణులు ఏవంటే వెంటనే గుర్తుకు వచ్చేవి హిమాలయాలు. ఎప్పడూ మంచుతో కప్పబడి ఉండే హిమాలయాకు సంబంధించి తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఓ అరుదైన చిత్రాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘అంతరిక్షం నుంచి చూస్తే.. దట్టమైన తెల్లని మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతశ్రేణులు అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం సిబ్బంది తీసింది’ అని కాప్షన్ జతచేసింది. అదే విధంగా ఈ చిత్రంలో హిమాలయాలతో పాటు ప్రకాశవంతమైన కాంతులతో కూడిన న్యూఢిల్లీ నగరం, లాహోర్, పాకిస్తాన్ దర్శనమిసున్నాయని పేర్కొంది. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ ఫొటోలోని కుడివైపు లేదా హిమాలయాలకు దక్షిణ భాగంలో ఉత్తర భారతదేశం, పాకిస్తాన్లోని సారవంతమైన వ్యవసాయ భూమి కనిపిస్తోందని పేర్కొంది. నాసా విడుదల చేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. లక్షల మంది ఈ ఫొటోను సోషల్ మీడియాలో వీక్షించగా వేలాది మంది అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. ‘వావ్.. ఇది చాలా అందమైన ఫొటో’, కచ్చితంగా ఆశ్చర్యపరిచే అద్భుతమైన చిత్రం’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి చిత్రాలను నాసా గతంలో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by NASA (@nasa) -
కుంగ్ ఫూ నన్స్
హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. అవసరమైతే రక్షణగా నిలుస్తారు. వీరు కుంగ్ ఫూ నన్స్. గతంలో కేవలం బౌద్ధ స్త్రీ సేవాదళంగా ఉండేవారు. ఇప్పుడు కుంగ్ ఫూ కూడా నేర్చి తమను తాము రక్షించుకోవడమే కాదు ఏ చెడు పైన అయినా పంచ్ విసరడానికి సిద్ధంగా ఉంటారు. కోవిడ్–19 మీద ప్రభుత్వాలు పోరాటం చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు, ఆరోగ్య సిబ్బంది అందరూ పోరాటం చేస్తున్నారు. అయితే హిమాలయ పర్వత ప్రాంతాలలో దాదాపు 800 మంది బౌద్ధ మహిళా భిక్షువులు కూడా పోరాటం చేస్తున్నారని చాలా కొద్దిమందికే తెలుసు. ఈ బౌద్ధ మహిళా భిక్షువులను ‘కుంగ్ ఫూ నన్స్’ అంటారు. ఎందుకంటే వీరికి కుంగ్ ఫూ వచ్చు కాబట్టి. కావి రంగు బట్టల్లో, శిరో ముండనం చేసుకుని, గంటల తరబడి చేసిన ధ్యానం వల్ల వచ్చిన ప్రశాంత వదనాలతో ఈ మహిళా భిక్షువులు ‘సాటి మనిషిని ప్రేమించుటకే జీవించు’ అనే బౌద్ధ తత్వాన్ని సాధన చేస్తుంటారు. ప్రస్తుతం కోవిడ్ రోజుల్లో ప్రజలను చైతన్యవంతం చేయడానికి హిమాలయ పర్వత సానువుల్లో వీరు తిరుగుతూ ఉంటే మంచు మీద పూసిన ఎర్రపూల వలే కనిపిస్తారు దూరం నుంచి. 2015 నుంచి వార్తల్లోకి బౌద్ధంలోని అనేక శాఖలలో మహిళా భిక్షువులకు ప్రవేశం లేదు. కాని స్త్రీలకు చదువు అబ్బకపోవడం, వారికి సహాయకులు లేకపోవడం, మార్గదర్శకుల లేమి... ఇవన్నీ గమనించిన ‘ద్రుక్పా’ అనే బౌద్ధ శాఖ స్త్రీలకు ప్రత్యేకంగా ప్రవేశం కల్పించింది. అందుకే వీరిని ద్రుక్పా బౌద్ధులు అంటారు. వీరు ప్రధానంగా శాంతి కొరకు, సేవ కొరకు పని చేయాల్సి వచ్చినా వీరికి వ్యాయామం నిషిద్ధమే అయినా 2015లో వచ్చిన వీరి గురువు వీరికి కుంగ్ ఫూ నేర్చుకునే అనుమతిని ఇచ్చాడు. దానికి కారణం పర్వత ప్రాంతాలలో అమాయక ఆడపిల్లలు ట్రాఫికింగ్ కు గురి కావడం వల్లే. ‘మీరూ నేర్చుకోండి... ఆడ³ల్లలకూ నేర్పండి’ అని లడాక్లో ఉన్న వీరి ప్రధాన కార్యాలయం ఆదేశం ఇవ్వగానే ఈ నన్స్ కుంగ్ ఫూ నేర్చుకుని భారత్–నేపార్ సరిహద్దుల్లోని గ్రామాల్లో ఆడపిల్లలకు కుంగ్ ఫూ నేర్పడం మొదలుపెట్టారు. ఇది అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించి మెచ్చుకోళ్లు వచ్చాయి. వీరి మంచి పనికి సహాయం కూడా అందసాగింది. ‘మేము కుంగ్ ఫూ నేర్చుకోవడం ఇతర బుద్ధిస్ట్ శాఖలకు నచ్చదు. మా పని ప్రార్థించడం, వంట చేయడం, శుభ్రం చేయడం అని భావిస్తారు. కాని మేము సేవతో పాటు రక్షణకు కూడా కట్టుబడ్డాం. జనం మమ్మల్ని మెచ్చుకుంటున్నారు’ అని అంటారు వీరు. వీరి అందరి పేర్ల చివర ‘జిగ్మే’ అని పెట్టుకుంటారు. జిగ్మే అంటే భయం లేనిది అని అర్థం. సహాయమే మతం ‘ఇతరులకు సహాయం చేయడమే మా మతం’ అంటారు కుంగ్ఫూ నన్స్. ప్రస్తుతం భారతదేశంలో అంటే టిబెట్ చుట్టుపక్కల 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న 800 మంది కుంగ్ ఫూ నన్స్ ఉన్నారు. కోవిడ్ సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు పడే ఇబ్బందులు వీరు గమనించారు. ‘ప్రకృతి మాత కాలుష్యం నుంచి బయటపడేందుకు చేసిన ప్రయత్నంలా అనిపించింది ఇది. అయితే ప్రజల కష్టాలను మేము చూడలేకపోయాం. సహాయం కోసం ఎదురు చూడటం కంటే మనమే సహాయంగా మారాలని అనుకున్నాం’ అని ఈ నన్స్ అన్నారు. లాక్డౌన్ సమయంలో లాక్డౌన్ తర్వాత కూడా వీరు సరిహద్దు గ్రామాల వెంట ఉన్న దాదాపు 2000 కుటుంబాలను వీరు రేషన్ అందించారు. దేశ విదేశాల నుంచి అందిన విరాళాలు ఇందుకు సాయపడ్డాయి. పరిశీలకులు గమనించింది ఏమిటంటే హిమాయాల పొడవున ఆహారం లేక అలమటించిన పశువులకు కుంగ్ ఫూ నన్లు మేత ఏర్పాటు చేశారు. లేకుంటే అనాథ పశువులు ఎన్నో ఇప్పటికి చనిపోయి ఉండేవి. చైతన్యం... సాధనం కోవిడ్ ఎంత ప్రమాదమో కుంగ్ ఫూ నన్లకు అర్థమైంది. కాని కొండ ప్రాంత ప్రజలకు దాని తీవ్రత అర్థం కాదు. ‘మేము వారికి పదే పదే చైతన్యం కలిగించాల్సి వచ్చింది. వారికి అది కేవలం జలుబు అనే అభిప్రాయం ఉంది. కాని వారికి భౌతిక దూరం గురించి, మాస్కుల గురించి చెప్పాం. వాటిని మేము కుట్టి పంచాం. దాని బారిన పడ్డ వారికి వైద్య సహాయం అందేలా చూశాం’ అంటారు ఈ కుంగ్ ఫూ నన్లు. కోవిడ్ ప్రచారంలో దిగాక వీరికి స్త్రీల ఇతర సమస్యలు కూడా తెలిసి వచ్చాయి. ‘శానిటరీ నాప్కిన్స్ సమస్య తీవ్రంగా ఉంది. హిమాయాల స్త్రీలకు వీటిని అందుబాటులోకి తేవడానికి పని మొదలుపెడతాం’ అంటున్నారు వారు. స్త్రీల శక్తి అపారం. యుద్ధ విద్యలు నేర్చిన స్త్రీల శక్తి మరింత దృఢం. ఈ దృఢమైన సేవ స్త్రీలకు తప్పక మేలు చేస్తుంది. సహాయక చర్యలు చేపట్టిన కుంగ్ఫూ నన్స్ కుంగ్ఫూ సాధన – సాక్షి ఫ్యామిలీ -
హిమాలయాలకు భారీ భూకంప ముప్పు
న్యూఢిల్లీ: భారతదేశానికి పెట్టని కోటలా ఉన్న హిమాలయాలకు భారీ భూకంపాల ముప్పు ఉందని తాజా అధ్యయనం తేల్చింది. హిమాలయాల శ్రేణిలో రిక్టర్ స్కేలుపై 8 కంటే తీవ్రత ఉండే భూకంపాలు సంభవిస్తాయని చెప్పింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్–కోల్కతా, అమెరికాకు చెందిన నెవడా యూనివర్సిటీ నిపుణుతో కూడిన బృందం ఈ విషయాలను వెల్లడించింది. ‘అరుణాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకూ వ్యాపించి ఉన్న హిమాలయాల శ్రేణిలో గతంలోనూ భారీ భూకంపాలు వచ్చిన చరిత్ర ఉంది. మా పరిశోధనలో తేలిన ప్రకారం మన తరంలోనే రాబోయే భారీ భూకంపాన్ని చూసే అవకాశం ఉంది. ఎంత లేదన్నా 100 సంవత్సరాల్లోపే పెద్ద భూకంపం సంభవించే అవకాశం ఉంది’ అని పరిశోధనలో పాల్గొన్న జియాలజీ, సిస్మోలజీ నిపుణుడు వెస్నౌస్కీ చెప్పారు. -
మేఘా చేతికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిర్మాణ రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్).. ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును దక్కించుకుంది. హిమాలయాల్లోని జమ్మూకాశ్మీ ర్–లద్దాఖ్లోని జోజిల్లా పాస్ టన్నెల్ నిర్మాణ టెండర్లలో కంపెనీ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. నేషనల్ హైవేస్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫైనాన్స్ బిడ్లను శుక్రవారం తెరిచింది. ప్రాజెక్టు వ్యయం రూ.4,509.50 కోట్లు. మొత్తం పనిని దాదాపు 33 కిలోమీటర్ల మేర 2 విభాగాలుగా చేపట్టాల్సి ఉంటుంది. మొదట 18.50 కిలోమీటర్ల పొడవైన రహదారిని అభివృద్ధి చేయాలి. 2 కిలోమీటర్లు, 0.5 కిలోమీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలను (టన్నెల్స్) నిర్మించాలి. అలాగే జోజిల్లా టన్నెల్ను 14.15 కిలోమీటర్ల మేర రెండు వరుసల్లో రోడ్డును 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తులో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించాల్సి ఉంటుంది. ఇంతవరకు దేశంలో ఎక్కడా నిర్మించని పద్ధతిలో అధునాతన రీతిలో, క్లిష్టమైన పరిస్థితిలో ఈ పనిని చేపట్టాల్సి ఉంటుందని ఎంఈఐఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్.సుబ్బయ్య తెలిపారు. ప్రాజెక్టును 72 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి లద్దాఖ్ లేహ్ ప్రాంతంలో ఉన్న రహదారిని ఏడాదిలో 6 నెలలపాటు పూర్తిగా మూసివేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో సుదీర్ఘ దూరం ప్రయాణించడానికి అత్యధిక వ్యయ ప్రయాసలతో పాటు సమయం కూడా వృధా అవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా సోనామార్గ్ నుంచి కార్గిల్ మీదుగా లేహ్, లడఖ్కు రహదారి టన్నెల్ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. అయితే ఆచరణలో మొదటి అధ్యాయం ఇప్పటికి సాధ్యం అయ్యింది. మొత్తం మూడు సంస్థలు పోటీపడ్డాయి. -
హిమాలయాల్లో తెలుగు స్వామీజీ
అన్వేషణ మనిషిని ఎటువైపు తీసుకెళుతుందో చెప్పలేం. జీవితపరమార్థాన్ని వెతుక్కుంటూ నెల్లూరు నుంచి బయల్దేరిన సుందరరాముడు హిమాలయాల చెంతకు చేరితే, గంగోత్రిని దర్శించుకునేందుకు వెళ్లిన ఒక హైదరాబాద్ యాత్రికుడికి సుందర రాముడు సాక్షాత్కరించారు! సముద్రమట్టానికి 10,200 అడుగుల ఎత్తున ఉంటుంది గంగోత్రి. అటువంటి దేవభూమిలో అడుగిడి గంగామాతను సందర్శించిన తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలను చూద్దామని నేనూ నా మిత్రుడు బయలుదేరాం. గంగానదికి కుడి పక్కనున్న మాతాదీ ఆలయాన్ని చూసిన తర్వాత ఎడమ వైపుకు వెళ్లాం. సెలయేళ్లు, రకరకాల పుష్పాలు.. అవి దాటి కొంచెం ముందుకు పోతే ప్రకృతి రమణీయతకు మారుపేరా అన్నట్టున్న తపోవనం. విశాలమైన ఆ ఆవరణలో ఓ మూల నీరెండ పడుతోంది. అక్కడ ఓ రుషి పుంగవుడు మంచంపై విశ్రమించి ఉన్నారు. లోపలికి వెళ్లి స్వామి వారికి నమస్కరించాం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం అని అనగానే ఏ ఊరి నుంచి అన్నారు స్వామి. ఆశ్చర్యపోతూ ఉబ్బితబ్బిబ్బయ్యాం. ముందు తపోవనం ఆర్ట్ గ్యాలరీని చూసి రండి తర్వాత మాట్లాడదామన్నారు. అలా తెలిసింది ఆయన తెలుగువారని, గత ఆరేడు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారని! తపోవనమే ఆశ్రమం ఈ తపోవనమే మన తెలుగువారైన స్వామీ సుందరానంద ఆవాసం. ఎక్కడో నెల్లూరు జిల్లాలో పుట్టి గురుపరంపరను వెతుక్కుంటూ భారతీయ ఆధ్యాత్మిక ఆత్మను పట్టి బంధించే (తన కెమెరాతో) దిశగా బయలుదేరి ఉత్తరాఖండ్లోని నాలుగు ధామాలలో ఒకటైన గంగోత్రిని అంతిమ గమ్యంగా ఎంచుకున్నారాయన. హిమాలయాలను ఔపాశన పట్టి ఎక్కడెక్కడి రహస్యాలను ఒడిసిపట్టి సుమారు 35 ఏళ్ల పాటు గంగోత్రిలోనే నివసించిన మహాపండితులు, సన్యాసీ, కీర్తిశేషులు స్వామీ తపోవన్ మహారాజ్ శిష్యుడు స్వామి సుందరానంద. 47 ఏళ్ల కిందట గురువు నుంచి సన్యాసం స్వీకరించిన సుందరానంద ప్రస్తుతం గంగోత్రిలో తపోవన్ (హిరణ్యగర్భ ఆర్ట్ గ్యాలరీ) ని నిర్వహిస్తున్నారు. కట్టుబట్టలతో వచ్చేశారు సుందరానంద స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కలిగిరి మండలం అనంతపురం. మద్దు పెంచమ్మ, వెంకటసుబ్బయ్య దంపతుల ఐదుగురి సంతానంలో నడిపివారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సుందర రాముడు. సంతానం తప్ప సంపద లేని కుటుంబం. ఏదో సాధించాలన్న తపన. చుట్టూ ప్రపంచాన్ని చూస్తే ఏదో తెలియని వెలితి. «ఇంట్లో ఎవరికీ చెప్పాపెట్టకుండా కట్టుబట్టలతో ఊరి నుంచి వచ్చేసి బెజవాడ చేరాడు. ఏమి చేయాలో తెలియలేదు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న న్యూ వెల్కమ్ హోటల్లో సర్వరుగా చేరారు. కడుపు నింపుకోవడానికి ఆ పని సరిపోయినా తన తృష్ణను తీర్చలేకపోయింది. నేతాజీని కలుద్దామని.. సుందర రాముడు బెజవాడ హోటల్లో పని చేస్తున్నప్పుడే రెండో ప్రపంచ యుద్ధ వార్తలు తెలుస్తుండేవి. హోరాహోరా యుద్ధం నడుస్తున్నప్పుడు ఈ హోటల్లో పనేమిటంటూ– విప్లవ వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన అజాద్ హింద్ ఫౌజ్లో చేరేందుకు కోల్కతాకు బయలుదేరాడు. సుందరరాముడు కోల్కతాకు వెళ్లేటప్పటికే రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. బోస్ విమాన ప్రమాదంలో చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఉసూరుమన్న సుందరరాముడు సన్యాసం స్వీకరించి తపస్సు చేసుకుందామని నిర్ణయించుకుని గురువును వెతుక్కుంటూ హిమాలయాలకు బయలుదేరారు. ‘‘1948–49లలో హిమాలయపర్వత సానువులకు వచ్చా. 1950–54 మధ్య కాలంలో ఐదారు సార్లు హిమాలయాలను ఎక్కిదిగా.చీలిక పీలికలయిన దుస్తులే ఈ భౌతికకాయాన్నీ, పవిత్ర ఆత్మను కప్పి ఉంచేవి’’ అని చెప్పారు స్వామీజీ. ఆయన పక్కనే పాతకాలం నాటి ఓ కెమెరా కనిపిస్తుంది. దాని గురించి అడిగినప్పుడు స్వామీజీ మందస్మితులయ్యారు. ‘‘అదో పెద్ద కథలే.. ఓసారి హిమాలయ పర్వతారోహణ సమయంలో కెమెరా ఉంటే బాగుండేదనిపించింది. దేవమార్గాన్ని బంధించాలనిపించింది. అప్పుడు డెహ్రడూన్లోని శివానంద ఆర్ట్ స్టూడియో వారిని అడిగి రూ.25లకు ఆస్ట్రేలియాకు చెందిన బాక్స్ కెమెరాను కొనుక్కున్నా. అలా నా భుజం మీదకు చేరిన కెమెరాను ఇప్పటివరకు ఎన్నడూ వీడలేదు. ఇప్పుడు నా వయస్సు 92 ఏళ్లు. 60 ఏళ్లకు పైబడి నా చేతిలో ఈ కెమెరా ఉంది’’ అన్నారు సుందరానంద. తాను తీసిన చిత్రాలతో– హిమాలయన్ త్రూ ద లెస్సెన్స్ ఆఫ్ సాధు – అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకం ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. 1962లో ఓసారి ఊరికెళ్లా.. ‘‘అప్పటికే సన్యాసం స్వీకరించా. తపోవన్ స్వాముల వారిది కేరళ. ఆయన అనుమతి మేరకు దేశపర్యటనలో భాగంగా 1962లో ఓసారి మా స్వగ్రామం అనంతపురం వెళ్లా. హిమాలయాల్లో తపస్సు చేసి వచ్చానని ఊరు ఊరంతా వచ్చి ఊరేగింపు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ వెళ్లలేదు. ఇప్పుడు నాకు తన, మన అనేదే తెలియదు. అందరూ నా వాళ్లే. మా అప్పచెల్లెళ్లు ఎక్కడున్నారో కూడా తెలియదు’’ అంటారు స్వామీ సుందరానంద. – సీవీఎస్ రఘునాథరావు ప్రధానులు సందర్శించారు గంగోత్రి నదికి కుడి వైపున ఆలయం ఉంటే ఎడమ వైపున తపోవన్ హిరణ్య గర్భ ఆర్ట్ గ్యాలరీ ఉంటుం ది. పూర్తిగా చెక్కతో నిర్మాణం. ఐదంతస్తులు. ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి చెందిన ఫొటోలను ఏర్పాటు చేశారు. ఎవరెస్ట్ పర్వతారోహకుడు టెన్సింగ్ నార్కే మొదలు మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, వాజపేయి వరకు ఎందరెందరో ఈ తపోవన్ను సందర్శించారు. పై అంతస్తులో ధ్యానమందిరం ఉంటుంది. యోగాభ్యాసంలో 360కి పైగా విన్యాసాలు ఉంటాయని, తన జన్మభూమి విశ్వంలో కీర్తిప్రతిష్టలు పొందాలన్నదే తెలుగు ప్రజలకు తానిచ్చే సందేశమన్నారు స్వామీజీ. -
రుషికేశ్లో రజనీకాంత్
తమిళనాడు,పెరంబూరు :నటుడు రజనీకాంత్ ఆదివారం చెన్నై నుంచి హిమాలయాలకు వెళ్లి, రుషికేశ్లోని స్వామీ దయానంద ఆశ్రమంలో బసచేశారు. సోమవారం ఉదయం అక్కడ రజనీకాంత్ అభిమానులు ఆయన్ని కలిసి ఫొటోలు దిగారు. రజనీకాంత్ 10 రోజుల పాటు రుషికేశ్, కేధారనాథ్, బద్రినాథ్ వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. అనంతరం హిమాలయాల్లోని బాబా మందిరంలో ధ్యానం చేసుకుని ప్రశాంతత పొంది చెన్నైకి రానున్నారు. కాగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న కొత్త చిత్రంలో రజనీ నటించనున్నారు. రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభం కానుందని తాజా సమాచారం. -
అమలా ఏమిటీ వైరాగ్యం!
అహో అమలాపాల్ ఏమీ ఈ వైరాగ్యం? ఆశలు ఆవిరయ్యాయా? లేక ఆడంబర జీవితంపై విరక్తి కలిగిందా? లేక ఇంకేమైనా కారణం ఉందా? ఇవి నెటిజన్లు ఆమె భావాలను చూసి ఆశ్చర్యపోతూ అడుగుతున్న ప్రశ్నలు. ఏమిటీ అమలాపాల్ ఏ మంటోంది అనేగా మీ ఉత్సుకత. దక్షిణాది సినిమాలో తనకంటూ ఒక స్థానాన్ని అందుకున్న నటి అమలాపాల్. ఈ మలయాళీ బ్యూటీ నటిగా పరిచయమై ఎంత వేగంగా ఎదిగిందో, అంతే అంత కంటే వేగంగా ప్రేమలో పడిపోయింది. దైవ తిరుమగళ్, తలైవా చిత్రాల్లో నటిస్తున్న సమయంలో ఆ చిత్రాల దర్శకుడు విజయ్తో పరిచయం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వారి పెళ్లి జస్ట్ రెండేళ్లు మాత్రమే సాఫీగా సాగింది. మనస్పర్థలతో విడిపోయి, విడాకులు కూడా తీసుకున్నారు. అనంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది. సక్సెస్లను అందుకోవడంతో పాటు, వివాదాస్పద కథా చిత్రాల్లోనూ నటిస్తూ సంచలన నటిగా పేరు తెచ్చుకుంది. ఇటీవల ఆడై చిత్రంలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది. దీంతో దర్శకులిప్పడు క«థలను పట్టుకుని ఆమెచుట్టూ తిరుగుతున్నారు. అలాంటిది ఇప్పుడు చాలా నిరాడంబరగా జీవించడాన్ని కోరుకుంటోంది. ఆ మధ్య హిమాలయాలకు వెళ్లొచ్చింది. ఇటీవల తరచూ పాండిచ్చేరిలో గడపడానికి ఇష్టపడుతోంది. అంతే కాదు పాండిచ్చేరిలోని అరవిందర్ ఆశ్రమంలో తనకు ఎంతో మనశ్శాంతి లభిస్తోందని, ఇక్కడ తనకోసం కొత్త జీవితం ఎదురుచూస్తున్న భావన కలుగుతోందని పేర్కొంటోంది. ఇప్పుడు తనకు ఆడంబర జీవితాన్ని అనుభవించడం నచ్చడంలేదని అంటోంది. సహజమైన ప్రకృతి మధ్య జీవించాలనిపిస్తోందని చెప్పింది. అన్నట్టు ఆ మధ్య విదేశాల నుంచి కొనుగోలు చేసి వివాదాల పాలైన ఖరీదైన కారును కూడా అమలాపాల్ ఇటీవల విక్రయించేసింది. ఈ మధ్యనే హిమాలయ ప్రాంతాలను చుట్టేసి వచ్చిన అమలాపాల్ ప్రకృతిలోని సహజమైన అందాలను ఆస్వాదిస్తూ జీవించడం ఇష్టంగా ఉందని అంది. చిన్న పాటి సంచిలో కొంచెం బట్టలు తీసుకుని ఒక బృందంగా కలిసి అడవుల్లో వంటావార్పులు చేసుకుంటూ తినడానికి ఇష్టపడుతోందట. దీంతో ఈ వయసులోనే ఈ భామకు ఇంత వైరాగ్యం ఏమీటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. -
అర్షద్..సాధించెన్
సాక్షి, కర్నూలు: సంకల్ప బలం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని నిరూపించాడు నంద్యాల పట్టణానికి చెందిన షేక్ అర్షద్. పర్వతమంత ఆత్మస్థైర్యాన్ని నింపుకుని అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచాడు ఆ యువకుడు. దివ్యాంగుడైనా..పలు క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ ప్రశంసలందుకుంటున్నాడు. హిమాలయాల్లో భగీరథి–2 పర్వతాన్ని 18వేల అడుగుల ఎత్తు ఎవరకు అధిరోహించి శుక్రవారం కర్నూలుకు వచ్చిన సందర్భంగా ఈయనకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్షద్ సాధించిన విజయాలపై ప్రత్యేక కథనం... అర్షద్కు స్వాగతం పలుకుతున్న కర్నూలు ప్రజలు నంద్యాల పట్టణం సంజీవనగర్కు చెందన షేక్ ఇస్మాయిల్, ససీమ్ల ఐదుగురి సంతానంలో రెండు వాడు అర్షద్. చిన్న తనం నుంచే క్రీడల్లో రాణిస్తూ తైక్వాండోలో గ్రీన్ బెల్ట్ సాధించాడు. అయితే ఏడో తరగతి చదువు చదువుతున్న సమయంలో (2004)లో ఆటో ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఎడమ కాలు తొలగించాల్సి వచ్చింది. అయినా క్రీడలపై అర్షద్కు మక్కువ తగ్గలేదు. దాతల సహకారంతో అర్చరీలో శిక్షణ తీసుకొని..జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. బాడీ బిల్డింగ్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ‘మిస్టర్ ఆంధ్ర’, ‘మిస్టర్ రాయలసీమ’గా ఎంపికయ్యాడు. స్విమ్మింగ్లోనూ రాణించి ఎన్నో పతకాలు సాధించాడు. హ్యాండ్ సైక్లింగ్, మారథాన్, వీల్ ఛైర్ ఫెన్సింగ్.. ఇలా పలు క్రీడల్లోనూ రాణిస్తున్నాడు. ఆగస్టు నెల 26వ తేదీన హిమాలయాల్లో భగీరథి–2 పర్వతాన్ని ఎక్కేందుకు బయలు దేరాడు. మంచు వర్షంతో చరియలు విరిగిపడిన కారణంగా 18 వేల అడుగుల ఎత్తు వరకు వెళ్లి నిపుణుల సూచనల మేరకు వెనుదిరగాడు. శుక్రవారం కర్నూలుకు వచ్చిన షేక్ అర్షద్కు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్లో ఘన స్వాగతం లభించింది. హర్షద్ తండ్రి షేక్ ఇస్మాయిల్, ఆవాజ్ కమిటీ నాయకులు ఇక్బాల్, షరీఫ్, అబ్దుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు. చదవండి : వణుకుతున్న నంద్యాల -
భూమి భగభగ.. హిమనీనదాలు విలవిల
సాక్షి, అమరావతి: ‘ఐస్ల్యాండ్లోని ఒకుకూల్ హిమనీనదం అంతరించిపోయింది. అది ఇక మృత హిమనీనదం’ అని శాస్త్రవేత్తలు ఒడ్డుర్ సిగురొసన్, కైమెన్ హువే ఈ నెల 18న ప్రకటించారు. వాతావరణ మార్పులతో భూమిపై పర్యావరణానికి ముంచుకొస్తున్న పెనుముప్పుకు తాజా సంకేతం ఇదీ. ఒక్క ఐస్ల్యాండ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మనదేశ నదీజలాలకు ప్రధాన ఆదరవుగా ఉన్న హిమాలయాల్లోని హిమనీనదాలకు కూడా పెనుప్రమాదం ముంచుకొస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముంచుకొస్తున్న ముప్పు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) తాజా అధ్యయనం ప్రకారం.. గ్రీన్హౌస్ ఉద్గారాలు ప్రస్తుత రేటులోనే కొనసాగితే ప్రపంచంలో దాదాపు సగం హిమనీనదాలు 2100 నాటికి పూర్తిగా కనుమరుగైపోతాయి. వాయు కాలుష్యంతో గ్రీన్హౌస్ ఉద్గారాల రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. 2019, ఆగస్టులో గాలిలో కార్బన్ డయాక్సెడ్ సాంద్రత 415.26 పీపీఎంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా శీతల, సమశీతోష్ణ, ఉష్ణ, సముద్ర తీరప్రాంతాలపై తీవ్ర దుష్ఫలితాలకు కారణమవుతోంది. ఆర్కిటిక్, అంటార్కిటిక్ మినహాయించి హిమనీనదాల ఉపరితల ప్రదేశం 50 శాతం తగ్గిపోయింది. హిమాలయాల్లోని 40 శాతం హిమనీనదాలు వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ముఖ్యంగా సూత్రి ఢాకా, బాటల్, బారా షిగ్రీ, సముద్ర తాపు, జెపాంగ్ గాథ్, కుంజుమ్ అనే ఆరు హిమనీనదాలు ఏటా 13 మిల్లీమీటర్ల నుంచి 33 మిల్లీమీటర్ల చొప్పున కరిగిపోతున్నాయని గుర్తించారు. వీటిలో బారా షిగ్రీ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. పంజాబ్, హరియాణాలను సస్యశ్యామలం చేస్తున్న చినాబ్ నదికి ఈ హిమనీనదమే ప్రధాన ఆదరువు. ఇది పూర్తిగా కరిగిపోతే చినాబ్ నదిలో నీటి లభ్యత అమాంతం తగ్గిపోతుంది. గంగోత్రి, సియాచిన్ హిమనీనదాలు కూడా అంతకంతకూ కరుగుతుండటం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ఇవేకాకుండా ఆండీస్, ఆల్ప్స్, రాకీ పర్వతాల్లోని హిమనీనదాలు కూడా వేగంగా కరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐస్ల్యాండ్లో మరో 400 హిమనీనదాలు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని.. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించకపోతే రాబోయే 200 ఏళ్లలో అవి పూర్తిగా కనుమరుగైపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. మేల్కొనకుంటే పెను ప్రమాదమే భూతాపం పెరుగుతుండటం భారత ఉపఖండంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు, సముద్రమట్టాలు పెరగడం, శక్తివంతమైన తుపానులు, వరదలు విరుచుకుపడటం, మరోవైపు ఎడారీకరణ ఇలా పలు రూపాల్లో దుష్ఫ్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజూ లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలో కలుస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని చెబుతున్నారు. 2030 నాటికి ఓజోన్ పొర క్షీణత కారణంగా వ్యవసాయ ఉత్పత్తుల ఉత్పాదన 26 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. వాతావరణ మార్పుల వల్ల రైతులు, తీరప్రాంత ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాతోపాటు తెలంగాణలోని నల్గొండ, ఒడిశాలోని కలహండీ, కర్ణాటకలోని బెల్గాం జిల్లాలు ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటున్నాయని రిమోట్ సెన్సింగ్ డేటా అధ్యయనాలు వెల్లడించాయి. వాతావరణ మార్పులతో 974 కి.మీ. పొడవైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్రం తరచూ తుపాన్ల బారిన పడుతోంది. తీరప్రాంతం కోతకు గురికావడం, సముద్రపు నీరు పొలాల్లోకి చేరి భూగర్భ జలాలు లవణీకరణకు గురై పంటలు దెబ్బతింటున్నాయి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే మేలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. లేకపోతే భవిష్యత్ తరాలు తీవ్రంగా నష్టపోతాయి. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు తీరప్రాంతం కేంద్ర బిందువుగా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలి. తీరప్రాంతాన్ని అటవీ శాఖకు అప్పగిస్తే బాగుంటుంది. తీరప్రాంతం నుంచి 300 మీటర్ల వరకు మడ అడవులను అభివృద్ధి చేయాలి. తద్వారా కార్బన్ డయాక్సైడ్ను నియంత్రించడంతోపాటు సముద్ర కోత, మట్టి క్షయకరణను నివారించవచ్చు. – మనోజ్ నలనాగుల, భూవిజ్ఞాన శాస్త్ర పరిశోధకుడు -
వీడిన ‘రూప్కుండ్’ మిస్టరీ!
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు దశాబ్దాల మిస్టరీకి తెరపడింది. హిమాలయాల్లో సముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్న రూప్కుండ్ సరస్సు వద్ద లభించిన అస్థిపంజరాలు ఏ దేశం వారివో తెలిసింది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల ద్వారా ఈ అస్థిపంజరాలు గ్రీకు లాంటి మధ్యధరా ప్రాంతానికి చెందిన వారివని తెలిసింది. వీరితోపాటు భారతీయ, ఆగ్నేయాసియా ప్రాంత ప్రజలకు చెందినవని, జన్యు పరిశోధనల ద్వారా దీన్ని నిర్ధారించామని పరిశోధనకు నేతృత్వం వహించిన సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. అందుబాటులో ఉన్న రుజువులను బట్టి చూస్తే వీరు నందాదేవి దర్శనానికి వెళుతున్న వారు గానీ, వ్యాపారులుగానీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమైన సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా, తంగరాజ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదీ నేపథ్యం... 1956లో భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు కొందరు రూప్కుండ్ సరస్సు వద్ద 500 అస్తిపంజరాలు ఉండటాన్ని తొలిసారి గుర్తించారు. వీరు ఎవరు? ఎక్కడి వారు? సరస్సు వద్ద ఎందుకు మరణించారు? అన్న విషయాలు మాత్రం తెలియలేదు. వీటిపై అనేక ఊహాగానాలు వచ్చినా.. వాస్తవం ఏమిటన్నది మాత్రం నిర్ధారణ కాలేదు. దీంతో రూప్కుండ్ సరస్సు మిస్టరీని ఛేదించేందుకు సీసీఎంబీ 2005లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనికోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డాక్టర్ లాల్జీసింగ్, డాక్టర్ తంగరాజ్లు పరిశోధనలు ప్రారంభించారు. లాల్జీసింగ్ ఇటీవలే మరణించగా, అంతర్జాతీయ శాస్త్రవేత్తల సహకారంతో తంగరాజ్ ఈ పరిశోధనలను విజయవంతంగా పూర్తి చేశారు. -
కరుగుతున్న హిమనదాలు
అంతరించిపోయిన హిమానీనదానికి ఒక విషాద భావగీతం. అవును. ప్రస్తుతం ఐస్లాండ్ శాస్త్రజ్ఞులు సరిగ్గా దీనికే పథకం రచిస్తున్నారు. పశ్చిమ ఐస్లాండ్ ప్రాంతంలో కనుమరుగైపోయిన మొట్టమొదటి హిమానీనదానికి గుర్తుగా ఆగస్టు 18న ఒక స్మారక స్తూపం ఏర్పర్చడానికి రైస్ యూనివర్సిటీ, ఐస్లాండ్ దేశం కలిసి ప్లాన్ చేస్తున్నాయి. ఆ మంచుదిబ్బ పేరు ‘ఓకే’. ఆ స్మారకచిహ్నం ఫలకంపై పొందుపరుస్తున్న సందేశం మనందరినీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. ‘హిమానీనదంగా తన ప్రతిపత్తిని కోల్పోతున్న మొదటి ఐస్లాండ్ మంచుదిబ్బ ఓకే. రాబోయే 200 ఏళ్లలో మన హిమానీనదాలన్నీ ఇదే మార్గం అనుసరించనున్నాయి. మనకు ఏం జరగబోతోందో, మనం ఏం చేయాల్సి ఉందో మనకు స్పష్టంగా తెలుసని ఈ స్మారకస్తూపం గుర్తు చేస్తోంది. మనం దాన్ని చేస్తామా అన్నది లేదా అనేది కూడా మనకే తెలుసు’’ మంచుదిబ్బలు కాదు కరుగుతున్నది భవిష్యత్తు! ఐస్లాండ్ దేశంలోని ఓకే హిమానీనదం ఆ దేశం నుంచి అంతరించిపోతున్న తొలి మంచుదిబ్బ. కానీ ఇది చివరిదేమీ కాదు. వచ్చే 200 సంవత్సరాల్లో ఐస్లాండ్ దేశంలోని మంచుదిబ్బలన్నీ అంతర్థానం కానున్నాయని ఆ స్మారక స్తూప ఫలకం ప్రకటిస్తోంది. అయితే 30 ఏళ్ల తర్వాత అంటే 2050లో ఈ స్మారక స్తూప సందేశాన్ని చూడబోయే ప్రజలందరూ ఓకే హిమానీనదానికి ఆ గతి పట్టించినందుకు ప్రస్తుత తరాన్ని శపించడం ఖాయం. మంచుదిబ్బను కరగదీయడం ద్వారా అత్యంత వేడి, పొడి వాతావరణం కలిగిన భూగ్రహాన్ని మనం భవిష్యత్ తరాలవారికి అందించనున్నాం. ఈ ప్రపంచంలో సంతోషభరితంగా జీవించే అవకాశాన్ని, వారికి దక్కాల్సిన వాటాను మనం దూరం చేసేస్తున్నాం. అంతరించిపోతున్న హిమానీనదాలకు స్మారకస్తూపాలను నెలకొల్పడం నిజంగానే అద్భుతమైన ఆలోచన. అలా మంచుదిబ్బలకు స్మారక స్తూపాలను నిర్మించడం సరైనదే అయినట్లయితే, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, భూటాన్, చైనా దేశాల్లో విస్తరించిన హిమాలయ పర్వత శ్రేణుల పొడవునా మనం అనేక స్మారకస్తూపాలను నిర్మించవలసి ఉంటుంది. ప్రపంచంలోనే అతి పెద్ద జలగోపురంగా పేరొందిన హిమాలయాలు భూమ్మీద లభిస్తున్న స్వచ్ఛమైన జలంలో 40 శాతాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ ఇక్కడ 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో మంచుదిబ్బలు శరవేగంతో కరిగిపోతున్నాయని యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం (యూఎన్డీపీ) వారి అంచనా. ఇవి అంతరిస్తున్న వేగాన్ని చూస్తుంటే, ఈ అత్యున్నత పర్వత శ్రేణికి ఇరువైపులా నివసిస్తున్న 130 కోట్లమంది ప్రజల జీవితాల్లో విధ్వంసం సృష్టించడం ఖాయమనే తెలుస్తోంది. మూడో ధ్రువం కరిగితే పెనుముప్పే అంటార్కిటికా, ఆర్కిటిక్ ఖండాల తర్వాత అతిపెద్ద స్థాయిలో మంచును కలిగి ఉన్న మూడో భూభాగంగా హిమాలయాలు గుర్తింపు పొందాయి కాబట్టి దీనిని మూడవ ధ్రువ ప్రాంతం అని పిలుస్తున్నారు. అందుచేత భూగ్రహంలోని అంటార్కిటికా, ఆర్టిటిక్ ధ్రువప్రాంతాలే కాకుండా హిమాలయాలు కూడా వాటికి సమాన స్థాయిలో కరిగిపోయే ప్రమాదం స్పష్టంగానే కనిపిస్తోంది. అయితే హిమాలయాలు యూరోపియన్ ఆల్ఫ్స్ పర్వతాలతో సమాన వేగంలో కరిగిపోవడం లేదు. గత దశాబ్దకాలంలో ఆల్ఫ్స్ పర్వత శ్రేణిలోని అనేక హిమానీనదాలు పూర్తిగా అంతరించిపోయాయి. దక్షిణాసియాలో కంటే యూరప్లో చాలా త్వరగా ఉష్ణోగ్రతలు పెరగడం ప్రారంభించడమే దీనికి కారణం కావచ్చు. కాకపోతే, 2000 సంవత్సరం నుండి హిమాలయాలు ప్రతి సంవత్సరం ఒకటిన్నర అడుగు కంటే ఎక్కువ స్థాయిలో మంచును కోల్పోతున్నాయని ఇటీవలే కొలంబియా యూనివర్సిటీకి చెందిన లేమోంట్–డొహెర్తీ ఎర్త్ అబ్జర్వేటరీ నిర్వహించిన సమగ్ర అధ్యయనం భారత్లో ఆగ్రహావేశాలను ప్రేరేపిస్తుందని నేను ఊహించాను. దీనికి ముందుగా 1975 నుంచి 2000 సంవత్సరం వరకు హిమాలయాల్లో ప్రతి ఏటా 10 అంగుళాల మేరకు మంచు కరుగుతూ వచ్చింది. అయితే తాజా అధ్యయనం ఆసియాలోని పామిర్, హిందూ కుష్, టియాన్ షాన్ అత్యున్నత పర్వత శ్రేణులను తన పరిశీలనాంశంగా చేర్చలేదు. ఈ స్థాయిలో హిమాలయాలు కరుగుతూ రావడం మొత్తం ఆసియా ప్రాంతానికి విధ్వంసకరంగా పరిణమించనుంది. హిమాలయాల్లో హిమానీనదాలు ప్రమాదకరంగా కరిగిపోవడం జాతికి వాస్తవంగా షాక్ కలిగించాలి. ప్రత్యేకించి హిందీ ప్రాబల్య ప్రాంతంలోని ప్రజలకు ఇది భారీ నష్టాన్ని కలిగించనుంది. కానీ అరుదుగా కొన్ని పతాక శీర్షికల్లో ప్రస్తావించడం తప్పితే దేశప్రజల్లో ఈ పరిణామం ఎలాంటి ఆగ్రహాన్ని కలిగించలేదు. ఈ సమస్యను తమ సంపాదకీయాల్లో ప్రస్తావించడానికి తగినదేనని వార్తా పత్రికలు కనీసం ఆలోచించలేదు. ఇక టీవీ చానెల్స్ అయితే అసందర్భమైన రాజకీయ ప్రకటనలతో చొంగకార్చుకోవడంలో బిజీగా ఉండిపోయాయి. చెన్నై జల సంక్షోభం నుంచి నేర్చుకోమా? హిమాలయ ప్రాంతంలో విస్తరించిన 650 హిమానీనదాలపై సాధారణంగా ఉపగ్రహాలు తీసే ఫొటోలతోపాటు, అమెరికన్ గూఢచర్య ఉపగ్రహాలు తీసిన ఫొటోలను కూడా వర్గీకరించి చేసిన పై అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం హిమాలయాలు 800 కోట్ల లీటర్ల నీటిని కోల్పోతున్నాయని తెలిసింది. అంటే ప్రతి సంవత్సరం ఒలింపిక్ పరిమాణంలోని 32 లక్షల స్విమ్మింగ్ పూల్స్లలోని నీటికి సమానమైన నీటిని హిమాలయాలు కోల్పోతున్నాయి. దక్షిణ భారతదేశంలోని చెన్నయ్లో ఇటీవల సంభవించిన జల సంక్షోభం కలిగించిన షాక్ని చూస్తే హిమాలయాల్ని కప్పి ఉంచిన మంచు కరిగిపోతుండటం పట్ల మనందరం కూర్చుని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇది మనందరి భవిష్యత్తుతో ముడిపడిన సమస్య కాబట్టి, మన పిల్లలకు మనం విడిచివెళుతున్న జల రహిత ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ప్రజలు తప్పకుండా ఆందోళన చెందాల్సి ఉంటుంది. బలమైన ప్రజాభిప్రాయం జాతి మొత్తాన్ని ప్రకంపింపచేయాలి. ఈ విషయమై భారత పార్లమెంటు కూడా అత్యవసర అర్ధరాత్రి సెషన్కు కూర్చోవాలి. కానీ ఏమీ జరగలేదు. లభ్యమవుతున్న సాగునీటిలో 78 శాతం నీటిని వ్యవసాయ రంగం దుర్వినియోగపరుస్తోందని దెప్పడం మినహా, జీవితం సజావుగానే సాగిపోతోంది. ఈలోగా హిమాలయాల్లో భాగంగా ఏర్పడిన అతి ముఖ్యమైన సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదీపరివాహక ప్రాంతాల్లో నీరు క్షీణించిపోతోందని కేంద్ర జల కమిషన్ అధ్యయనం హెచ్చరిస్తోంది. ఇవి ఈశాన్య భారత్, కొంతవరకు మధ్యభారత్ ప్రాంత ప్రజాజీవనానికి అత్యవసర వనరులు. కానీ ఇక్కడ కూడా నీటి లభ్యత తగ్గిపోతుండటం ఎవరూ గుర్తించడం లేదు. ఈ మూడు నదీ పరివాహక ప్రాంతాల్లో సగటున నీటి లభ్యత ఇప్పటికే 40 శాతం క్షీణించిపోయింది. ఇక నదీ పరివాహకప్రాంతం క్షీణించిపోవడంతో తూర్పు, ఉత్తర భారత ప్రాంతంలో 628 చదరపు కిలోమీటర్ల పొడవునా అడవులు హరించుకుపోయినట్లు 2015 అటవీ నివేదిక తెలిపింది ఈ తరం తప్పులతో భవిష్యత్ తరాల బలి ఇలాంటి పరిస్థితుల్లో ఎండిపోతున్న నదుల దిగువ ప్రాంతంలో వ్యవసాయాన్ని, పరిశ్రమలను, తాగునీటి వసతులను దెబ్బతీస్తున్న జల సంక్షోభం నేపథ్యంలో జీవనం సాగిస్తున్న వందల కోట్లమంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో హిమాలయన్ రాష్ట్రాలుగా పేరొందిన జమ్మూ– కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, మేఘాలయ, అసోం, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్లు తమ తమ ప్రాంతాల్లో నెలకొన్న కొండ ప్రాంతాల పరిరక్షణకు కలిసికట్టుగా ఒక విధానాన్ని రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయిదేళ్ల క్రితం కేదార్నాథ్లో సంభవించిన విధ్వంసం పునరావృతం కాకుండా అనువైన పథకాలు రూపొందించడం, నదీపరివాహక ప్రాంతాల పరిరక్షణకోసం సామూహికంగా మదుపులు పెట్టడంపై ఈ రాష్ట్రాలన్నీ దృష్టి సారించాల్సి ఉంది. పర్వతాలు అందించే పర్యావరణ వ్యవస్థ సేవలకు చెందిన ఆర్థిక విలువను మదింపు చేస్తున్న క్రమంలో నీరు, వృక్షాల పరిరక్షణ, నేల కోత నివారణ, వన్యమృగాల పరిరక్షణ వంటి సేవలను తప్పకుండా మిళితం చేయాలి. వీటిని అంతిమంగా రాష్ట్రాల బడ్జెట్ అంచనాల్లో భాగం చేయాలి. పర్వతాలు అందించగలిగే ఆర్థిక సంపదను కొలిచే కొలమానం ఇదే. అభివృద్ధి పేరుతో ఇంతకాలంగా సాగిస్తూ వచ్చిన కొండల్ని కొల్లగొట్టే ప్రక్రియలకు వెంటనే చెల్లుచీటీ చెప్పాలి. పర్వత ప్రాంత రాష్ట్రాల అభివృద్ధికి ఇది నిజంగానే ఒక వినూత్న మార్గంగా ఉపయోగపడుతుంది. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంపైనే పర్వత ప్రాంత రాష్ట్రాలు మనగలుగుతాయి. దీనికి తోడుగా మన పరిశోధనా విధానాలు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మైదాన ప్రాంతాల్లో సాగించే పరిశోధనా పద్ధతులను నకలు చేస్తూ పర్వతప్రాంతంలో మన యూనివర్సిటీలు యథాతథంగా అమలు చేయడంలో ఎలాంటి సంబద్ధతా లేదు. దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
ఆంధ్రలో వికసించిన హిమాలయ బ్రహ్మకమలం
సాక్షి, శ్రీకాకుళం : పొందూరు మండలంలోని మొదలవలసలోని సీతారామారావు ఇంటిలో బ్రహ్మకమలం వికసించింది. ఈ పుష్పం హిమాలయాల్లో మాత్రమే సర్వసాధారణంగా కనిపిస్తుంది. దీంతో ఈ పుష్పాన్ని చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. అలాగే కవిటి మండలంలోని ముత్యాలపేటకు చెందిన సంగీత కళాకారుడు ఆరంగి వెంకటరావుతన పెరటితోటలో మూడేళ్ల కిందట నాటిన బ్రహ్మకమలం చెట్టు ఇప్పుడు విరబూసింది. ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి ఈ మొక్కను వెంకటరావుకు కానుకగా ఇచ్చినట్టు తెలిపారు. -
మంచుకొండల్లో మహావిలయం!
బెంగళూరు: హిమాలయ ప్రాంతానికి మరో భారీ భూకంపం ముప్పు పొంచి ఉందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే జవాబిస్తున్నారు. ఈ పర్వతాల భూపొరల్లో విపరీతమైన ఒత్తిడి నెలకొని ఉందనీ, అది ఏ క్షణమైనా వెలువడవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై బెంగళూరులోని జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్లో భూకంప శాస్త్రవేత్తగా ఉన్న సిపీ రాజేంద్రన్ బృందం ఓ నివేదికను విడుదల చేసింది. మధ్య హిమాలయాల ప్రాంతంలో ఎప్పుడైనా 8.5 తీవ్రతతో భూకంపం రావచ్చని రాజేంద్రన్ అన్నారు. భూపొరల్లో కదలికలు, ఘర్షణల ఫలితంగా ఈ ప్రాంతంలో విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. పశ్చిమ నేపాల్లోని మోహనఖోలా, ఉత్తరాఖండ్లోని ఛోర్గలియా ప్రాంతంలో భూప్రకంపనలతో పాటు ఇతర డేటాబేస్లు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులు, ఇస్రో పంపిన కార్టోశాట్–1 చిత్రాలు, గూగుల్ ఎర్త్ ఆధారంగా తాము ఈ నిర్ధారణకు వచ్చారు. 2004లో సునామీ రాకను కచ్చితంగా అంచనా వేసిన పుణెకు చెందిన భూకంప శాస్త్రవేత్త అరుణ్ బాపట్ స్పందిస్తూ.. ఈ ఏడాది చివర్లో లేదా 2019 ఆరంభంలో భారీ భూకంపం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. పక్కకు జరిగిన హిమాలయాలు.. క్రీ.శ.1315–1440 మధ్యకాలంలో మధ్య హిమాలయాల ప్రాంతంలో 8.5 తీవ్రతతో భీకరమైన భూకంపం సంభవించిందని తమ పరిశోధనలో తేలినట్లు రాజేంద్రన్ తెలిపారు. దీని కారణంగా ఈ ప్రాంతంలో 600 కి.మీ పొడవైన పగులు ఏర్పడిందన్నారు. ప్రకంపనల వల్ల పర్వతాలు 15 మీటర్లు పక్కకు జరిగాయన్నారు. హిమాలయాల్లో 2015, ఏప్రిల్లో వచ్చిన భూకంపం దెబ్బకు దాదాపు 9,000 మంది ప్రాణాలు కోల్పోయినా, దాని తీవ్రత 7.8గానే ఉందని రాజేంద్రన్ అన్నారు. ఈ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 8.5, అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించి 600 నుంచి 700 సంవత్సరాలు గడిచిపోయాయని వ్యాఖ్యానించారు. పొరల్లో విపరీతమైన ఒత్తిడి కారణంగా ఎప్పుడైనా భూకంపం రావచ్చని చెప్పారు. పెనువిధ్వంసమే.. ఈ ప్రాంతంలో జనసాంద్రత క్రమంగా పెరుగుతున్నందున ఇలాంటి ప్రకృతి విపత్తు సంభవిస్తే నష్టం ఊహకు అలందదని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ పెనుభూకంపాన్ని తట్టుకునేవిధంగా కట్టడాలు నిర్మించకపోవడం, ప్రజలను అధికారులు సంసిద్ధులను చేయకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రవేత్త రాజేంద్రన్ అన్నారు. ఇప్పుడు హిమాలయాల ప్రాంతంలో 8.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవిస్తే నేపాల్తో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇదే అంశంపై పరిశోధనలు జరుపుతున్న అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరడోకు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త రోజర్ బిల్హమ్ ఈ విషయమై స్పందిస్తూ.. హిమాలయాల్లోని తూర్పు అల్మోరా నుంచి నేపాల్లోని పోకరా ప్రాంతం మధ్యలో భూపొరల్లో తీవ్రమైన ఒత్తిడి నెలకొందన్నారు. ఈ అధ్యయనం కోసం 36 జీపీఎస్ స్టేషన్ల నుంచి సమాచారాన్ని సేకరించామని తెలిపారు. తమ పరిశోధనను బట్టి వాయవ్య హిమాలయాల్లోని ఘర్వాల్–కుమౌన్(ఉత్తరాఖండ్) సెగ్మెంట్ను త్వరలో భారీ భూకంపం కుదిపేసే అవకాశముందని వెల్లడించారు. -
దేవుడా.. ఈ మగాళ్లున్నారే...!
బ్రూస్ అలెగ్జాండర్ టెక్సాస్ నుంచి న్యూ మెక్సికోకు విమానంలో ప్రయాణిస్తున్నాడు. అతడొక సాధారణ ప్రయాణికుడు. అయితే ఫ్లయిట్ ఆల్బుకర్క్లో దిగాక మాత్రం ‘పేరుమోసిన’ ప్రయాణికుడు అయ్యాడు! పోలీసులు అతడి చేతికి బేడీలు వేసి తీసుకెళ్లడంతో అతడలా పేరు మోశాడు! ప్రయాణంలో బ్రూస్ తన సహ ప్రయాణికురాలిపై కనీసం రెండుసార్లు కావాలని తలవాల్చాడు. ఒకసారి తన వేళ్లతో ఆమె వక్షోజాలను తాకాడు. ఆ మహిళ ఫిర్యాదుపై ఇప్పుడు పోలీసులు, కోర్టు అంటూ తిరుగుతున్నాడు. ఇవన్నీ కాదు.. విచారణలో అతడు అన్న మాటలకు ఈ రెండు డిపార్ట్మెంట్లు దిగ్భ్రాంతికి లోనయ్యాయి. ‘‘నచ్చిన స్త్రీల అవయవాలను తాకడం తప్పేం కాదని స్వయంగా అమెరికా అధ్యక్షుడు కొనాల్డ్ ట్రంపే అన్నాక.. (2005లో అన్నాడట) నేను చేసిన పని తప్పెలా అవుతుంది?’’ అని బ్రూస్ ప్రశ్నించాడు. దేవుడా.. ఈ మగాళ్లున్నారే...! ‘ది షూటింగ్ స్టార్ : ఎ గర్ల్, హర్ బ్యాక్ప్యాక్ అండ్ ది వరల్డ్’ అనే కొత్త పుస్తకం మార్కెట్లోకి వచ్చింది. పెంగ్విన్ రాండమ్ హౌస్ ప్రచురణ ఇది. రచయిత్రి శివ్యానాథ్ ఎప్పటి నుంచో ‘సోలో’ ప్రయాణాలు చేస్తున్నారు. ఆ అనుభవాలను, అనుభూతులను ఈ పుస్తకంలో పొందుపరిచారు. శివ్యానాథ్ది డెహ్రాడూన్. ఆమె తొలి జర్నీ సింగపూర్. అక్కడినుంచి ఆగ్నేయాసియా దేశాలన్నీ చుట్టి వచ్చారు. కొంతకాలం సింగపూర్ టూరిజం బోర్డులో పనిచేశారు. మంచి ఉద్యోగమే కానీ, ఎందుకో ఆమెకు ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. 2011లో స్పితీ వ్యాలీకి (హిమాలయాలు) వెళ్లి, నెలపాటు సన్యాసినిగా గడిపినప్పుడు ఆ ఏకాంత ప్రశాంత వాతావరణంలో.. జీవితం అంటే ‘సోలో జర్నీ’ అని అర్థం చేసుకున్నారు శివ్యానాథ్. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, ఇటలీ తిరిగొచ్చారు. ఊహల్లోకి, కలల్లోకి, నక్షత్రాల్లోకి, పచ్చటి పర్వతాల్లోకి, ప్రపంచ పచ్చిక బయళ్లలోకి శివ్యా చేసిన తొలి సోలో జర్నీ అది. బస్సులు, రైళ్లు, విమానాలు, ఓడల్లో ప్రయాణించారు. రకరకాల మనుషుల్ని కలుసుకున్నారు. మారిషస్ కూడా వెళ్లారు. అక్కడ ఆమెకు స్వర్గం కనిపించింది! స్వర్గమే కానీ కొన్ని భయాలు కూడా వెంటాడాయి. శివ్యా.. మధ్య అమెరికా దేశాల్లో పర్యటిస్తున్నప్పుడు స్పానిష్ భాష నేర్చుకున్నారు. అక్కడి మన్యన్ తెగలతో కలిసి జీవించే ప్రయత్నం చేశారు. 2014లో దక్షిణ ఆస్ట్రేలియాలోని ద్రాక్షతోటల్లో కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ ఆమెకు హిందీ మాట్లాడే గుజరాత్ మూలాలున్న పోలెండ్ దేశస్థుడు పరిచయం అయ్యాడు. టర్కీ, బెహ్రెయిన్, కెనడా.. శివ్యా పర్యటించిన దేశాల్లో ఉన్నాయి. ఇండియాలో అయితే ఆమె విహరించని ప్రదేశమే లేదు. ఈ అనుభవాలనన్నింటినీ శివ్యానాథ్ ఈ పుస్తకంలో రాశారు. పర్యాటనల అనుభవాలు ఎవరివి వారివే అయినా, శివ్యా అనుభవాలు ఒంటరి ప్రయాణాలకు మహిళల్ని ప్రేరేపించేంత శక్తిమంతంగా ఉన్నాయి. బహుశా ఆ శక్తి ఆమె రచనా శైలిది కావచ్చు. ‘పిచ్చి అభిమానం’ అంటుంటారు. ఈ స్థాయి అభిమానం సాధారణంగా ఫ్యాన్స్కి ఉంటుంది. అయితే అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్కు ఇంత పిచ్చి అభిమానం తన ఫ్యాన్స్ మీద ఉంది! వాళ్లకు ఏమైనా కష్టం వస్తే ఆమె తట్టుకోలేరు. తను చేయగలిగింది చేస్తారు. ఈ దయాగుణ సంపన్నురాలు చేయగలిగింది ఏముంటుంది? ఆర్థికంగా ఆదుకుంటారు. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు’ అనుకుంటారు. తాజాగా శాడీ బార్టెల్ అనే మహిళా అభిమానికి ఆమె 15,000 డాలర్లను విరాళంగా పంపించారు. శాడీ విషయం ఆమె వరకు ఎలా వచ్చిందంటే.. విరాళాల కోసం టేలర్ స్విఫ్ట్ను, ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ట్విట్టర్లో శాడీ ఒక మెసేజ్ పెట్టింది. టేలర్ వెంటనే ఆ మెసేజ్కు స్పందించి డబ్బు పంపారు. ‘‘హేయ్ గయ్స్! ఎంతో ఆవేదనతో ఈ పోస్ట్ పెడుతున్నాను. వీలైతే నాకు, నా కుటుంబానికి సహాయం చెయ్యండి. వెంటనే ఇప్పుడేం చెప్పలేను కానీ.. అకస్మాత్తుగా ఏంటిది అని అనుకోకండి. ఐ లవ్ యు గైస్. నేను మా అమ్మను బతికించుకోవాలి. అందుకే సహాయం అడుగుతున్నా. నా వయసు ఇప్పుడు 19 ఏళ్లు. దిక్కుతోచని స్థితిలో చేతులు చాస్తున్నాను’’ అని శాడీ ట్విట్టర్ పెట్టారు. ఆ అమ్మాయి చెబుతున్నదానిని బట్టి ఆమె తల్లికి అల్సర్ కారణంగా రక్తస్రావం జరుగుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందక.. చివరికది ‘బ్రెయిన్ హెమరేజ్’కు దారి తీసింది. ఆమె చికిత్స కోసం టేలర్ డబ్బు పంపగానే శాడీ తన ఫేస్బుక్ అకౌంట్లో ఆమె దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. టేలర్ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని ఎమోషనల్ అయింది. ఇండియాలో స్థిరపడిన 34 ఏళ్ల ఫ్రెంచి ప్రయోగశీల నటి, రచయిత్రి కల్కీ కేక్లాన్.. దీపపు పురుగులా ఇప్పుడు డిజిటల్ స్పేస్లో తిరుగుతున్నారు. ‘స్మోక్’ అనే వెబ్ సిరీస్తో ఆన్లైన్ వినోదాల ప్రపంచంలోకి తొలిసారి అడుగుపెడుతున్న కేక్లాన్.. ‘స్కేర్డ్ గేమ్స్’ వెబ్ సిరీస్లోని అత్యుత్తమ కథా, సాంకేతిక, నట ప్రమాణాలను చూసి స్ఫూర్తి పొందారు. గోవాలో చిత్రీకరించిన ఈ ‘స్మోక్’ అనే క్రైమ్ డ్రామాలో కేక్లాన్ అసమాన ప్రతిభను కనబరిచినట్లు ‘స్మోక్’ దర్శకుడు నీల్ గుహా ఆమెను ప్రశంసిస్తుండగా.. ‘‘కనీసం ఆ మాత్రమైనా చేయలేకపోతే వెబ్ వరల్డ్లోకి అడుగుపెట్టడం దుస్సాహమే అవుతుంది’’ అని కేక్లాన్ నవ్వుతూ అంటున్నారు. రేపటి నుంచి (అక్టోబర్ 26) ‘ఈరోస్ నౌ’ లో వీక్షకులకు అందుబాటులోకి రానున్న 11 ఎపిసోడ్ల ‘స్మోక్’ ఇప్పటికే ఈ ఏడాది కాన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు అవకాశం పొందింది. ఒక వెబ్ సిరీస్ కాన్స్ వెళ్లడం ఇదే మొదటిసారి. అన్ని వయసులలోని మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశార్హతను కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతుగా, వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపిన మహిళా ఉద్యమకారులతో గతవారం శబరిమల ఆలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సున్నితమైన అంశంపై వ్యాఖ్యానించడానికి కేంద్రంలో అధికార పక్షం నుంచి ప్రముఖులెవరూ ఇంతవరకు ముందుకు రాని పరిస్థితుల్లో తొలిసారి స్మృతీ ఇరానీ తన అభిప్రాయాన్ని బహిరంగంగా వెల్లడించారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మాట్లాడ్డం నా ఉద్దేశం కాదు. కానీ మనసుకు అనిపించిన మాట చెబుతాను. నెలసరి రోజుల్లో రక్తస్రావంతో తడుస్తున్న వస్త్రంతో (ప్యాడ్) మనం మన స్నేహితుల ఇళ్లకు వెళతామా?! వెళ్లము కదా. ఇదీ అంతే అనుకోవాలి. ఆచారశుభ్రత ఎంత ముఖ్యమో, ఆచారాలను పాటించడానికి వ్యక్తిగత శుభ్రతా అంతే అవసరం. నాకు ప్రార్థించే హక్కు ఉండొచ్చు. కానీ అపవిత్రం చేసే హక్కు లేదు’’ అని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి అన్నారు. వ్యక్తిగత హోదాలో, ఒక పౌరురాలిగా ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కూడా ఇప్పుడు దుమారం రేగుతోంది. -
నడిపించిన మాట
స్వామీ వివేకానంద ఒకరోజు హిమాలయాల్లో సుదీర్ఘమైన కాలిబాట గుండా ప్రయాణిస్తున్నారు. అప్పుడు బాగా అలసిపోయి, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని స్థితిలో ఉన్న ఒక వృద్ధుణ్ణి ఆయన చూశారు. స్వామీజీని చూస్తూ ఆ వృద్ధుడు నైరాశ్యంతో ఇలా అన్నాడు: ‘‘ఓ మహాశయా! ఇప్పటిదాకా ఎంతోదూరం నడిచి నడిచి అలసి సొలసి ఉన్నాను. ఇక ఎంతమాత్రమూ నేను నడవలేను. నడిచానంటే నా ఛాతీ బద్దలయిపోతుంది’’ అన్నాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఏమి చేసేవాళ్లం? మహా అయితే ఆ వృద్ధుణ్ణి ఎత్తుకుని భుజాన వేసుకుని అతి కష్టం మీద కొంతదూరం నడిచేవాళ్లం . లేదంటే పెద్దాయన కదా, కాళ్లు పట్టుకున్నా పుణ్యమేలే అని కాసేపు కాళ్లు నొక్కి, సేదతీర్చి అప్పుడు ఆయనని నడిపించేవాళ్లమేమో! అయితే, స్వామి వివేకానంద అలా చేయలేదు. ఆ వృద్ధుడి మాటలను ఓపిగ్గా విని ఇలా అన్నారు:‘‘మీ కాళ్ల దిగువన చూడండి. మీ కాళ్ల కింద ఉన్న బాట, మీరు ఇప్పటి దాకా నడచి వచ్చిన బాట, మీ ముందు కనిపిస్తున్నది కూడా అదే బాట! అది కూడా త్వరలోనే మీ కాళ్లకింద పడిపోవడం ఖాయం’’ అన్నారు. అంతే, ఈ స్ఫూర్తిదాయక వచనాలు ఆ వృద్ధునికి కొండంత బలాన్నివ్వడంతో ఆయన తన కాలినడకను కొనసాగించాడు. – డి.వి.ఆర్. -
నందాదేవి.. ఓ మిస్టరీ.. పొంచి ఉన్న అణు ముప్పు!!
ఐదు దశాబ్దాల క్రితం జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్ ఇప్పుడు మన వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చైనాపై నిఘా పెట్టడానికి హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణులకు తరలించిన అణు పరికరం.. భవిష్యత్తులో ఏం ప్రకంపనలు రేపుతుందోనని గుబులు రేపుతోంది. మంచులో కూరుకుపోయిన దాని జాడ పసిగట్టేందుకు కేంద్రం సన్నాహాలు మొదలు పెట్టింది. మరోవైపు ఆ సీక్రెట్ ఆపరేషన్ వెండితెరపై ఆవిష్కృతం కానుంది. అసలు అప్పుడేం జరిగింది ? మనకు పొంచి ఉన్న ముప్పేంటి ? 53 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే... అది 1964 సంవత్సరం. చైనా తొలిసారిగా అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచ దేశాలకు ముఖ్యంగా పెద్దన్న అమెరికాకు దడ పుట్టించింది. దీంతో చైనా అణుపాటవం తెలుసుకోవడానికి హిమాలయాల్లో సెన్సార్లు ఏర్పాటు చేయాలని అమెరికా భావించింది. దీనికి భారత్ సహకారం కోరింది. అనాలోచితంగా భారత్ దీనికి అంగీకరించింది. అమెరికాకు చెందిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), భారత్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సంయుక్తంగా చైనా అణుకార్యకలాపాలపై హిమాలయాల్లోని నందాదేవి పర్వత శ్రేణుల నుంచి నిఘా పెట్టడానికి రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలకు చెందిన సిబ్బంది అణు ఇంధనంతో నడిచే జనరేటర్, ప్లుటోనియం క్యాప్సూల్స్, ఏంటెనాలు ఏర్పాటు చేయడానికి 1965 జూన్ 23న అలాస్కాలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ తర్వాత అక్టోబర్లో నందాదేవి శ్రేణులకు వెళ్లారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జనరేటర్, క్యాప్సూల్స్ను అక్కడే విడిచి వచ్చేశారు. వాతావరణం చక్కబడ్డాక తిరిగి వెళ్లి చూస్తే అవి అక్కడ కనిపించలేదు. ఎక్కడో మంచులో కూరుకుపోయా యి. వాటిని అలాగే వదిలేస్తే ప్రమాదం ఉంటుందని భావించిన ఈ బృందం తిరిగి 1966, 67లలో కూడా హిమాలయాలకు వెళ్లి వాటి కోసం విస్తృతంగా గాలించాయి. కానీ లాభం లేకుండా పోయింది. అవెక్కడున్నాయో కనిపెట్టలేకపోయారు. అది రహస్య ఆపరేషన్ కావడంతో చేసేదేమీలేక మౌనంగా ఉండిపోయారు. అయితే అప్పట్లో భారత్ బృందానికి నేతృత్వం వహించిన కెప్టెన్ మన్మోహన్సింగ్ కోహ్లి మాత్రం భవిష్యత్తులో ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడాయనకు 88 ఏళ్లు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున పరికరాల జాడ కనిపెట్టాలంటున్నారు. క్యాప్సూల్స్తో ప్రమాదం ఎలా ? ప్లుటోనియం క్యాప్సూల్స్ జీవితకాలం వందేళ్లు. ఆ తర్వాత అవి కరిగిపోతాయి. ఇప్పటికే 53 ఏళ్లు గడిచిపోగా మరో 47 ఏళ్లే మిగిలి ఉంది. గంగానదికి అణు ముప్పు ప్లుటోనియం క్యాప్సూల్స్ ఒకవేళ కరిగిపోయి రిషి గంగలో కలిస్తే పవిత్ర జలాలన్నీ కలుషితమైపోతాయి. ఆ నీటిని వినియోగిస్తే ఎందరో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉత్తరాఖండ్ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు ఉన్న ప్రజలు రేడియేషన్ బారినపడే అవకాశం ఉంది. ఇప్పుడేం చేస్తారు? ఉత్తరాఖండ్ పర్యాటక మంత్రి సత్పల్ మహరాజ్ ఇటీవల ప్రధాని మోదీని కలిసి గంగానదికి ఉన్న అణుముప్పు గురించి వివరించారు. ప్లుటోనియం క్యాప్సూల్స్ను వెలికితీయకపోతే 40ఏళ్ల తర్వాత పెను ప్రమాదం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్లు, సెన్సార్ల ద్వారా 10–15 అడుగుల లోతైన మంచు పొరలను తొలిచి ఆ పరికరాల జాడ కనుగొనాలని కోరారు. ఇందుకు కేంద్రం ఓకే చెప్పింది. తెరకెక్కనున్న హాలీవుడ్ సినిమా... స్మోక్ సిగ్నల్స్, హోమ్ ఎలోన్ వంటి చిత్రాలను నిర్మించిన హాలీవుడ్ నిర్మాత స్కాట్ రోజెన్ఫెల్ట్ని ఈ సీక్రెట్ మిషన్ విపరీతంగా ఆకర్షించింది. కెప్టెన్ కోహ్లి ఈ ఆపరేషన్పై స్పైస్ ఇన్ హిమాలయాస్ పేరుతో చాలా ఏళ్ల కిందటే ఒక పుస్తకాన్ని రచించారు. ఆ పుస్తకం హక్కుల్ని రోజెన్ఫెల్ట్ పదేళ్ల క్రితమే కొనుగోలు చేశారు. కానీ బడ్జెట్ సరిపోక ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఇప్పుడు మలబెర్రి ఫిలిమ్స్, రోజెన్ఫెల్ట్ సంయుక్తంగా 2 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సీక్రెట్ ఆపరేషన్లో పాల్గొన్న పలువురిని రోజెన్ఫెల్ట్ కలసి వారు చెప్పిన అనుభవాలతో ఆపరేషన్ నందాదేవిని తెరకెక్కిం చనున్నారు. భారత్ సిబ్బంది పాత్రల్లో భారతీయులనే తీసుకోనున్నారు. కెప్టెన్ కోహ్లి పాత్రకు రణబీర్ను సంప్రదించినట్టు సమాచారం. -
ఎవరెస్ట్.. అత్యంత ఎత్తయిన చెత్త కుప్ప
-
ఎవరెస్ట్.. ఎ ‘వరెస్ట్’...
ఏటికేడూ హిమాలయాల్లోని మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించే వారి సంఖ్య పెరిగిపోతోంది. అదే స్థాయిలో వారు వదిలేస్తున్న వ్యర్థాల పరిమాణమూ పెరిగింది. వెరసి 8,848 మీటర్ల ఎవరెస్ట్ శిఖరం.. నేడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చెత్త కుప్పగా మారిపోయింది. చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ఎవరెస్ట్పై పరిస్థితిని వివరిస్తూ విడుదల చేసిన ఓ నివేదిక విస్మయానికి గురిచేస్తోంది. నిజానికి ఎవరెస్ట్పై చెత్త పేరుపోతుండటం ఇప్పటిదేం కాదు. ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఒకానోక దశలో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ పై పోగయ్యే వర్థాలను తగ్గించేందుకు ఐదేళ్ల కిందట నేపాల్ ప్రభుత్వం సరికొత్త నిబంధన విధించింది. పర్వతారోహకుల బృందం పైకి ఎక్కేప్పుడు కొంత సొమ్మును డిపాజిట్ చేయాలి. ఒక్కో సభ్యుడు తిరిగి వచ్చేటప్పుడు ఎనిమిది కిలోల చొప్పున వ్యర్థాలను తెవాలి. అప్పుడు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. టిబెట్ వైపు నుంచి ఎక్కేవారు కచ్చితంగా ఎనిమిది కిలోల వ్యర్థాలను తేవాలి. గత ఏడాది నేపాల్ నుంచి వెళ్లిన పర్వతారోహకులు 25 టన్నుల చెత్తను - 15 టన్నుల మానవ విసర్జితాలను తెచ్చారని సాగర్ మాత పొల్యూషన్ కంట్రోల్ కమిటీ తెలిపింది. కానీ ఏటా ఎవరెస్ట్ పై పేరుకుపోతున్న వ్యర్థాలతో పోలిస్తే ఇది చాలా తక్కువన్నది తేలింది. అవినీతి దందా... ‘ఒక్కో బృందం ఎవరెస్ట్ పర్యటనకు రూ.14 లక్షల నుంచి రూ.68 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. అంత మొత్తం చెల్లించినప్పుడు తిరిగి చెత్తను వెంటపెట్టుకుని రావటం ఏంటన్న భావనతో చాలా మంది అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి తమ డిపాజిట్ సొమ్మును వెనక్కి తీసుకుంటున్నారు. ఇలా రెండు దశాబ్దాలుగా ఎవరెస్ట్ అధిరోహకుల సంఖ్య పెరిగి వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పడేస్తుండటంతో టన్నుల మేర చెత్త పేరుకుపోయింది’ అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు నేపాలీ షెర్పా పెంబా డోర్జే ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో 30 మంది సభ్యుల బృందం 8.5 టన్నుల చెత్తను అతికష్టం మీద తీసుకొచ్చినట్లు ఆయన చెబుతున్నారు. అవగాహన సదస్సులు ఎన్ని నిర్వహిస్తున్నా.. అవినీతి దందాతో లాభం లేకుండా పోతోందని పెంబా డోర్జే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ పరిణామాలపై పర్యావరణ వేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘ఎవరెస్ట్ పై పెద్ద ఎత్తున పెరిగిపోతున్న చెత్త సుందర హిహాలయాలను కలుషితం చేస్తోంది. ఎవరెస్ట్ పై పేరుకున్న వ్యర్థాలు మంచులో కలుస్తున్నాయి. మంచు కరిగినప్పుడు కలుషిత నీరు ఉత్పత్తి అవుతోంది. అది మహా ప్రమాదం’ అని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. -
భారత్–నేపాల్–చైనాల మధ్య ఆర్థిక కారిడార్
బీజింగ్: హిమాలయ దేశమైన నేపాల్పై మరింత పట్టు బిగించేందుకు చైనా చురుగ్గా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా చైనా–నేపాల్–భారత్ల మధ్య కొత్త ఆర్థిక కారిడార్ నిర్మాణాన్ని డ్రాగన్ దేశం ప్రతిపాదించింది. నేపాల్ విదేశాంగ మంత్రి ప్రదీప్ కుమార్ గ్యావలి చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ దేశం ఈ మేరకు స్పందించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో చర్చల అనంతరం కుమార్ బుధవారం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘నేపాల్–చైనాలు బహుళార్థక ప్రయోజనాలున్న హిమాలయ అనుసంధాన వ్యవస్థ ఏర్పాటుకు అంగీకరించాయి’ అని చెప్పారు. అనంతరం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ స్పందిస్తూ.. నేపాల్ ఇప్పటికే వన్బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో భాగస్వామిగా చేరిందన్నారు. ఇందులో భాగంగా నేపాల్లో రైలు, రోడ్డు మార్గాలు, విమానాశ్రయాలు, విద్యుత్, సమాచారం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేస్తామన్నారు. దీనివల్ల చైనా–నేపాల్–భారత్లను అనుసంధానిస్తూ ఆర్థిక కారిడార్ను నిర్మించేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. నేపాల్ అభివృద్ధికి భారత్, చైనాలు సాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ధర్మశాలలో ఉన్న బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామాను కలుసుకునేందుకు టిబెట్ శరణార్థులు తమ దేశం గుండా వెళ్లకుండా చర్యలు తీసుకునేందుకు నేపాల్ ఒప్పుకుందన్నారు. -
నా వెనకాల ఉన్నది వాళ్లే!
ముగిసింది. రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్ర ముగిసింది. హిమాలయాలను సందర్శించి కూల్గా చెన్నై తిరిగొచ్చారు. అసలే ప్రశాంతంగా కనిపించే రజనీ మరింత ప్రశాంతంగా కనిపించారు. చుట్టుముట్టిన అభిమానులను చూసి, చిరునవ్వు నవ్వి మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపరంగా మీ వెనకాల ఉన్నది బీజేపీయా? అని మీడియా అడిగితే– ‘‘నా వెనకాల ఉన్నది దేవుడు, ప్రజలు’’ అన్నారు. ప్రచారంలో ఉన్నట్లుగా తన పొలిటికల్ పార్టీ పేరుని, చిహ్నాన్ని ఏప్రిల్ 14న ప్రకటించడంలేదని కూడా స్పష్టం చేశారాయన. కాగా, రజనీ నటించిన ‘కాలా’ ఏప్రిల్ 27న విడుదల కానుంది. శంకర్ డైరెక్షన్లో చేసిన ‘2.0’ విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు. ఈ రెండు చిత్రాలే కాకుండా ఈ ఏడాది రజనీ మరో చిత్రంలోనూ కనిపించే అవకాశం ఉంది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఆయన నటించనున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. -
దేవుడు శాసించాడు
ఇప్పుడు కొత్త ప్రిజ్లు వస్తున్నాయి. లోపల ఉంచినవి.. ఎన్నిరోజులైనా ఫ్రెష్గానే ఉంటాయట. అలాంటి ఒక ఫ్రిజ్.. హిమాలయాలు! అక్కడి నుంచి ఫ్రెష్గా రాబోతున్నాడు తలైవర్... ర.. జ.. నీ.. కాం.. త్!! దేశమంతా వెయిటింగ్. తమిళనాడంతా స్వెట్టింగ్! టెన్షన్ పీక్లో ఉంది. హిమాలయాలంత.. పీక్లో! రజనీకాంత్ లైఫ్లో కష్టాలు పడి పైకొచ్చారు. సూపర్ స్టార్ అయ్యారు. ప్రతి కష్టంలోనూ ఆయనకు దేవుడో, దేవుడిలాంటి మనిషో తోడుగా ఉన్నారు. అవమానాలు ఎదురైనప్పుడు దేవుడు, ఆర్థికంగా నష్టపోయినప్పుడు దేవుడు. ఆరోగ్యం బాగోలేనప్పుడు దేవుడు. రాఘవేంద్రస్వామి అంటే ఆయనకు భక్తి. హిమాలయ ప్రాంతపు గురూజీలంటే గురి. అందుకే ఏటా హిమాలయాలకు వెళ్లి వస్తుంటారు. ఇప్పుడు అక్కడే గురు యోగిరాజ్ అమర్ జ్యోతీజీ మహారాజ్ సన్నిధిలో గడుపుతున్నారు. ఎన్నికల వేడి ఉన్నా, లేకున్నా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ మరుగుతూనే ఉంటాయి. ఆ రాజకీయాలు సూపర్స్టార్ రజనీకాంత్ని కూడా.. ఆయన ప్రమేయం లేకుండానే ఎప్పుడూ మరిగించే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే మరిగిస్తే మరిగిపోయే మనిషి కాదు రజనీ! చుట్టూ ఎంత వేడైనా ఉండనివ్వండి, ఆయనెప్పుడూ కూల్ గానే ఉంటారు. ఇప్పుడు మరింత కూల్గా ఉండే హిమాలయాలలోకి రజనీ వెళ్లిపోయారు! కూల్! ‘శివాజీ’ సినిమాలో రజనీ పంచ్ డైలాగ్. కూలింగ్ గ్లాసెస్ని స్టెయిల్గా రెండు చేతుల్తో తీసి కళ్లకు పెట్టుకుంటూ అంటాడు.. ‘కూల్’ అని, అద్దాల్లోంచి చూస్తూ. ఎవర్ని చూసి అంటాడు కూల్ అని! తనని చూసి ఎవరైతే టెన్షన్ పడుతున్నారో వాళ్లను చూసి! ‘శివాజీ’ పదేళ్ల క్రితమే వచ్చింది. రజనీ మాత్రం ఇరవై ఏళ్లుగా ప్రత్యర్థుల వైపు చూసి ‘కూల్’ అని అంటూనే ఉన్నారు. సినిమాల్లో ఆయనకెవరూ పోటీ కంటెస్టెంట్లు లేరు. ఉన్నది రాజకీయాల్లోనే. పాలిటిక్స్లో కూడా లీడర్లు రజనీని పోటీ అనుకున్నారు కానీ లీడర్లను రజనీ ఎప్పుడూ పోటీ అనుకోలేదు. వచ్చేస్తాడా! కొంప ముంచేస్తాడా! డీఎంకే, అన్నాడీఎంకేల డౌట్. అపోజిషన్తో చేతులు కలిపితే? అదీ ఆ పార్టీల డౌట్. అప్పుడు నవ్వేవాడు రజనీ. సేమ్ సినిమాలో నవ్వినట్టే.. ‘హహాహాహహా’ అని! నవ్వి, ‘కూల్’ అనే డైలాగ్ కొట్టేవాడు. అయినా రాజకీయాలు కూల్గా ఎందుకుంటాయి? ఉంటే అవి హిమాలయాలు అయి ఉండేవి. అప్పుడు రజనీ తమిళ హిమాలయాల్లోనే ఉండిపోయేవారు. అంత దూరం వెళ్లకుండా. చెన్నై నుంచి హిమాలయాలకు రెండువేల కిలోమీటర్ల దూరం. ఫ్లయిట్లో ఆరు గంటల ప్రయాణం. రజనీ అక్కడికి వెళ్లి వారం అయింది. ఇంకోవారం అక్కడే ఉంటారు. అక్కడి మహావతార్ బాబాజీ గుహల్లో! ఆ గుహలు పలంపూర్లో ఉన్నాయి. పలంపూర్ హిమాచల్ప్రదేశ్లో ఉంది. ఏం చేస్తున్నారు రజనీ ఆ గుహల్లో?! ధ్యానంలోకి వెళ్లి దారులను శోధిస్తున్నారు. ఎక్కడికి వెళ్లే దారులవి? రాజకీయాల్లోకి! రాజకీయాల్లోకా!! తమిళనాడులో ఉన్నవేమిటి? రాజకీయాలు కాదా?! తమిళనాడులో మూడురోజుల క్రితం కూడా ఒక కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఆ పార్టీని పెట్టింది దినకరన్. దినకరన్ అనే పేరు పక్కన ఆవిర్భావం అనే మాట పెద్దది. ‘పుట్టుకొచ్చింది’ అనాలి. కానీ చాలా శ్రద్ధగా, భక్తిగా మదురైలో తన పార్టీ పేరును ప్రకటించాడు దినకరన్. ఆ భక్తి ‘అమ్మ’ జయలలిత మీద. ఆ శ్రద్ధ.. రాజకీయాల మీద. ఎంతో భక్తిశ్రద్ధలతో పార్టీకి ఆయన పెట్టుకున్న పేరు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’. అన్నాడీయెంకే నుంచి అలా గెంటేయగానే, ఇలా బయటికొచ్చి పార్టీ పెట్టేశాడు. అమ్మ క్యాండిడేట్గా, అమ్మలేని నియోజకవర్గం నుండి ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్గా గెలిచాడు! తమిళనాడు ముఖ్యమంత్రికి గానీ, ఉపముఖ్యమంత్రికి గానీ రాజకీయాల్లోకి వచ్చేసిన కమలహాసన్ అంటే భయం లేదు. రాజకీయ పార్టీ పెట్టబోతున్న రజనీ అన్నా భయం లేదు. దినకరన్ అంటే ఉంది. తమిళనాడులో ఎప్పటికైనా సీఎం కాగలిగిన శక్తి.. శశికళకూ ఉంది, దినకరన్కూ ఉంది. వాళ్లిద్దరి వెనుకా ‘అమ్మ’ శక్తి ఉంది. దినకరన్ పార్టీ ప్రకటించిన మర్నాడే రజనీ అల్లుడు ధనుష్, రజనీ ఇద్దరు కూతుళ్లు ఐశ్వర్య, సౌందర్య.. రజనీ పెట్టబోయే పార్టీలో చేరతారని వార్త వచ్చింది. అయితే ఆ విషయానికి ఎవరూ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజకీయాల్లోకి రాకుండానే రజనీ ఇరవై ఏళ్ల పాటు రాజకీయాల్లో నలిగారు! వస్తారా? లేదా? అనే ప్రశ్నతో. ‘వస్తున్నాను’ అని ఇరవై ఏళ్ల తర్వాత, డిసెంబర్ 31న రజనీ ప్రకటించారు. మళ్లీ ఇప్పుడు ఇంకొక ప్రశ్నతో ఆయన నలిగిపోతున్నారు. పార్టీ పెడతారా? లేదా? అని! హిమాలయాల నుంచి వచ్చీ రాగానే రజనీ, ఇంట్లోకి కూడా వెళ్లకుండా పార్టీ పేరు ప్రకటిస్తారని అంతా ఎదురుచూస్తున్నారు! అయితే ఆయన మాత్రం ఆ మాట చెప్పలేదు! అసలు ఏమాటా చెప్పలేదు. ‘తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తాం’ అని మాత్రం అన్నారు ఈ హిమాలయన్ ట్రిప్లో. 2021లో ఎలక్షన్స్. ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే ఇంకా పేరే ఖరారు కాని పార్టీకి అది పెద్ద సమయమేం కాదు. దినకరన్ తన పార్టీ ప్రారంభించిన మదురైలోనే ఫిబ్రవరి నెలలో కమలహాసన్ తన ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీని స్థాపించారు. రజనీతో పోల్చి చూస్తే, కమల్ చాలా త్వరగా రాజకీయాల్లోకి వచ్చినట్లు! చాలా త్వరగా పార్టీ పెట్టినట్లు. ‘రాష్ట్రంలో పేదరికం లేకుండా చెయ్యడమే నా ధ్యేయం’ అంటున్నాడు కమల్. ఓ పేదవాడొచ్చి ఈ వ్యవస్థను కుప్పకూలుస్తా అని చాలెంజ్ చెయ్యడం అది! కమల్ దగ్గర క్యాష్ లేదు. తలా ఇంత వేసుకుని పార్టీ కార్యాలయాన్ని నడిపించుకునే పరిస్థితి. అయినా వచ్చాడు. ‘వస్తారా?’ అని రజనీని అడిగాడు. రజనీ నవ్వారు. ‘వస్తాను’ అన్నారు కానీ ‘నీతో వస్తాను’ అనలేదు. అంటే.. రజనీ పార్టీ రాబోతోంది! రజనీ ఏదీ నేరుగా చెప్పరు. నవ్వుతూ చెప్తారు. నర్మగర్భంగా చెప్తారు. అలా కూడా చెప్పలేనప్పుడు ‘ఆ దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు’ అన్నట్లు చూపుడు వేలికీ, చిటికెన వేలికీ ఉన్న మధ్యవేళ్లు మడిచి సంకేతమిస్తారు! అయితే సంకేతాలను అర్థం చేసుకుని స్పందించే రాజకీయ పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో లేవు. ‘‘అవినీతి ఉంది. దాన్ని అంతమొందించడానికే వచ్చాను’’ అని క్లియర్ కట్గా అంటున్నాడు కమల్. ఎలాగైనాసరే ఈసారి అన్నాడీఎంకే పవర్ను కట్ చెయ్యాలని కరుణానిధి అండ్ సన్స్ క్యాడర్కు ఆల్రెడీ స్కెచ్ గీసి ఇచ్చారు. ఇక సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం అయితే, బీజేపీ జాతీయభక్తికి దీటుగా ‘రాష్ట్రభక్తి’ని ప్రదర్శిస్తున్నారు. గురువారం బడ్జెట్ ప్రసంగంలో పన్నీర్సెల్వం బీజేపీని నేరుగానే ఎటాక్ చేశారు. తమిళనాడులో ద్రవిడుల శకం అంతరించింది అని బీజేపీ నాయకులు అన్నమాటకు అది గట్టి జవాబు. ఎందుకు గట్టి జవాబు అయిందంటే.. ఎంజీ రామచంద్రన్, జయలలితలతో పాటు, తమ రాజకీయ ప్రత్యర్థి డీయంకేను కూడా కలుపుకుని.. ‘ద్రవిడుల పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని అన్నారు సెల్వం. నాయకులనేవాళ్లు ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. దినకరన్లా స్ట్రెంగ్త్ లేకున్నా స్ట్రాంగ్గానే మాట్లాడాలి. అయితే రజనీ స్ట్రెంగ్త్ ఏపాటిదో ఇప్పటికీ బయటపడలేదు. అంతకన్నా ప్రమాదకరమైన సంగతి.. తమిళనాడు ప్రజలు గానీ, దేశంలోని రజనీ అభిమానులు గానీ ఆయన పెట్టపోయే పార్టీ కంటే కూడా.. ఏప్రిల్లో, ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోయే ఆయన సినిమాలు.. ‘కాలా’, ‘2 పాయింట్ ఓ’ కోసమే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూడడం! హిమాలయ ధ్యానంలో రజనీ కోరుకుంటున్న సాక్షాత్కారం ‘ఆధ్యాత్మిక రాజకీయం’. ఈమాట వింతగా ఉంటుంది. కానీ ఆయనే చెబుతున్నారు. ‘స్పిరుచువల్ పాలిటిక్స్’ని సాధనచెయ్యడానికి వచ్చానని! గత శనివారం ధర్మశాల (హిమాచల్ప్రదేశ్) ఎయిర్పోర్ట్లో దిగడంతో రజనీ హిమాలయ యాత్ర ఆరంభమయింది. ఈ వారం రోజుల యాత్రలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడినవి రెండే మాటలు. స్పిరుచువల్ పాలిటిక్స్, స్పిరుచువల్ గవర్నెన్స్. ఆ రెండు మాటలకూ కలిపి ఆయన ఒకే అర్థం చెప్పారు. శుభ్రమైన, ధర్మబద్ధమైన, వివక్షారహితమైన పాలన అని. మరికొంచెం వివరంగా చెప్పమని అడిగినప్పుడు.. ఆయన ఒకటే మాట చెప్పారు. ఎం.జి.రామచంద్రన్లా తమిళులను పరిపాలిస్తాను అని చెప్పారు. కష్టాల్లో ఉన్నవాళ్లను దగ్గరకు తీసుకోవడం, నష్టాల్లో ఉన్నవాళ్లను పైకి లేపడం; పేదలకు, అనాధలను ఆదరించే సంస్థలకు ఆర్థిక సహాయం చెయ్యడం; విలయాలు, విపత్తు బాధితులకు అవసరమైన విరాళాల కోసం ‘సూపర్స్టార్’ ఇమేజ్ను ఉదారంగా వినియోగించడం.. ఇవన్నీ కూడా రాజకీయాలలో భాగమే అయితే.. రజనీ రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నట్లే.అయితే ఆయన ఇంకా చెయ్యొచ్చు! ‘బాషా’లా వేలెత్తి రాష్ట్రాన్ని శాసించవచ్చు. ‘బాబా’లా వేళ్లు మడిచి రాష్ట్రప్రజల్ని మెస్మరైజ్ చెయ్యొచ్చు. అలా చెయ్యాలంటే మాత్రం పార్టీ పెట్టాల్సిందే. ఎన్నికల్లో నిలబడాల్సిందే. హిమాలయ గుహల్లో రజనీ ధ్యాన యాత్ర ఇంకో వారం పాటు సాగుతుంది. ‘ధ్యానం’ సంతృప్తికరంగా పూర్తయితే ముందనుకున్న ప్రకారమే ఈ నెల 24న చెన్నై తిరిగి వచ్చిన వెంటనే పార్టీ పేరును ప్రకటిస్తారు రజనీ. (గురువు అమర్ జ్యోతీజీ మహారాజ్తో హిమాలయ గుహల్లో రజనీ) -
హిమాలయాల్లో పర్యటిస్తున్న రజనీకాంత్
-
హిమాలయాల్లో ఆశ్రమం నిర్మిస్తున్న రజనీ
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి తెలిసి వారికి ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక చింతన గురించి కూడా తెలిసే ఉంటుంది. సినిమాలో మాస్ ఆడియన్స్ ఉర్రూతలూగించే సూపర్ స్టార్, ఎక్కువగా హిమాలయాల్లో సాధువులతో కలిసి ఆధ్యాత్మిక గురించి చర్చిస్తుంటారు. తాజాగా రజనీ, కొంత మంది స్నేహితులతో కలిసి హిమాలయాల్లో ఓ ఆశ్రమాన్ని నిర్మించారు. ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద శిష్యుడైన రజనీ, గురువు స్థాపించిన యెగోదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా శత సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురుశరణ్ పేరుతో ఆశ్రమాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ ఆశ్రమాన్ని నవంబర్ 10న ప్రారంభించనున్నారు. ప్రస్తుతం 2.0, కాలా చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నరజనీ.. వచ్చే సంవత్సరం ఈ ఆశ్రమాన్ని సందర్శించనున్నారు. ఈ ఆశ్రమాన్ని రజనీ ఎంతో బలంగా విశ్వసించే బాబాజీ గుహకు దగ్గరల్లోనే నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. -
ఎవరెస్ట్ ఎత్తు ఎంతో తెలుసా?
కఠ్మాండు: భూతాపోన్నతి కారణంగా మంచు కరిగి హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చిందా? నేపాల్లో 2015లో వచ్చిన పెను భూకంపం వల్ల కొండలు కుంచించుకుపోయాయా? భూమి పొరలు కదలడం వల్ల ఎత్తు మరింత పెరిగిందా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకనుంది. ప్రపంచంలోనే ఎల్తైన హిమాలయాలను కొలిపించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిసారి హిమాలయాలను 1856లో కొలిచారు. బ్రిటీష్ సర్వేయర్ సర్ జార్జ్ ఎవరెస్ట్ బందం దీన్ని కొలచి సముద్ర మట్టానికి 8,840 మీటర్ల ఎత్తున ఉందని తేల్చింది. ఆయన పేరుతోనే హిమాలయాల్లో ఎవరెస్ట్ శిఖరం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత 1955లో రెండోసారి కొలచి హిమాలయాల ఎత్తును 8,848 మీటర్లుగా తేల్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే ఎత్తును ప్రమాణంగా తీసుకుంటున్నారు. కాలక్రమంలో హిమాలయాల ఎత్తులో మార్పు వచ్చినట్లు మూడు శాస్త్రీయ పరిశోధనలు తెలియజేస్తున్నాయని, అందుకని ఎత్తును కొలవాల్సిన బాధ్యత నెపాల్కుందని నేపాల్ సర్వే విభాగం డైరెక్టర్ గణేష్ ప్రసాద్ భట్టా తెలిపారు. ఈ సర్వేకు దాదాపు 15 లక్షల డాలర్లు ఖర్చవతాయన్నది ఓ అంచనా. నేపాల్లోని ఉదయపూర్ జిల్లాలో సముద్ర మట్టానికి దాదాపు 1500 మీటర్ల ఎత్తులో కొంతమంది సర్వేయర్లు ఎవరెస్ట్ను కొలవడం మొదలు పెట్టారని నేపాల్ అధికారులు తెలిపారు. ప్రతి రెండు కిలీమీటర్లకు ఒక స్టేషన్ను ఏర్పాటు చేస్తామని, ఒక్క మిల్లీమీటరు కూడా వదలకుండా కొలుస్తామని వారు చెప్పారు. జూలై మధ్యలో అధికారికంగా కొలిచే కార్యక్రమం మొదలవుతుందని, ఆగస్టు నాటికి ఊపందుకుంటుందని, దాదాపు 50 మంది సర్వేయర్లు పాల్గొంటారని వారు వివరించారు. జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అమెరికా జాతీయ జియోగ్రఫిక్ సొసైటీ 1999లో ఎవరెస్ట్ ఎత్తును కొలచి 8,850 మీటర్లని తేల్చింది. అయితే సంప్రదాయక పద్ధతుల్లో ఎత్తును కొలవలేదన్న కారణంగా దాన్ని గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం తిరస్కరించింది. 2005లో చైనా బందం సర్వే జరిపి 8,844 మీటర్లని తేల్చింది. దాన్ని కూడా గుర్తించేందుకు నేపాల్ తిరస్కరించింది. ఎవరెస్ట్ శిఖరం అధికారికంగా నేపాల్ భూభాగంలో ఉన్న విషయం తెల్సిందే. -
మైనింగ్పై పూర్తి నిషేధం
ఉత్తరాఖండ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నాలుగు నెలల పాటు మైనింగ్ను పూర్తిగా నిషేధించింది. రాష్ట్రంలో జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలపౌ ఉన్నత స్థాయి కమిటీ ఒకదాన్ని ఏర్పాటుచేయాలని, దానిద్వారా అన్ని విషయాలూ తెలుసుకని, నాలుగు నెలల తర్వాత అయినా మైనింగ్ను పునరుద్ధరించాలో వద్దో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం దృష్ట్యా 50 ఏళ్లకు సరిపోయేలా ఒక బ్లూప్రింట్ను కూడా ఈ కమిటీ తయారుచేయాల్సి ఉంటుంది. ఇష్టారాజ్యంగా సాగుతున్న మైనింగ్ వల్ల హిమాలయాల్లోని శివాలిక్ ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న అడవులు, నదులు, జలపాతాలు, సరస్సులు అన్నీ దెబ్బతింటున్నాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ విషయాలు చెప్పింది. సమగ్ర నివేదిక వచ్చేవరకు మైనింగ్ కార్యకలాపాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ మాఫియా చేతుల్లో ఒక అటవీ శాఖాధికారి హత్యకు గురి కావడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా మైనింగ్ వ్యవహారాలపై కలకలం రేగింది. అనంతరం దీనిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన న్యాయమూర్తులు జస్టిస్ రాజీవ్ శర్మ, జస్టిస్ సుధాంశు ధులియా ఈ ఆదేశాలు ఇచ్చారు. మైనింగ్ వల్ల శివాలిక్ ప్రాంతం బాగా దెబ్బతింటోందని, ఇక రాష్ట్రంలో అసలు అక్రమ మైనింగ్ అన్నది లేకుండా రాష్ట్రప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఉన్నతస్థాయి కమిటీ హైకోర్టుకు తమ నివేదిక ఇచ్చేవరకు రాష్ట్రంలో మైనింగ్ జరగడానికి గానీ, లైసెన్సులు ఇవ్వడానికి గానీ, పునరుద్ధరించడానికి గానీ వీల్లేదని స్పష్టం చేసింది. -
పవర్ అంటే నాకిష్టం
తమిళసినిమా (చెన్నై): పవర్ అంటే తనకు చాలా ఇష్టమని కాని అది ఆధ్యాత్మికతతో కూడిన పవర్ అని సూపర్స్టార్ రజనీకాంత్ అన్నారు. శనివారం చెన్నైలో మాట్లాడుతూ ఓ కథ చెప్పారు. ‘ఒక రాజ్యంలో మంత్రి రాజ్యాన్ని వదిలేస్తాడు. ఆధ్యాత్మిక చింతనతో హిమాలయాలు తిరిగి మూడేళ్లకు తిరిగొచ్చాడు. అప్పుడు రాజు మంత్రిని ఏం సాధించావు’ అని అడగ్గా మంత్రి ‘ ఓ రాజా గతంలోఓ మీరు కూర్చున్నారు. నేను నిలబడి మీకు సమాధానం చెప్పేవాడిని. ఇప్పుడు ఆధ్యాత్మిక గురువుగా వచ్చిన నన్ను కూర్చోబెట్టి మీరు నిలబడ్డారు. ఇదే నేను సాధించింది’ అని అన్నాడు. నేను ఇష్టపడేది కూడా అలాంటి ఆధ్యాత్మిక పవర్నేనని రజనీకాంత్ వివరించారు. -
పర్వతారోహణలో ‘రాణి’ంపు
పోలసానిపల్లి (భీమడోలు): పోలసానిపల్లి సాంఘిక సంక్షే మ గురుకుల బాలికల కళాశాల సీని యర్ ఎంపీసీ విద్యార్థిని బొడ్డు రాణి ఎవరెస్ట్ పర్వత శ్రేణిలోని 17 వేల అడుగుల ఎత్తయిన మౌంట్ రేనార్క్ను అధిరోహించి సత్తాచాటింది. శనివారం కళాశాలకు వచ్చిన రాణికి తోటి విద్యార్థులు, అధ్యాపకులు ఘనస్వాగతం పలికారు. రాష్ట్రంలోని 13 జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో 28 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సిద్ధం చేశారు. వీరిలో 15 మంది సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థులు, 13 మంది గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఉన్నారు. వీరంతా గతంలో రాష్ట్రస్థాయి గురుకుల పోటీ ల్లో విజేతలుగా నిలిచివారే కావడం విశేషం. జిల్లా నుంచి పోలసానిపల్లి గురుకుల పాఠశాల నుంచి లింగపాలెం మండలం ధర్మాజీగూడెంకు చెం దిన బొడ్డు రాణి ఎంపికైంది. వీరందరికీ ఎవరెస్ట్ అధిరోహించిన శేఖర్బాబు పర్యవేక్షణలో అక్టోబర్ నెలలో విజయవాడ సమీపంలోని కేతనకొండ ను అధిరోహించేందుకు ఆరు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈ బృందం నవంబర్ 12న డార్జింగ్కు బయలుదేరింది. వీరి ని అక్కడ ఉన్న డాస్కింగ్ మార్కే అనే ట్రైనింగ్ కేంద్రానికి తీసుకువెళ్లారు. 28 మందిని రెండు గ్రూపులకు ఆరేసి మం ది చొప్పున, మిగిలిన రెండు గ్రూపుల్లో 8 మందిగా విభజించారు. వీరంతా రేనార్క్ పర్వతాన్ని అధిరోహించగా బొడ్డు రాణి జట్టు ప్రథమ స్థానంలో నిలిచింది. మిగతా జట్ల కన్నా గంట ముందుగా గమ్యాన్ని చేరుకుంది. జి ల్లాలోని పెదవేగి గురుకులానికి చెందిన çసద్దిపాముల వేణు, వట్లూరు గురుకులానికి చెందిన బొబ్బిలి దీప్తి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరంతా వచ్చే మే నెలలో ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఎంవీవీ సూర్యారావు తెలిపారు. అనంతరం బొడ్డు రాణి, అధ్యాపకులు ఉంగుటూరు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కలిశారు. -
హిమాలయాల ప్రాంతీయ విభజన
భారతదేశంలో ప్రవహించే నదుల ఆధారంగా, ప్రాంతాల వారీగా హిమాలయాలను తూర్పు, పడమరలుగా 5 రకాలుగా విభజించొచ్చు. అవి.. 1. కశ్మీర్ హిమాలయాలు 2. పంజాబ్ హిమాలయాలు 3. కుమయూన్ హిమాలయాలు 4. నేపాల్ (లేదా) మధ్య హిమాలయాలు 5. అస్సాం హిమాలయాలు కశ్మీర్ హిమాలయాలు ఇవి సింధూ నదికి ఉత్తరాన సుమారుగా 3,50,000 చ.కి.మీ.విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. ఇవి ప్రధానంగా కశ్మీర్లో ఉన్నాయి. ఈ హిమాలయాల్లో పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్ ఉంది. ఇవి హిమానీనదాలకు ప్రసిద్ధి. వీటిలో అత్యంత ఎత్తయిన ప్రదేశం సియాచిన్ ఉంది. పంజాబ్ హిమాలయాలు ఇవి సింధూ-సట్లెజ్ నదుల మధ్య భాగంలో సుమారు 570 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. ఇందులోనే ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కశ్మీర్ లోయ ఉంది. ఇది పండ్ల తోటలకు ప్రసిద్ధి. కశ్మీర్ లోయ భూతల స్వర్గంగా ప్రసిద్ధి చెందింది. దేశంలో కుంకుమపువ్వుకు కశ్మీర్ ప్రసిద్ధి చెందింది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన పాస్కీనా ఉన్నికి కూడా కశ్మీర్ ప్రసిద్ధి చెందింది. దేశంలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని సరోవరీయ రాష్ర్టం అని కూడా పిలుస్తారు. హిమాలయాల్లో మొట్టమొదట నిర్మించిన జల విద్యుత్ కేంద్రం - మండి జలవిద్యుత్ కేంద్రం. ఇక్కడ అనేక వేసవి విడుదులున్నాయి. ముఖ్యంగా కులు, కాంగ్రాలు ప్రసిద్ధి చెందాయి. కుమయూన్ హిమాలయాలు ఇవి సట్లెజ్ నదికి, కాళీ నదికి మధ్యభాగంలో విస్తరించి ఉన్నాయి. ఇవి పూర్తిగా ఉత్తరాఖండ్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఇవి మతపరమైన క్షేత్రాలు, సరస్సులకు ప్రసిద్ధి చెందాయి. మతపరమైన పుణ్యక్షేత్రాలు: బద్రీనాథ్, కేదార్నాథ్. సరస్సులు - ధాల్, నైనిటాల్ సరస్సులు. హిమానీ నదాలు కూడా ఉన్నాయి. ఉదా॥యమునోత్రి, గంగోత్రి. నందాదేవి అనే శిఖరం కూడా ఈ శ్రేణుల్లోనే ఉంది. ఇక్కడ ఉన్న కనుమలు.. 1) మిధులా 2) దల్గా నేపాల్ (లేదా) మధ్య హిమాలయాలు ఈ పర్వత భాగం కాళీ-తీస్తా నదుల మధ్య సుమారు 800 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. తీస్తా నది బ్రహ్మపుత్ర నదికి ఉప నది. వీటిని కేంద్ర హిమాలయాలు అంటారు. వీటిని వివిధ ప్రదేశాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. నేపాల్ హిమాలయాలు, సిక్కిం హిమాలయాలు, డార్జిలింగ్ హిమాలయాలు, భూటాన్ హిమాలయాలు అని పిలుస్తారు. ఇవి భారతదేశంలో ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలోనూ, నేపాల్లోనూ విస్తరించాయి. సుమారు 1,16,000 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి. ఈ హిమాలయాలు ఎత్తై శిఖరాలకు ప్రసిద్ధి. ఇక్కడే ముఖ్యమైన మౌంట్ ఎవరెస్ట్, కాంచనగంగ, అన్నపూర్ణ, మకాలు, ధవళగిరి ఉన్నాయి. అస్సాం హిమాలయాలు ఈ హిమాలయాలు తీస్తా నదికి, బ్రహ్మపుత్ర (దిహాంగ్) నదికి మధ్య సుమారు 720 కి.మీ. పొడవున, 67,500 చ.కి.మీ. వైశాల్యం కలిగి ఉన్నాయి. ఈ హిమాలయాలు క్రమక్షయ మైదానాలకు ప్రసిద్ధి చెందాయి. ఈ హిమాలయాలు ఎక్కువగా తేయాకు పంటకు అనుకూలం. ఇక్కడే అసోంలోని తేయాకు పంటకు ప్రసిద్ధి చెందిన సూర్య లోయ ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజులీ ఈ హిమాలయాల్లోనే ఉంది. గారో, కాశీ, జయంతియా, మిర్ కొండలు ఈ హిమాలయాల్లోనే ఉన్నాయి. కనుమలు రెండు కొండల మధ్య లేదా పర్వతాల మధ్య సహజంగా ఏర్పడిన రహదారిని కనుమ అంటారు. బనీహాల్ కనుమ: ఇది జమ్మూ, శ్రీనగర్ను కలుపుతుంది. దీన్ని ‘గేట్ వే ఆఫ్ శ్రీనగర్’ అని అంటారు. భారతదేశంలో అతి పొడవైన ‘జవహర్ టన్నెల్’ ఈ కనుమ వద్ద ఉంది. జోజిలా కనుమ: ఇది లేహ్, శ్రీనగర్ ప్రాంతాలను కలుపుతుంది. ఇది జమ్మూకశ్మీర్ రాష్ర్టంలో ఉంది. ఖార్డుంగ్లా కనుమ: ఇది భారతదేశంలో ఎత్తై కనుమ. ఇది జమ్మూకశ్మీర్లోని లడఖ్లో ఉంది. కారకోరం కనుమ: ఇది భారతదేశం, చైనాల మధ్య ఉంది. బుర్జిలా కనుమ: ఇది జమ్మూకశ్మీర్లోని కశ్మీర్ లోయ నుంచి మధ్య ఆసియా వరకు ఉంది. పిర్పంజాల్ కనుమ: ఇది కశ్మీర్లో ఉంది. ఇది జమ్మూ, శ్రీనగర్ను కలుపుతుంది. జమ్మూ-శ్రీనగర్ రహదారి ఈ కనుమ ద్వారా పోతుంది. రోహతంగ్ కనుమ: ఇది హిమాచల్ప్రదేశ్లో ఉంది. కులూ- క్యెలాంగ్లను కలుపుతుంది. ఈ కనుమ గుండా రోహతంగ్ సొరంగాన్ని తవ్వారు. బారాలాప్చాలా కనుమ: ఇది హిమాచల్ప్రదేశ్లో ఉంది. ఈ కనుమ వద్ద చీనాబ్ నది జన్మించింది. ఇది లేహ్ నుంచి క్యెలాంగ్ వరకు ఉంది. షిప్కిలా కనుమ: దీన్ని హిందూస్తాన్ టిబెట్ రోజ్ అంటారు. ఈ కనుమ గుండానే సట్లెజ్ నది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. ఈ కనుమ సిమ్లా నుంచి టిబెట్లోని గార్టోక్ వరకు ఉంది. నిథిలా కనుమ: ఇది ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు వ్యాపించింది. లిపులేఖి కనుమ: ఈ కనుమ ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు ఉంది. ఈ కనుమను ఇండియా, నేపాల్, చైనాల ‘ఖీటజీ ఒఠఛ్టిజీౌ’ అంటారు. థగులా కనుమ: ఇది ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు ఉంది. జీలప్లా కనుమ: ఇది పశ్చిమ బెంగాల్లోని ‘కలింపాంగ్’ను టిబెట్లోని ‘లాసా’ను కలుపుతుంది. నాథులా కనుమ: ఇది టిబెట్ను, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్తో చుంబీ లోయ ద్వారా కలుపుతుంది. ఇటీవల కాలంలో భారతదేశం-చైనా దేశాల మధ్య వర్తకం ఈ కనుమ గుండా ప్రారంభమైంది. బొమ్మిడిలా కనుమ: ఇది అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ను, టిబెట్ సమీపంలోని తేజ్పాల్తో కలుపుతుంది. యాంగ్యాస్ కనుమ: ఈ కనుమ భారతదేశం, చైనాను కలుపుతుంది. దీని గుండా బ్రహ్మపుత్ర నది ప్రవేశిస్తుంది. కైబర్ కనుమ: ఇది పాకిస్తాన్లోని పెషావర్ నుంచి అఫ్గానిస్థాన్లోని కాబూల్ వరకు ఉంది. బోలాన్ కనుమ: ఇది అఫ్గానిస్థాన్లోని కాందహార్ నుంచి క్వెట్టా వరకు ఉంది. ట్రాన్స హిమాలయాలు హిమాద్రి లేదా అత్యున్నత హిమాలయాలకు ఉత్తరాన ఉన్న పర్వత శ్రేణులను ట్రాన్సహిమాలయాలు అంటారు. ఇవి టిబెట్ భూభాగంలోని పామీర్ పీఠభూమి నుంచి జమ్మూకశ్మీర్ వరకు విస్తరించి ఉన్నాయి. ఈ మండలంలో ఉన్న శ్రేణులు: కారకోరం శ్రేణి, లడక్ శ్రేణి, జస్కార్ శ్రేణి, హిందూకుష్ పర్వతాలు, సులేమాన్ పర్వతాలు, కున్లున్ పర్వతాలు, కైలాస కొండలు, మహాభారత శ్రేణి మొదలైనవి. ప్రముఖ నదులకు జన్మస్థానమైన మానససరోవరం, ప్రపంచంలో అతి ఎత్తయిన పామీరు పీఠభూమి (దీన్ని ప్రపంచ పైకప్పు అని పిలుస్తారు) ఇక్కడే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్ ఇక్కడే ఉంది. కారకోరం పర్వత శ్రేణి: ఈ పర్వత శ్రేణిని ‘ఆసియా ఖండం వెన్నెముక’ (బ్యాక్బోన్ ఆఫ్ ఆసియా) అని పిలుస్తారు. ఇది సింధూనదికి ఉత్తరాన వాయవ్య కశ్మీర్లో ఉంది. ప్రపంచంలోనే 2వ ఎత్తయిన శిఖరం ఓ2 లేదా గాడ్విన్ ఆస్టిన్ ఈ పర్వత శ్రేణిలోనిదే. ఓ2 శిఖరం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉంది. దీని ఎత్తు 8,611 మీ. దీన్ని పాకిస్తాన్లో చాగోరీ అని, చైనాలో క్వాగర్ అని పిలుస్తారు. ఈ శ్రేణిలో ఓ2 శిఖరంతోపాటు ‘హీడెన్ పీక్’ బ్రాడ్ పీక్ శిఖరాలు కూడా ఉన్నాయి. ఓ2 శిఖరాన్ని ‘క్వీన్ ఆఫ్ హిమాలయాస్’ అని పిలుస్తారు. ఓ2 శిఖరాన్ని భారతదేశంలో ‘కృష్ణగిరి’ శిఖరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలో కెల్లా అతి పొడవైన హిమానీ నదం సియాచిన్ కూడా ఈ పర్వత శ్రేణిలోనే ఉంది. ఇది నుబ్రా లోయలో ఉంది. బైఫో, బల్టారో, బటార్, పిస్సార్ మొదలైన హిమనీనదాలు కూడా ఈ మండలంలోనే ఉన్నాయి లడఖ్ శ్రేణి: ఈ పర్వత శ్రేణి సింధూ, షియాన్ నదుల మధ్య జాస్కార్ శ్రేణికి సమాంతరంగా సుమారు 300 కి.మీ.ల పొడవుతో విస్తరించి ఉంది. సింధూనది ఈ శ్రేణి గుండా ప్రవహిస్తూ బుండి అనే ప్రదేశం వద్ద 5,200 మీ. లోతైన విదీర్ణ దరిని ఏర్పరుస్తుంది. జస్కార్ పర్వత శ్రేణి: ఈ పర్వత శ్రేణులు లడఖ్ శ్రేణులకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి. లడఖ్, జస్కార్ శ్రేణుల మధ్య సింధూ నది ప్రవహిస్తోంది. ఈ శ్రేణి హిమాద్రి రూపాంతరం. ఇది హిమాద్రి నుంచి 80ం తూర్పు రేఖాంశం వద్ద ఒక పర్వత శాఖ విడిపోయి హిమాలయాలకు సమాంతరంగా, వాయవ్య దిశగా ప్రయాణిస్తుంది. ట్రాన్స హిమాలయ మండలంలోని పర్వత శ్రేణులు - దేశాలు సులేమాన్ పర్వతాలు - పాకిస్తాన్ హిందూకుష్ పర్వతాలు - ఆఫ్గనిస్థాన్ లడక్ శ్రేణులు - భారతదేశం జస్కార్ శ్రేణులు - భారతదేశం కారకోరం శ్రేణులు - భారతదేశం కున్లున్ పర్వతాలు - చైనా కైలాస కొండలు - టిబెట్ గంగా-సింధూ మైదానం హిమాలయాలకు, ద్వీపకల్ప పీఠభూమికి మధ్యలోని లోతట్టు ప్రాంతంలో ఈ మైదానం ఏర్పడింది. ప్లీస్టోసీన్ కాలం నుంచి ఇప్పటి వరకు హిమాలయ నదుల వల్ల వచ్చిన ఒండ్రు మట్టితో ఇవి ఏర్పడ్డాయి. ఇక్కడ ప్రవహించే గంగా, సింధూ నదుల పేర్ల మీదుగా దీనికి ‘గంగా-సింధూ’ మైదానంగా పేరొచ్చింది. ఈ మైదానం సుమారు 7 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంలో ఉంది. సింధూ నది ముఖద్వారం నుంచి గంగా నది ముఖ ద్వారం వరకు సుమారు 3,200 కి.మీ. పొడవున వ్యాపించి ఉంది. పాకిస్తాన్లోని పొట్వార్ పీఠభూమి నుంచి భారతదేశంలోని అరుణాచల్ప్రదేశ్లోని దిహంగ్ గార్జ వరకు విస్తరించి ఉంది. భారతదేశంలో దీని పొడవు 2,400 కి.మీ. మాత్రమే. మనదేశంలో పశ్చిమాన రావి, సట్లెజ్ నదుల ఒడ్డు నుంచి తూర్పున గంగానది డెల్టా వరకు విస్తరించి ఉంది. ఈ మైదాన భూ స్వరూపాల్లో 4 ముఖ్యమైన ఉపరితల వ్యత్యాసాలను గుర్తించవచ్చు. అవి ) భాబర్ , 2) టెరాయి, 3) భంగర్ 4) ఖాదర్ భాబర్ : శివాలిక్ కొండల పాదాల వెంబడి విసన కర్ర ఆకారంలో ఉండే గులకరాళ్లతో కూడిన సచ్చిద్ర మండలాన్ని భాబర్ అంటారు. ఇది పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్లోని బృహత్ మైదానాల ఉత్తర సరిహద్దు వెంబడి సుమారు 8-16 కి.మీ. వెడల్పున్న సన్నని మేఖలుగా ఏర్పడింది. టెరాయి: భాబర్ నుంచి ఉపరితలానికి వచ్చి, ఎల్లప్పుడూ వెల్లువలా ప్రవహించడం వల్ల అక్కడ 15-30 కి.మీ. వెడల్పున్న చిత్తడి ప్రదేశం ఏర్పడింది. దీన్నే టెరాయి అంటారు. ఇది దట్టమైన అడవులతో అనేక రకాల వన్యమృగాలతో నిండి ఉంది. భంగర్: టెరాయికి దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని భంగర్ అంటారు. ఖాదర్: ఇటీవల కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఖాదర్ అని పిలుస్తారు. ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లోని శుష్క ప్రదేశాల్లో ఉన్న చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలను రే లేదా కల్లార్ అంటారు. కార్బొనేట్, బై కార్బొనేట్ లవణాల వల్ల ఇవి క్షార స్వభావం కలిగి ఉన్నాయి. వీటిని చవిటి నేలలు అని కూడా పిలుస్తారు. పంజాబ్లో ఖాదర్ భూములను బెట్స్ అని పిలుస్తారు. ముల్కల రమేష్ సీనియర్ ఫ్యాకల్టీ, జీవీఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్. -
హిమాలయాలూ కరిగిపోతున్నాయ్..
బంజారాహిల్స్: ‘హిమాలయాలూ కరిగిపోతున్నాయి.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి, వ్యాపార ప్రయోజనాల కొరకు పర్యావరణాన్ని తాకట్టు పెడితే పెనుముప్పు తప్పదు, పర్యావరణం ఒక వ్యాపార అవకాశం ఎప్పటికీ కాకూడదు’ అని మాజీ కేంద్రమంత్రి జైరామ్మ్రేష్ అన్నారు. ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో శనివారం తాజ్కృష్ణాలో ‘ఎన్విరాన్మెంట్ యాస్ ఏ బిజినెస్ అపర్చునిటీ ’పేరుతో నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాలకు పర్యావరణం ఒక జీవన విధానమైతే మన దేశంలో అది జీవనంలో ఒక భాగమన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి అడవులు, నదులు, గనులు, నీళ్లు, గాలి సహా అన్ని ప్రకృతి వనరులను యథేచ్ఛగా వినియోగిస్తుండడంతో మానవాళికి పెనుముప్పుగా మారుతుందన్నారు. హిమాలయాలు కరిగిపోతున్నాయని, నదులు ఇంకిపోతున్నాయని, సముద్రమట్టాలు పెరుగుతున్నాయని, ఎండలు మండిపోతున్నాయని.. పర్యావరణ విధ్వంసానికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలన్నారు. కార్యక్రమంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు జైరామ్ సమాధానాలు ఇచ్చారు. ఎఫ్ఎల్వో చైర్పర్సన్ నిధిస్వరూప్, పింకిరెడ్డి, అజితారెడ్డి సహ పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
భారతీయ యాత్రాదర్శిని
సందర్శనీయం భారతదేశం వేదాలకు పుట్టినిల్లు. ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణాన కన్యాకుమారి వరకు ఈ పవిత్ర వేద భూమిలో అతి ముఖ్యమైన తీర్థయాత్రలు కైలాస మానస సరోవర యాత్ర, అమర్నాథ్ యాత్ర, చార్ధామ్ యాత్ర, కాశీయాత్ర, ద్వాదశ జ్యోతిర్లింగాల యాత్రలు ముఖ్యమైనవి. కైలాస మానస సరోవర యాత్ర పార్వతీపరమేశ్వరుల నివాసంగా భావించే కైలాస శిఖరం శివ భక్తులకు, హరి భక్తులకు, దేవీ భక్తులకు పరమ పవిత్రమైన పుణ్యస్థలం. ఆదిశంకరాచార్యులవారు కైలాసానికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు నాలుగు శివలింగాలను అనుగ్రహించాడట. ఆదిశంకరాచార్యులవారు ఆ లింగాలను తూర్పు సముద్ర తీరం నందు గల పూరి క్షేత్రం నందు గోవర్ధన పీఠాన దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలోనూ, గుజరాత్ రాష్ట్రం నందు గల ద్వారకలో కాళికా మఠం, ఉత్తరాంచల్ రాష్ట్రం నందు బదరీనాథ్ క్షేత్రంలో జ్యోతిర్మఠం అనబడు నాలుగు మఠాలను స్థాపించి, వాని యందు శివలింగాలను ప్రతిష్ఠించారు. కైలాస పర్వతం ఒక్కో సమయంలో ఒక్కో రంగులో దర్శనమిస్తుంటుంది. ఇది పరమేశ్వరుని లీలగా చెప్తారు. కైలాస పర్వతం నాలుగు ముఖాలు స్పటిక, బంగారం, రూబి, నీలం రంగులతో రూపొందినట్లు విష్ణు పురాణం చెప్తుంది. భూమి మీద వున్న మంచినీటి సరస్సు - మానస సరోవరం. ఋషుల కోరికపై బ్రహ్మ తన మనస్సు (మానసము) నుండి సృష్టించినందు వలన దీనిని మానస సరోవరం అని అంటారు. ఈ సరోవరంలోని నీరు చతుర్వేద సార మని అంటారు. దేవతలు ఈ సరోవరంలో స్నానం చేయటానికి స్వర్గలోకం నుండి ప్రతి రాత్రి వేంచేస్తుంటారని, పండుగ రోజుల్లో.. పున్నమి రోజుల్లో తప్పక వస్తారని ప్రతీతి. ఇంత విశిష్టమైనటువంటి కైలాస మానస సరోవర యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని ప్రతి హిందువు పరితపిస్తూ ఉంటాడు. ఫోన్: 8106201230 అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ అంటే జరామరణాలు లేనివాడని అర్థం. ఈ అమర్నాథ్ గుహలో సహజసిద్ధంగా ఏర్పడిన మంచు ‘శివలింగం’ ఉంది. చంద్ర చక్రం ఆధారంగా మంచు శివలింగం పెరగటం, తరగటం జరుగుతుంది. జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఈ మంచులింగం పెద్దదిగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఒక వింతగా కొనియాడబడుతోంది. గణేశునికి, పార్వతీదేవికి ఇక్కడ రెండు మంచులింగాలు వున్నాయి. ఒకనాడు పార్వతీదేవి పరమేశ్వరునితో ‘నాథా! నేను తిరిగి తిరిగి జన్మిస్తుంటాను. మీరు మాత్రం అలాగే శాశ్వతుడిగా ఉంటున్నారు. ఇది ఎలా సాధ్యం?’ అని అడిగింది. అందుకు ఈశ్వరుడు ‘ఇది పరమ రహస్యం. కనుక ప్రాణకోటి లేని ప్రదేశంలో నీకు చెప్పాలి’’ అని ఎవరూ లేని నిర్జన ప్రదేశం కోసం వెతకి చివరకు ఈ అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు. శివుడు ఈ గుహను ఎన్నుకోవటానికి ముందు తనతోపాటు వున్న వారందరినీ వదిలిపెట్టి వెళ్లాడు. హిమాలయాలకు వెళ్లే దారిలో ముందుగా వాహనమైన నందిని పహల్గామ్లో, చంద్రుని చందన్వారి వద్ద, సర్పాలను పిషాంగ్ సరోవర తీరాన గల శేష్నాగ్ వద్ద, కుమారుడైన గణేశున్ని మహాగుణ పర్వతం వద్ద, పంచభూతాలను పంచ్తర్ణి వద్ద వదిలి పార్వతీదేవితో అమర్నాథ్లోని అమరలింగం వున్న గుహ లోపలికి వెళ్లాడు. అక్కడ తన అమరత్వ రహస్యం, జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు. ఆ సమయంలో గుహలో రెండు గుడ్ల నుండి జన్మించిన పిల్ల పావురాళ్లు శివుడు పార్వతితో చెప్పిన అమరగాథను విన్నాయట. ఈ విషయం తెలుసుకొన్న శివుడు ‘‘జీవధర్మమైన జనన మరణాలు ఈ పావురాల జంటకు వుండదు. మనిద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలో వుండి దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యం ప్రసాదిద్దాం’’ అని తెలియజేశాడు. ఇప్పటికీ ఈ పావురాల జంట అజరామరమై ఈ గుహకు వచ్చి శివుని అర్చించినవారికి దర్శనమిస్తూ ముక్తిని ప్రసాదిస్తు న్నాయని చెబుతారు. మహాద్భుతమైన ఈ పుణ్యస్థలాన్ని దర్శించుకోవ టానికి ప్రతియేటా కొన్ని లక్షల మంది భక్తులు తరలి వెళ్తుంటారు. ఈ సంవత్సరం కూడా ఈ మహా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే అవకాశం జూలై నెల 2 నుండి ప్రారంభం అవుతుంది. ఫోన్: 9100090295 చార్ధామ్ యాత్ర ఉత్తరాంచల్లోని ఘల్వాల్ ప్రాంతంలోని అనేక పుణ్యక్షేత్రాల్లో గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రినాథ్ ప్రసిద్ధమైనవి. ఈ నాలుగింటిని కలిపి చార్ధామ్ అంటారు. వీటిని ఒకేసారి సందర్శించి రావటానికే చార్ధామ్ యాత్ర అని పేరు. యమునోత్రి: ఆదిశంకరుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థలపురాణం. సూర్యదేవుని సంతానంలో ఒకరు యముడు, మరొకరు యమున-సూర్యుని భార్య ఛాయాదేవి, ఒకరోజున ఛాయాదేవికి యమున మీద కోపం వచ్చి భూలోకంలో పడిపొమ్మని శపించిందట. అందువలన యమున భూలోకంలో నదిగా చేరింది. గంగోత్రి: గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తూ వచ్చిన ఈ గంగానది ప్రవాహం, తల్లి గర్భంలో నుండి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుంచి గంగోత్రి చేరేవరకూ ఈ పవిత్ర గంగాజలంలో మానవస్పర్శకూడా ఉండదు. అంత పవ్రితంగా ఉంటుంది. బద్రీనాథ్: బదరీ అనగా రేగుచెట్టు. రేగు చెట్టు, లక్ష్మీనివాసం. కనుక నారాయణుడు ఆ చెట్టు నీడలోనే తపమాచరించాడు. అందువల్లే ఈ క్షేత్రానికి బదరీ క్షేత్రం అని పేరు. ఇది నర నారాయణుల నివాస స్థలమవటం వల్ల నారాయణాశ్రమం అని కూడా పిలుస్తారు. నారదుడు ఈ క్షేత్రంలో అర్చకత్వం చేసినందువల్ల నారద క్షేత్రమని కూడా పేరు. శ్రీకృష్ణ నిర్యాణాంతరం పాండవులు తమ జీవితాలను చాలించదలచి స్వర్గారోహణ సమయంలో బద్రీనాథ్ మీదుగా ప్రయాణం చేశారట. స్వర్గారోహణ పర్వంలో వర్ణించిన ‘మానా’ పర్వతం బద్రీనాథ్కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. కేదార్నాథ్: ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం ఆదిశంకరులచే 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఈ స్వామి ఆరు నెలలు మానవుల పూజలను, ఆరు నెలలు దేవతల పూజలు అందుకుంటారని చెబుతారు. ఆలయం మూసివేయగానే స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని కేదార్కు 52 కి.మీ. దూరంలో ఉన్న ఉఖీమర్లో వున్న ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. సుమారు 1000 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయం దీర్ఘ చతురస్రాకార స్థావరం మీద పెద్ద రాతి కట్టడాలను ఉపయోగించి నిర్మించారు. ఫోన్: 7032666924 కాశీ క్షేత్ర యాత్ర కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇక్కడి శివుడికి కాశీ విశ్వేశ్వరుడని పేరు. విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అందుచేత, ఈ క్షేత్రానికి వారణాసి అనే పేరు. చరిత్రలో వివిధ కాలాలలో నిర్మించబడ్డ పెద్దపెద్ద ఆలయాలు వారణాసిలో ఉన్నాయి. సాక్షాత్తు పార్వతీపరమేశ్వరులు ఈ నగరంలో నివసించారని, శివుని త్రిశూలంపై కాశీ నగరం నిర్మించబడిందని పురాణ వచనం. పరమేశ్వరునికి ఈ ప్రాంతం అత్యంత ప్రీతిపాత్రమైనది. అందువలన ఈ వూరికి ‘ఆనందకావనం’ అనే పేరు కూడా ఉన్నది. ఇంకా ప్రతివీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం. బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి, బెనారస్గా మారంది. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం ‘కాశీ’ జాతి వారు నివసించేవారు. అందువల్ల దీనికి ‘కాశి’ అనే పేరు స్థిరపడింది. ఫోన్: 7032666927 భారతీయ యాత్రా ప్రపంచంలో ఆర్ వి టూర్స్ అండ్ టావెల్స్ సనాతన సంస్కృతికి, ఆచారాలకు నిలయం అయిన భారతదేశంలోని పైన పేర్కొన్న కైలాస మానస సరోవరం, అమర్నాథ్, చార్ధామ్, కాశీ యాత్రలతోపాటు, భారతదేశం నలుమూలల అన్ని ఆధాత్మిక ప్రదేశాలకు యాత్రా ప్యాకేజీలు అందిస్తున్న సంస్థ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంస్థ గడిచిన 14 సంవత్సరాలుగా ఎంతోమంది తెలుగువారి ఆహార అభిరుచులకు అనుగుణంగా అద్భుతమైన భోజన, వసతి సదుపాయాలను కల్పిస్తోంది. సువిశాల భారతదేశంలోని ఏ ప్రదేశానికైనా యాత్రికులను పంపిస్తూ తెలుగువారి ఆదరాభిమానాలు పొంది ఆత్మీయ ట్రావెల్గా పిలువబడుతున్న సంస్థ ఆర్.వి. టూర్స్ అండ్ ట్రావెల్స్. ఈ సంవత్సరం కూడా పైన తెలిపిన అన్ని యాత్రా స్థలాలకు ప్రత్యేకమైన ప్యాకేజీలను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి వున్న వారు ఆర్వి ట్రావెల్స్ను సంప్రదించవచ్చు. -
మన దేశంలోనే... మరో కాశ్మీరం
టూర్దర్శన్ - సమ్మర్ స్పెషల్ - పితోరాగఢ్ ఉదయం వేళ హిమగిరుల ధవళకాంతుల ధగధగలు కనువిందు చేస్తాయి. చుట్టూ కనుచూపు మేరలో అంతా విస్తరించుకున్న ఆకుపచ్చదనం ఆనంద పరవశులను చేస్తుంది. ఘనచరిత్రకు సాక్షీభూతంగా నిలిచి ఉన్న కోట... వీర సైనికులకు నివాళిగా వెలసిన తోట... ఎన్నెన్నో గాథలు చెబుతాయి. పరిసర ప్రాంతాల్లో పురాతన దేవాలయాలు, మందిరాలు వాతావరణానికి పవిత్రతను అద్దుతూ ఉంటాయి. ఇలాంటి చాలా వింతలు, విశేషాలు గల ప్రదేశం పితోరాగఢ్. పర్వతశిఖరాల నడుమ వెలసిన ఈ పట్టణం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. వేసవి యాత్రలో విహార, వినోదాలతో పాటు కొంత విజ్ఞానం, కొంత పరమార్థం కూడా కావాలనుకుంటే పితోరాగఢ్కు వెళ్లాల్సిందే! హిమాలయాల దిగువన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చందక్, ధ్వజ్, కుమ్దార్, తల్ కేదార్ కొండల నడుమ వెలసిన పట్టణం పితోరాగఢ్. ఉదయం వేళ ఇక్కడి నుంచి చూస్తే హిమాలయాల్లోని పంచ్చులి, నందాదేవి, నంద కోట్ శిఖరాలు తెల్లగా తళతళలాడుతూ కనువిందు చేస్తాయి. ఈ మూడు శిఖరాల నడుమనున్న లోయను స్థానికంగా ‘సోర్’లోయ అంటారు. అంటే చల్లని లోయ అని అర్థం. ఈ లోయ పరిసరాలన్నీ కశ్మీర్ లోయను తలపిస్తాయి. అందుకే ఈ లోయలో కాళీనది ఒడ్డున వెలసిన పితోరాగఢ్ను ‘మినీ కశ్మీర్’గా అభివర్ణిస్తారు. ట్రెక్కింగ్ చేసే యాత్రికులు ఇక్కడి నుంచి కైలాస పర్వతానికి, మానస సరోవరానికి చేరుకోవచ్చు. అందుకే దీనిని ‘హిమాలయాలకు ప్రవేశమార్గం’గా కూడా అభివర్ణిస్తారు. ఏం చూడాలి? చారిత్రక పట్టణమైన పితోరాగఢ్ రాజపుత్ర వీరుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏలుబడిలో రాజధానిగా ఉండేది. పద్నాలుగో శతాబ్దంలో ఇదే పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాల్ వంశపు రాజులు మూడు తరాల పాటు పరిపాలించారు. వారి తర్వాత నేపాల్కు చెందిన బ్రహ్మ వంశపు రాజులు, చాంద్ వంశపు రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు. పాత కోట నాశనమైపోవడంతో చాంద్ వంశపు రాజులు 1790లో ఇక్కడ కొత్తగా కోటను నిర్మించారు. శిథిలావస్థలో ఉన్న ఆ కోటను పర్యాటకులు తప్పనిసరిగా సందర్శించుకుంటారు. * చాంద్ వంశీకులు ఎక్కువకాలం పరిపాలించిన పితోరాగఢ్లో ఇప్పటికీ పలు చిన్నా చితకా కోటలు, పురాతన మందిరాలు సందర్శకులను ఆకర్షిస్తాయి. అప్పటి కోటల్లో ఒకదాంట్లో ప్రస్తుతం ట్రెజరీ, తహశిల్ కార్యాలయాలు పనిచేస్తుండగా, మరో కోటను పడగొట్టి, ఆ స్థలంలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను నిర్మించారు. * కశ్మీర్లో మరణించిన వీర సైనికుల జ్ఞాపకార్థం ఇండియన్ ఆర్మీ ఈ పట్టణంలో నిర్మించిన మహారాజా పార్కు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అరుదైన మొక్కలతో, పచ్చని పరిసరాలతో కనువిందు చేస్తుంది. * పితోరాగఢ్కు 54 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 5412 అడుగుల ఎత్తున కుమావోన్ హిమాలయాల్లో ఏర్పాటు చేసిన ‘అస్కోట్ అభయారణ్యం’ మరో ప్రత్యేక ఆకర్షణ. మంచు చిరుతలు, హిమాలయన్ నల్ల ఎలుగులు, కస్తూరి మృగాలు, మంచు కాకులు, జింకలు వంటి అరుదైన వన్యప్రాణులను ఇక్కడ చూసి ఆనందించవచ్చు. * పితోర్గఢ్కు 112 కిలోమీటర్ల దూరంలో ఉన్న చకోరీ హిల్స్టేషన్ ట్రెక్కర్లకు స్వర్గధామంలా ఉంటుంది. మంచుకొండలు, కొండల దిగువన తేయాకు తోటలతో కనువిందు చేసే చకోరీ నుంచి మూడు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. * వేసవి వినోదంతో పాటు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించుకోవాలనుకునే పర్యాటకులకు పితోరాగఢ్ చాలా అనువైన ప్రదేశం. ఇక్కడకు చేరువలోనే శైవ క్షేత్రాలైన పాతాళ భువనేశ్వర్, తల్ కేదార్, నకుల సహదేవులు నిర్మించారనే ప్రతీతి గల నకులేశ్వర ఆలయం, పురాతన ధ్వజ ఆలయం, కాళీ మందిరం వంటి పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. * పితోరాగఢ్కు 35 కిలోమీటర్ల దూరంలోని ఝులాఘాట్ పట్టణం షాపింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఈ పట్టణంలో కాళీ నదిపై నిర్మించిన వేలాడే కలప వంతెన నేపాల్ను కలుపుతుంది. ఈ వంతెన మీదుగా ఇక్కడి ప్రజలు నేపాల్కు, నేపాలీలు ఇక్కడకు రాకపోకలు సాగిస్తుంటారు. ఏం కొనాలి? * పితోరాగఢ్లో స్థానికంగా తయారయ్యే సంప్రదాయ హస్తకళా వస్తువులు చౌకగా దొరుకుతాయి. * ఇక్కడి బజారులో దొరికే ఉన్ని శాలువలు, కంబళ్లు, స్వెట్టర్లు, మఫ్లర్లు వంటివి కొనుక్కోవచ్చు. * ఉద్యాన ఉత్పత్తులకు పితోరాగఢ్ పెట్టింది పేరు. ఇక్కడ స్థానికంగా పండే నారింజలు, ద్రాక్షలు, యాపిల్స్ రుచికరంగా ఉంటాయి. ఇక్కడ పండే భారీ దోసకాయలు నీటి శాతంలో పుచ్చకాయలను తలపిస్తాయి. ఏం చేయాలి? * సముద్ర మట్టానికి చాలా ఎత్తున ఉండే పితోరాగఢ్ పరిసర ప్రదేశాలన్నీ పర్వతారోహణకు అనువుగా ఉంటాయి. వేసవిలో ట్రెక్కింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. * చరిత్ర, వారసత్వ సంపద గురించి ఆసక్తి గల వారు ఇక్కడి పురాతన కోటలను, ఇతర కట్టడాలను సందర్శించుకోవచ్చు. * తీర్థయాత్రలపై ఆసక్తి గల వారు పితోరాగఢ్ పరిసరాల్లోని ప్రాచీన ఆలయాలను సందర్శించుకోవచ్చు. ఎలా చేరుకోవాలి? ఇతర ప్రాంతాల వారు దేశ రాజధాని ఢిల్లీ లేదా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు విమాన మార్గంలో లేదా రైలు మార్గంలో చేరుకోవచ్చు. ఢిల్లీ లేదా డెహ్రాడూన్ నుంచి మరో రైలులో హల్ద్వానీ లేదా తనక్పూర్ వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. హల్ద్వానీ నుంచి, తనక్పూర్ నుంచి పితోరాగఢ్ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సులు తరచుగా తిరుగుతూ ఉంటాయి. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. -
హిమాలయాల్లో సహజంగా పెరిగే మొక్క?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు.. కిందివాటిని పరిశీలించండి. 1) పత్తి 2) వేరుశెనగ 3) వరి 4) గోధుమ పైవాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 సరైన సమాధానం: సి వివరణ భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజిస్తారు. అవి 1) ఖరీఫ్ 2) రబీ 3) జైద్. గోధుమ ప్రధానమైన రబీ పంట. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం సరిపోతుంది. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు-శ్రీలంక, ఇండో-బర్మన్ ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్స్పాట్స్’గా ప్రకటించడానికి కింద తెలిపిన వాటిలో మూడు ప్రామాణికతలేవి? 1) జాతుల సంపన్నత్వం (స్పిసీస్ రిచ్నెస్) 2) ఉద్భిజ్జ సంపద సాంద్రత (వెజిటేషన్ డెన్సిటీ) 3) స్థానీయత (ఎండెమిజం) 4) ప్రమాదస్థితి (థ్రెట్ పర్సెప్షన్) 5) వెచ్చటి, తడి వాతావరణాలకు అనుకూలత పొందే వృక్ష, జంతు జాతులు పై అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ) 1, 2, 3 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 3, 4, 5 సమాధానం: బి వివరణ జాతుల సంపన్నత్వం అంటే ఏదైనా జీవసమాజంలో మిగతా జాతులకన్నా ఓ ప్రత్యేక జాతి సంఖ్యాపరంగా, ఆ ప్రాంత వనరులను వినియోగించుకోవడంలో మిగతా జాతుల కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్థానీయత అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవిస్తూ, ఇతర ప్రాంతాల్లో పెరుగుదల తక్కువగా ఉన్న జాతులు. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల ప్రాంతాలు, ఇండో-బర్మన్ ప్రాంతాల్లోని జాతుల్లో ఎక్కువగా స్థానీయమైనవి. ఇవి ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. కింది వాక్యాలను పరిశీలించండి (1) టెక్సాస్ అనే మొక్క హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది. (2) దీన్ని ఇటీవల ‘రెడ్ డేటా బుక్’ లిస్ట్లో చేర్చారు (3) దీని నుంచి ‘టాక్సోల్’ అనే డ్రగ్ను తయారు చేస్తారు. దీన్ని ‘పార్కిన్ సాన్స్’ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. పై వాటి నుంచి సరైన దాన్ని గుర్తించండి (ఎ) 1 (బి) 2, 3 (సి) 1, 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ ఈ మొక్క నుంచి తయారు చేసే టాక్సోల్ డ్రగ్లో గుండె క్యాన్సర్, పార్కిన్సాన్స్, రొమ్ము క్యాన్సర్లను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ స్థాయిలో టాక్సోల్ డ్రగ్ను తయారు చేసేందుకు నిర్మూలించారు. అందువల్ల దీన్ని రెడ్ డేటా లిస్ట్లో చేర్చారు. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే కింది వాటిలో భారతదేశ భూభాగంపై కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి? (1) దేశంలో ఎక్కువ భాగం ఆసియా భూభాగం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి లోనై ఉండేది. (2) గంగా-సింధు మైదాన ప్రాంతంలో ఇప్పుడున్నంత విస్తీర్ణంలో సారవంతమైన ఒండ్రుమట్టి నేలలు, జీవనదులు ఉండేవి కాదు. వర్షపాత పరిమాణం తక్కువై దుర్భిక్ష ప్రాంతంగా ఉండేది. (3) రుతుపవన విధానం ఇప్పుడున్నట్లు కాకుండా భిన్నమైన రీతిలో ఉండేది. పైవాటి నుంచి సరైనదాన్ని గుర్తించండి. (ఎ) 1 (బి) 1, 3 (సి) 2, 3 (డి) పైవ న్నీ సరైన సమాధానం: డి కింది వాటిలో భారత్-చైనాల మధ్య 2006లో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలను పెంపొందించేందుకు ఏ కనుమను తెరిచారు? (ఎ) నిథిలా (బి) జెలెప్లా (సి) నాథులా (డి) షిప్కిలా సరైన సమాధానం: సి పశ్చిమ దిశలో ప్రవహించే నర్మద, తపతి లాంటి ద్వీపకల్ప నదులు వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టురీస్ ఏర్పరిచేందుకు కారణం? (1) అతి తక్కువ కాలంతో పాటు, వేగంగా ప్రవహించడంవల్ల (2) పశ్చిమతీర రేఖ తరచూ టైడల్ బోర్స్ తో మునిగిపోవడం వల్ల (3) అవి రవాణా చేసే నిక్షేపాల పరిమాణం తక్కువగా ఉండటం, పగులు లోయ గుండా ప్రవహిండం వల్ల. (4) వాటి ద్వారా రవాణా అయ్యే నిక్షేపాలను వాటి ముఖ ద్వారాల వద్ద నిక్షేపితం చేయకుండా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల పైవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి (ఎ) 1, 3, 4 (బి) 2, 3, 4 (సి) 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: ఎ వివరణ పై ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే పగులులోయలు, పశ్చిమ కనుమల భౌమ నిర్మాణంపై సరైన అవగాహన ఉండాలి - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
ట్రెక్కింగ్ @ 81
మనదేశంలోని అత్యంత శీతల ప్రదేశాలు హిమాలయాలే.. ఎముకలు కొరికేసే చలి ఉండే ఆ పర్వత శ్రేణుల్లో ఒకసారి పర్యటించడమే కష్టసాధ్యమైన పని. అలాంటిది ఈ పెద్దాయన హిమగిరి సొగసులూ...ఏమి హాయిలే అనుకుంటూ ఏకంగా పదిసార్లు హిమాలయాలు ఎక్కి దిగేశాడు . ఆయన పేరు గోపాల్ వాసుదేవ్. పుణేకు చెందిన ఈ పర్వతారోహకుడు ఈ మధ్యే లిమ్కా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కి ఔరా అనిపించాడు. ఇందులో గొప్పేముందని అనుకుంటున్నారా? అవును 81 ఏళ్ల వయసులో నడవడమే కష్టమైన విషయం. అలాంటిది ఏకంగా పర్వతాలు ఎక్కడమంటే మాటలు కాదు. కానీ, గోపాల్కు పర్వతారోహణే అత్యంత ఇష్టమైన పని. ఆటోమొబైల్ ఇంజనీర్గా 1964లో కెరీర్ను ప్రారంభించాక, చాలా ఏళ్లు పుణేలోనే వివిధ కంపెనీల్లో పనిచేశాడు. ఆ సమయంలోనే పర్వతారోహణపై ఆసక్తి పెంచుకున్నాడు. తొలిసారిగా 1972లో ట్రెక్కింగ్ చేశాడు. అప్పటి నుంచీ చిన్నాపెద్దా పర్వతాలను అధిరోహిస్తూనే ఉన్నాడు. ట్రెక్కింగ్ చేసేవాళ్లకు దేహదారుఢ్యం చాలా అవసరమని ఆయన అభిప్రాయం. అందుకే, ఈ వయసులోనూ రోజుకు 8 కిలోమీటర్ల పాటు నడక సాగిస్తాడు, వారానికోసారి పుణే-ముంబై రహదారి సమీపంలోని చిన్నపాటి కొండను ఎక్కడం, దిగడం చేస్తుంటాడు. గతేడాది సెప్టెంబర్లో హిమాచల్ ప్రదేశ్లోని 15,350 అడుగుల ఎత్తై రూపిన్ పాస్ని అధిరోహించిన సందర్భంగా లిమ్కాబుక్ వాళ్లు పెద్ద వయసు పర్వతారోహకుడిగా ఆయన పేరుని చేర్చారు. 80 ఏళ్లు పైబడినా రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు లాంటి సమస్యలు ఈయన దరిచేరలేదంటే నమ్మాల్సిందే.! -
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం
హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా. నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
శంభల! అద్భుతమా..? అపోహా..?
హిమాలయాల్లో అంతుచిక్కని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఇంతవరకు హిమాలయాలను ఏ వ్యక్తీ పూర్తిగా సందర్శించలేదనేది వాస్తవం. అక్కడ 'యతి' రూపంలో సంచరించేది హనుమంతుడేనని విశ్వసించేవారూ ఉన్నారు. కొన్ని పరిశోధనలు, మరికొన్ని భారతీయ, బౌద్ధ గ్రంథాల్లో రాసిన దాన్ని బట్టి చూస్తే బాహ్యప్రపంచానికి తెలియని లోకం ఒకటి హిమాలయాల్లో దాగి ఉందని తెలుస్తుంది. దాని పేరే 'శంభల' దీన్నే పాశ్చాత్యులు 'హిడెన్ సిటీ' అని పిలుస్తారు. దీనికి సంబంధించి ప్రచారంలో ఉన్న కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు.. కొన్ని వేల కిలోమీటర్లలో విస్తరించి ఉన్న హిమాలయాల్లో సాధారణ మానవులు చేరుకోలేని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఈ శంభల ఒకటి. ఇక్కడికి చేరుకోవాలంటే మానసికంగా, శారీరకంగా ఎంతో దృఢచిత్తులై ఉండాలని, ఎవరికి పడితే వారికి ఇది కనిపించదని.. ఎందుకంటే శంభల అతి పవిత్రమైన ప్రదేశమనీ చాలా మంది విశ్వసిస్తారు. భౌద్ధగ్రంథాల ప్రకారం.. బౌద్ధ గ్రంథాల్లో రాసి ఉన్న దాని ప్రకారం ఇది చాలా ఆహ్లాదకరమైన చోటు. ఇక్కడ నివసించేవారు నిరంతరం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉంటారు. వీరి ఆయుఃప్రమాణం సాధారణ ప్రజల కంటే రెట్టింపు ఉంటుంది. వారు మహిమాన్వితులు. లోకంలో పాపం పెరిగిపోయి అంతా అరాచకత్వం తాండవిస్తున్న సమయంలో శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. అప్పటి నుంచి మరో కొత్త శకం ప్రారంభం అవుతుంది. ఆ కాలం 2424లో వస్తుంది. రష్యా పరిశోధనలు.. 1920లో శంభల రహస్యాన్ని ఛేదించడానికి రష్యా తన ప్రత్యేక మిలటరీ బలగాలను పంపి పరిశోధనలు చేయించింది. ఈ పరిశోధనలో వారికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అక్కడ ఉండే యోగులు దాని పవిత్రత గురించి వివరించారు. హిట్లర్ ప్రయత్నాలు.. ఈ విషయాన్ని తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ 1930లో శంభల అధ్యయనానికి ప్రత్యేక బృందాలను పంపాడు. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని.. దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువిపైన ఏర్పడ్డ స్వర్గమని హిట్లర్కు చెప్పాడు. అనేక గ్రంథాల్లో.. గోబి ఎడారికి దగ్గరిలో ఉన్న శంభల రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రం అవుతుందని బుద్ధుడు 'కాలచక్ర'లో రాశారు. ఫ్రాన్స్కు చెందిన చారిత్రక పరిశోధకురాలు, రచయిత్రి అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కొన్ని గ్రంథాలు రచించారు. ఆమె తన 56 ఏళ్ల వయసులో ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి లామాలను కలుసుకున్నారు. వారి ద్వారా శంభల వెళ్లి అక్కడి మహిమాన్వితుల ఆశీర్వాదాలు తీసుకోవడం వల్లే ఆమె 101 ఏళ్లు బతికారని చెబుతారు. ఎక్కడ ఉంది..? సాక్షాత్తు పరమశివుడు కొలువై ఉంటాడని భక్తులు విశ్వసించే కైలాస పర్వతాలకు దగ్గరలో ఈ పుణ్యభూమి ఉందనీ.. ఆ ప్రదేశం అంతా అద్భుతమైన సువాసనలతో నిండి ఉంటుందని, పచ్చని ప్రకృతి నడుమ ఉండే శంభలను వీక్షించడం ఎంతో మధురానుభూతిని కలిగిస్తుందని కొన్ని గ్రంథాల్లో రాసి ఉంది. మరిన్ని విశేషాలు.. పూర్వీకులు తెలిపిన దాని ప్రకారం ఈ నగరం వయస్సు 60 లక్షల సంవత్సరాలు. ఇక్కడ ప్రజలు సుమారు 12 అడుగుల పొడవు ఉంటారు. హిమాలయాల్లో ఎక్కడ ఉందో తెలియని ఈ నగరం చేరుకోవడం చాలా ప్రయాసలతో కూడి ఉంది. ఈ ప్రయాణంలో తొలుత ఎడారి వస్తుంది. అదే గోబి ఎడారి. పరిశోధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఇది కున్లున్ పర్వత శ్రేణులతో కలిసి ఉండొచ్చు. ఆధ్యాత్మి క ధోరణి లేనివారికి ఈ నగరం కనిపించదని చెబుతుంటారు. పాశ్చాత్యులు ఈ నగరాన్ని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్, ది ఫర్బిడెన్ ల్యాండ్, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్.. అనే పేర్లతో పిలుస్తారు. -
ఆయనతో హిమాలయాలకు..!
‘రక్తచరిత్ర’, ‘లెజెండ్’, ‘లయన్’ తదితర చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టేకు తెలుగు నాట మంచి హోమ్లీ ఇమేజ్ ఉంది. కానీ, బాలీవుడ్లో ఆమెకు దీనికి పూర్తి భిన్నమైన ఇమేజ్ ఉంది. ‘బద్లాపూర్’ చిత్రంలో అర్ధనగ్నంగా నటించి, ‘రాధికా ఇలా కూడా నటిస్తుందా?’ అని చాలామంది అనుకునేలా చేశారామె. ఆ తర్వాత ఓ డాక్యుమెంటరీ మూవీలో నగ్నంగా నటించి, షాకిచ్చారు. ఈ అర్ధనగ్న, నగ్న దృశ్యాల ద్వారా రాధిక ఈ మధ్య వార్తల్లో నిలిచారు. ఎక్కడికెళ్లినా ఆమెను వీటి గురించే అడుగుతున్నారు. ఈ తతంగంతో రాధికా విసిగిపోయారట. దాంతో కొంచెం సేద తీరాలనుకున్నారో ఏమో... ఆయనగారితో హిమాలయాలకు చెక్కేశారు. ఆయనగారు ఎవరు? అని ఊహల్లోకి వెళ్లకండి. ఆయన స్వయంగా రాధికా భర్తే. మూడేళ్ల క్రితం బ్రిటిష్ మ్యూజిషియన్ బెనెడిక్ట్ టేలర్ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు రాధిక. అడపా దడపా ఆయన రాధిక నటించే చిత్రాల లొకేషన్స్లోనూ కనిపిస్తుంటారు. ఆ సంగతలా ఉంచితే.. ‘‘మంచు కొండలకు వెళ్లడం భలే ఆనందంగా ఉంది. కొండలంటే నాకు చాలా ఇష్టమండీ బాబూ’’ అంటున్నారు రాధికా ఆప్టే. -
ఎవరెస్ట్పై స్వచ్ఛభారత్
న్యూఢిల్లీ: హిమాలయాల్లోకెల్లా అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడం ప్రతి పర్వతారోహకుడి స్వప్నం. దశాబ్దాలుగా ఈ శిఖరాన్ని ఎంతోమంది అధిరోహించారు. ఈ క్రమంలో వీరు తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు, ఇతరత్రా చెత్త ఈ మంచు శిఖరంపై పేరుకుపోతూ వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ను స్ఫూర్తిగా తీసుకున్న భారత సైనికులు ఇప్పుడీ చెత్తను కిందకుతెచ్చే కార్యక్రమం చేపట్టారు. 8,848 మీటర్ల ఎత్తున్న ఈ శిఖరంపైకి మేజర్ రణ్బీర్సింగ్ సారథ్యంలోని బృందం శనివారం నేపాల్వైపు నుంచి బయలుదేరింది. ఎవరెస్ట్ పర్వత సానువుల్లో పేరుకుపోయిన నాలుగు వేల కిలోల చెత్తను పోగేసి... కిందకు తేనున్నారు.