రిలయన్స్‌ జియో ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 51వ జాతీయ భద్రతా వారోత్సవాలు | Reliance Jio Celebrated The 51st National Safety Day In Telangana | Sakshi

రిలయన్స్‌ జియో ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా 51వ జాతీయ భద్రతా వారోత్సవాలు

Mar 9 2022 4:35 PM | Updated on Mar 9 2022 4:35 PM

Reliance Jio Celebrated The 51st National Safety Day In Telangana - Sakshi

రిలయన్స్ జియో 51వ జాతీయ భద్రతా వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జియో తన కార్యాలయాల్లో సంస్థ ఉద్యోగులు  కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో మార్చి4 నుండి 10వరకు ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఏడాది పొడవునా సురక్షితంగా పని చేయాలనే నిబద్ధతను పునరుద్ధరించడం, వృత్తిపరమైన ఆరోగ్యం, భద్రత పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ వారోత్సవాలను జరుపుతున్నట్లు చెప్పారు.  

సేఫ్టీ వీక్‌లో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని పని ప్రదేశాలలో వివిధ భద్రతా అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యకలాపాలలో కార్మికులకు నిర్మాణ సామగ్రి, యంత్రాలు, పరికరాలను సురక్షితంగా నిర్వహించడంపై ప్రత్యేక ప్రదర్శన సెషన్‌లు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జియో బృందం సభ్యులు పని ప్రదేశాలలో  ప్రమాదాలను నివారించడానికి అనుసరించాల్సిన భద్రతా ప్రోటోకాల్‌లపై అవగాహన, నిబద్ధతను పెంచేలా ప్రతిజ్ఞ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement