మాటల మాంత్రికులు.. వలలో చిక్కామో అంతే | Cyber Crime: Youth Cheated Lakhs Of Money Through Online In Hyderabad | Sakshi

మాటల మాంత్రికులు.. వలలో చిక్కామో అంతే

Jul 23 2021 7:37 AM | Updated on Jul 23 2021 7:50 AM

Cyber Crime: Youth Cheated Lakhs Of Money Through Online In Hyderabad - Sakshi

సాక్షి, హిమాయత్‌నగర్‌( హైదరాబాద్‌): నగరంలోని వివిధ ప్రాంతంలో సైబర్‌నేరగాళ్లు ముగ్గురినుంచి 4.20 లక్షలు వారి ఖాతాల్లోంచి లాగేశారు.దీంతో బాధితులు  గురువా రం   సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  
► బొల్లారానికి చెందిన పవన్‌ పార్ట్‌ టైం ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అతనికి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం వద్దు.. వ్యాపారంలో లాభాలు ఇప్పిస్తానని నమ్మించి పలు దఫాలుగా రూ. 1.60 లక్షలు తీసుకొని మోసం చేశాడు. 
► ఇన్‌స్ట్రాగామ్‌లో కనిపించిన ‘మార్కెటింగ్‌ ట్రేడింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ అనే యాడ్‌ చూసి సికింద్రాబాద్‌కు చెందిన శివాని వాట్సప్‌ ద్వారా సంప్రదించింది. సైబర్‌ నేరగాడు చెప్పినట్లు విని పలు దఫాలుగా రూ.1.20లక్షను పంపి మోసపోయింది. 
► ఆసిఫ్‌నగర్‌కు చెందిన వీణవాణికి ఓ వ్యక్తి పరిచమైయ్యాడు. ‘టూ ఎఫ్‌ఏయూక్యూ’ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేపించి రూ.1.50లక్షను పెట్టుబడి పెట్టించాడు. లాభాలు కనిపిస్తున్నా తీసుకోకపోవడానికి రాకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  
► స్నేహితుడు తన ఫొటోలను అడ్డుకుని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడని మలక్‌పేటకు చెందిన బాధితురాలు గురువారం సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement