ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. చున్ని యంత్రానికి చిక్కుకుని.. | Married Woman Dies Accidentally In Factory Karnataka | Sakshi

ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. చున్ని యంత్రానికి చిక్కుకుని..

Apr 4 2022 2:54 PM | Updated on Apr 4 2022 3:39 PM

Married Woman Dies Accidentally In Factory Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు చంద్రా లేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఆదివారం ఒక కర్మాగారంలో మహిళ ప్రమాదవశాత్తు చనిపోయింది. ప్లాస్టిక్‌ వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేస్తున్న షాజియా అనే కార్మికురాలి చున్నీ యంత్రం బెల్టుకు చుట్టుకుంది. దీంతో చున్నీ ఆమె మెడకు ఉరి మాదిరిగా బిగుసుకుపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఫ్యాక్టరీ యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు.  

మరో ఘటనలో..

సైబర్‌ మోసగాడు అరెస్టు 
హోసూరు: ఈ–మెయిల్‌ని హ్యాక్‌ చేసి ఎలక్ట్రికల్‌ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్‌  చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హోసూరుకు దినేష్‌కుమార్‌ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ  గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్‌ ఐడిని హ్యాక్‌ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్‌ (24) అనే యువకున్ని అరెస్ట్‌ చేశారు. 

చదవండి: ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట‍్యూబ్‌ చూసి.. ఆ తర్వాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement