factory
-
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి మృతి
చెన్నై:తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో శనివారం(జనవరి4) భారీ పేలుడు సంభవించింది. జిల్లాలోని సత్తూర్ సమీపంలోని బాణసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఆరుగురు మృతి చెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. ఫ్యాక్టరీ సమీపంలోని ఆరు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల జనాలు అక్కడినుంచి పరుగులు తీశారు. మంటలను ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో భారీ పేలుడు.. కార్మికుడు మృతి -
మిల్లెట్ ఫ్యాక్టరీ.. ఆమెకు ఆర్థిక బలం
‘మిల్లెట్స్లో పోషకాలుంటాయి. అందుకే వాటిని పునర్వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు మహిళా రైతులు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే దారిలో మామిడిపాలెంలో మహిళలే నిర్వహిస్తున్న ‘మిల్లెట్ ఫ్యాక్టరీ’ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. పాడేరు, అరకు ఏజెన్సీలో పండే చిరుధాన్యాలనుప్రాసెస్ చేసి దేశమంతా మార్కెట్ చేయడమేకాక, చిరుధాన్యాలతో వివిధ రకాల రుచికరమైన వంటకాల కోసం రెస్టారెంట్ కూడా నిర్వహిస్తున్నారు.పంట పండిన వెంటనే కొనడానికి తమను వెదుక్కుంటూ ఎవరూ రారని ముందే గుర్తించారు మామిడిపాలెం మహిళా రైతులు. పంట వేయడానికి ముందే మిల్లెట్స్కి మార్కెట్ ఎక్కడ ఉంది అని ఆరా తీశారు. ఆ విషయంలో ఒక ఎన్జీఓ వీరికి సహాయపడింది. మిల్లెట్స్ పండించినంత మాత్రాన ఆదాయం రాదని, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చినపుడే డిమాండ్ ఉంటుందని తెలుసుకున్నారు. దానికోసం వారి ఊరి మధ్యనే ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ పెట్టి చిరుధాన్యాలతో సేమియా, ఇడ్లీ, దోసె పిండి తయారు చేసి ΄్యాకింగ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ ఫ్యాక్టరీ సమీపంలో ఒక మిల్లెట్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి, సజ్జల జంతికలు, జొన్నల స్నాక్స్, అరికల అప్పడాల రుచి చూపిస్తున్నారు. ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి మార్కెట్ వాళ్లను వెతుక్కుంటూ వస్తుంది! ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ వల్ల ఏజెన్సీ రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించింది. మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చిరుధాన్యాలు పండించుకొని ఇక్కడేప్రాసెస్ చేయించుకొని లాభాలుపొందుతున్నారు. ఈ మిల్లెట్స్ మిల్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండొందలకు పైగా మహిళలకు ఉపాధి దొరికింది. ‘ఒకప్పుడు పశువులను మేపుకునే దానిని. మాకు దగ్గరే ఈ మిల్లెట్ ఫ్యాక్టరీ పెట్టాక ఇక్కడ పని దొరికింది. స్థిరమైన ఆదాయం వస్తోంది. దాంతో పిల్లలను చదివించుకుంటున్నాను’ అన్నారు మామిడిపాలేనికి చెందిన నూకరత్నం. ‘మాకు కొంతపొలం ఉన్నా దాని మీద వచ్చే పంటతో ఏడాదంతా బతకడం కష్టం అయ్యేది. కొన్నిరోజులు కూలి పనులకు వెళ్లేదానిని. అది కూడా అన్నిసార్లూ దొరికేది కాదు. ఈ ఫ్యాక్టరీలో చేరాకే మిల్లెట్స్ గొప్పతనం తెలిసింది. కనీస మద్దతు ధర దొరుకుతోంది’ అని సంతోషంగా చెప్పింది విజయ. వర్షాధార భూముల్లో అరుదైన సంపదను సృష్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చారు. సుస్థిర జీవనోపాధిపొంది ఏడాదికి రూ.కోటికి పైగా బిజినెస్ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన ఆత్మవిశ్వాసం, నమ్మకం సంపాదించారు. – శ్యాంమోహన్ఫ్యాక్టరీ ప్రత్యేకతలుఈ ఫ్యాక్టరీలో తొమ్మిది రకాల చిరుధాన్యాలుప్రాసెస్ చేస్తారు. బ్రాండెడ్ ΄్యాకింగ్ చేసి దాని మీద ఏ మిల్లెట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో స్పష్టంగా వివరాలిస్తారు ∙చిరు ధాన్యాలపై పోషకాలు ఎక్కువగా ఉండే లేయర్ తొలగించకుండా కేవలం పై పొట్టు మాత్రమే మర పట్టే యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. అందుకే మార్కెట్లో దొరికే వాటికంటే వీరి మిల్లెట్స్లో పోషకాలు ఎక్కువ. అన్నిరకాల మిల్లెట్స్ని ఇక్కడప్రాసెస్ చేయడం వల్ల రైతులు కూడా అన్ని రకాలు పండించడం మొదలు పెట్టారు. దీనివల్ల క్రాప్డైవర్సిటీ పెరిగింది.ఒక అధ్యయనం తరువాత...పాడేరు, అరకు ఏజెన్సీలో మిల్లెట్స్ ఉత్పత్తి పెరిగింది కానీ మార్కెటింగ్ సదుపాయాలు లేవు.ప్రాసెసింగ్ సదుపాయాలు లేవు. అపుడొక అధ్యయనం చేసింది ‘వాస¯Œ ’ స్వచ్ఛంద సంస్థ. సామలు, సజ్జలను ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కొని నాసిక్లోనిప్రాసెసింగ్ మిల్స్కి పంపుతున్నారు. అక్కడప్రాసెస్ చేసి వాటినే ఇక్కడికి తెచ్చి మన మార్కెట్లోకి అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల స్థానిక రైతులకు రేటు, తూకం దగ్గర మోసాలు జరుగుతున్నాయి. ఇదంతా గమనించాక సొంతంగాప్రాసెసింగ్ యూనిట్ పెడితే స్థానికంగా రైతులకు మేలు జరుగుతుందని గుర్తించాం. మహిళలతో మిల్లెట్ ఫ్యాక్టరీప్రారంభించాం’ అంటారు మార్కెటింగ్ నిపుణుడు శ్రీనివాస్. ఈయన ముడిధాన్యాలను నాణ్యమైన ధాన్యాలుగా మార్చడంలో మహిళలకు సాంకేతిక సహకారం అందించారు. -
నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపేయాలని కలెక్టర్ ఆదేశం
-
నిర్మల్ పల్లెల్లో ‘ఇథనాల్’ మంట
నిర్మల్/దిలావర్పూర్: తమ పచ్చని పంటపొలాల్లో ఇథనాల్ చిచ్చు పెట్టొద్దంటూ నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు కొన్ని నెలలుగా చేపడుతున్న నిరసన మంగళవారం తీవ్రరూపు దాల్చింది. దిలావర్పూర్ మండలంలోని దిలావర్పూర్–గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలన్న తమ డిమాండ్ను అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజల సహనం నశించింది. బంద్ పాటించడంతోపాటు దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద 61వ నంబర్ జాతీయ రహదారిపై ఒక్కసారిగా వందలాది మంది నిరసనకారులు రాస్తారోకోకు దిగారు. నిర్మల్–భైంసా మార్గంలో దాదాపు 12 గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో హైవేపై కొన్ని గంటలపాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి.ఆర్డీవో నచ్చజెప్పినా..: నిరసనకారులు రోడ్డుపైనే మధ్యాహ్నం, రాత్రి వంటావార్పు చేసుకోవడంతోపాటు సాయంత్రం నుంచి అక్కడే చలిమంటలు వేసుకున్నారు. వారికి నచ్చజెప్పేందుకు మధ్యాహ్నం 3 గంటల వేళ నిర్మల్ ఆర్డీవో రత్నకల్యాణి రాగా ఆమెను నిరసనకారులు అడ్డుకున్నారు. 20 మంది గ్రామస్తులను కలెక్టరేట్కు తీసుకెళ్లి కలెక్టర్తో మాట్లాడిస్తానని చెప్పినా వారు ససేమిరా అన్నారు. గతంలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే కలెక్టరే తమ వద్దకు రావాలంటూ ఆమెను ఘెరావ్ చేశారు. దీంతో ఆమె రాత్రి 9:30 గంటల వరకు వాహనంలోనే కూర్చుండి పోయారు. చివరకు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల స్వయంగా రోప్పార్టీ పోలీసులతో వచ్చి అడ్డుగా కూర్చున్న మహిళలను బలవంతంగా పక్కకు తప్పించి ఆర్డీఓను వాహనంలో నుంచి బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపోద్రిక్తులైన నిరసనకారులు ఆర్డీవో వాహనాన్ని బోల్తా పడేసి దానిపై చలిమంటల్లోని కర్రలను విసిరేశారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో లక్ష్మణచాంద మండల ఎస్సై సుమలత గాయపడ్డారు. మరోవైపు కొన్ని గంటలపాటు వాహనంలో కూర్చుండిపోయిన ఆర్డీఓ సైతం అనారోగ్యానికి గురైనట్లు తెలిసింది.చేతిలో ప్లకార్డులు, పురుగుమందు డబ్బాలుమాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి ‘కనబడుట లేదు..’ అంటూ వారి ఫొటోలతో కూడిన ప్లకార్డులను నిరసనకారులు ప్రదర్శించారు. అలాగే కొందరు మహిళలు పురుగుల మందు డబ్బాలు తీసుకొచ్చి ఇప్పటికైనా ఫ్యాక్టరీని తీసేయకపోతే తమకు అవే దిక్కంటూ చూపించారు.300 మంది పోలీసుల మోహరింపు..నిరసనకారులు బంద్తోపాటు ఆందోళన చేయొచ్చన్న సమాచారంతో నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దకు మంగళవారం వేకువ జామునే నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డితోపాటు జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, దాదాపు 300 మంది పోలీసు బలగాలను పంపించారు. రోజంతా రాస్తారోకో చేస్తున్నంత సేపు శాంతియుతంగానే ఉండాలని, ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తమ సిబ్బందిని ఆదేశించారు. రాత్రిపూట ఆందోళనకారులను అడ్డుకునేందుకు నిజామాబాద్ జిల్లా నుంచీ బలగాలను రప్పించారు.సీఎంవోకు నివేదిక పంపాం: కలెక్టర్నిర్మల్ చైన్గేట్: ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ ప్రకటనలో తెలిపారు. వారి ఆవేదనను సీఎంవోకు నివేదించినట్లు వివరించారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.ఆది నుంచి వద్దంటూనే..దిలావర్పూర్–గుండపల్లి గ్రామాల మధ్య శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్కు సమీపంలో దాదాపు 40ఎకరాల్లో పీఎంకే గ్రూప్ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ప్రహరీతోపాటు దాదాపు నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. రూ. వందల కోట్ల పెట్టుబడితో పెడుతున్న తమ ఫ్యాక్టరీ జీరో పొల్యూషన్తో కూడినదని నిర్వాహకులు చెబుతున్నారు. కానీ సమీపంలోని దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలు తొలి నుంచీ ఈ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. గతేడాది సైతం ఈ గ్రామాలు చేపట్టిన పరిశ్రమ ముట్టడి ఉద్రిక్తంగా సాగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. నాటి నుంచి ఆయా గ్రామస్తులు దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. తాజాగా దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలతో పాటు సమీపంలోని సముందర్పల్లి, కాండ్లి, టెంబరేణి, లోలం గ్రామాలూ ఆందోళనలో భాగమయ్యాయి. -
Fire Accident : జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
-
మూతపడిన బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ తెరవాలి
సాక్షి, నరసరావుపేట: బండ్లమోటు.. రాష్ట్ర చరిత్రలో దీనికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలానికి చెందిన ఈ ప్రాంతంలో దేశంలో రాజస్థాన్ తరువాత అత్యధికంగా సీసం లభించే ప్రాంతంగా చరిత్రలోకెక్కింది. దీంతో హిందుస్థాన్ కంపెనీ జింక్ ఫ్యాక్టరీని నిర్మించింది. మినీ వైజాగ్గా గుర్తింపు పొంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. కాలక్రమేణా ఉత్పత్తి వ్యయం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పతనమవడంతో 2002లో ఫ్యాక్టరీ మూతపడింది. అప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు, ప్రజాసంఘాలు, కార్మికులు తిరిగి జింక్ ఫ్యాక్టరీ తెరవాలని ఆకాంక్షిస్తున్నారు. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో శుద్ధిచేసిన జింక్ ధరలు రూ.1.3 నుంచి 1.5 లక్షల మధ్య ఉంటుండటంతో సీసం తవ్వకాలు తిరిగి ప్రారంభించాలని డిమాండ్ పెరుగుతోంది. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి తిరిగి ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఉపాధి అవకాలు పెరుగుతాయని ఆశిస్తున్నారు.480 మందితో మొదలైన తవ్వకాలు...బండ్లమోటులో సర్వే ఆఫ్ ఇండియా 1969లో సర్వే నిర్వహించి.. ఇక్కడ సీసం, రాగి నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించి జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థకు నివేదిక ఇచ్చింది. ఈ రిపోర్టు ఆధారంగా కేంద్రం హిందూస్థాన్ జింక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1978లో 480 మంది కార్మికులతో పనులు ప్రారంభించింది. 1980 నాటికి రోజుకు 240 టన్నుల సీసం శుద్ధి చేసే స్థాయికి కంపెనీ చేరింది. 1993కి ఆర్థిక సరళీకృత విధానాలు అమల్లోకి వచ్చాక సీసం ధరలు పడిపోయాయి. గనులు నిర్వహణతో లాభం లేకపోవడంతో ఉద్యోగుల భారం తగ్గించుకునేందుకు “గోల్డెన్షేక్ హ్యాండ్’ పేరిట 150 మంది ఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విరమణకు ఒప్పించింది. దీంతో 310 మంది ఉన్న శాశ్వత ఉద్యోగుల సంఖ్య 160కి పడిపోయింది. కాంట్రాక్ట్ ఉద్యోగులతో కొంతకాలం నెట్టుకొచ్చారు. 1998కి బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీను సొంతం చేసుకుంది. ఇక్కడి వెలికితీసిన సీసం శుద్ధి చేయడానికి రాజస్థాన్కు పంపడంతో రవాణా ఖర్చు తడిసిమోపెడు అవడంతో కంపెనీని మూసివేసింది. ఆ సమయంలో 125 మంది శాశ్వత, 150 మంది కాంట్రాక్టు సిబ్బంది ఫ్యాక్టరీలో పనిచేసేవారు. వీరితోపాటు పరోక్షంగా ఉపాధి పొందుతున్న వేలాది మంది రోడ్డునపడ్డారు.అంతర్జాతీయంగా పెరిగిన ధరలతో...గత కొంత కాలంగా అంతర్జాతీయంగా సీసం ధరలు రూ.1.3 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉంటోంది. దీంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి తవ్వకాలు ప్రారంభించేందుకు కృషి చేసింది. 2022 డిసెంబర్లో ప్రైవేట్ కంపెనీలను టెండర్లు వేయాలని ప్రకటన జారీ చేసింది. కొంత సాంకేతిక సమస్యలతో బిడ్డింగ్ పనులు ఆలస్యం అవ్వడం, ఇంతలో ఎన్నికల సమీపించడంతో ఈ ప్రతిపాదన మరుగునపడింది.తాజాగా బండ్లమోటు కార్మికల సంఘాలు సమావేశం ఏర్పాటు చేసి తిరిగి తవ్వకాలు ప్రారంభించాలని పిలుపునిచ్చాయి. పెరిగిన ధరలతో గిట్టుబాటు అవుతుందని, ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. గనిలో ఇంకా మేలైన సీసం నిల్వలు ఉన్నాయి. గతంలో తవ్వి తీసి ధరలు పడిపోవడంతో వదిలేసిన ముడి ఖనిజం సైతం 15 లక్షల టన్నుల వరకు నిల్వ ఉంది. ఇప్పటికే తవ్వితీసిన గనులను పర్యాటక క్షేత్రంగా మలిస్తే ఈ ప్రాంతానికి ఆర్థికంగా బలం చేకూర్చినట్టు అవుతుంది.తవ్వకాలు చేపట్టాలి నేను బండ్లమోటు జింక్ ఫ్యాక్టరీ కార్మిక సంఘం నేతగా పనిచేశాను. గతంలో ఓ వెలుగు వెలిగిన ఫ్యాక్టరీ మూతపడటంతో ఈ ప్రాంతానికి చెందిన వందలాది మంది ఉపాధి కోల్పోయారు. అప్పట్లో సీసం ధరలు తక్కువగా ఉండటం, తవ్వకం ఖర్చు పెరగడంతో మూతపడింది. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉన్న నేపథ్యంలో సాంకేతికతను ఉపయోగించి తవ్వకాలు ప్రారంభిస్తే మంచిది. కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అందుకు అవసరమైన అటవీశాఖ అనుమతులు సైతం పునరుద్ధరించుకోవాల్సి ఉంది. – జయకర్ రావు, కార్మిక సంఘం మాజీ వర్కింగ్ సెక్రటరీ, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్జీవనశైలిలో మార్పు వస్తుందిప్రస్తుత అంతర్జాతీయ మార్కెట్లో సీసం ధరలతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించడానికి సానుకూలంగా ఉంది. ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభిస్తే ఈప్రాంత ప్రజల జీవనశైలిలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దళిత, గిరిజన ప్రజలలో సాంఘిక పరమైన మార్పులు పెద్ద ఎత్తున రానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టి వీలైనంత త్వరగా తవ్వకాలు పునఃప్రారంభించాలి. గతంలో పనిచేసిన కార్మికులంతా కలిసి మాకు చేతనైనంతగా పోరాటాలు చేస్తున్నాం. – ఎంహెచ్ ప్రసాద్, హిందుస్తాన్ జింక్ లిమిటెడ్, కార్మిక సంఘం పూర్వ నేత -
పానాసోనిక్ 4680 బ్యాటరీ: ఎక్కువ రేంజ్ కోసం..
జపాన్కు చెందిన పానాసోనిక్ కంపెనీ 4680 లిథియం అయాన్ బ్యాటరీ సెల్లను భారీగా ఉత్పత్తి చేయడానికి సన్నద్ధమైంది. ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని (రేంజ్) పెంచడానికి ఈ కంపెనీ వీటిని తయారు చేయడానికి పూనుకుంది. ఈ బ్యాటరీల వినియోగంతో ఖర్చు కూడా తగ్గుతుందని తెలుస్తుంది.సాధారణంగా ఇప్పటి వరకు చాలా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించిన 2170 సెల్స్ 21 మిమీ వ్యాసం, 70 మిమీ పొడవు (0.83 x 2.8 ఇంచెస్) ఉంటుంది. అయితే 4680 సెల్స్ మాత్రం 46 x 80 మిమీ (1.8 x 3.1 ఇంచెస్) వద్ద చాలా లావుగా, కొంచెం పొడవుగా ఉంటాయి. అంతే వీటి పనితీరు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.4680 సెల్స్ పరిమాణంలో లావుగా ఉండటం వల్ల.. చిన్న సెల్స్ కంటే కూడా ఐదు రెట్లు ఎక్కువ పవర్ డెలివరీ చేస్తాయి. వీటిని ఎలక్ట్రిక్ వాహనాల్లో వినియోగించినప్పుడు రేంజ్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వినియోగదారుడు పీక్ పవర్ ఆశించవచ్చు. ఛార్జింగ్ కూడా చాలా వేగంగా ఉంటుంది. టెస్లా 2020 బ్యాటరీ డేలో ప్రకటించిన సెల్ కూడా ఇదే పరిమాణంలో ఉంది.ఇదీ చదవండి: పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు పానాసోనిక్ కంపెనీ 4680 బ్యాటరీల ఉత్పత్తిని త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 400 మంది సిబ్బంది దీనికోసం పనిచేయనున్నట్లు సమాచారం. సంస్థ ఈ సెల్స్ ఉత్పత్తి చేసి టెస్లా, లూసిడ్, టయోటా, ఫోర్డ్ వంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి
బరేలీ: యూపీలోని బరేలీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అక్రమంగా నిర్వహిస్తున్న బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి, ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. మరో ఇద్దరు చిన్నారుల జాడ తెలియడం లేదు. వారిని వెదికేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.రెండు గంటల వ్యవధిలో బాణసంచా ఫ్యాక్టరీలో ఒకదాని తర్వాత ఒకటిగా భారీ పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల తీవ్రతకు గ్రామమంతా దద్దరిల్లింది. సిరౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీం సంఘటనాస్థలికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న ఐదుగురిని రక్షించారు. ఈ ఘటన నేపధ్యంలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు సహా నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.పేలుడు ఘటన గురించి తెలుసుకున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బరేలీ రేంజ్) రాకేశ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్వాహకుడిని నాసిర్గా గుర్తించామన్నారు. అతనికిగల లైసెన్సు వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం నాసిర్కు భారీగా దీపావళి ఆర్డర్లు వచ్చాయని, దీంతో పగలు, రాత్రి టపాసుల తయారీ పని జరుగుతోందని, చాలా మంది కూలీలు పనిచేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. అయితే ఇక్కడ ఎటువంటి భద్రత ఏర్పాట్లు లేవని వారు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: భారత్ అప్రమత్తంగా ఉండాలి: జీటీఆర్ఐ -
టాటా ఎల్రక్టానిక్స్ కొత్త ఒప్పందం.. తొలి చిప్ ఫ్యాక్టరీ
న్యూఢిల్లీ: ధొలేరా చిప్ తయారీ ప్లాంటు కోసం తైవాన్కి చెందిన పవర్చిప్ సెమీకండక్టర్ మాన్యుఫాక్చరింగ్ కార్పొరేషన్తో (పీఎస్ఎంసీ) ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాటా ఎల్రక్టానిక్స్ తెలిపింది. దీని ప్రకారం ఈ ప్లాంటుకు సంబంధించి డిజైన్, నిర్మాణ, సాంకేతికాంశాల్లో పీఎస్ఎంసీ సహాయ, సహకారాలు అందిస్తుంది.పీఎస్ఎంసీ సాంకేతికత, నైపుణ్యాలు భారత్లో సెమీకండక్టర్ల తయారీని వేగవంతం చేయగలవని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. గుజరాత్లోని ధొలేరాలో టాటా గ్రూప్ రూ. 91,000 కోట్లతో చిప్ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. నెలకు 50,000 వేఫర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతోంది. దీనితో 1,00,000 పైచిలుకు నిపుణులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్పూర్- పూణె స్పెషల్ రైలు -
ఆఫ్రికాపై చైనాకు ఎందుకంత ప్రేమ?
ఆఫ్రికా దేశాలపై చైనా ఎన్నో వరాలు కురిపించింది. 51 బిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం, పది లక్షల ఉద్యోగాలు, సైనిక శిక్షణ... ఇలా అనేక హమీల వరదను పారించింది. ఒక వైపు చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో సాగుతోంది. మరో వైపు అమెరికా సహా పశ్చిమ దేశాలతో భౌగోళిక, రాజకీయ ఘర్షణలు, వ్యాపార ఆంక్షలు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీనివల్ల గ్లోబల్ మార్కెట్ కుంచించుకుపోతోంది. చైనా దౌత్యానికి, ఆర్థిక వ్యవస్థకు ఊపు తేవటానికి ఆఫ్రికా దోహదకారి అవుతుందని భావించింది. ఈ పూర్వరంగంలో ‘బీజింగ్ సమ్మిట్ ఆఫ్ ది ఫోరమ్ ఆన్ చైనా–ఆఫ్రికా కోఆపరేషన్’ (ఎఫ్ఓసీఏసీ) అనే సదస్సును మూడు రోజుల పాటు (2024,సెప్టెంబర్ 4–6) చైనాలో నిర్వహించింది. కోవిడ్ అనంతరం చైనా నిర్వహించిన అతి పెద్ద కార్యక్రమం ఇదే.ఈ సదస్సు ద్వారా ప్రధానంగా రెండు లక్ష్యాలను సాధించాలని భావించింది. మొదటిది గ్లోబల్ సౌత్లో తన ప్రభావాన్ని పెంచుకోవటం. రెండోది చైనా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చూసుకోవటం. గ్లోబల్ సౌత్ లో ఆఫ్రికా అత్యంత ముఖ్యమైంది. అందుకే ఈ ఖండం మనసు గెలుచుకోవటానికి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సర్వశక్తులు వెచ్చించారు. ఆఫ్రికాలో మొత్తం దేశాలు 54 ఉంటే 53 దేశాలు సదస్సులో పాల్గొన్నాయి. 2023 నాటికి, అమెరికాను అధిగమించి 282 బిలి యన్ డాలర్లతో చైనా ఆఫ్రికాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఆఫ్రికా మినరల్స్, ఫ్యూయల్స్, మెటల్స్ చైనాకు ఎగుమతి అవుతున్నాయి. మరో వైపు ఆఫ్రికా రుణదాతల్లో చైనా అగ్రగామిగా ఉంది. గత 20 ఏళ్లలో అది అందించిన రుణం 696 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు ప్రకటించిన 51 బిలియన్ డాలర్లు (360 బిలియన్ యువాన్లు) పెద్ద ఎక్కువేం కాదు అంటున్న వాళ్లూ ఉన్నారు. ఇందులో రుణాలుగా కొంత (210 బిలి యన్ల యువాన్లు), సహాయంగా కొంత (80 బిలియన్ల యువాన్లు), పెట్టుబడులుగా కొంత (70 బిలియన్ల యువాన్లు) అందించాలని బీజింగ్ నిర్ణయించింది. ఇదంతా వచ్చే మూడేళ్ల కాలంలో చేయాలనేది చైనా ఆలోచన. జిన్పింగ్ తన ప్రసంగంలో ఎక్కడా రుణం అన్న మాట వాడకుండా జాగ్రత్తగా ఆర్థిక సాయం అన్న పదాన్ని మాత్రమే ఉపయోగించారు. ఆఫ్రికాతో కేవలం వాణిజ్య సంబంధాలను మాత్రమే కాదు, రాజకీయంగా, ఆర్థికంగా సంబంధాలను ఉన్నతీకరించుకోవాలని భావిస్తున్నట్టు సంకేతాలు ఇచ్చారు. ‘మనం అంతా కలిసి రైళ్లు, రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, హాస్పిటళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాజెక్టులు ఎంతో మంది ప్రజల జీవితాలను, వారి అదృష్టాన్ని మార్చి వేశాయి’ అని జిన్పింగ్ గుర్తు చేశారు. ఈ దఫా ఆర్థిక సాయం డాలర్లలో కాకుండా చైనా యువాన్ల రూపంలో ఉంటుందని బీజింగ్ ప్రకటించింది. చైనా కరెన్సీని అంతర్జాతీయం చేయాలనేది దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. ఆఫ్రికాలో పది లక్షల మందికి ఉద్యోగాలను కల్పిస్తారు. ఇందుకోసం కనెక్టివిటీని పెంచేందుకు ప్రత్యే కంగా 30 ప్రాజెక్టులను చేపడతారు. మరో వెయ్యి చిన్న ప్రాజెక్టులను చేపడతారు. 140 మిలియన్ డాలర్లతో సైన్యా నికి ఆర్థిక సహకారం, శిక్షణ అందిస్తారు. ఆరువేల మంది సైనికులకు, వెయ్యి మంది పోలీసు అధికారులకు శిక్షణ అందిస్తారు. ఆఫ్రికా పారిశ్రామికీకరణకు అవరోధంగా నిలిచిన ఇంధన సమస్యను కూడా పరిష్కరిస్తామని చైనా హామీ ఇచ్చింది. ఐక్యరాజ్యసమితి అతి తక్కువ అభివృద్ధి సాధించిన దేశాలుగా పేర్కొన్న 33 ప్రాంతాల్లో ఓపెన్ మార్కెట్లు ప్రారంభిస్తామని (జీరో టారిఫ్లతో) ప్రకటించింది. ఇవన్నీ బీజింగ్కు ఉపయోగపడే అంశాలు. మా సంగతి కూడా ఆలోచించండి అని అడిగారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామ్ఫోసా. బదులుగా ‘వాణిజ్య మిగులు 64 బిలియన్ డాలర్లు ఉంది. మీ దగ్గర నుంచి రా మెటీరియల్, డెయిరీ ప్రోడక్ట్స్ మేము కొనుగోలు చేస్తాం’ అని చైనా హామీ ఇచ్చింది. అంతే తప్ప మరే రకమైన ప్రకటనలు చేయలేదు. అప్పుల ఊబిలోకి ఆఫ్రికా దేశాలు రుణమాఫీ చేసి తమకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించాలని చాలా ఆఫ్రికా దేశాలు కోరుతున్నాయి. మైనింగ్, ఇంధన రంగంలో ప్రైవేటు పెట్టుబడుల పోర్టుఫోలియోను వికేంద్రీకరించమని కోరుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ పెద్ద ప్రాజెక్టులను నిభాయించగలిగే పరిస్థితిలో లేదు. చైనా చేపట్టే మౌలిక వసతుల ప్రాజెక్టులు ఆఫ్రికా దేశాలను అప్పుల ఊబిలోకి లాగేస్తు న్నాయి. దాదాపు ఆరు బిలియన్ డాలర్ల అప్పుతోజాంబియా ఎగవేతదారుల్లో ఉంది. అలాగే ఘనా, ఆంగోలాలు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఇదే విషయాన్ని సదస్సులో చెప్పారు. ‘ఆఫ్రికా రుణాలనేవి భరించలేని దశకు చేరాయి, ఆర్థిక సుస్థిరత దెబ్బతింటోంది’ అని ప్రకటించారు. బీజింగ్ మాత్రం దీనికి స్పందించలేదు. రుణామాఫీ కాదు, కనీసం రుణాలను పునర్వ్యవస్థీకరిస్తుందని ఆఫ్రికా దేశాలు ఆశించాయి. కానీ చైనాది పెట్టుబడి దారు మనస్తత్వం. అది తన వ్యాపార ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుంది. మరి తాజా హామీలు ఆఫ్రికా దేశాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో భవిష్యత్తులో కానీ ప్రపంచానికి అర్థం కాదు.– డా‘‘ పార్థసారథి చిరువోలు ‘ సీనియర్ జర్నలిస్ట్ -
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
రింగ్రోడ్ ఇంటర్చేంజ్
దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ భారీ ప్రైవేటు పరిశ్రమ కోసం రీజనల్ రింగురోడ్డు ఇంటర్చేంజ్ డిజైన్ మారింది. ముందుగా ఎంచుకున్న డిజైన్లో రింగురోడ్ కూడలి నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. అది స్థానికంగా నిరసనకు కారణమవుతుందన్న ఉద్దేశంతో ఇంటర్చేంజ్ డిజైన్ను మార్చారు. నాలుగు లూప్లతో నిర్మించడానికి బదులు.. ఆ పరిశ్రమ వైపు లూప్ లేకుండా మూడింటితోనే ఇంటర్చేంజ్ డిజైన్ను ఖరారు చేశారు. - సాక్షి, హైదరాబాద్రోడ్డు లేఔట్ మార్చే వీలు లేక.. తూప్రాన్ నుంచి గజ్వేల్ పక్కగా వచ్చే రీజనల్ రింగురోడ్డు హైదరాబాద్–కరీంనగర్ రాజీవ్ రహదారిని ప్రజ్ఞాపూర్కు కాస్త ముందుగా క్రాస్ చేస్తుంది. రాజీవ్ రహదారి మీద వాహనాల రద్దీ ఎక్కువ. ఇలా అధిక రద్దీ ఉన్న రోడ్లను రీజనల్ రింగ్రోడ్డు క్రాస్ చేసేచోట.. నాలుగు లూప్లతో ఉండే క్లోవర్ లీఫ్ డిజైన్తో ఇంటర్చేంజ్ జంక్షన్లను నిర్మించాలని గతంలోనే నిర్ణయించారు. ఈ మేరకు ప్రజ్ఞాపూర్ సమీపంలో క్లోవర్ లీఫ్ డిజైన్తో ఇంటర్చేంజ్ నిర్మించాల్సి ఉంది. కానీ ఇంటర్ చేంజ్కు ఉండే నాలుగు లూప్లలో ఒక లూప్ కట్టాల్సిన చోట ఓ బ్రేక్ లైనర్స్ తయారీ పరిశ్రమ ఉంది. అదే డిజైన్తో నిర్మిస్తే.. ఆ పరిశ్రమను తొలగించాల్సిన పరిస్థితి. ఇలా జరగకుండా రింగ్రోడ్డును కాస్త అటువైపో, ఇటువైపో జరపడానికీ వీలు లేకుండా పోయింది. ఆర్ఆర్ఆర్ను హైదరాబాద్ వైపు జరపాలనుకుంటే.. ఓవైపు కొండపోచమ్మ సాగర్ జలాశయం, మరోవైపు వందల ఎకరాల్లో విస్తరించిన సామాజిక అటవీ ప్రాంతం అడ్డు వస్తున్నాయి. అదే గజ్వేల్ వైపు జరపాలనుకుంటే.. వేల ఇళ్లతో నిర్మించిన పునరావాస కాలనీ, గజ్వేల్ రింగురోడ్డు కూడలి అడ్డు వస్తున్నాయి. ఒకవేళ పరిశ్రమను తొలగించాలనుకుంటే.. దశాబ్దాలుగా స్థానికులకు ఉపాధినిస్తున్న పరిశ్రమను తొలగిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఇంటర్చేంజ్ డిజైన్ను మూడు లూప్లకు మార్చారు. మరో లూప్కు బదులు.. పరిశ్రమ ప్రహరీని ఆనుకుని రెండు కారిడార్లను నిర్మించి, ఇటు రాజీవ్ రహదారికి, అటు ‘రీజనల్’ప్ర«దాన వేకు అనుసంధానం చేసేలా డిజైన్ను సిద్ధం చేశారు. అయితే మార్పుల వల్ల అదనంగా కొంత రోడ్డు, రెండు వంతెనలు నిర్మించాల్సి వస్తుందని.. దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అంచనా వేశారు. -
పుంగనూరులో పరిశ్రమల కారిడార్ కనుమరుగు?
‘కరువుకు మారుపేరైన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి మండలాలను సస్యశ్యామలం చేయాలి. డొక్కలు మాడ్చుకుని ఊరుగాని ఊరు వెళుతున్న నిరుపేదల వలసలను నివారించాలి. స్థానికంగానే ఉపాధి కల్పించి చేయూతనందించాలి..’ అనే సదుద్దేశంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుంగనూరు వేదికగా పరిశ్రమల కారిడార్ తీసుకువచ్చింది. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్, గ్రానైట్, ఫీడ్ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు అందించింది. అలాగే ప్రతిష్టాత్మకమైన జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమను నెలకొల్పేందుకు శ్రీకారం చుట్టింది. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ వ్యవహారశైలితో ఆయా కంపెనీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టీడీపీ నేతల దమనకాండతో ఆయా పరిశ్రమల స్థాపన సందిగ్ధంలో పడింది. వేలాది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత భవితకు ఆశనిపాతమైంది.పుంగనూరు: స్థానికంగా పదివేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్ష ఉపాధి, మరో 20 వేల మందికి పరోక్ష ఉపాధి కల్పించే జర్మన్ పెప్పర్ ఎలక్ట్రికల్ మోషన్ బస్సులు, ట్రక్కుల పరిశ్రమ పుంగనూరు ప్రాంతం నుంచి తరలిపోనుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తూరు జిల్లా, పడమటి ప్రాంతంలో నిరుద్యోగం, వలసల నివారణకు పుంగనూరు సమీపంలోని ఆరడిగుంటలో రూ.4.640 కోట్లతో 800 ఎకరాలలో బస్సుల పరిశ్రమ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు గత ఏడాది అనుమతులు కూడా మంజూరు చేసింది. అప్పటి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, కంపెనీ సీఈఓ ఆండ్రియస్ హేగర్తో గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన పనులు ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు భూసేకరణ కూడా పూర్తిచేశారు. ఈ పరిశ్రమ పశ్చిమ ప్రాంతంలో మొట్టమొదట అతి పెద్ద భారీ పరిశ్రమగా నిలవనుందని స్థానికులు కలలుగన్నారు. ఈ ప్రాంత వాసులు తమ బతుకులు మారుతాయని, బిడ్డల భవిష్యత్ బాగుంటుందని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం కొన్నాళ్లు కూడా నిలవలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిశ్రమ ఏర్పాటు ఆశలపై నీరుచల్లినట్టయ్యింది. ప్రశాంతతకు మారుపేరైన పుంగనూరులో టీడీపీ శ్రేణులు సృష్టిస్తున్న అలజడులు, అల్లర్లు శాంతి భద్రతల సమస్యకు దారితీస్తున్నాయి. ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో భారీ పరిశ్రమ నెలకొల్పేందుకు యాజమాన్యం పునరాలోచనలో పడింది.నాటి నుంచి అడ్డంకులేపుంగనూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి కక్షగట్టారు. ఈ విభేదాలతోనే ఇన్నేళ్లుగా వారు అధికారంలో ఉన్నప్పుడు పుంగనూరు అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదేళ్లుగా పుంగనూరులో ఊహించని అభివృద్ధి జరిగింది. ఇలాంటి తరుణంలో చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావడంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిపోయింది.గతంలో ఎప్పుడూ అల్లర్లు లేవునియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నాటి నుంచి పుంగనూరులో అల్లర్లు జరగలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఇలాంటి ప్రశాంతత కలిగిన పుంగనూరులో ప్రస్తుత కూటమి ప్రభుత్వం చేసే ఆగడాలకు జనం బెంబేలెత్తిపోతున్నారు.కంపెనీలు వెనక్కే!పుంగనూరు మండలంలో సుమారు 20 వేల ఎకరాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పరిశ్రమల కారిడార్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన ఫెరా ఆలాయ్ పరిశ్రమ పనులు జరుగుతున్నాయి. అలాగే జర్మన్ కంపెనీ పనులు చేపట్టింది. గ్రానైట్ పరిశ్రమ, ఫీడ్ పరిశ్రమతో పాటు మరిన్ని కంపెనీలు ఏర్పాటుకు ముందుకొచ్చాయి. ఒక్కసారిగా అధికార పార్టీ చేష్టలకు పరిశ్రమల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ప్రశాంతత లేని ప్రాంతాలలో పరిశ్రమల ఏర్పాటు కష్టతరమేనని భావించి మరొక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఆగడాలే కారణంకర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుంగనూరులో పుష్కలమైన వనరులు లభిస్తాయని జర్మన్ కంపెనీ భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బస్సుల కంపెనీని ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేపట్టారు. ఇలాంటి తరుణంలో టీడీపీ అఽధికారం చేపట్టింది. పరిశ్రమ స్థాపనపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం అండతో ఆ పార్టీ శ్రేణులు అల్లర్లు సృష్టిస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నడూ లేనివిధంగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి నియోజకవర్గంలో తిరగరాదంటూ కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా పుంగనూరు ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. టీడీపీ నేతల ఆగడాలకు ప్రశాంత వాతావరణం దెబ్బతింటోంది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులపై దాడులు, ఆస్తుల ధ్వంసం లాంటి ఘటనలతో బస్సుల కంపెనీ ఏర్పాటుకు యాజమాన్యం వెనకడుగు వేస్తోంది. -
సియోల్: బ్యాటరీల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 20 మంది మృతి
సియోల్: దక్షిణ కొరియాలోని లిథియం బ్యాటరీల ఫ్యాక్టరీలో సోమవారం(జూన్24) ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లు సమాచారం. రాజధాని సియోల్ దక్షిణ ప్రాంతంలో ఆరిసెల్ బ్యాటరీ ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.దాదాపు 35 వేల బ్యాటరీ సెల్స్ను ఉంచిన గోదాములో పేలుళ్లు జరగడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన చోట ఇప్పటివరకు 20 మృతదేహాలను అధికారులు గుర్తించారు. డజన్లకొద్దీ ఫైర్ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. లిథియం బ్యాటరీల నుంచి వెలువడే మంటలార్పడానికి డ్రైశాండ్ను వినియోగించారు. నీళ్లు ఈ మంటలను ఆర్పలేవు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో 100 మంది దాకా పని చేస్తున్నారు. వీరిలో 78 మంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మంటలు అదుపులోకి రావడంతో సహాయక బృందాలు కర్మాగారం లోపలికి చేరుకొని మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాదంపై దేశాధ్యక్షుడు యూన్సుక్ యోల్ స్పందించారు. మంటలను అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విద్యుత్ వాహనాల్లో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో సౌత్ కొరియా ముందుంది. -
ఛత్తీస్గఢ్ ఘోర ప్రమాదం.. 18 మంది మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఈ ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ గన్పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి అందులో పని చేసేవాళ్లు మృతి చెందారు. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీయగా.. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. బెమెతారా జిల్లా బెర్లా తాలుకా బోర్సి గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. పేలుడు శబ్ధం భయంకరంగా వినిపించిందని.. ఆ ధాటికి భయంతో వణికిపోయామని స్థానికులు చెబుతున్నారు. కిలోమీటర్ల మేర ఆ శబ్ధం వినిపించిందని.. కొన్ని ఇళ్లు సైతం దెబ్బ తిన్నాయని అంటున్నారు. భారీగా మంటలతో దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు వెంటనే ఆ ఫ్యాక్టరీ వద్దకు పరుగులు తీశారు. పోలీసులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తోంది. ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది.. గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించింది. వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పేలుడు ధాటికి కార్మికుల దేహాలు ముక్కలై ఎగిరిపడ్డాయని, ఫ్యాక్టరీ లోపల 20 అడుగుల లోతు గోతులు ఏర్పడ్డాయని అధికారులు అంటున్నారు.కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. పేలుడు ధాటికి గల కారణాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యే మహారాష్ట్ర థానేలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 9 మంది చనిపోగా.. 60 మందికి పైగా గాయాలయ్యాయి. -
బిస్కెట్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం
-
కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం
సాక్షి, రంగారెడ్డి: మైలార్దేవుపల్లి పరిధి కాటేదాన్ పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుంది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది మాట్లార్పుతోంది. దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా అంచనా. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. -
బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. ఎనిమిదిమంది మృతి!
ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి జిల్లాలోని ఓ బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మృతదేహాలు లభ్యమైనట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లాలోని కోఖ్రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ పట్టణంలో చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఫ్యాక్టరీలో చిక్కుకున్న 10 మంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఫ్యాక్టరీలో ఇంకా ఎనిమిది మంది చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న యూపీ సీఎం యోగి అధికారులను అప్రమత్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. -
హిమాచల్లో అగ్ని ప్రమాదం.. దూకేసిన సిబ్బంది
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం సంభవివంచింది. ఓ కాస్మోటిక్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భవనంపై నుంచి దూకేశారు. ఈ ప్రమాదంలో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మొత్తం 41 మంది సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. #Himachal: major fire in a cosmetic factory in Baddi factory. 32 injured rescued, 24 feared missing. pic.twitter.com/hhD0xakgDs — Diksha Verma (@dikshaaverma) February 2, 2024 Massive fire broke out in cosmetic & perfume manufacturing factory in Baddi, Himachal Pradesh. About 130 employees were working in the factory at the time & many are feared to be trapped. Fire brigade & health department teams reached the spot.#Baddi #HimachalPradesh #fire pic.twitter.com/AyDt6EyA5J — Mirror Now (@MirrorNow) February 2, 2024 -
వీరి జీవితం.. వడ్డించుకున్న ‘విస్తరి’..!
జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదంటారు పెద్దలు. శ్రీ పావన ఇండస్ట్రీస్ అధినేత ‘విస్తరి’(భోజన ప్లేట్ల) వ్యాపారంతోనే జీవితాన్ని ‘విస్తరి’ంచుకుంటున్నారు. మరో 40 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీతోపాటు, జగన్ ప్రభుత్వం తీసుకున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధ చర్యలు వీరి వ్యాపారానికి ఊతమిచ్చాయి. ప్రమాదకర ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో ఇతోధికంగా సాయపడుతూ, వ్యాపారంలో రాణించాలనుకునే పలువురు ఔత్సాహిక యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప కార్పొరేషన్ : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎఈ) ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవే ట్ లిమిడెట్(ఏపీఐఐసీ) ద్వారా పరిశ్రమల ఏర్పాటు కు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఇందులో భాగంగానే ప్రొద్దుటూరు పట్టణంలోని పొట్టిపాడు రోడ్, బొల్లవరం వద్ద శ్రీ పావన ఇండస్ట్రీస్ ఏర్పాటైంది. 2019లో షెడ్ కన్స్ట్రక్షన్కు రూ.50 లక్షలు, మెషినరీకి రూ.50 లక్షలు చొప్పున మొత్తం రూ.కోటితో విస్తర్ల(భోజన ప్లేట్ల) తయారీ పరిశ్రమను పోరెడ్డి సందీప్ స్థాపించారు. ఈ పరిశ్రమ అనతి కాలంలోనే అంచెలంచెలుగా ఎదుగుతూ పలువురికి ఉపాధి కల్పిస్తోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పెరిగిన ధైర్యం పరిశ్రమల ఏర్పాటులో ప్రభుత్వ ప్రోత్సాహక చర్యలే తమకు ధైర్యాన్నిచ్చాయని సందీప్ చెప్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.13 లక్షలు రాయితీ ఇచ్చింది. దీంతోపాటు పరిశ్రమలకు అవసరమైన కరెంట్, నీరు, ఇతర అనుమతులకు సింగిల్ విండో విధానం అమలుతో శ్రమ, కాలయాపన తగ్గింది. ఈ చర్యలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్నిచ్చాయి. దీంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించడంతో పేపర్ ప్లేట్లు, కప్పులకు డిమాండ్ పెరిగింది. స్టీల్, ప్లాస్టిక్ ప్లేట్లు అయితే వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. లేకుంటే రోగాల బారిన పడే ప్రమాదముంది. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరోవైపు ప్లాస్టిక్ అంత వేగంగా భూమిలో కలిసిపోదు. అదే చేతిలో ఉంచుకొని తినే పేపర్ ప్లేట్లు(బఫే ప్లేట్లు), కూర్చొబెట్టి వడ్డించేవి(సిటింగ్ పేపర్ ప్లేట్లు) తినగానే పడేస్తాం. కడగాల్సిన శ్రమ ఉండదు. ఇవి పేపర్తో తయారు చేసినవి కావడంతో భూమిలో త్వరగా కలిసిపోతాయి. ప్రభుత్వ చర్యలతో ఈ తరహా పరిశ్రమలకు ఊతం ఏర్పడింది. ముడిసరుకు సరఫరా, ప్లేట్ల తయారీ శ్రీ పావన ఇండస్ట్రీస్లో క్రాఫ్ట్ పేపర్ రోల్స్, గమ్, ఫిల్మ్ తెచ్చి కారగేషన్ మిషన్లో వాటిని అతికించడం ద్వారా పేపర్ షీట్లు తయారు చేస్తున్నారు. వాటిని పేపర్ ప్లేట్లు తయారుచేసే కుటీర పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా చేస్తున్నారు. అందులోనే ఆరు మెషీన్ల ద్వారా వీరు కూడా వివిధ రకాల పేపర్ ప్లేట్లు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 20 మంది స్థానిక మహిళలు, మరో 20 మంది ఇతర రా ష్ట్రాలకు చెందిన వారు ఉపాధి పొందుతున్నారు. వీరు తయారు చేసే భోజన ప్లేటు హోల్సేల్గా రూ.1.50, బహిరంగ మార్కెట్లో రూ.2.50కు విక్రయిస్తున్నారు. భారీ స్థాయిలో పేపర్ షీట్లు, ప్లేట్లు తయారు చేయడంతో వీరికి ఆదాయం కూడా బాగానే ఉంటోంది. నీడ పట్టున ఉంటూనే సంపాదన పావన ఇండస్ట్రీ ఏర్పాటుకు ముందు ఏ పనీ లేక ఇంటిదగ్గరే ఉండేదాన్ని. ఈ పరిశ్రమ ఏర్పాటుతో ఇందులో పనిచేస్తూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా. నా కుటుంబ జీవనానికి, పిల్లల చదువులకు, నా ఖర్చులకు ఈ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతోంది. నాలాంటి పది మంది మహిళలు ఇక్కడ పనిచేస్తున్నారు. నీడ పట్టునే ఉండి ఈ మాత్రం సంపాదించడం సంతోషమే కదా..! – భారతి, ప్రొద్దుటూరు ఉన్న ఊర్లోనే ఉపాధి ఈ పరిశ్రమలో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను. నెలకు రూ.15 వేలకు పైగానే సంపాదించుకుంటున్నా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎవరు ఏ పని చేయాలో చెప్పడం, ముడి సరుకు రప్పించడం, తయారు చేసిన ప్లేట్లను ప్రాంతాల వారీగా సప్లై చేయడం తదితర విషయాలను చూసుకుంటాను. పెద్దగా శారీరక శ్రమ ఉండదు. ఉన్న ఊర్లోనే గౌరవ ప్రదమైన జీతం వస్తోంది. – శశిధర్, మేనేజర్, ప్రొద్దుటూరు -
‘ఇథనాల్’పై గ్రామస్తుల ఆగ్రహజ్వాల
దిలావర్పూర్ (నిర్మల్): నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండల కేంద్రం–గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన బుధవారం ఉద్రిక్తంగా మారింది. ఒక్కసారిగా తరలివచ్చిన గ్రామస్తులు, రైతులు ఫ్యాక్టరీపై దాడిచేసి, వాహనాన్ని తగులబెట్టడంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. పోలీసులు లాఠీచార్జీ చేసినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో కొన్ని గంటలపాటు ఉద్రిక్తత కొనసాగింది. చివరకు జిల్లా ఉన్నతాధికా రులు సముదాయించడంతో గ్రామస్తులు వెనక్కితగ్గారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వాటర్ సమీపంలో నిర్మిస్తున్న ఫ్యాక్టరీపై మొదటి నుంచీ రైతులు, గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సమీప గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేయడంతోపాటు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా ఫ్యాక్టరీ పనులు ఊపందుకోవడంతో బుధవారం దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఒక్కసారిగా పరిశ్రమ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. అక్కడ నిర్మిస్తున్న ప్రహరీని కూల్చేశారు. నిర్మాణా లను అడ్డుకున్నారు. వందలమంది మూకుమ్మ డిగా దాడికి పాల్పడటంతో నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఓ కారును ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. నిర్మల్ నుంచి ఫైరింజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. మరోపక్క రైతులు, గ్రామస్తులు దిలావర్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వారిని సివిల్డ్రెస్లో ఉన్న పోలీసులు వీడియో తీస్తుండగా వారు ఇథనాల్ కంపెనీ వారని అనుకున్న గ్రామస్తులు దాడి చేశారు. పోలీసుల ఫోన్లు లాక్కుని ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇందులో పలువురు రైతులు, గ్రామస్తులకు గాయాలయ్యాయి. అడిషనల్ కలెక్టర్ కిశోర్కుమార్, భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, తహసీల్దార్ సరిత అక్కడికి వచ్చి సమస్యను ప్రభుత్వానికి నివేదిస్తామని, అప్పటివరకు శాంతియుతంగా ఉండాలని గ్రామస్తులను కోరగా, రైతులు శాంతించారు. కాగా, రైతులు, ప్రజలు గురువారం దిలావర్పూర్ మండల బంద్కు పిలుపునిచ్చారు. -
ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురి మృతి
మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామూన 2.15 గంటల సమయంలో ఛత్రపతి శంభాజీనగర్లోని వాలూజ్ ఎంఐడీసీ ప్రాంతంలో ఉన్న చేతి గ్లౌజ్ల ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చెలరేగిన భారీగా మంటలకు ఆరుగురు మృతి చెందారు. ‘తెల్లవారుజామూన 2.15 గంటలకు అగ్ని ప్రమాద సమాచారం అందింది. వెంటనే ప్రమాద స్థలానికి చేరుకొని సాహయక చర్యలు చేట్టాం. అప్పటికే ఆరుగురు ఫ్యాకర్టీ మంటల్లో చిక్కున్నారు. దీంతో రెస్క్యూ చేసిన ఆ ఆరుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చాం’ అని అగ్నిమాపక అధికారి మోమన్ మోంగ్సే తెలిపారు. ఘటన స్థలంలో సాయహక చర్యలు కొనసాతుగున్నాయని తెలిపారు. -
సోలార్ కంపెనీలో భారీ పేలుడు.. తొమ్మిదిమంది మృతి!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి ఓ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పేలుడు ఘటనలో గాయపడివారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నాగ్పూర్ రూరల్ ఎస్పీ హర్ష్ పొద్దార్ ఈ సంఘటన గురించి మాట్లాడుతూ నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలోని సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీకి చెందిన కాస్ట్ బూస్టర్ ప్లాంట్లో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఈ పేలుడు సంభవించిందన్నారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సందీప్ పఖాలే మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీలో భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, రసాయనాలు ఉండటం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం భారీగా జరిగే అవకాశం ఉందన్నారు. మృతుల్లో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారన్నారు. ఇది కూడా చదవండి: లోక్సభ ఎన్నికల బరిలో లాలూ చిన్న కుమార్తె? -
కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి!
మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని పింప్రి చించ్వాడ్లో గల ఒక కొవ్వొత్తుల తయారీ కర్మాగారంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. 10 మంది గాయపడ్డారు. ఈ సమాచారాన్ని ఓ అధికారి మీడియాకు తెలియజేశారు. పింప్రి-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శేఖర్ సింగ్ ఈ ఉదంతం గురించి మీడియాతో మాట్లాడుతూ తల్వాడేలో గల కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో మంటలు సంభవించినట్లు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. ఈ కర్మాగారంలో.. పుట్టినరోజు వేడుకల్లో ఉపయోగించే కొవ్వొత్తులను తయారు చేస్తుంటారని ఆయన తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారని, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్ యజమాని సంఘటన గురించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారని, ఆ తర్వాత వారు సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారన్నారు. ప్రమాదంలో ఆరు మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయని, వాటిని గుర్తించడం కష్టంగా మారిందన్నారు. ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన చెప్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామన్నారు. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీచేశారు. అగ్నిప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ దేశ్ముఖ్ ససూన్ జనరల్ ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శించారు. ఇది కూడా చదవండి: ఏమీ చేయకుండా నెలకు రూ. 9 లక్షలు.. ఫలించిన కుర్రాడి ఐడియా! -
రూ.160 కోట్ల డ్రగ్స్ పట్టివేత
ముంబై: మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని ఓ ఫ్యాక్టరీలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఆదివారం అపెక్స్ మెడికెమ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి రూ.160 కోట్ల విలువైన 107 లీటర్ల మెఫెడ్రిన్ను గుర్తించారు. ఈనెల 20న ఇదే జిల్లాలో జరిపిన దాడుల్లో రూ.250 కోట్ల విలువైన కెటమిన్, కొకైన్, మెఫెడ్రిన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
నేడు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సీసీపీటీ వాహనాల విడుదల
సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్ఎల్ ప్రధానంగా ఆర్మ్డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు. సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ.. సీసీపీటీని డీఆర్డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్(సీవీఆర్డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది. తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
ఆరని ఇథనాల్ చిచ్చు.. పోలీసుల లాఠీచార్జ్పై సీబీఐ విచారణ చేయాలి
నారాయణ్పేట్: కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాల్సి ఉండగా.. ఇథనాల్ కంపెనీ ఆయా గ్రామాల్లో చిచ్చు పెట్టింది. ఆదివారం జరిగిన ఘటనతో చిత్తనూర్, ఎక్లాస్పూర్, జిన్నారం గ్రామాల్లో సోమవారం దసరా పండుగ వాతావరణం ఎక్కడా కనిపించలేదు. ఆయా గ్రామస్తులు ఇళ్లకు తాళాలు వేసి అడవులు, బంధువుల ఇళ్లకు తరలివెళ్లారు. ఎక్లాస్పూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం దగ్గర కంపెనీ నుంచి వ్యర్థాలతో వచ్చిన ఓ ట్యాంకర్ను అడ్డుకొని ధర్నా చేస్తున్న మూడు గ్రామాల ప్రజలు, పోలీసులకు నడుమ జరిగిన ఘర్షణలో 10 మంది గ్రామస్తులు, ఏడుగురు మంది పోలీసులు గాయపడ్డారు. సెల్ఫోన్లలో తీసిన వీడియోలు, ఫొటోల ఆధారంగా పోలీసులపై దాడి చేసిన వారిని గుర్తించి ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి నుంచి గాలింపు ప్రారంభించారు. ఇళ్లల్లో ఉన్న వారిని పోలీసు వాహనాల్లో ఇతర మండలాల పోలీస్స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు. మరింత మంది కోసం ప్రత్యేక పోలీసులు గాలింపు ప్రారంభించారు. చిత్తనూర్, ఎక్లాస్పూర్ సర్పంచులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. భయాందోళనలో గ్రామస్తులు.. రాత్రిళ్లు స్పెషల్ బెటాలియన్ పోలీసులు గస్తీ నిర్వహిస్తుండటంతో చిత్తనూరు, జిన్నారం, ఎక్లాస్పూర్ గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు గ్రామాలు వదిలి వెళ్లడంతో ఇళ్ల దగ్గర ఉన్న వృద్ధులు, చిన్నారులు బిక్కుబిక్కుమంటు కాలం వెళ్లదీస్తున్నారు. జన సంచారం లేక ఆయా గ్రామస్తులు నిర్మానుష్యంగా మారాయి. ఇళ్లకు తాళాలు.. పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వారి కోసం పోలీసులు రెండ్రోజులుగా ఇల్లిల్లూ జల్లెడ పడుతుండటంతో మూడు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లకు తాళాలు వేసి ఇతర గ్రామాలకు కొందరు, వ్యవసాయ పొలాలకు మరికొందరు తరలివెళ్లారు. ఇళ్ల వద్ద కేవలం వృద్ధులు, చిన్నారులు మాత్రమే ఉన్నారు. పండుగ కోసం గ్రామాలకు వచ్చిన బంధువులను సైతం రాత్రిళ్లు పోలీసులు చితకబాదినట్లు వివరించారు. ఐజీ, డీఐజీ ఆరా.. ఘర్షణ వివరాలు తెలుసుకునేందుకు సోమవారం ఐజీ షానవాజ్ ఖాసీం, డీఐజీ ఎల్ఎస్ చౌహన్, ఎస్పీ యోగేష్ గౌతమ్ మరికల్ పోలీస్స్టేషన్కు వచ్చారు. సీఐ కార్యాలయంలో సుమారు మూడు గంటల పాటు చర్చించారు. ఎన్నికల్ కోడ్ అమలులో ఉన్నందుకు బాధ్యులపై తీసుకోవాల్సిన చర్యలు, చట్టపరమైన అంశాలను చర్చించినట్లు తెలిసింది. పోలీసుల లాఠీచార్జ్పై సీబీఐ విచారణ చేయాలి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీని మూసివేయాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కంపెనీ నుంచి వ్యర్థాలను తరలిస్తున్న ట్యాంకర్ను అడ్డుకున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేల్చాలన్నారు. ఇథనాల్ కంపెనీపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. కంపెనీ వ్యర్థాలను సమీపంలోని మన్నె వాగులో వేయడం వల్ల నీళ్లు కలుషితమవుతున్నాయని.. మూగజీవాలు, మానవళికి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ చేయించి బాధిత గ్రామాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నర్సన్గౌడ్, తిరుపతిరెడ్డి, వేణు ఉన్నారు. గ్రామస్తులపై దాడిని ఖండిస్తున్నాం.. రెండేళ్ల నుంచి కంపెనీ రద్దు కోసం ఉద్యమిస్తున్న గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ను ఖండిస్తున్నామని పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఇద్దరు ఎమ్మెల్యేలు స్పందించకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందన్నారు. వీరన్న, కృష్ణయ్య పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. మూడు గ్రామాల ప్రజలపై పోలీసుల లాఠీచార్జ్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. బాల్రాం, గోపాల్, సుదర్శన్, మల్లయ్య ఉన్నారు. కేసులు ఎత్తి వేయాలి.. గ్రామస్తులపై పోలీసుల లాఠీచార్జ్ హేయమైన చర్యగా భావిస్తున్నామని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలను కూడా చూడకుండా పోలీసులు దాడి చేసి ఆ ప్రాంతాన్ని హింసాత్మకంగా మార్చారని, ఇందుకు వారే బాధ్యత వహించాలన్నారు. గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నారాయణ, కాళేశ్వర్ ఉన్నారు. 20 మందిపై కేసులు నమోదు.. పోలీసులపై దాడి ఘటనలో మూడు గ్రామాల్లోని 20 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిప్రసాద్రెడ్డి తెలిపారు. వీరిని నారాయణపేట కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. మిగిలిన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలి.. చిత్తనూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ ఘర్షణలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని మంగళవారం టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ను కలిసి విన్నవించారు. జూరాల ఆగ్రో ఇథనాల్ కంపెనీతో నీటి, వాయు కాలుష్యం ఏర్పడి సుమారు 26 గ్రామాలకు నష్టం వాటిల్లుతోందన్నారు. రెండేళ్లుగా ఆయా గ్రామాల ప్రజలు కంపెనీని తరలించాలంటూ పోరాడుతున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదని వివరించారు. ప్రజల విజ్ఞప్తులను వినిపించుకోకుండా వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నారని.. వ్యతిరేకిస్తున్న ప్రజలను కాపాడాలని కోరారు. నిజమైన దోషులను గుర్తించి మిగతా వారిని విడుదల చేయాలని కాంగ్రెస్పార్టీ తరఫున కోరారు. -
సమస్యలపై నిలదీస్తే అరెస్ట్ చేస్తారా?.. డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు
ఆదిలాబాద్: ప్రజాసమస్యలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ను నిలదీయడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? అని డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరి రావు ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో దిలావర్పూర్ మండలం గుండంపల్లి హెలీప్యాడ్ వద్దకు వెళ్లిన శ్రీహరిరావును బుధవారం అరెస్ట్ చేసి సారంగపూర్ పోలీస్టేషన్కు తరలించారు. ఈక్రమంలో పోలీసుల తీరును నిరసిస్తూ సారంగపూర్ పోలీస్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన పోలీస్స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. గుండంపల్లిలోని కాళేశ్వరం ప్యాకేజీ నంబర్ 27 అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారో.. చెప్పాలని డిమాండ్ చేశారు. దిలావర్పూర్ మండలంలో పచ్చని పంటపొలాల మధ్య విషవాయువు వెలువరించి ప్రజల ప్రాణాలు, పచ్చటి పంటపొలాలకు హాని కలిగించే ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మించడం వెనుక మరమ్మమేమిటో తెలుపాలని పేర్కొన్నారు. వెంటనే దానిని రద్దు చేయాలని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడవద్దని తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో అక్రమంగా 42 ఉద్యోగాలు అమ్ముకున్నారని తేలినప్పటికీ రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో? ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత దారుణమైన పాలన సాగిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ప్రజలకు సమాధానం చెప్పలేని మంత్రులకు ప్రజలే తగిన బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తిరగబడతారని, ఓటు హక్కుతో బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. సమర్థవంతమైన పాలన అందించే కాంగ్రెస్నే ప్రజలు కోరుకుంటున్నారని, తప్పకుండా రాష్ట్రంలో ఆ పార్టీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంజేశారు. ఈయన వెంట కాంగ్రెస్ నాయకులు అరుగుల రమణ, విలాస్రావు, బొల్లోజి నర్సయ్య, రొడ్డ మారుతి, అబ్దుల్ హాదీ, న్యాయవాది మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వజీద్ అహ్మద్, పొడెల్లి గణేశ్ తదితరులున్నారు. -
భారత్లో ప్రవేశించడానికి టెస్లా కొత్త వ్యూహం! ఇదే జరిగితే..
Tesla Battery Storage Factory: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇందులో భాగంగానే అనేక ఆధునిక కార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ బ్రాండ్ 'టెస్లా' (Tesla) ఇండియాలో ప్రవేశించడానికి అనేకవిధాలుగా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు కంపెనీ ఇప్పుడు 'బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ' ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గత కొన్ని రోజులకు ముందు మన దేశంలో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి నరేంద్ర మోడీతో చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే సుమారు 24,000 డాలర్ల విలువైన ప్లాంట్ భారతదేశంలో నిర్మించడానికి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి.. తయారీ & విక్రయం వంటి వాటికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీ నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ ఇప్పటికే ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. సోలార్ ప్యానల్స్, గ్రిడ్ నుంచి పవర్ స్టోర్ చేసుకుని రాత్రి సమయంలో లేదా విద్యుత్తుకు అంతరాయం కలిగిన సందర్భంలో ఉపయోగించుకోవడానికి ఇలాంటి బ్యాటరీలు ఉపయోగపడతాయి. టెస్లా ప్రతిపాదనకు ప్రభుత్వం కూడా సుముఖత చూపే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం టెస్లా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. కానీ ఇదే జరిగితే టెస్లా భారతదేశంలో తన ప్రాభవాన్ని నిరూపించుకుంటుంది. ఇదీ చదవండి: ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్లో ఇండియన్ ఎంప్లాయిస్.. బ్యాటరీ ఫ్యాక్టరీ ప్రస్తుతం దేశానికి చాలా అవసరమని, గ్రామీణ ప్రాంతాల్లో కరెంటుకు అంతరాయం కలిగినప్పుడు ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. పవర్ జనరేషన్ స్టోరేజి అవసరమైన అంశం.. ఈ అవకాశాన్ని టెస్లా అందుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తోంది. -
యుద్ధ విమానాల ప్లాంట్ను సందర్శించిన కిమ్
సియోల్: రష్యా పర్యటనలో ఉన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జొంగ్ ఉన్ శుక్రవారం యుద్ధ విమానాల ఫ్యాక్టరీని సందర్శించారు. కొమ్సోమోల్స్క్ ఆన్ అముర్లోని ఫ్యాక్టరీలో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ ఎస్యూ–57ను ఆయన ఆసక్తికరంగా పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వీడియోను రష్యా కేబినెట్ విడుదల చేసింది. ఒక ఎస్యూ–35 ఫైటర్ జెట్ ల్యాండ్ అయినప్పుడు కిమ్ చప్పట్లు కొడుతున్నట్లుగా ఉంది. కిమ్ సుఖోయ్ ఎస్జే–100 ప్యాసింజర్ విమానాల ప్లాంట్ను కూడా సందర్శించారని తెలిపింది. కిమ్ వెంట రష్యా ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఉన్నారు. బుధవారం రష్యా అధ్యక్షుడు పుతిన్తో కిమ్ భేటీ అయ్యారు. -
దిగొచ్చిన చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి: సంచలన నిర్ణయం
Xiaomi smartphone plant: చైనా స్మార్టఫోన్ తయారీదారులపై కొనసాగుతున్న ఒత్తిడి నేపథ్యంలో చైనా కంపెనీ షావోమి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో, చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీదారు షావోమి సప్లయిర్ డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ శివార్లలో భారీ ఫ్యాక్టరీని నిర్మించనుంది. దీంతో ఐఫోన్ తయారీ దారు తైవాన్ కంపెనీ ఫాక్స్కాన్కు పోటీగా డిక్సన్కు షావోమి పార్టనర్ షిప్ మరింత బలాన్నివ్వనుందని అంచనా. అయితే ఈ వార్తలపై అటు షావోమిగానీ, డిక్సన్గానీ అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. (ఎమర్జెన్సీ అలర్ట్ సివియర్..ఈ ఫ్లాష్ మెసేజ్మీకూ వచ్చిందా?) బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం 300,000 చదరపు అడుగులకు మించి, దాదాపు ఆరు ఫుట్బాల్ మైదానాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీలో డిక్సన్ మూడు సంవత్సరాలలో రూ. 400 కోట్ల రూపాయలు (48.2 మిలియన్ డాలర్లు) కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ఫోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ ప్లాంట్ను ఈ నెలాఖరులో ప్రభుత్వ అధికారి ప్రారంభించనున్నారు. (తొలి భారతీయ కంపెనీగా ఇన్ఫోసిస్ ఘనత: దిగ్గజ కంపెనీల ప్లేస్ ఎక్కడ?) అలాగే షావోమీ గతంలో చైనానుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్ నెక్బ్యాండ్ ఇయర్ఫోన్లను తయారు చేయడానికి దేశీయ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్ట్ను కుదుర్చుకుంది. ఇది గతంలో చైనా నుండి దిగుమతి అయ్యేవి. డిక్సన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీ. మోటరోలా, శాంసంగ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మెషీన్లు, టెలివిజన్ సెట్లతో సహా ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. మూడు దశాబ్దాల క్రితం డిల్లీ శివార్లలో సునీల్ వచాని డిక్సన్ను ప్రారంభించారు. కాగా ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకపుడు టాప్లో ఎదురు లేకుండా ఉన్న షావోమి కేంద్ర నిబంధనలు, నియంత్రణలతో అధిక నియంత్రణ త తర్వాట్ మార్కెట్ షేర్ను కోల్పోయింది. దీన్నుంచు కోలుకునే చర్యల్లో భాగంగా మేడిన్ ఇండియా 5G స్మార్ట్ఫోన్లను సరసమైన ధరలో అందించాలని ప్లాన్ చేస్తోంది. Leadership of @XiaomiIndia met me tdy - hv set out to them our expectations of thm increasing exports, deepening supply chain eco-system n value addition in India n all products to be data privacy compliant @PMOIndia @GoI_MeitY pic.twitter.com/Y8E1YXnOxv — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) July 6, 2022 -
కళ్లు చెదిరేలా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ.. వీడియోలు షేర్ చేసిన సీఈవో
భారతీయ మార్కెట్లో ప్రారంభం నుంచి అత్యధిక ప్రజాదరణ పొందుతున్న ఓలా ఎలక్ట్రిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒక్క డీలర్షిప్ కూడా లేకుండా అధిక విక్రయాలు పొందిన ఈ సంస్థ ఇప్పుడు మరింత దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇటీవల ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ రెండు వీడియోలను ట్విటర్ వేదికగా షేర్ చేశారు. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా ఫ్యూచర్ఫ్యాక్టరీకి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. ఇందులోని ఒక వీడియో కంపెనీలో లోపల జరుగుతున్న కార్యకలాపాలను చూపిస్తోంది. మరో వీడియోలో నిర్మాణంలో వేగంగా దూసుకెళ్తున్న గిగాఫ్యాక్టరీని చూడవచ్చు. ఇదీ చదవండి: రూ. 200 కోట్లు కంటే ఎక్కువ ఖరీదైన కారు! ఎందుకింత రేటు? ఈ వీడియోలను షేర్ చేస్తూ ఈ రోజు ఫ్యూచర్ఫ్యాక్టరీలో.. రానున్న రోజుల్లో ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరుగుతుందని ట్వీట్ చేసాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలమంది వీటిని వీక్షించగా.. చాలా మంది లైక్ చేస్తున్నారు. మరి కొందరు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. At the Futurefactory today. Major changeover from Gen 1 production to all Gen 2 products happening this week - Air, Pro, X! Capacity doubling and number of products going from 1 to 5. Also, Gigafactory construction underway. Crazy momentum and activity! pic.twitter.com/bymdf8qoPG — Bhavish Aggarwal (@bhash) August 20, 2023 -
యమ్మీ..యమ్మీ.. 'కుల్ఫీ"ని ఇష్టపడని వారుండరు..ఎలా చేస్తారంటే..!
రకరకాల ఐస్క్రీం ప్లేవర్స్ ఉన్నా కూడా కుల్ఫీ చూడగానే దాన్ని తినేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తారు ప్రజలు. అది అంతలా మధురంగా యమ్మీ..యమ్మీగా ఉంటుంది. దీనికి తీసుపోనిదీ ఏదీ లేదన్నట్లుగా.. ఇష్టంగా తినే చల్లటి పదార్థాలలో దీనిదే అగ్రస్థానం. అంతలా తనదైన రుచితో ప్రజల మనసును దోచుకుంది. అలాంటి కుల్ఫీ ఎలా తయారవుతుందో, ఏవిధంగా ప్యాక్ చేస్తారో చూద్దాం మంచి ఎండల్లోనూ లేదా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లటి కుల్ఫీ తింటే.. ఆ ఫీల్ వేరు. అబ్బా తలుచుకుంటేనే నోట్లోకి నీళ్లూరతాయి. పిల్లలు దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ దీని రుచికి ఫిదా అవుతారు. అలాంటి కుల్ఫీ ఎలా తయరవుతుందో తెలుసుకుందామనే ఆసక్తి అందరికీ ఉంటుంది కదా. ఐతే ఘజియాబాద్లోని ఓ ఫ్యాక్టరీ ఆ కుల్ఫీ ఎలా తయారువుతుందో విపులంగా వెల్లడించింది. సుమారు 120 లీటర్ల పాలనను మిషన్లో వేసి బాగా మరిగించి అందులో పాలపొడి, పంచదార తదితరాలను వేసి చిక్కగా మార్చుతుంది. ఆ తర్వాత 14 డిగ్రీల సెల్సియస్ చేరుకునేలా చల్లబరుస్తుంది. ఆ తర్వాత చక్కగా ప్యాక్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: స్వాతంత్య్ర పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఐకానిక్ స్వీట్ ఏంటో తెలుసా! ఎలా చేయాలంటే) -
సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!
మనసు దోచే దోసె గురించి ఎంత చెప్పినా తక్కువే. దోసె ప్రియుల కోసం సరికొత్త ‘ఫుడ్ చాలెంజ్’ ముందుకు వచ్చింది. ‘ఆరడుగుల పొడవు ఉన్న దోసెను ఒక్క సిట్టింగ్లో తినగలరా?’ అనే సవాలు విసురుతుంది ఈ ఫుడ్ చాలెంజ్. విజేత పొట్టశ్రమ వృథా పోదు. పదకొండు వేల రూపాయలను నగదు బహుమతిగా ఇస్తారు. పాపులర్ బ్లాగర్స్ వాణి, సావిలు ‘సమ్వన్ హు కెన్ ఫినిష్ దిస్?’ ట్యాగ్తో పోస్ట్ చేసిన ‘ఫుడ్ చాలెంజ్’ 5.7 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఢిల్లీలోని పాపులర్ రెస్టారెంట్ ‘దోసె ఫ్యాక్టరీ’లో ఈ ఆరు అడుగుల దోసెను తయారు చేయడంతోపాటు షూట్ చేశారు. మూడు రకాల మసాలాలు, నెయ్యితో తయారు చేసిన ఈ మెగా దోసెకు సాంబార్, చట్నీ, రవ్వ కేసరి కాంబినేషన్లుగా ఉంటాయి. ‘టైమ్ లిమిట్ లేకపోతే ఈజీగా లాగించవచ్చు’ అని కొందరు నెటిజనులు స్పందించారు. (చదవండి: ఔరా అమ్మకచెల్ల... భాంగ్రా స్టెప్పులు వేయడం ఇల్లా!) -
వైద్యుల కర్మాగారంగా తెలంగాణ: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: వైద్యుల కర్మాగారంగా తెలంగాణ మారిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిచ్చారు. ‘తెలంగాణ వైట్ కోట్ రివల్యూషన్ సాధించింది. ఆ మేరకు మెడికల్ కాలేజీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన సీట్లలో 43% తెలంగాణ నుంచే ఉన్నాయి. త్వరలోనే మండలస్థాయిలో త్వరలోనే 40 ప్రాథమిక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వరంగల్ హెల్త్ సిటీని ప్రారంభిస్తాం’ అని మంత్రి హరీశ్రావు వివరించారు. -
విషాదం: బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు.. 8 మంది మృతి..
చెన్నై: తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కృష్ణగిరి వద్ద బాణాసంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చిధ్రమై పడి ఉన్నాయి. అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. ఘటనాస్థంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న కొన్ని హోటళ్లు కూడా కూలిపోయాయి. పలు భవంతులు స్వల్పంగా దెబ్బతిన్నాయి. కాగా.. శిథిలాల కింద ఎంత మంది చిక్కుకున్నారో స్పష్టంగా తెలియదు. వారిని బయటికి తీయడానికి సహాయక చర్యలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని కోరారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడ్డవారికి రూ.50 వేలు ఇస్తామని ట్విట్టర్ వేదికగా తెలిపారు. Deeply saddened by the tragic mishap at a cracker factory in Krishnagiri, Tamil Nadu, resulting in the loss of precious lives. My thoughts and prayers are with the families of the victims during this extremely difficult time. May the injured recover soon. An ex-gratia of Rs. 2… — PMO India (@PMOIndia) July 29, 2023 పజాయపెట్టైలో జరిగిన ప్రమాదం భాదకలిగించిందని సీఎం స్టాలిన్ అన్నారు. బోగనపల్లిలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ బాణాసంచాను తయారు చేస్తున్నట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన సీఎం.. రూ.3లక్షల పరిహారాన్ని ప్రకటించారు. తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్షఇవ్వనున్నట్లు చెప్పారు. స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50 వేలు పరిహారాన్ని కేటాయించారు. Deeply saddened by the loss of valuable lives in the mishap at the firecracker godown in Boganapalli, Krishnagiri District. My prayers and thoughts are with the bereaved families. Wishing a speedy recovery to those injured.- Governor Ravi — RAJ BHAVAN, TAMIL NADU (@rajbhavan_tn) July 29, 2023 ఇదీ చదవండి: కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక భారత్లో ఆగిన తల్లి గుండె.. -
శ్రీనాద్ రోటాప్యాక్ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో పేలిన సిలిండర్
-
Viral Video: హఠాత్తుగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది
ఏమైందో ఏమో ఒక్కసారిగా ఓ నది ఎరుపు రంగులోకి మారిపోయింది. ఈ షాకింగ్ ఘటన జపాన్లో చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా స్థానిక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఓరియన్ బ్రూవరీస్ అనే బీర్ ప్యాక్టరీ లీక్ కారణంగా జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ షాకింగ్ ఘటన ఒకినావాలోని నాగో సిటీలోని ఓడరేవు వద్ద జరిగింది. కర్మాగారాన్ని చల్లబరిచే ప్రక్రియలో భాగంగా వినియోగించే ఒక రసాయనం కారణంగా ఇది జరిగిందని వివరణ ఇచ్చారు. ఇది సురక్షితమైనదేనని, ఈ రసాయనాన్ని కాస్మెటిక్ పరిశ్రమలో వియోగిస్తారని చెప్పారు. సదరు ఓరియన్ బ్రూవరీ కంపెనీ ఫుడ్ కలరింగ్ రసాయనం వల్లే ఇది ఈ రంగులోకి మారిందని. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపింది. తమ ఫ్యాక్టరీని చల్లబరిచే ప్రక్రియకు సంబంధించి ఆహార భద్రత చట్టాల నిబంధనలో జాబితాలో ఉందని వివరణ ఇచ్చింది. ప్రొపైలిన్ గ్లైకాల్ అనే రసాయంన లీకేజ్ కారణంగా ఇలా నది ఎరుపురంగులోకి మారిందని తెలిపింది. నిజానికి లీకైన శీతలీకరణ నీరు వర్షం ద్వారా నదిలోకి ప్రవహించడంతో ఇలా మారిందని, అది కాస్త సముద్రంలోకి చేరడంతో ఓడరేవు ఈ రంగులోకి మారిందని వెల్లడించింది ఓరియన్ బ్రూవరీస్ బీర్ కంపెనీ. ఈ మేరకు బీర్ కంపెనీ ప్రెసిడెంట్ హజిమ్ మురానో మాట్లాడుతూ..ఈ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడమే గాక ఈ లీక్ ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. Orion beer factory leak turns Japanese port red. pic.twitter.com/uyw3JC02S2 — Project TABS (@ProjectTabs) June 29, 2023 (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం..
గుజరాత్ : రాజ్ కోట్ లోని ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు ఇచ్చిన సమాచారమందగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. రాజ్ కోట్ లోని ఆనంద్ బంగ్లా చౌక్ సమీపంలో ఉన్న ఒక ఫర్నీచర్ గొడౌన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఉన్నట్టుండి అగ్నికీలలు ఎగిసిపడటంతో ఒక్కసారిగా దట్టమైన పొగ మేఘాల్లా ఆకాశంలో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనలకు గురై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వెంటనే అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకోగా సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేసింది అగ్నిమాపక సిబ్బంది. ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు గాని ఆస్తినష్టం ఎంత వరకు జరిగి ఉండవచ్చన్న వివరాలు తెలియాల్సి ఉంది. Fire breaks out at furniture godown near Anand Bangla Chowk in Rajkot. Fire tenders are at the spot. More details are awaited. pic.twitter.com/d9aA1x7sgF — Press Trust of India (@PTI_News) June 22, 2023 ఇది కూడా చదవండి: అజిత్ పవార్ ఏది కోరితే అదిస్తాం.. -
అవును.. భారత్కు టెస్లా వస్తోంది
అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా సీఈవో, ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్తో సమావేశమయ్యారు . ఈ సమావేశం అనంతరం భారత్లో టెస్లా భవిష్యత్తు గురించి ఎలాన్ మస్క్ మాట్లాడారు. Great conversation with @NarendraModi https://t.co/UYpRvNywHb— Elon Musk (@elonmusk) June 21, 2023 భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశం మంచి కోసం ఆలోచిస్తున్నారని, దేశంలో కొత్త కంపెనీల ఏర్పాటుకు మద్దతుగా ఉండాలనుకుంటున్నారని చెప్పారు. అదే సమయంలో ఇది దేశానికి ప్రయోజనం చేకూర్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మోదీ భారత్కు ఆహ్వానించారా.. తాత్కాలిక ప్రణాళికలను ఆయనతో పంచుకున్నారా అని అడిగిన ప్రశ్నకు మస్క్ అవునని సమాధానమిచ్చారు. మోదీ తనను భారత్కు ఆహ్వానించారని, వచ్చే ఏడాది భారత్ సందర్శించే ప్రణాళిక ఉందని పేర్కొన్నారు. ఈ ఏడాది చివరికల్లా.. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటును ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ మాట్లాడుతూ భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఈ ఏడాది చివరికల్లా ఖరారు చేసే అవకాశం ఉందన్నారు. కాగా అమెరికాలో బిజినెస్ లీడర్లతో సమావేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్కు ఎలాన్ మస్క్ స్పందించారు. మోదీని మరోసారి కలవడం గౌరవంగా ఉందంటూ రీట్వీట్ చేశారు. It was an honor to meet again — Elon Musk (@elonmusk) June 20, 2023 ఇదీ చదవండి: థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్: ఏ వాహనానికి ఎంతెంత? ప్రీమియం రేట్ల ప్రతిపాదనలు.. -
భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..
ఓ బాణా సంచా దుకాణంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్లు మేర దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన మైసూరులోని హుబ్లీ ఇండస్ట్రీయల్ పార్క్లోని ఓ ప్రైవేటు గోడౌన్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ గోడౌన్లో క్రాకరీ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారు. అందులో కోట్లాది రూపాయలు విలువ చేసే క్రాకర్లను నిల్వ ఉంచారు. ఈ క్రమంలో అనూహ్యంగా గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దీంతో బాణాసంచాలన్ని ఒక్కసారిగా పేలడంతో మంటలు మరింత చెలరేగాయి. దీని ధాటికి చుట్టుపక్కల ఉన్న దాదాపు 50కి పైగా భవనాలు త్రీవంగా దెబ్బతిన్నాయి. ఐతే ఈ గోడౌన్లో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది చనిపోయారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ మంటలను అదుపు చేసేందుకు దాదాపు 14 అగ్నిమాపక యంత్రాలు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. భవనంలో పలువురు పౌరులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పేలుడు ధాటికి మూడు కిలోమీటర్లు దూరం వరకు ప్రభావితమైనట్లు సమాచారం. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రమదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: ఆ హీట్ స్ట్రోక్ హీట్ మాములుగా లేదు! దెబ్బకు బహిరంగా కార్యక్రమాలు..) -
కాలుష్య కాసారంతో నిండిపోతున్న కృష్ణ కెనాల్ కాలువ...
-
టెస్లా మెగా బ్యాటరీ ఫ్యాక్టరీ.. ఆ దేశంలో
వ్యాపార రంగంలో అమెరికా, చైనా మధ్య పోటీ తారస్థాయిలో ఉన్నప్పటికీ టెస్లా కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ మాత్రం అవేవి ఎరగనట్టు చైనాలో వ్యాపారాన్ని విస్తరించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇందులో భాగంగానే చైనాలో అతి పెద్ద బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. నివేదికల ప్రకారం, చైనాలోని షాంఘైలో భారీ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి మస్క్ ముందడుగు వేశారు. ఇందులో భాగంగానే ఇక్కడ దాదాపు 10,000 మెగాఫ్యాక్ స్టోరేజీ యునిట్లను ఉత్పత్తి చేసేలా ఈ కంపెనీ నిర్మాణం చేపట్టనున్నట్లు టెస్లా ఆలోచిస్తోంది. ఇప్పటికే కాలిఫోర్నియాలో మెగా ప్లాంట్ కలిగి ఉన్న టెస్లా మరో భారీ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టనుంది. (ఇదీ చదవండి: నరేంద్ర మోదీని ఫాలో అవుతున్న మస్క్.. వైరల్ అవుతున్న నెటిజన్ల కామెంట్స్) అమెరికాలో ఉన్న టెస్లా ఫ్యాక్టరీకి అదనంగా చైనాలో ఈ కంపెనీ ప్రారంభించనున్నట్లు సీఈఓ మస్క్ వెల్లడించారు. ఈ సంవత్సరం చివరి నాటికి కొత్త ప్లాంట్ నిర్మాణం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు మస్క్ చెబుతున్నారు. అంటే 2024 నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని చైనా మీడియా వెల్లడించింది. చైనా ఇప్పటికే అత్యధికంగా బ్యాటరీలు ఉత్పత్తి చేసే దేశంగా కీర్తి గడించింది. దీనిని ఆసరాగా తీసుకుని టెస్లా అతి తక్కువ ధరకే బ్యాటరీలను తయారు చేయాలని సంకల్పించింది. 2019లో మొదటి సారి చైనాలో టెస్లా ఎలక్ట్రిక్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ కూడా షాంఘైలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 22వేల కంటే ఎక్కువ వాహనాలు ఉత్పత్తి అవుతున్నాయి. (ఇదీ చదవండి: చదివింది ఐఐటీ.. చేసేది పశువుల వ్యాపారం.. ఆదాయం ఎంతనుకున్నార?) జర్మనీలోని బెర్లిన్ సమీపంలో ఇప్పటికే టెస్లాకు ఒక ప్లాంట్ ఉంది. ఇది కాకుండా కంపెనీ మెక్సికోలోని మాంటెర్రీలో ప్లాంట్ నిర్మించనున్నట్లు గతంలో వెల్లడించింది. అయితే ఇప్పుడు చైనాలో భారీ ప్లాంట్ ఏర్పాటుకు మస్క్ తీవ్రంగా యోచిస్తున్నాడు. నిజానికి గతంలో వాషింగ్టన్, బీజింగ్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెరికా ప్రభుత్వం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని అక్కడి సంస్థలకు సూచించింది. ఇదే సమయంలో చైనాలో కంపెనీలు ఏర్పాటు చేయాలనుకునే కొన్ని సంస్థలు వెనక్కి తగ్గాయి. ఇది ఇలాగే మరో పది సంవత్సరాలు కొనసాగే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పుడు ఈ నిబంధనలను అతిక్రమించి మస్క్ ప్లాంట్ ఏర్పాటు చేయడం విడ్డూరమే చెప్పాలి. -
ఇక ఎయిర్ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ!
సాక్షి, ముంబై: ప్రపంచంలోని అతిపెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీదారు, యాపిల్ ఐఫోన్ మేకర్ ఫాక్స్కాన్ భారత్లో మరో ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి వేల కోట్ల రూపాయల ఆర్డర్ను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఐఫోన్ మేకర్గా ఉన్న తైవాన్కు మేకర్ ఇపుడు తొలిసారి ఎయిర్పాడ్స్ను కూడా ఉత్పత్తి చేయనుంది. దాదాపు 70శాతం ఐపోన్ల అసెంబ్లర్ ఫాక్స్కాన్ కొత్త ప్లాంట్లో ఎయిర్ప్యాడ్స్ ఉత్పత్తి షురూ అయితే తక్కువ ధరకే లభ్యం కానున్న యాపిల్ ఉత్పత్తుల జాబితాలో ఇవి కూడా చేరనున్నాయి. (లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!) రాయిటర్స్ అందిచిన రిపోర్ట్ ప్రకారం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఇండియా ఎయిర్ప్యాడ్ ప్లాంట్లో ఫాక్స్కాన్ 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,654 కోట్లు) పైగా పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా 2024 చివరి నాటికి తయారీని ప్రారంభించాలనే ఫాక్స్కాన్ లక్క్ష్యం. గత కొంతకాలంగా యాపిల్ భారత్లో తన కార్యకలాపాలని విస్తరించాలని యోచిస్తోంది. అయితే తక్కువ లాభాలు ఉన్నందున ఎయిర్పాడ్లను తయారు చేయాలని అనేదానిపై ఫాక్స్కాన్ తీవ్రం చర్చిస్తోందని చివరికి ఒప్పందంతో ముందుకు సాగాలని నిర్ణయించుకుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించిందేకు నిరాకరించిన ఫాక్స్కాన్ కస్టమర్ డిమాండ్ను తీర్చడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనా వెలుపల పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్కాన్ బుధవారం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎయిర్ప్యాడ్స్ సరఫరా చేస్తున్న చైనా కంపెనీలను కాదని, భారత్లో కాంట్రాక్ట్ ఉన్న ఫాక్స్కాన్తో యాపిల్ ఒప్పందం చేసుకున్నట్టు అంచనా. మరోవైపు ఈ వార్తలపై యాపిల్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ యాపిల్ నుండి మరిన్ని ఆర్డర్లను గెలుచుకోవడానికి Wistron Corp, Pegatron Corp వంటి తైవానీస్ ప్రత్యర్థులతో ఫాక్స్కాన్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
ఘోర అగ్నిప్రమాదం..పలువురికి తీవ్ర గాయాలు
నాసిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పలవురు కార్మికులు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయారు. ఈ మేరకు మహారాష్ట్రలో నాసిక్లోని ముండేగావ్ గ్రామంలోని ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బాయిలర్ పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున్న మంటలు చెలరేగాయని చెప్పారు. ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక దళాలు మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సుమారు 11 మంది కార్మికులను రక్షించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. Massive Fire After Explosion In Nashik Factory, Workers Feared Trapped https://t.co/QxhVRO0G1l pic.twitter.com/pJN6pDX6iC — Breaking News (@feeds24x7) January 1, 2023 (చదవండి: న్యూయర్ వేడుకల్లో రగడ..సెల్ఫీల కోసం వేరేవాళ్ల భార్యలతో బలవంతంగా..) -
ట్రిపుల్ఎఫ్ కర్మాగారంలో భారీ విస్ఫోటనం
పెంటపాడు: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ట్రిపుల్ఎఫ్ కర్మాగారంలో బుధవారం సాయంత్రం భారీ విస్పోటనం సంభవించింది. పరిశ్రమలో మూడంతస్తుల మేర ఉన్న ఎక్సైన్గా పిలిచే సాల్వెంట్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్లో 9 మంది పనిచేస్తుండగా వారిలో తాడేపల్లిగూడెం మండలం కుంచనపల్లికి చెందిన గుడిగంట మల్లికార్జునరావు అనే కార్మికుడి ఆచూకీ తెలియలేదు. అతడు గల్లంతైనట్టు భావిస్తున్నారు. కాగా మరో ముగ్గురు కార్మికులు తృటిలో తప్పించుకుని పరుగులు తీయడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా వారిని తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారిలో పరిస్థితి తీవ్రంగా ఉన్న ఇద్దరిని రాజమండ్రి తరలించినట్టు ఎస్ఐ జి.సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పరిశీలించారు. పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి విస్ఫోటనంలో దగ్ధమైన యంత్రాలను పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఫోన్లో కోరారు. -
శ్రీ సత్యసాయి జిల్లాలో అతి పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం
-
ఆసియాలోనే అతిపెద్ద ఎక్స్ ట్రూడర్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ తెలిపారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్లాంట్ను మంత్రులు సత్యవతి రాథోడ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా రాజీవ్ సాగర్ మాట్లాడుతూ పోషకాహార లోపం లేని తెలంగాణ కోసం కృషి చేయడమే తెలంగాణ ఫుడ్స్ లక్ష్యమన్నారు. దాదాపుగా 30 లక్షల మంది ఆరోగ్యవంతమైన జీవితం కోసం సంస్థ ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం నడుం బిగించిందని వివరించారు. ఆధునిక సాంకేతికత తో ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్లాంట్ ఆసియాలోనే ఇదే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ ముందు చూపుతో సంస్థ ఎంతో అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ 1975 లో నిర్మించింది కాబట్టి రానున్న భవిష్యత్ దృష్యా నూతన ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. మొత్తం 18,404 అడుగుల స్థలంలో నిర్మిస్తున్న ఈ ఫ్లాంట్ ద్వారా గంటలకు 4 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరగనుందని తెలిపారు. ఈ ప్లాంట్ నిర్మాణం కోసం రూ. 42 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ నూతన ప్లాంట్ ద్వారా ఇప్పుడు సరఫరా చేస్తున్న మన రాష్ట్రం, ఏపీతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మనం పోషకాహారం అందించవచ్చన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రానున్న మరో 40 ఏళ్లు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అవసరం మేర పోషకాహారం ఉత్పత్తి జరుగుతుందన్నారు. అంతే కాకుండ సివిల్ సప్లై వారికి అందించే ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఉత్పత్తి చేసి అందించే సామర్ధ్యం నూతన ప్లాంట్కు ఉందన్నారు. సంస్థ ఉత్పత్తి చేసే బాలామృతం, బాలామృతం+, స్నాక్స్ వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లోని 35,699 అంగన్వాడీ సెంటర్ల ద్వారా దాదాపు 15.5 లక్షల మంది లబ్ధిపొందుతున్నారని వివరించారు. అదే విధంగా ఏపీలోని 55,605 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 16.12 లక్షల మంది పోష్టికాహారం అందుకుంటున్నారని తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించాక ఉద్యోగులకు 20 శాతం వేయిజేస్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే సంస్థ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పవర్ వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు -
ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో దారుణం
సాక్షి, బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా కేంద్రంలోని బొమ్మలసత్రం సమీపంలో ఉన్న ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికుడు జమాల్బాషాను ఫ్యాక్టరీ యాజమాన్యం ఐదు రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన మంగళవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బాధితుడు జమాల్బాషా తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన అతను కొన్నేళ్లుగా ఎస్పీవై రెడ్డి పైపుల ఫ్యాక్టరీలో కార్మికునిగా పనిచేస్తున్నాడు. కార్మికులకు యాజమాన్యం అక్కడే భోజనాలు పెడతారు. జమాల్బాషా తనకు పరిచయం ఉన్న బియ్యం వ్యాపారితో ఫ్యాక్టరీకి బియ్యం సరఫరా చేయిస్తున్నాడు. బియ్యం వ్యాపారి నుంచి జమాల్బాషా కమీషన్ తీసుకుంటున్నట్లు అనుమానించి ఫ్యాక్టరీ మేనేజర్ శేషిరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మహేశ్వరరెడ్డిలు గత శుక్రవారం దాడి చేశారు. ఫ్యాక్టరీలోని ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేశారు. విషయం తెలుసుకున్న భార్య పర్వీన్ ఫ్యాక్టరీ ఎండీ సుజల వద్దకు వెళ్లి తన భర్తను విడిచి పెట్టాలని కోరింది. రూ.15 లక్షలు చెల్లిస్తేనే విడిపిస్తామని చెప్పడంతో పర్వీన్ బంధువుల సహాయంతో హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు జమాల్ను విడిపించి కారకులపై కేసు నమోదు చేయాలని నంద్యాల జిల్లా పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో త్రీటౌన్ పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి జమాల్బాషాను విడిపించారు. బాధితుని ఫిర్యాదు మేరకు యాజమాన్యంపై కేసు నమోదు చేస్తున్నట్లు డీఎస్పీ మహేశ్వరరెడ్డి మంగళవారం రాత్రి తెలిపారు. చదవండి: (అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్) -
RFCL ప్లాంట్ ను సందర్శించిన ప్రధాని మోదీ
-
లాక్డౌన్ అంటే పరుగులు తీసున్న చైనీయులు....కంచెలు, గోడలు దూకి...
బీజింగ్: చైనాలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఒక కోవిడ్ సోకిన రోగిని అత్యంత హేయంగా క్రేన్ సాయంతో తీసుకువెళ్లిన సంఘటన గురించి ఉన్నాం. ప్రపంచమంతటా చైనాలో కరోనా విషయమైన వ్యవహరిస్తున్న తీరుని విమర్శిస్తున్నా... ఏ మాత్రం తీరు మార్చుకోకపోగా మరిన్ని ఆంక్షలు విధిలించి ప్రజలను బెంబేలెత్తించేలా చేసింది. అది ప్రస్తుతం ఎంతలా ఉందంటే...చైనీయులు కరోనా కేసులు ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తారు అని తెలియగానే దూరంగా పరుగులు తీసే స్థాయికి వచ్చేశారు. ఈ మేరకు చైనాలో సెంట్రల్ సిటీ ఆఫ్ జెంగ్జౌలో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ ఫాక్స్కాన్లో కరోనా తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతుంది. దీంతో చైనా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జీరో కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలు యథావిధిగా అమలు చేస్తోంది. దీన్ని తప్పించుకునేందుకు పలువురు కార్మికులు ఫ్యాక్టరీ కంచెలు దూకి పారిపోతున్న వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి ప్రపంచంలోని సగం ఐఫోన్లు ఈ ఫాక్స్కాన్లోనే ఇక్కడే తయారవుతాయి. అంతేగాక ఈ ఫ్యాక్టరీలో దాదాపు 3 లక్షల మంది కార్మికులు విధులు నిర్వర్తిస్తారు. వారంతా ప్రస్తుతం ఈ లాక్డౌన్ గురించి భయపడి కాలినడకన ఇళ్లకు పయనమయ్యారు. పగటి పూట పొలాల మీదుగా రాత్రిళ్లు రోడ్ల మీద ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఫాక్స్కాన్ కంపెనీ యూఎస్ ఆధారిత యాపిల్ కంపెనీకి సరఫరదారు. ఐతే ఈ కాలినడకన ఇళ్లకు వెళ్తున్న కార్మికులకు స్థానికులే ఉచిత ట్రాన్స్పోర్ట్ సాయం అందిస్తున్నారు. ప్రస్తుతం హెనాన్ ప్రావిన్స్ రాజధాని జెంగజౌలో గత అక్టోబర్ 29 వరకు 167 కేసులు నమోదయ్యాయి. కేవలం గత ఏడు రోజుల్లోనే 97 కేసులు పెరిగాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో జీరో కోవిడ్ విధానం పూర్తి స్థాయిలో అమలు చేసింది. చైనా ప్రజలు ప్రభుత్వం ఈ ఏడాదితో ఈ జీరో కోవిడ్ చట్టాన్ని ఉపసంహిరిచంకుంటుందని భావించారు. ఐతే ఇటీవల జరిగిన 20వ కమ్యునిస్ట్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటిలో ఆ చట్టాన్ని ఉసంహరించే అవకాశం లేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేసి వారి ఆశలపై నీళ్లు జల్లారు. Workers have broken out of #Apple’s largest assembly site, escaping the Zero #Covid lockdown at Foxconn in #Zhengzhou. After sneaking out, they’re walking to home towns more than 100 kilometres away to beat the Covid app measures designed to control people and stop this. #China pic.twitter.com/NHjOjclAyU — Stephen McDonell (@StephenMcDonell) October 30, 2022 (చదవండి: కరోనా రోగుల పట్ల చైనా కర్కశత్వం.. పశువులకన్నా హీనంగా క్రేన్ల సాయంతో..!) -
వేదాంత దూకుడు: గుజరాత్లో సెమీకండక్టర్ ప్లాంటు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత సెమీకండక్టర్ ప్లాంటును గుజరాత్లో ఏర్పాటు చేయాలని పారిశ్రామిక దిగ్గజం వేదాంత నిర్ణయించింది. అహ్మదాబాద్లో తలపెడుతున్న ఈ ప్రాజెక్టులో డిస్ప్లే, సెమీకండక్టర్ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై వేదాంత ప్రతినిధులు కానీ, ఫాక్స్కాన్ వెంటనే స్పందించ లేదు. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్తో కలిసి 20 బిలియన్ డాలర్ల జాయింట్ వెంచర్గా వేదాంత తలపెట్టిన ఈ మెగా ప్రాజెక్టు కోసం తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటక కూడా పోటీపడ్డాయి. కానీ ఇటీవల ముగిసిన తుది చర్చల్లో మహారాష్ట్రను పక్కకు నెట్టి గుజరాత్ ఆ ప్రాజెక్టును దక్కించుకుంది. కాగా భారతదేశ సెమీకండక్టర్ మార్కెట్ 2020లో 15 బిలియన్ డాలర్లనుంచి 2026 నాటికి 63 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
గౌతమ్ అదానీ: 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. 2030 కల్లా నెం.1 లక్ష్యం!
న్యూఢిల్లీ: సోలార్ మాడ్యూల్స్, విండ్ టర్బైన్స్, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్స్ తయారీకి వీలుగా మూడు గిగా ఫ్యాక్టరీలను నెలకొల్పనున్నట్లు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ తాజాగా పేర్కొన్నారు. 2030 కల్లా శుద్ధ ఇంధనాలపై 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెచ్చించే ప్రణాళికల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ వేల్యూ చైన్లో భాగంగా అదానీ గ్రూప్ పెట్టుబడులను హెచ్చిస్తోంది. తద్వారా 2030కల్లా ప్రపంచంలోనే నంబర్వన్ పునరుత్పాదక ఇంధన కంపెనీగా ఆవిర్భవించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వాతావరణ మార్పులు, గ్రీన్ ఎనర్జీపై తమ గ్రూప్ 70 బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు కట్టుబడి ఉన్నట్లు గౌతమ్ అదానీ మరోసారి స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా దేశంలో మూడు గిగా ఫ్యాక్టరీల నిర్మాణానికి తెరతీయనున్నట్లు తెలియజేశారు. వెరసి ప్రపంచంలోనే అత్యుత్తమ సమీకృత గ్రీన్ ఎనర్జీ వేల్యూ చైన్ గ్రూప్గా నిలిచేందుకు వీలుంటుందని వివరించారు. యూఎస్ఐబీసీ గ్లోబల్ లీడర్షిప్ అవార్డు స్వీకరించిన సందర్భంగా గౌతమ్ అదానీ ఈ విషయాలు వెల్లడించారు. చదవండి: iPhone14: స్టీవ్ జాబ్స్ కుమార్తె సెటైర్ ఏమైంది? -
పామ్పై 3ఎఫ్ ఆయిల్ రూ.250 కోట్ల పెట్టుబడి
ముంబై: హైదరాబాద్ కంపెనీ 3ఎఫ్ ఆయిల్ పామ్ అరుణాచల్ ప్రదేశ్లో రూ. 250 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తాజాగా వెల్లడించింది. తద్వారా సమీకృత ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు ఇప్పటికే 120 ఎకరాల భూమిని సేకరించినట్లు తెలియజేసింది. పిబ్రవరిలో సొంతం చేసుకున్న భూమికి సంబంధించి నియంత్రణ సంస్థల ఆమోదంసహా అవసరమైన అన్ని రకాల అనుమతులను పొందినట్లు వెల్లడించింది. రెండు దశలలో ప్లాంటును నెలకొల్పనున్నట్లు తెలియజేసింది. స్థానికంగా 300 మందికి ఉపాధి కల్పించగల తొలి దశను 2023 సెప్టెంబర్కల్లా పూర్తిచేయగలమని భావిస్తున్నట్లు అభిప్రాయపడింది. పామాయిల్ ప్రాసెసింగ్ రిఫైనరీ, వ్యర్ధరహిత యూనిట్(జీరో డిశ్చార్జ్), పామ్ వ్యర్ధాలతో విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. ప్రస్తుత కంపెనీ నర్సరీ, పంటల నిర్వహణ, ఎఫ్ఎఫ్బీ హార్వెస్టింగ్, కలెక్షన్ తదితర రైతు అనుబంధ సర్వీసులకు మద్దతిస్తుందని తెలియజేసింది. -
ఫ్యాక్టరీలో భారీ పేలుడు... 13 మంది మృతి
లక్నో: ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం. దీంతో పోలీసులు ఫ్యాక్టరీ యజమాని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఈ మేరకు ఈ ఘటనలో చనిపోయిన మృతుల పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు గల కారణాల గురించి ప్రత్యేక నిపుణులతో సత్వరమే విచారణ జరపించాలని ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు. అంతేకాదు బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా సహయం అందించాలని ఆదిత్యనాథ్ జిల్లా పరిపాలనాధికారులను కోరారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ దృశ్యాలు ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. (చదవండి: ఢిల్లీలో భానుడి భగభగలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ) -
గుజరాత్లో ఘోర ప్రమాదం
-
గుజరాత్లో ఘోర ప్రమాదం: గోడ కూలి 12 మంది దుర్మరణం
Morbi's Salt Factory Wall Collapsed: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం మోర్బీలోని హల్వాద్ ఇండస్ట్రీయల్ ఏరియా(జీఐడీసీ)లోని సాగర్ ఉప్పు కర్మాగారం గోడ కూలి 12 మంది మరణించారు. మరో ముగ్గురు శిథిలాల కిందే ఇరుక్కుపోయినట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 12 మంది గోడ కిందే ప్రాణాలు వదిలిన ఘటన స్థానికంగా విషాదం నింపింది. ఘటన గురించి తెలియగానే.. స్థానిక ఎమ్మెల్యే బ్రిజేష్ మెర్జా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటుందని ఆయన తెలిపారు. Gujarat | At least 12 people died after a wall of a salt factory in Morbi's Halvad GIDC collapsed 12 people have died after an incident happened at Sagar Salt Factory in Halvad GIDC. Government stands with the families of the deceased: State Minister Brijesh Merja pic.twitter.com/lSBAaw2jJB — ANI (@ANI) May 18, 2022 ఇదిలా ఉంటే ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. The tragedy in Morbi caused by a wall collapse is heart-rending. In this hour of grief, my thoughts are with the bereaved families. May the injured recover soon. Local authorities are providing all possible assistance to the affected. — Narendra Modi (@narendramodi) May 18, 2022 GUJARAT: 12 PEOPLE KILLED IN WALL COLLAPSE "We have identified the owner of the factory," said SP of #Gujarat's #Morbi district where 12 people have been killed in a wall collapse in a salt factory. pic.twitter.com/ucDdKU5jCe — Mirror Now (@MirrorNow) May 18, 2022 -
టెస్లాకి షాకిచ్చిన షాంఘై!
ఎన్నో ఆశలతో చైనాలో టెస్లా కార్ల తయారీ కర్మాగారం స్థాపించిన ఈలాన్ మస్క్కి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సప్లై చెయిన్ సమస్యలతో షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూత పడినట్టు సమాచారం. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ మూత పడటం ఇది రెండోసారి. ఏషియా మార్కెట్పై కన్నెసిన ఈలాన్ మస్క్ వ్యూహాత్మక భాగస్వామిగా చైనాను ఎంచుకున్నాడు. షాంఘై సమీపంలో బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని నిర్మించాడు. ఇక్కడి నుంచి జపాన్, ఇండియా, ఇతర ఏషియా దేశాలకు ఎలక్ట్రిక్ కార్లు సప్లై చేయాలని భావించాడు. అయితే చైనాలో తయారైన వస్తువుల దిగుమతిపై భారీ సుంకాలు విధిస్తోంది ఇండియా. దీంతో ప్రపంచంలో రెండో పెద్ద మార్కెటైన ఇండియా విషయంలో ఈలాన్ మస్క్కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఓ వైపు మార్కెటింగ్ సమస్యలు చుట్టుముట్టగా షాంఘైలో కరోనా కేసులు పెరిగిపోవడం కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. మార్చి చివరి నుంచి షాంఘైలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో అక్కడ లాక్డౌన్ అమలు చేసింది డ్రాగన్ ప్రభుత్వం. దీంతో టెస్లా కార్ల కర్మాగారం మూత పడక తప్పని పరిస్థితి నెలకొంది. 22 రోజుల పాటు ఈ గిగా ఫ్యాక్టరీ షట్డవున్ అయ్యింది. షాంఘైలో కొంత మేర పరిస్థితులు చక్కబడటంతో 2022 ఏప్రిల్ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభించారు. అయితే కరోనా దెబ్బతో కఠిన లాక్డౌన్ అమలు చేయడంతో చైనాలో సప్లై వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కార్ల తయారీలో ఉపయోగించే అనేక ముడి వస్తువల లభ్యత తగ్గిపోయింది. దీంతో ఫ్యాక్టరీ తెరిచినా కార్లు ఉత్పత్తి చేసే పరిస్థితి లేక పోవడంతో మే 9న మరోసారి కర్మాగారానికి తాళం వేసింది టెస్లా. అయితే ఈ మూసివేతపై టెస్లా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చదవండి: ఈలాన్మస్క్.. అసలు విషయం ఎప్పుడో చెప్పు? -
ఫ్యాక్టరీలో పని చేస్తుండగా.. చున్ని యంత్రానికి చిక్కుకుని..
యశవంతపుర(బెంగళూరు): బెంగళూరు చంద్రా లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆదివారం ఒక కర్మాగారంలో మహిళ ప్రమాదవశాత్తు చనిపోయింది. ప్లాస్టిక్ వస్తువులను తయారుచేసే ఫ్యాక్టరీలో పని చేస్తున్న షాజియా అనే కార్మికురాలి చున్నీ యంత్రం బెల్టుకు చుట్టుకుంది. దీంతో చున్నీ ఆమె మెడకు ఉరి మాదిరిగా బిగుసుకుపోవడంతో స్పృహ తప్పి పడిపోయింది. సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందింది. ఫ్యాక్టరీ యజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. మరో ఘటనలో.. సైబర్ మోసగాడు అరెస్టు హోసూరు: ఈ–మెయిల్ని హ్యాక్ చేసి ఎలక్ట్రికల్ షాపు యజమానికి రూ. 65 వేలు అబేస్ చేసిన వ్యక్తిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హోసూరుకు దినేష్కుమార్ (38) బస్టాండు వద్ద ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. గత నెల 21వ తేదీ గుర్తు తెలియని వ్యక్తులు అతని ఈమెయిల్ ఐడిని హ్యాక్ చేసి బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి ఖాతాలోని 65 వేలను కొట్టేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపి బెంగళూరు వద్ద అత్తిపల్లికి చెందిన కాంతరాజ్ (24) అనే యువకున్ని అరెస్ట్ చేశారు. చదవండి: ప్రియుడితో షికార్లు.. గర్భం దాల్చడంతో వైద్యం కోసం యూట్యూబ్ చూసి.. ఆ తర్వాత -
రష్యాలోని గన్ పౌడర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం
-
ఓలా 'ఫ్యూచర్ ఫ్యాక్టరీ'లో అంతా మహిళా ఉద్యోగులే
న్యూఢిల్లీ: రానున్న కాలంలో ఓలా 'ఫ్యూచర్ ఫ్యాక్టరీ'ని మహిళామణుల చేత నిర్వహిస్తామని ఓలా చైర్మన్ భవేశ్ అగర్వాల్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర భారత్కీ ఆత్మనిర్భర విమెన్ అవసరమని పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీని దాదాపు 10 వేల మంది మహిళలే నిర్వహిస్తారని, ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళలు ఉన్న ఫ్యాక్టరీగా ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిలవనుందని చెప్పారు. మహిళలను సమగ్ర శ్రామిక శక్తిగా తీర్చిదిద్దడమే కాక ఆర్థిక పరంగా ఉపాధి అవకాశలు కల్పించిన తొలి సంస్థగా ఓలాను అభివర్ణించారు. చదవండి: సియాచిన్ హిమ శిఖరాన్ని అధిరోహించి ...రికార్డు సృష్టించిన వికలాంగులు సమానత్వానికే పెద్ద పీట..... ఈ క్రమంలో మహిళల నైపుణ్యాలను పెంపొందించేలా శిక్షణ ఇవ్వడానికీ పెట్టుబడులు పెట్టామని భవేశ్ తెలిపారు. ఈ ఉపాధి అవకాశాలు ఆర్ధికపరంగా వారి జీవితాల్ని, కుటుంబాల్ని మాత్రమే కాక యావత్ సమాజాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. అంతేకాక వాహనాల ఉత్పాదనకు సంబంధించిన పూర్తి బాధ్యత మహిళలదేనని చెప్పారు. శ్రామిక శక్తిలో మహిళల సమానత్వానికీ ప్రాధాన్యత ఇస్తే భారత్ జీడీపీ వృద్ధి రేటు 27% పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తరాలలో శ్రామిక శక్తిలో సమానత్వాన్ని తీసుకువచ్చేలా కార్యచరణ దిశగా తొలి అడుగులు వేసిన సంస్థగా ఓలా నిలుస్తుందన్నారు. భారతదేశ పురోగతిలో తమ వంతు పాత్ర పోషిస్తామని భవేశ్ చెప్పారు. చదవండి: ఉగ్రవాదుల్ని ఎదుర్కొనేలా భారత బలగాలకు వ్యూహాత్మక శిక్షణ ! -
సలసలకాగుతున్న వంటనూనె ధరలు! మరోసారి షాక్ తప్పదా?
Edible Oil Prices: కరువుతో అమెరికా , బ్రెజిల్లలో తగ్గిపోయిన సోయా ఉత్పత్తి, ఇండోనేషియాలో పెరిగిన పామాయిల్ రేట్లు ఇలా అంతర్జాతీయ కారణాలతో ఇంత కాలం వంటనూనెల ధరలు పెరగుతూ సామాన్యుడికి చుర్రుమనిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి మన దేశంలోని పరిస్థితులు కూడా తోడవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో వంట నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. గుజరాత్లో తగ్గిన ఉత్పత్తి దేశంలో వంట నూనె ఫ్యాక్టరీల్లో సింహభాగం గుజరాత్లోనే ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా వెయ్యికి పైగా వంట నూనె తయారీ కర్మాగారాలు ఉండగా ఇందులో ఇప్పటికే 800లకు పైగా ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపుగా మూత పడ్డాయి. భారీ నూనె తయారీ పరిశ్రమల్లోనే ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ ఫ్యాక్టరీల్లో కూడా మరో నెలకు సరిపడా ముడి పదార్థాలు ఉన్నాయి. మిల్లర్ల మొండిపట్టు వంటనూనె ముడి పదార్థాలైన వేరు శనగ, పత్తిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ఆసక్తి చూపించడం లేదు. ముఖ్యంగా పత్తికి సంబంధించి నాఫెడ్ దగ్గర సరిపడా నిల్వలు ఉన్నా.. ధర ఎక్కువగా ఉందనే కారణం చెబుతూ మిల్లర్లు కొనుగోల్లు మానేశారు. ధర తగ్గిన తర్వాతే ఉత్పత్తి మొదలు పెడతామంటూ భీష్మించుకున్నారు. పెరిగిన విదేశీ ఎగుమతులు గుజరాత్ నుంచి పత్తి, వేరు శనగల ఎగుమతులు విదేశాలకు పెరిగాయి. సాధారణంగా ప్రతీ ఏడు ఈ రాష్ట్రం నుంచి 30 లక్షల పత్తి బేళ్లు ఎగుమతి అవుతుండగా ఈ సారి మొత్తం 55 లక్షలకు చేరుకుంది. విదేశీ ఎగుమతులు పెరగడంతో గత పన్నెండేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కో బేల్ ధర రూ. 57,000లుగా పలుకుతోంది. దీంతో వీటిని కొనేందుకు ఆయిల్ మిల్లర్లు ముందుకు రావడం లేదు. అప్పుడే వంద పెరిగింది గుజరాత్లో కాటన్ సీడ్ ఆయిల్, గ్రౌండ్ నట్ ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ప్రభావం వంట నూనెల ధరలపై పడుతోంది. ఇప్పటికే 15 కేజీల కాటన్ సీడ్ ఆయిల్ ధర రూ.100 వరకు పెరిగింది. 15 కేజీల గ్రౌండ్ నట్ ఆయిల్ ధర రూ. 2,550 నుంచి రూ. 2,560లకి చేరుకుంది. కాటన్ సీడ్ టిన్ ధర రూ. 2400 నుంచి రూ.2500కి చేరుకుంది. చదవండి: Onion : ఉల్లిఘాటు.. ‘ముందే కొని పెట్టుకోండి’! -
ఓర్కా.. టన్నుల్లో బొగ్గుపులుసును మింగేస్తది
పర్యావరణ కాలుష్యానికి కార్బన్ ఉద్గారాలు ప్రధాన కారణమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహన కాలుష్యంతో పాటు ప్రకృతి వైపరిత్యాల కారణంగా గత రెండేళ్లుగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ శాతం విపరీతంగా పెరిగిపోతోంది. అయితే గాల్లోని బొగ్గుపులుసు వాయువును సంగ్రహించి.. కాలుష్యాన్ని తగ్గించే చర్యలు ప్రయత్నాలు అక్కడక్కడా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఐస్ల్యాండ్లో ప్రపంచంలోనే భారీ ఫ్యాక్టరీని నెలకొల్పి సంచలనాలకు తెర లేపింది. ప్రపంచంలోనే అతిపెద్ద Co2 సంగ్రహణ పరిశ్రమను ఐస్ల్యాండ్లో బుధవారం(సెప్టెంబర్ 8, 2021) ప్రారంభించారు. దీనిపేరు ఓర్కా(ఆర్కా). ఇది ఐస్ల్యాండిక్ పదం. ఇంగ్లిష్ మీనింగ్ ‘ఎనర్జీ’ అని. మొత్తం నాలుగు యూనిట్లు.. రెండు మెటల్ బాక్స్ల సెటప్తో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటుచేశారు. స్విట్జర్ల్యాండ్కు చెందిన క్లైమ్వర్క్స్, ఐస్ల్యాండ్కు చెందిన కార్బ్ఫిక్స్ కంపెనీలు సంయుక్తంగా ఈ ఫ్యాక్టరీని భారీ నిధులు వెచ్చించి నెలకొల్పాయి. ఎలా పని చేస్తుందంటే.. ఏడాది నాలుగు వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల్ని ఇది సంగ్రహిస్తుంది. ఇది దాదాపు 870 కార్ల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలతో సమానమని యూఎస్ పర్యావరణ పరిరక్షణ సంస్థ (ఈపీఏ) పేర్కొంది. ఈ ఫ్యాక్టరీ యూనిట్లలోని ఫ్యాన్లు.. వాతావరణంలోని Co2ను సంగ్రహిస్తాయి. ఫిల్టర్ మెటీరియల్ సాయంతో వాయువును ఫిల్టర్ చేస్తుంది. అక్కడ అధిక ఉష్ణోగ్రతల వద్ద గాఢత ఉన్న Co2 గ్యాస్గా మారుతుంది. ఆపై నీటిని చేర్చి.. వెయ్యి మీటర్ల లోతులో బాసాల్ట్ బండరాళ్ల మీదకు వదిలేస్తారు. అంటే కార్బన్ క్యాప్చుర్ అండ్ స్టోరేజ్(CCS) ద్వారా కార్బన్ డయాక్సైడ్ను రాళ్లురప్పల్లో కలిపేయడం ఈ ప్రక్రియ విధానమన్నమాట. అయితే విమర్శకులు మాత్రం ఈ సాంకేతికత మంచిది కాదని చెప్తున్నారు. బాగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, ఇది అమలు చేయడానికి సంవత్సరాలు పడుతుందని వాళ్లు విబేధిస్తున్నారు. చదవండి: రియల్మీ ట్యాబ్! ఇవాళ్టి నుంచే.. -
విషాదం: భారీ అగ్నిప్రమాదం.. 52 మంది మృతి
ఢాకా: బంగ్లాదేశ్లోని ఓ కారాగారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 52 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఢాకా శివారులోని రూప్ గంజ్లోని కర్మాగారంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని యుద్ధ ప్రాతపదికన సహాయక చర్యలు చేపడుతున్నారు. అగ్నిమాపక అధికారులు వివరాల ప్రకారం.. రుప్గంజ్లోని షెజాన్ జ్యూస్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో మంటలు చెలరేగినట్లు తెలిపారు. కర్మాగారంలో రసాయనాలు, ప్లాస్టిక్ సీసాలు ఎక్కువగా ఉండడంతో భవనం మొత్తం మంటలు త్వరగా వ్యాపించినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 52 మంది మృతి చెందారని తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి 18 అగ్నిమాపక విభాగాలు కష్టపడుతున్నాయని, సహాయక చర్యులను ముమ్మరం చేశామని అన్నారు. తెలిపారు. కాగా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవాడానికి జిల్లా యంత్రాంగం ఐదుగురు సభ్యుల దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసింది. -
చైనాలో గ్యాస్ లీక్: ఏడుగురు మృతి
బీజింగ్: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో టాక్సిక్ గ్యాస్ లీకైనది. ఈ విష వాయువు పీల్చుకుని ఏడుగురు మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యిబిన్ నగరంలోని చాంగ్నింగ్ కౌంటీలోని ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఆ ఫ్యాక్టరీలో మరమ్మత్తు పనులు జరిగే సమయంలో ఈ గ్యాస్ లీకైనట్లు జిన్హువా కౌంటీ అధికారులు తెలిపారు. విషవాయువు పీల్చుకుని బాధితులు మొదట స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్లారు. వారికి వైద్య చికిత్స అందించడానికి ఆస్పతికి తరలించగా మార్గమధ్యలోనే మరణించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు. (చదవండి: తగ్గుతున్న కరోనా: 2 లక్షల దిగువకు కొత్త కేసులు) -
ఫ్యాక్టరీ కప్పులపై టర్బో వెంటిలేటర్ ఎందుకు ఏర్పాటు చేస్తారు?
మనం ఏదైనా పెద్ద పారిశ్రామిక ప్రదేశాలను సందర్శించినప్పుడు లేదా మీ దగరలో ఉన్న పారిశ్రామిక కర్మాగారాల పైకప్పులపై కర్మాగారాల పైకప్పులపై స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన చిన్న గుండ్రని గోపురాలను మీరు చూసి ఉంటారు. అయితే, గుండ్రంగా తిరుగుతూ ఉన్న వాటిని పైన ఎందుకు ఏర్పాటు చేస్తారో మీకు తెలుసా?. వీటిని ఎందుకు ఏర్పాటు చేస్తారో అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే దాని గురుంచి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరికరాన్ని టర్బో వెంటిలేటర్ అని పిలుస్తారు. దీనిని ఎయిర్ వెంటిలేటర్, టర్బైన్ వెంటిలేటర్, రూఫ్ ఎక్స్ట్రాక్టర్ వంటి అనేక పేర్లతో కూడా పిలుస్తారు. ప్రస్తుతం టర్బో వెంటిలేటర్లను కర్మాగారాలు, పెద్ద దుకాణాలలో మాత్రమే కాకుండా, పెద్ద పెద్ద ప్రాంగణాల్లో, రైల్వే స్టేషన్ల పైకప్పులపై కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇవి చాలా మితమైన వేగంతో నడుస్తాయి. కర్మాగారాలలో ఉండే లోపలి వేడి గాలులను పైకప్పు ద్వారా బయటికి పంపించడం వీటి ప్రధాన పని. ఇలా వేడి గాలులను బయటకి పంపించినప్పుడు కిటికీలు, ప్రధాన ద్వారాల నుంచి తాజా సహజమైన గాలులు ఫ్యాక్టరీలలో ఎక్కువసేపు ఉంటాయి. దీని వల్ల ఆ కర్మాగారాలలో పనిచేసే ఉద్యోగులకు చాలా ఉపశమనం లభిస్తుంది. టర్బో వెంటిలేటర్ ద్వారా వేడి గాలులతో పాటు కర్మాగారాల నుంచి వెలువడే వచ్చే చెడు, కెమికల్ వాసనను బయటకి పంపించడానికి సహాయ పడుతుంది. అలాగే వాతావరణం మారినప్పుడు లోపల ఉన్న తేమను కూడా బయటకు పంపిస్తుంది. చదవండి: ఫ్లిప్కార్ట్లో రూ.15 వేలకే ఆపిల్ ఐఫోన్ -
వేమగిరిలో దారుణ హత్య
సాక్షి, కడియం: మండలంలోని వేమగిరిలో బొంతు వెంకన్న (45) అనే కూలీ శనివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేమగిరి తోట ప్రాంతానికి చెందిన పితాని సత్యనారాయణ అలియాస్ అన్నమయ్య, భవానీ భార్యాభర్తలు. సత్యనారాయణ లారీ డ్రైవర్గా పనిచేస్తుండగా, భవానీ గ్రామంలోని హైవేపైగల ఒక ప్రముఖ డ్రగ్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. కాగా భవానీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే క్రమంలో అదే గ్రామానికి చెందిన కూలి పనులు చేసుకొనే వెంకన్న ఆమెను మోటారు సైకిల్పై తీసుకువచ్చి ఇంటి వద్ద దింపుతుండేవాడు. ఈ క్రమంలోనే సత్యనారాయణకు భార్యపై అనుమానం ఏర్పడింది. దీంతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. ఇదే విషయంపై గతంలో కూడా సత్యనారాయణ, వెంకన్నల మధ్య వివాదం కూడా చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఎప్పటి మాదిరిగానే శనివారం రాత్రి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న భవానీని వెంకన్న తన మోటారు సైకిల్పై తీసుకువస్తున్నాడు. వీరిని గమనించిన సత్యనారాయణ వారిని వెంబడించి గ్రామానికి సమీపంలోని ఒక నర్సరీ వద్ద కాపు కాశాడు. తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో వెంకన్న, భవానీలపై విచక్షణా రహితంగా దాడికి దిగాడు. మృతుడు వెంకన్న మెడ, ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. భవానీపై కూడా దాడి చేయడంతో ఆమె మెడ భాగంలో గాయమైంది. అక్కడి నుంచి భవానీ పరుగు పెడుతూ ఇంటికి చేరుకుంది. ఆమె కుటుంబ సభ్యులు భవానీని రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు కడియం పోలీస్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్కుమార్ తన సిబ్బందితో ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. దక్షిణ మండలం డీఎస్పీ ఎం. శ్రీలత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఎం.సత్యనారాయణ పరారీలో ఉన్నాడు. పోలీసులు గాలిస్తున్నారు. అతడు పనిచేసే మండపేట ప్రాంతానికి చెందిన లారీ యజమానిని కూడా పోలీసులు ఆరా తీసారు. అయితే అతని ఆచూకీ ఇంకా లభించలేదు. విషయం తెలుసుకున్న మృతుడు బొంతు వెంకన్న కుటుంబ సభ్యులు ఆతృతగా ఘటనా ప్రాంతానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. -
విషాదం: గ్రైండర్లో పడి నలిగిన మహిళ
మాస్కో : కోళ్ల ఫాంలో చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ నిండు ప్రాణం బలైంది. ఫాంలోని గ్రైండర్లో పడి ఓ మహిళ మృత్యువాతపడింది. ఈ సంఘటన రష్యాలోని జుకోస్కిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. బెలెవ్సోవోకు చెందిన ఓ మహిళ అక్కడి కోళ్ల ఫ్యాక్టరీలో ఉపాధి పొందుతోంది. కొద్దిరోజుల క్రితం ఫ్యాక్టరీలోని గ్రైండర్ దగ్గర పనిచేస్తోంది. కోళ్లను(మాంసం) ఒక కన్వేయర్నుంచి మరో కన్వేయర్కు మారుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చెయ్యి గ్రైండర్లో ఇరుక్కుంది. ( మనుషులు లేని దీవిలో ఆ ముగ్గురు 33 రోజుల పాటు..) తీయటానికి ఎంత ప్రయత్నించినా రాలేదు. సెకన్లలో మహిళ మొత్తం గ్రైండర్లోకి వెళ్లిపోయింది. తోటి పనివాళ్లు ఆమెను రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోళ్ల ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవటానికి సిద్ధమయ్యారు. అధికారులు సంఘటనకు సంబంధించిన సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డయిన వీడియోను తాజాగా విడుదల చేశారు. -
భారీ పేలుడు : ఐదుగురు దుర్మరణం
సాక్షి, కోలకతా: పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్నపేలుడు తీవ్ర విషాదాన్ని నింపింది. మాల్డా జిల్లాలో ఓ ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరిన రక్షక బృందాలు,అగ్నిమాపక బృందాలు, సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఉదయం 11 గంటల సమయంలో సుజాపూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భారీ పోలీసు బృందాలను పంపించామన్నారు. అగ్నిమాపక శకటాలు మంటలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్నాయనీ, ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తక్షణమే స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ .2 లక్షలు, గాయపడిన వారికి రూ .50 లక్షలు ఎక్స్గ్రేషియాను ప్రభుత్వ కార్యదర్శి అలపన్ బండి యోపాధ్యాయ ప్రకటించారు. పట్టణ అభివృద్ధి శాఖా మంత్రి సంఘటనా స్థలాన్ని సందర్శించనున్నారని తెలిపారు. -
వెట్టిచాకిరి నుంచి చిన్నారులకు విముక్తి..
సాక్షి, హైదరాబాద్: ఎర్రకుంటలోని గాజుల కర్మాగారంపై పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 20 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గయా, బీహార్కి చెందిన పిల్లలతో గాజుల తయారీలో పని చేయిస్తున్నారని పేర్కొన్నారు. బీహార్ నుండి అక్రమంగా పిల్లలను తరలించారని, వారికి కనీసం సరైన భోజనం సదుపాయం కూడా కల్పించడంలేదని, అర్ధరాత్రి వరకు కూడా వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నలుగురు ఆర్గనైజర్లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మెడికల్ పరీక్షలు నిర్వహించిన అనంతరం 20 మంది చిన్నారులను వారి స్వస్థలాలకు పంపిస్తామని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు గంజాయి ముఠా అరెస్ట్.. గంజాయి సరఫరా చేస్తున్న హర్యానాకి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. సీపీ మహేష్ భగవత్ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. ఒక్కొక్కటి 5.5 కేజీల ప్యాకెట్లగా కంటైనర్లో సరఫరా చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. మొత్తం 1010 కేజీల 194 ప్యాకెట్ల గంజాయితో పాటు ఒక కంటైనర్, నాలుగు వేలు నగదు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. -
ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మరో ప్రమాదం..
సాక్షి, కర్నూలు జిల్లా: నంద్యాల ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మళ్లీ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలోని బాయిలర్ హీటర్ పేలి ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ముగ్గురు కార్మికుల్లో ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దక్షిణ మూర్తి అనే కార్మికుడు మృతి చెందాడు. మిగతా ఇద్దరు కార్మికులు కోలుకొని ఆస్పత్రి నుంచి డిశార్జి అయ్యారు. ఇటీవలే ఎస్పీవై ఆగ్రో ఫ్యాక్టరీలో మెయిన్ టెనెన్స్ వర్క్స్ జరుగుతున్న సమయంలో జరిగిన ప్రమాదంలో జనరల్ మేనేజర్ మృతిచెందిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో సంచలనం రేపిన ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఓ కమీటీని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆ ఘటన మరువకముందే మళ్లీ ప్రమాదం జరిగింది. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ఆందోళన చెందుతున్నారు. -
సాక్షి ఎన్ఆర్ఐ ఫండ్ ఫ్యాక్టర్ లైవ్ షో
-
మావో సూట్, మారిన హెయిర్స్టైల్
సియోల్: ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యంపైనున్న అనుమానాలు తొలగిపోయాయి. ఆయనకు బ్రెయిన్ డెడ్ అయిందన్న ఊహాగానాలకు తెరపడింది. మూడు వారాలపాటు బయట ప్రపంచానికి కనిపించకుండా ఉన్న ఆయన సంచోన్లో ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కిమ్తో పాటు ఆయన సోదరి జాంగ్ ఉన్న వీడియో, ఫొటోలను ఉ.కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. నవ్వుతూ కలియతిరుగుతూ.. ఉ. కొరియా విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు చూస్తే కిమ్ అనారోగ్యం బారిన పడినట్టు లేదు. నల్లని మావో సూట్ వేసుకొని, కొత్త హెయిర్ స్టైల్తో నవ్వుతూ కనిపించారు. తన సోదరి అందించిన కత్తెరతో రెడ్ రిబ్బన్ కట్ చేసి అందరి కరతాళ ధ్వనుల మధ్య ఫ్యాక్టరీని ప్రారంభించారు. పొగ పీలుస్తూ, అధికారులతో మాట్లాడుతూనే ఎరువుల ఫ్యాక్టరీలో కలియతిరిగారు. ఫ్యాక్టరీలో తిరిగేటపుడు ఊతకర్ర లేకుండా నడిచారు. 2014లో ఆయన కాలుకి సర్జరీ జరిగి కోలుకున్నాక కిమ్ గతంలో కొంతకాలంపాటు ఊతకర్ర సాయంతో నడిచారు. ఈ సారి నడుస్తున్నపుడు ఊతకర్ర సాయం తీసుకోలేదు. అయితే ఒక ఫొటోలో కిమ్ పక్కన ఉన్న అధికారి చేతిలో ఊతకర్ర ఉంది. ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి చూపించే చరిత్ర ఉ.కొరియాకు ఉండడంతో కిమ్ ఊతకర్ర లేకుండా నడుస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మాస్కులతో కార్మికులు.. ఫ్యాక్టరీలో ఏర్పాటు చేసిన వేదికపై కిమ్, ఇతర అధికారులు కూర్చొని ఉండగా బెలూన్లు గాల్లో ఎగురవేసి మే 1న సంచోన్ ఫాస్ఫేటిక్ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభం అయిందంటూ ప్రకటించారు. ఆ సమయంలో వేలాది మంది ఫ్యాక్టరీ కార్మికులు ముఖానికి మాస్కులతో కనిపించారు. అంటే ఉ.కొరియాలోనూ కరోనా విజృంభిస్తోందని స్పష్టమవుతోంది. పార్టీలో అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పాలిట్ బ్యూరోలోకి ఏప్రిల్ 11న తన సోదరిని నియమించాక కిమ్ బయట ప్రపంచానికి కనిపించలేదు. కిమ్ బాడీ గార్డుల్లో ఒకరికి కరోనా వైరస్ సోకిందని, అందుకే ఆయన సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్లిపోయారని గుసగుసలైతే వినిపిస్తున్నాయి. -
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
-
ఢిల్లీలో మరో అగ్నిప్రమాదం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ముంద్కా ప్రాంతంలో ఉన్న విడిభాగాల ఫ్యాక్టరీలో గురువారం మధ్యాహ్నం మంటలంటుకున్నాయి. ఇవి మరింత విస్తరించి భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి వుంది. Delhi: 26 fire tenders present at the spare parts factory in Mundka, where a fire has broken out. https://t.co/O8XY1gDSss pic.twitter.com/sidhMphqdo — ANI (@ANI) February 13, 2020 -
టిన్నర్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
-
బ్యాటరీ ఫ్యాకర్టీలో అగ్ని ప్రమాదం
-
ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీ నరేలా ఇండస్ట్రియల్ ప్రాంతంలోని రెండు ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రెండు ఫ్యాక్టరీల్లో మంటలు ఎగిసిపడుతున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 22 ఫైరింజన్లు సంఘటనా స్థలంలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. మొదట ఓ షూ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం సంభవించిందని, అక్కడి నుంచి పక్కనే ఉన్న మరో ఫ్యాక్టరీకి మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. -
అంతు చిక్కని భూముల లెక్కలు
సాక్షి, బోధన్: బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీకి చెందిన భూముల వ్యవహారం గందరగోళంగా మారింది.. ఫ్యాక్టరీ భూములకు సంబంధించి రికార్డుల్లో ఉన్న లెక్కలకు, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేకుండా పోయింది. మొదట్లో 16 వేల ఎకరాలకు పైగా ఉన్న ఫ్యాక్టరీ భూములు క్రమంగా అన్యాక్రాంతమయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో కూడా చాలా వరకు కబ్జాకు గురవుతున్నాయి! ఫ్యాక్టరీ భూముల కొనుగోళ్లు, పట్టామార్పిళ్లు, రిజిస్ట్రేషన్ల వ్యవహారం తరచూ వివాదాస్పదంగా మారుతోంది. ఫ్యాక్టరీకి సంబంధించిన భూ రికార్డులు రెవెన్యూ శాఖ వద్ద లేకపోవడం అక్రమార్కులకు కలిసి వస్తోంది. తాజాగా బోధన్ నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) పరిధిలో గల కేన్యార్డును ఆనుకుని 2.30 ఎకరాల స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు యత్నించడంతో మరోమారు ఈ భూముల వ్యవహారం చర్చనీయాంశమైంది. రూ.కోట్ల విలువైన ఖాళీ స్థలాన్ని ఇటీవల కొందరు జేసీబీతో చదును చేయిస్తుండగా, ఆ స్థలం పక్కనే ఉన్న హనుమాన్ టేకిడి కాలనీ యువకులు అడ్డుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కబ్జా వ్యవహారం తేల్చాలని అఖిలపక్షాలు ఆందోళనకు కూడా దిగాయి. 2002లో ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అనంతరం నిజాంషుగర్స్ భూములు, ఖాళీ స్థలాల రక్షణకు అప్పట్లో ప్రభుత్వం పలువురు అధికారులతో కోర్ కమిటీని నియమించింది. ప్రస్తుతం భూములు కబ్జాకు గురవుతుంటే ఈ కమిటీ ఏం చేస్తుందో ఏమో మరీ!? 16 వేల ఎకరాలు.. నిజాం పాలనలో 1938లో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. ఫ్యాక్టరీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 16 వేల ఎకరాల భూములను అప్పట్లో సాగు కోసం కేటాయించారు. బోధన్, ఎడపల్లి, రెంజల్, కోటగిరి, వర్ని, మోస్రా, చందూర్ తదితర మండలాల పరిధిలో ఈ భూముల్లో 16 వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసి చెరుకు పంట సాగును ప్రోత్సహించారు. 1992 నుంచి ఫ్యాక్టరీ భూముల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాల పేదలకు ఎకరం చొప్పున గత ప్రభుత్వాలు పంపిణీ చేశాయి. కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములు సుమారు 8,500 ఎకరాలు, బహిరంగ వేలంపాట ద్వారా మరో 3,500 ఎకరాలు విక్రయించారు. అలాగే, వీఆర్ఎస్ పొందిన కార్మికులకు 1,292 ఎకరాలను కేటాయించినట్లు ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ రికార్డులు చెబుతున్నాయి. పేదల ఇళ్ల స్థలాలు, పట్టణ డంపింగ్ యార్డులు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రార్థనాలయాలు, సంక్షేమ హస్టళ్ల భవనాలు కూడా ఫ్యాక్టరీ స్థలాల్లోనే నిర్మించారు. కొన్నిచోట్ల చెరువుల శిఖంలో ఫ్యాక్టరీ భూములుండగా, ఫ్యాక్టరీకి చెరుకు తరలింపు కోసం నిర్మించిన లైట్ రైల్వే లైన్ స్థలం 188 ఎకరాలు రోడ్లుగా మారాయి. ఎన్డీఎస్ఎల్ వద్ద 191 ఎకరాలు 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిజాం షుగర్స్ను ప్రైవేటీకరించింది. 51 శాతం ప్రైవేట్ కంపెనీ వాటా, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ ప్రైవేట్పరమైంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎన్డీఎస్ఎల్ ప్రైవేట్ యాజమాన్యం చేతిలోకి వెళ్లింది. ప్రైవేట్ యాజమాన్యం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఉన్న విలువైన భూములను కొనుగోలు చేసింది. 20 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఉండగా, మిగిలిన భూములను కూడా కొనుగోలు చేసిందని కోర్ కమిటీ అధికారులంటున్నారు. 2015 డిసెంబర్ 23న ఎన్డీఎస్ఎల్ మూసివేతకు గురి కాగా, అక్రమార్కులు ఫ్యాక్టరీకి చెందిన విలువైన ఖాళీ స్థలాలపై కన్నేశారు. శక్కర్నగర్ ప్రాంతంలో పలు చోట్ల కోర్ కమిటీ ఆధీనంలో రూ.కోట్ల విలువైన స్థలాలున్నాయి. ఇందులో కొన్ని ఇప్పటికే ఆక్రమణకు గురయ్యాని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదల ఇక్కట్లు.. మరోవైపు, కార్పొరేషన్ల ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూములు చాలా చోట్ల వివాదాస్పదంగా మారాయి. కొందరికి భూములుంటే పట్టాలు లేవు.. పట్టాలున్న వారికి భూముల్లేవు. కొందరికి భూములున్నా హద్దులు చూపించలేదు. ప్రతి సోమవారం బోధన్ ఆర్డీవో ఆఫీసులో నిర్వహించే ప్రజావాణిలో ఇలాంటి వినతులు ఎన్నో వస్తుంటాయి. ఇలాంటి సమస్యలు సుమారు 500కు పైగానే ఉంటాయి. భూములపై దృష్టి సారించాం ఫ్యాక్టరీ భూములు, స్థలాలు ఆక్రమణకు గురి కాకుండా దృష్టి సారించాం. కార్పొరేషన్ ద్వారా పేదలు కొనుగోలు చేసిన భూముల సమస్యలపై మా వద్దకు 350 వరకు వినతులు వచ్చాయి. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం. – ఖాలిద్ అలీ, ఎన్ఎస్ఎఫ్ కోర్ కమిటీ అధికారి -
బిస్కెట్ ఫ్యాక్టరీ గోడౌన్లో అగ్రి ప్రమాదం
-
మొక్కజొన్న ఫ్యాక్టరీలో పేలుడు
పెనుబల్లి: మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందారు. సుమారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం పంచాయతీ పరిధిలోని నాయకులగూడెం సమీపంలో గల మొక్కజొన్న ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. సత్తుపల్లికి చెందిన వ్యాపారి ఎలినేని మురళీకృష్ణ నాయకులగూడెంలో నెల రోజుల క్రితం మొక్కజొన్న ఫ్యాక్టరీని ప్రారంభించారు. మొక్కజొన్న కంకుల నుంచి విత్తనాలు వేరు చేసి.. బెండ్లను బాయిలర్లో వేడి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాయిలర్ ద్వారా వచ్చిన ఆవిరితో విత్తనాలను శుద్ధి చేసి.. ప్యాకింగ్ చేసి రవాణా చేస్తారు. ఈ క్రమంలో బాయిలర్ వద్ద పీడనం పెరిగి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న నలుగురు కార్మికులు మృతి చెందగా.. ఆరు నుంచి పది మంది వరకు తీవ్ర గాయాల య్యాయి. పేలుడు తీవ్రతకు కార్మికులు 10 నుంచి 20 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయారు. మృతదేహాలు మాత్రం భయానక పరిస్థితిలో పడి ఉన్నాయి. క్షతగాత్రులను సత్తుపల్లి, పెనుబల్లి ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. కాగా.. పేలుడు రాత్రి 7 గంటల సమయంలో చోటుచేసుకోగా.. అప్పటికే కొందరు కార్మికులు విధుల నుంచి ఇళ్లకు వెళ్లడంతో ప్రాణనష్టం సంభవించలేదు. పేలుడుతో ఫ్యాక్టరీలోని సగ భాగం, ప్రహరీ కూలిపోయింది. పరిసరాల్లోని కార్లు, లారీల అద్దాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఎవరినీ గుర్తించలేని పరిస్థితి ఉంది. కాగా.. బిహార్కు చెందిన కార్మికులతోపాటు స్థానికులు ఇందులో పనిచేస్తున్నారు. మృతులు ఎవరనేది ఇంకా నిర్ధారించలేకపోతున్నారు. -
వాలెంటైన్స్ డే రోజే ఆగ్నికి ఆహుతి
సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీని వరుస అగ్ని ప్రమాదాలు వణికిస్తున్నాయి. కరోల్ బాగ్ ట్రాజెడీని ఇంకా మరువకముందే మరో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. వాలెంటైన్స్ డే కార్డులు, ఇతర గిఫ్ట్ కార్డులను తయారు చేసే ఫ్యాక్టరీలో భారీ ఎత్తున గ్రీటింగ్ కార్డులు అగ్నికి ఆహుతి కావడం విషాదం. అదీ వాలెంటైన్స్ డే రోజు. వెస్ట్ ఢిల్లీలోని నరైనా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫ్యాక్టరీ పైఅంతస్థులో గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న 23 అగ్నిమాపక శకటాలు మంటలను అదుపు చేస్తున్నాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి వుంది. కాగా ఫిబ్రవరి 12వతేదీన కరోల్ బాగ్లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్ దుర్ఘటన జరిగి 24 గంటలు గడవకముందే బుధవారం జరిగిన మరో అగ్ని ప్రమాదంలో సుమారు 250కిపైగా నిరుపేదల గుడిసెలు కాలి బూడిద కాగా, గురువారం మరో ప్రమాదంతో ఢిల్లీ నగరం నిద్ర లేచింది. #WATCH A medium category fire broke out at a paper card factory in Naraina Industrial Area, Phase I, early morning today; Total 23 fire tenders engaged in fire fighting operations, no casualties reported pic.twitter.com/l6wiOjfELO — ANI (@ANI) February 14, 2019 -
ఫ్యాక్టరీలో ఎల్పీజీ సిలిండర్ పేలి ఏడుగురి మృతి
-
కూలిన భవనం.. ఏడుగురు దుర్మరణం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్లోని సుదర్శన్ పార్క్ వద్దగల ఓ మూడంతస్థుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవించండంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది. గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందగా మరో 8 మందిని రెస్క్యూ టీం రక్షించింది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని డీసీపీ (పశ్చిమ ఢిల్లీ) మోనికా భరద్వాజ్ తెలిపారు. ప్రమాద సమయంలో మొత్తం 18 మంది ఫ్యాక్టరీలో ఉన్నట్టు చెప్పారు. అయితే, స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. ప్రమాద సమయంలో 13 మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. పక్కనే ఉన్న స్క్రాప్యార్డులో మరో 12 మంది ఉన్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ముమ్మర సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఫైర్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. -
ఎట్టకేలకు క్షమాపణ చెప్పిన శాంసంగ్
సియోల్ : దక్షిణకొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు ఉద్యోగులకు క్షమాపణలు చెప్పింది. తమ ఫ్యాక్టరీలో పనిచేయడం మూలంగా కొంతమంది ఉద్యోగులు క్యాన్సర్ బారిన పడుతున్నారని అంగీకరించిన సంస్థ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది. తద్వారా దశాబ్ద కాలంగా సాగుతున్న వివాదానికి ముగింపు పలికింది. తమ ఎల్సీడీ, సెమీ కండక్టర్ కర్మాగారాల్లో కార్మికుల భద్రత కోసం సరియైన రక్షణచర్యలు తీసుకోలేకపోయామని శాంసంగ్ వెల్లడించింది. వ్యాధి బారిన పడిన ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మనస్పూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని శాంసంగ్ కో ప్రెసిడెంట్ కిమ్ కి నామ్ ప్రకటించారు. అలాగే ఒక్కో బాధితుడికి సుమారు 9లక్షల రూపాయలు (133వేల డాలర్లు) చెల్లించనున్నట్టు ప్రకటించారు. దీంతో గత పదేళ్లుగా పోరాటం సాగిస్తున్న ఉద్యమకారులు శాంతించారు. తాజాగా శాంసంగ్ క్షమాపణలు చెప్పడంపై ఉద్యమ కారుల్లో ఒకరు, బాధిత మహిళ ఒకరైన హ్వాంగ్ శాంగ్-జి సంతృప్తి వ్యక్తం చేశారు. తన 22 కుమారుడు 2007లో లుకేమియాతో కన్నుమూశాడని వెల్లడించారు. కంపెనీ క్షమాపణ కుటుంబాల బాధను ఏ మాత్రం తీర్చలేదని, నిజానికి సంస్థ ప్రకటించిన పరిహారం కుటుంబాలకు సరిపోదు కానీ, తాము అంగీకరిస్తున్నామన్నారు. ఎందుకంటే తమ బంధువుల మరణంతో , తాము అనుభవించిన వేదన ఎన్నటికీ తీరనిదనీ, చాలా కుటుంబాలది ఇదే పరిస్థితని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దక్షిణ సియోల్లోని సువాన్లో శాంసంగ్ నెలకొల్పిన సెమీకండక్టర్, ఎల్సీడీ ఫ్యాక్టరీ వివాదానికి దారితీసింది. అనేకమంది అతిప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడుతున్నామంటూ ఉద్యోగులు 2007లో పోరాటానికి దిగారు. దాదాపు 320 మంది ఉద్యోగులు క్యాన్సర్ బారినపడగా, 118 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఫ్యాక్టరీ మూలంగా 16 రకాల క్యాన్సర్లు వ్యాప్తి చెందాయి. అలాగే కొన్ని ఇతర అరుదైన తీవ్ర అనారోగ్యంతోపాటు, గర్భస్రావాలు, కార్మికుల పిల్లలు తీవ్రమైన కంటి రోగాల బారిన పడ్డారని ఉద్యమ కమిటీ వాదించింది. -
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు, 7గురి మృతి
బుద్వాన్: ఉత్తరప్రదేశ్లోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది. బుద్వాన్ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటన జరిగింది. స్థానికుల అందించిన సమాచారం ప్రకారం, పేలుడు కారణంగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలంటుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీలో దీపావళిని పురస్కరించుకుని టపాసులు తయారు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బాణసంచా పేలుళ్లతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగ కమ్ముకు పోయింది. సంఘటా స్థలానికి చేరుకున్నఅగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పలువురు సీనియర్ అధికారులు కూడా సహాయక చర్యల్నిపర్యవేక్షిస్తున్నారు. మరోవైపు గాయపడిన వారికి సమీప ఆసుపత్రికి తరలించామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ.. బాధితులకు తగిన సాయం అందిస్తామని ప్రకటించారు. -
అగ్ని ప్రమాదంలో నలుగురి మృతి
న్యూఢిల్లీ : బూట్ల ఫ్యాక్టరీలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతిచెందారు. ఈ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్పురి రాజా పార్క్ ఫ్యాక్టరీలో ఉదయం 6.35 గంటలకు జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 12 మంది కార్మికులు ఉన్నట్లు ఢిల్లీ అగ్నిమాపకశాఖాధికారి చెప్పారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకుని తీవ్రగాయాలతో నలుగురు కార్మికులు అప్పటికే చనిపోయారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. చనిపోయిన వారిని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మృతులను గుర్తించాల్సి ఉంది. షార్ట్సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. -
తమిళనాడులో మరో ఉద్యమం
-
పంజాబ్లో భారీ అగ్ని ప్రమాదం
-
గోడకూలి అన్నదమ్ముల మృతి
బరంపురం: గంజాం జిల్లా గురింటి గ్రామ శివారులో ఉన్న క్రషర్స్ కర్మాగారంలో గోడ కూలి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న సదర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కూలిన గోడ కింద ఉన్న మృతదేహాలను గ్రామస్తుల సహాయంతో వెలికితీసి 108 అంబులెన్స్లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. ఐఐసి అధికారి శివశంకర్ మహాపాత్రో, ప్రత్యక్ష సాక్షులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. సదర్ పోలీస్స్టేషన్ పరిధిలో గల గురింటి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు క్రషర్స్ కర్మాగారంలో కార్మికులుగా పనికి వెళ్తుంటారు. ప్రతిరోజూ లాగానే పనిచేసేందుకు అన్నదమ్ములిద్దరూ శుక్రవారం వెళ్లారు. అయితే యూనిట్లో వారిద్దరూ పనిచేస్తున్న సమయంలో హఠాత్తుగా గోడ కూలడంతో అన్నదమ్ములైన కలియా శెట్టి, బబ్బు శెట్టిలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను 108 అంబులెన్స్లో ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించినట్లు ఐఐసీ అధికారి తెలియజేశారు. అన్నదమ్ములిద్దరూ పనిచేస్తూ ప్రమాద స్థితిలో మృతిచెండంతో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని గురింటి గ్రామస్తులు క్రషర్స్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. -
ఇట్లయితే పరిశ్రమలు నడపలేం
- జీఎస్టీ భారంపై బేతంచెర్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన - బుగ్గన ఆధ్వర్యంలో ఆర్థికమంత్రితో భేటీ బేతంచెర్ల : జూలై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ పెంపు వల్ల నాపరాతి పరిశ్రమలపై భారం పెరిగి పోయిందని, ఇదే కొనసాగితే పరిశ్రమలు నడపలేమని బేతంచెర్ల ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని విజయవాడలోని ఆయన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మారుతి కృష్ణ, మిలాప్చంద్, చలంరెడ్డి, సుబ్బారావు, సంజయ్, స్వరూప్ తదితరులు పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను మంత్రికి వివరించారు. పన్ను 5 శాతం నుంచి 28 శాతానికి పెరగడంతో పరిశ్రమలు నడుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇందుకు స్పందించిన మంత్రి.. ఆగస్టులో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో విషయంపై ప్రస్తావించి పన్ను తగ్గింపునకు కృషి చేస్తామని చెప్పినట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. -
పనిచెప్పక.. పొమ్మనక..పస్తులుంచుతున్నారు
త్రిశంకు స్వర్గంలో బీరు ఫ్యాక్టరీ కార్మికులు ఉపాధి లేక వీధిన పడుతున్న వైనం రామచంద్రపురం: కంపెనీలో కార్మికులకు పని చెప్పరు.. అలాగని పొమ్మనరు.. జీతాలివ్వక పస్తులుంచుతున్నారు. ఇదీ పట్టణంలోని ఆర్టోస్ బ్రూవరీస్ (బీరు ఫ్యాక్టరీ) పరిస్థితి. 50 ఏళ్లుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన బీరు ఫ్యాక్టరీ ప్రస్తుతం మూతపడింది. దీంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కానీ ఫ్యాక్టరీ పెట్టినప్పచీ నుంచి పనిచేస్తున్న 35 మంది కార్మికులు ఇప్పటికీ ఫ్యాక్టరీనే నమ్ముకుని ఉన్నారు. ప్రత్యక్షంగా 200 మంది కార్మికులు ఫ్యాక్టరీ పనిచేసే సమయంలో ఉంటే ఎన్ఎంఆర్లుగా మరో 500 మంది వరకూ ఉపాధి పొందేవారు. ప్రతీరోజు సుమారు 1.75 లక్షల బీరు సీసాలు తయారు చేయగల సామర్థ్యం ఈ ఫ్యాక్టరీది. రాష్ట్ర విభజనానంతరం శ్రీకాకుళం జిల్లా రణస్థంలో ఒక ఫ్యాక్టరీ ఉంటే రెండవ ఫ్యాక్టరీ ఇదే ఏపీలో ఉన్న రెండింటిలో ఒకటి రామచంద్రపురానికి చెందిన ఆర్టీస్ బ్రూవరీస్ కావడం గమనార్హం. ఇక్కడ తయారయ్యే గోల్డెన్ ఈగల్ బీరు అప్పట్లో దేశవ్యాప్త ప్రాచుర్యం పొందింది. కారణం తెలియదు గానీ, ఏడాదిన్నరగా ఇక్కడ బీరు సీసాల తయారీ నిలిపివేశారు. ఇక్కడ తయారు చేసిన సుమారు 3.5 లక్షల వేల బీరు సీసాలను గత ఏడాదిన్నరగా ఉంచేశారని కార్మికులు చెబుతున్నారు. దీంతో ఎన్ఎంఆర్లతో పాటుగా కాంట్రాక్టుపై పనిచేసే వారికి ఉపాధి లేకుండా పోయింది. ట్రాన్స్పోర్టు మీద ఆధారపడి జీవించే లారీల యజమానులు, డ్రైవర్లు అప్పులపాలయ్యారు. సుమారు 600 మంది వరకు ఉపాధి లేక జీవనోపాధి కోల్పోయారు. ఇక మిగిలింది గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న 35 మంది కార్మికులు ఉన్నారు. వీరికి కూడా ఐదు నెలలుగా జీతాలు లేవు. పాత బకాయిలతో కలిపి ఒకొక్కరికీ సుమారు రూ.1.50లక్షల వరకు కంపెనీ ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎలక్ర్టీషియన్ పెండ్యాల శ్రీనివాసరావు తన చావుకు కారణం యాజమాన్యమే నంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడడంతో మిగిలినవారిలో ఆందోళన నెలకొంది. మరిన్ని కుటుంబాలు వీధిని పడకుండా చూడాలని యాజమాన్యాన్ని వారు వేడుకుంటున్నారు. పస్తులుంటున్నాము కంపెనీలో 30 ఏళ్లుగా బాయిలర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. ఐదు నెలలుగా జీతాలు రాకపోవటంతో కుటుంబాన్ని పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాజమాన్యం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. - కె భూపతి, బాయిలర్ ఆపరేటర్. అలవెన్సులు బకాయిలున్నాయి 28 ఏళ్లుగా పనిచేస్తున్నాను. రెండేళ్ల అలవెన్సులు రావాల్సి ఉంది. కానీ యాజమాన్యం స్పందన లేదు. కుటుంబాలు రోడ్డున పడకుండా చూడాలి. కేఆర్వీవీ సత్యనారాయణ, రిఫ్రిజిరేటర్ సెక్షన్. కార్మికులు భయపడుతున్నారు 32 ఏళ్లుగా పనిచేస్తున్నాను. యాజమాన్యం తీరుతో అందరూ ఆందోళనగా ఉన్నారు. జీతాలు ఇవ్వక ఇబ్బంది పడుతున్నాం. కార్మిక శాఖ అధికారులు వెంటనే స్పందించాలి. - ఎంవీ రాజు, వాషింగ్ ఆపరేటర్ -
పేపర్ ప్లేట్స్ పరిశ్రమలో మంటలు
తణుకు: తణుకు మండలం తేతలి ఇండస్ట్రియల్ ఏరియాలో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పేపర్ ప్లేట్స్ తయారీ పరిశ్రమలో మంటలు వ్యాపిం చాయి. గురువారం సాయంత్రం పరిశ్రమలో పనిముగించుకుని కార్మికులు వెళ్లిన తర్వాత గోదాము నుంచి మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు గుర్తించి తణుకు అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అప్పటికే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేశారు. సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్టు బాధితులు చెబుతున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. -
పండగ పూట విషాదం
- ఫ్యూజ్ వేయబోయి మృత్యువాత - పెట్నికోట గ్రామంలో ఘటన కొలిమిగుండ్ల: శ్రీరామనవమి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాల్సిన ఆ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఫ్యూజ్ వేయబోయి ఓ యువకుడు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పెట్నికోట ఎస్సీ కాలనీకి చెందిన మగదాల సుబ్బరాయుడుకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సురేంద్రబాబు(28) స్వంతంగా నాపరాతి పాలీష్ ప్యాక్టరీ నిర్మించుకొని కుటుంబానికి అండగా ఉన్నాడు. మూడు రోజుల క్రితం పెట్నికోటలో పెనుగాలుల బీభత్సానికి స్తంభాలు, చెట్లు విరిగి పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సురేంద్రబాబు ప్యాక్టరీకి చెందిన ట్రాన్స్ఫార్మర్లో ఎగ్జ్ఫ్యూజ్ పోవడంతో సరఫరా నిలిచి పోయింది. ఉదయం ఆరున్నర గంటల సమయంలో ప్యాక్టరీ వద్దకు వెళుతుంటే కుటుంబ సభ్యులు కాఫీ తాగి వెళ్లమని సూచించినా త్వరగా వస్తానని వెళ్లాడు. ఏదో ఆలోచనలో ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరాను బంద్ చేయకుండా ఎక్కి ఫ్యూజ్ వేసే క్రమంలో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ట్రాన్స్కో ఏఈ సూర్యనారాయణరెడ్డి, లైన్ ఇన్స్పెక్టర్ జయనాయక్ .. ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హెడ్కానిస్టేబుల్ బాబాఫకృద్దీన్ వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఆనంద ఆక్వా వద్ద స్వల్ప ఉద్రిక్తత
మొగల్తూరు: మొగల్తూరులోని ఆనంద ఆక్వా పరిశ్రమలో పనులు చేపట్టారంటూ గ్రామస్తులు పరిశ్రమ వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు తమ పరిసరాలు శుభ్రం చేయించుకునేందుకు కూలీలను నియమించుకున్నారు. అయితే పరిశ్రమ సూపర్వైజర్లు విధుల్లో చేరారనుకుని సీపీఎం నాయకులు యడ్ల చిట్టిబాబుతో కలిసి కొందరు స్థానికులు ఇక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో డీఎస్పీ పూర్ణచంద్రరావు రావడంతో వీరిని వారించారు. తాము పరిసరాలను శుభ్రం చేయించుకుంటే మీకొచి్చన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో కంపెనీ వద్ద పరిసరాలు శుభ్రం చేయడానికి వీలులేదని గ్రామస్తులు అనడంతో డీఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పరిశ్రమను సీజ్ చేయడంతో ఎవరికీ లోపలకు వెళ్లే అవకాశం లేదని, దీంతో ఆరుబయట విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది పరిసరాలు శుభ్రం చేయించుకుంటున్నట్టు డీఎస్పీ చెప్పడంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
రెయిన్ ఇండస్ట్రీస్లో అసైన్డ్ భూములు
– 15 నుంచి 20 ఎకరాలలను గతంలోనే కొనుగోలు చేసిన యాజమాన్యం – యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ నోటీసులు కర్నూలు(అగ్రికల్చర్): అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఫ్యాక్టరీ స్థలంలో కలిపేసుకున్న రెయిన్ ఇండస్ట్రీస్ సిమెంట్ కంపెనీ యాజమాన్యానికి జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ నోటీసులు జారీ చేశారు. దాదాపు 10 రోజుల క్రితమే నోటీసులు జారీ కాగా.. వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వివిధ సర్వే నెంబర్లలోని 15 నుంచి 20 ఎకరాల అసైన్డ్ భూములను కలిపేసుకున్నందుకు మీపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోరాదో చెప్పాలని జిల్లా కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. ప్యాపిలి తహసీల్దారు ద్వారా ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినట్లు సమాచారం. ప్యాపిలి మండలం రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలో దాదాపు 20 ఏళ్ల క్రితం ఎన్సీసీ సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటయింది. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీని రెయిన్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ఆధీనంలోకి వచ్చింది. రాచర్ల రెవెన్యూ గ్రామం పరిధిలోని బోయిన్చెర్వుపల్లి గ్రామంలోని సర్వే నెంబర్లు 50, 54, 116, 287తో పాటు మరిన్ని సర్వే నెంబర్లలోని అసైన్డ్ భూములను యాజమాన్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వీటిని కొన్నేళ్ల క్రితమే ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. అయితే సిమెంటు ఫ్యాక్టరీ యాజమాన్యం ఽఅసైన్డ్ భూములను ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందే కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటి విలువ ప్రస్తుతం రూ.2కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. తమ ఫ్యాక్టరీలో అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన యాజమాన్యం మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లిస్తాం.. ప్రభుత్వ భూములను స్వాధీనం చేయండంటూ(అలెనేషన్) ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం దీనిపై జిల్లా కలెక్టర్ను నివేదిక కోరినట్లు సమాచారం. దీనిని కలెక్టర్ లోతుగా విచారించగా అసైన్డ్ భూములని స్పష్టమైంది. ఆ మేరకు నోటీసులు జారీ చేశారు. -
‘నెక్కంటి’లో మళ్లీ ప్రమాద ఘంటికలు
వాంతులతో 26 మందికి అనారోగ్యం మొత్తం అస్వస్థులైన వారి సంఖ్య 56 మంది కాకినాడ, రాజమండ్రి ఆస్పత్రులకు తరలింపు ఫ్యాక్టరీ తాత్కాలిక మూసివేతకు జేసీ ఆదేశం పెద్దాపురం : పెద్దాపురం–జగ్గంపేట మార్గంలోని నెక్కంటి సీఫుడ్స్లో మరోమారు ప్రమాద ఘంటికలు మోగాయి. సోమవారం రాత్రి జరిగిన సంఘటనలో 30 మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం సంభవించిన ప్రమాదంలో మరో 26 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇప్పటి వరకు అస్వస్థతకు గురైన వారి సంఖ్య 56కు చేరింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం యథావిధిగా నెక్కంటి సీఫుడ్స్లో విధులకు హాజరైన మహిళలు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కిందపడిన మహిళలు వాంతులు చేసుకుంటూ బాధపడుతుండడంతో కాకినాడ, రాజమండ్రిల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. విషయం బయటకు పొక్కకుండా సీఫుడ్స్ యాజమాన్యం పోలీసు, మీడియా, ప్రజాసంఘాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఈ ఫ్యాక్టరీలో జనరల్ డ్యూటీలకు వెళ్లే మహిళలు జరిగిన ప్రమాదాన్ని గుర్తించి వెనుకకు పరుగులు తీశారు. దీంతో విషయం తెలుసుకున్న సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్సై సతీష్ అక్కడకు చేరుకున్నారు. మరోపక్క ఫ్యాక్టరీలో జరిగిన సంఘటనను వీడియో తీసేందుకు ప్రయత్నించిన పాత్రికేయులపై యాజమాన్యం దాడిచేసే ప్రయత్నం చేసింది. మీడియాను లోపలికి రాకుండా నిలువరించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, ఆర్డీవో విశ్వేశ్వరరావు, డీఎస్పీ రాజశేఖరరావు, తహసీల్దార్ వరహాలయ్య, సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్, చీఫ్ ఇ¯ŒSస్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవీంద్రబాబు, కార్మికశాఖ కమిషనర్ కృష్ణారెడ్డి పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణంపై ఎన్ఎఫ్సీఎల్, కోరమండల్ సాంకేతిక నిపుణులతో వారు చర్చించారు. ప్లాంట్లోలోని ఏసీ సామర్థ్యం, ఆక్సిజ¯ŒS లోపం వల్లే మహిళలు అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా గుర్తించారు. కార్మికుల భద్రత దృష్టా తాత్కాలికంగా ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలిపివేయాలని జేసీ సత్యనారాయణ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న మహిళలు సృహతప్పి పడిపోతుంటే వారిపై సత్తెమ్మ అమ్మవారు పూని అలా కింద పడిపోతున్నారని యాజమాన్యం ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి మహిళల అస్వస్థతకు కారణమైన నెక్కంటి సీఫుడ్స్ యాజ మాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ సీఐటీయూ, రైతుకూలీ సంఘం, ఆర్పీఐ, లిబరేషన్, పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేపట్టాయి. 30 మంది సీఐటీయూ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. సంజీవి ఆస్పత్రికి 18 మంది కాకినాడ క్రైం: పెద్దాపురం సమీపంలోని నెక్కింటి సీఫుడ్స్ ఫ్యాక్టరీలో బుధవారం కార్భన్ డయాక్సైడ్ లీకవడంతో అస్వస్థతకు గురైన వారిలో 18 మందిని యాజమాన్యం కాకినాడలోని సంజీవి ఆస్పత్రికి తరలించింది. ఇదే ఫ్యాక్టరీలో సోమవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన వారిలో 28 మందిని ఇదే ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. రొయ్యల కంపెనీలో వెదజల్లిన విషవాయువుపై విచారణ చేపట్టకుండా, లోపాలను సరిచేయకుండా బుధవారం కంపెనీలో పనులు నిర్వహించడంపై సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ తక్షణమే విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
రైతుల నోట్లో బాబు మట్టి
-
పరిశ్రమలపై అవగాహనకు చర్యలు
ఏలూరు (మెట్రో) జిల్లాలో పారిశ్రామిక రంగంపై ఆసక్తిగల వారికి వివిధ పరిశ్రమల స్థాపనకై బ్యాంకు రుణాలు, సబ్సిడీ తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆంద్రప్రదేశ్ పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ కె.ప్రసాదరావు చెప్పారు. బుధవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నూతన సమావేశ మందిరంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు, సబ్సిడీ, అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా జెడి ప్రసాదరావు మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ఆసక్తిగల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసమరైన అన్ని అనుమతులు 21 రోజుల్లో సింగిల్ డెస్క్ విధానం ద్వారా లభిస్తాయని ఆయన చెప్పారు. వివిధ పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు రుణాలు, సబ్సిడీ వంటి వివరాలను అవగాహన చేసుకుని పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకుని పూర్తి అవగాహన పొందిన వారికి ప్రభుత్వం తమవంతు సహకారాన్ని లబ్ధిదారులకు అందిస్తుందని ప్రసాదరావు చెప్పారు. ఈ సందర్భంగా పరిశ్రమల స్థాపనకు ప్రస్తుతం చేసుకున్న వ్యాపారాల అభివద్ధికి బ్యాంకు రుణాలు, అవగాహన కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పారిశ్రామిక వేత్తల సమస్యలను, సలహాలను అధికారులు అడిగి తెలుసుకుని వారికి అవసరమైన సూచనలు చెప్పారు. ఈ కార్యక్రమంలో లీడ్బ్యాంకు మేనేజర్ సుభ్రహ్మణ్యేశ్వరరావు, నాబార్డు ఎజిఎం రామప్రభు, నాబ్కాన్స్ సెక్టోరియల్ హెడ్ సుభ్రహ్మణ్యం, ప్రసాద్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ శ్రీనివాసమూర్తి, జిల్లా పరిశ్రమల డిప్యూటీడైరెక్టర్ పి.ఏసుదాసు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి.ఆదిశేషు పాల్గొన్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి
-
శ్రీసిటీలో వెర్మీరియన్ పరిశ్రమ ప్రారంభం
శ్రీసిటీ(సత్యవేడు) : శ్రీసిటీలో శుక్రవారం బెల్జియం దేశానికి చెందిన వెర్మీరియన్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ పరిశ్రమను రాష్ట్రవైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆస్పత్రి పరికరాల తయారీలో పేరుగాంచిన వెర్మీరియన్ గ్రూప్ భారతదేశంలో మొట్టమొదట ఉత్తత్తి కేంద్రాన్ని శ్రీసిటీలో ప్రారంభించింది. చెన్నైలోని బెల్జియం కాన్సుల్ జనరల్ డాక్టర్ బార్డ్ డి గ్రూఫ్, వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్,వెర్మీరియన్ గ్రూప్ సీఎఫ్వో జాన్ పేన్హెర్క్, శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఈ కంపెనీ ఉత్పత్తుల్లో ప్రధానమైనవి వీల్చైర్లని, ఆస్పత్రులు, దివ్యాంగులకు మాత్రమే కాకుండా వయస్సు మీరిన వారికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. వెర్మీరియన్ గ్రూప్ సీఈవో పాట్రిక్ వెర్మీరియన్ మాట్లాడుతూ రూ. 40వేల కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చే శామని, ప్రపంచంలో ఇది నాలుగో ఉత్పత్తి కేంద్రమని తెలిపారు. ఇండియా తమకు చాల ముఖ్యమైన వ్యాపార కేంద్రమని, ఇక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తులు అందిస్తామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అన్ని వసతులు కలిగిన శ్రీసిటీలో తమ ప్లాంట్ ఏర్పాటు చేశామన్నారు. శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ వెర్మీరియన్ కంపెనీ శ్రీసిటీలో నెలకొల్పడం తనకు చాలా ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. ఈ కంపెనీ ఏర్పాటుతో తక్కువ ధరతో నాణ్యమైన వస్తువులు తమకు లభిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు. 07ఎస్టివిడి03– -
‘దివీస్’ అనుమతులు రద్దు చేయాలి
తుని : తీరప్రాంత ప్రజల జోవనోపాధికి హాని కలిగించే దివీస్ మందుల పరిశ్రమ మంజూరు చేసిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ప్రకాశం రోడ్డులోని సాదీఖానాలో దివీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీపీఐ, సీపీఐ(ఎంఎల్), వ్యవసాయ కూలీ సంఘం, గిరిజన సంఘం, బాధిత గ్రామాలకు చెందిన పెద్దలు హాజరయ్యారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దువ్వా శేషు బాబ్జి మాట్లాడుతూ దానవాయిపేట పంచాయతీ పరిధిలో దివీస్ లాబొరిటీస్ నిర్మాణం చేపట్ట కూడదని హైకోర్టు స్టేటస్ కో జారీ చేసినా పట్టించుకోకుండా పనులు చేపడుతున్నారన్నారు. తక్షణమే పనులు నిలిపివేయాలన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కొనసాగిస్తున్న 144 సెక్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర కార్యవర్గం సభ్యుడు బుగతా బంగార్రావు, రాష్ట్ర రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దివీస్ పరిశ్రమను తరలించాలని ఈ నెలాఖరున సంతకాల సేరకణ చేపట్టి సీఎం, గవర్నర్లకు అందజేస్తామన్నారు. రెవెర్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. బాధిత గ్రామాల నుంచి వచ్చిన నాయకులు మట్ల ముసలయ్య, తొండంగి మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీవిశ్వేశ్వరరావు ప్రజల కష్టాలను వివరించారు. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేసుకట్ల సింహాచలం, రైతు కూలి సంఘం జిల్లా కార్యదర్శి మాను లచ్చ బాబు, కె. జనార్దన్, రాపా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టరైనా నేతలవేపే
– సీపీఎం జిల్లా కార్యదర్శి ఆరోపణ – బదిలీ చేయాలని డిమాండ్ కర్నూలు సిటీ: ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన జిల్లా కలెక్టర్...కార్పొరేట్ కంపెనీలు, రాజకీయ నేతలకు అనుకూలంగా పని చేస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. స్థానిక సుందరయ్య భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నానో కెమికల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అడ్డుపడకుండా ఉంటే గ్రామాల్లో రోడ్లు వేయిస్తాం, మురుగు కాల్వలు నిర్మిస్తామంటూ కంపెనీ యాజమానులకు అనుకూలంగా కలెక్టర్ మాట్లాడడాన్మిన బట్టి ఆయన యాజమాన్యంతో కుమ్మక్కయ్యారన్న అనుమానం వస్తోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏ ఒక్కరు వ్యతిరేకం కాదని, అయితే ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిశ్రమలు మాత్రం పెట్టవద్దన్నారు. దీనిపై రైతులు అడ్డుకుంటే కలెక్టర్ కేసులు పెట్టించడం ఎంటని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని చుట్టంలా చేసుకుని నిత్యం ఉద్యోగులను ఇబ్బంది పెడుతూ పైశాచికానందం పొందుతున్నారని కలెక్టర్పై అగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వేలాది రోగులతో రద్దీగా ఉండే ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివద్ధిని పట్టించుకోవడం లేదన్నారు. అలాంటి కలెక్టర్.. రైతులతో మాట్లాడేందుకు వచ్చిన బివి.రాఘవులను శకునాలకు పోకుండా రాత్రికి రాత్రే అక్కడ 144 సెక్షన్ పెట్టడం సరికాదన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
చాగల్లు షుగర్స్పై కొరడా
కొవ్వూరు : చాగల్లులోని జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను రాబట్టేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించిన అధికారులు ఈనెల 15న ఉదయం 11 గంటలకు కర్మాగారాన్ని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయిం చారు. రైతుల నుంచి చెరకు సేకరిస్తున్న ఫ్యాక్టరీ యాజమాన్యం రెండేళ్లుగా వారికి సొమ్ము చెల్లించడం లేదు. 2014–15, 2015–16 సంవత్సరాలకు సంబంధించి రూ.70.44 కోట్లమేర బకాయిలు పేరుకుపోయాయి. దీంతో రైతులు అనేకసార్లు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఎదుట నెల రోజులకు పైగా ఆందోళన చేశారు. అయినప్పటికీ యాజమాన్యం స్పందించలేదు. రైతు సంఘం నాయకులు, ఆర్డీవో, అసిస్టెంట్ కేన్ కమిషనర్ యాజమాన్య ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. చివరకు ఆర్డీవో బి.శ్రీనివాసరావు సారధ్యంలో రైతు ప్రతిని ధులు, అసిస్టెంట్ కేన్ కమిషనర్తో సంఘాన్ని ఏర్నాటు చేశారు. ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేసిన పంచదార నిల్వలను విక్రయించడం ద్వారా రైతుల బకాయిలు చెల్లించాలని సంఘం నిర్ణయించింది. అందుకు యాజమాన్యం సానుకూలత వ్యక్తం చేయడంతో 12 విడతలుగా పంచదారను విక్రయించగా వచ్చిన రూ.34.61 కోట్లను 9,640 మంది రైతులకు చెల్లించారు. అయినా, బకాయిలు పూర్తిగా తీరకపోవడంతో అసిస్టెంట్ కేన్ కమిషనర్ నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) యాక్ట్ ప్రయోగించారు. యాజమాన్యానికి నోటీసులు ఇచ్చినా సరైన స్పందన రాకపోవడంతో రైతు ప్రతినిధుల బృందం జూన్ మొదటి వారంలో చెన్నై వెళ్లి యాజమాన్యంతో చర్చించింది. అనంతరం యాజమాన్యం రూ.6.50 కోట్లను చెల్లించింది. ఈ సొమ్మును 3,300 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా రూ.28.04 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని రాబట్టేందుకు ఫ్యాక్టరీని బహిరంగ వేలంలో విక్రయించాలని నిర్ణయించి వేలం ప్రకటన జారీ చేశారు. 15న వేలం వేస్తున్నాం చెరకు రైతులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం చాగల్లులోని జైపూర్ షుగర్స్ను ఈనెల 15న వేలం వేస్తున్నాం. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ ఆవరణలోనే ఈ కార్యక్రమం నిర్వహించారు. వేలం నిర్థారణకు 30 రోజుల గడువు ఉంటుంది. ఈలోగా యాజమాన్యం ఏదైనా అప్పీల్ వస్తే స్వీకరిస్తాం. –బి.శ్రీనివాసరావు, ఆర్డీవో, కొవ్వూరు రూ.28.04 కోట్లు చెల్లించాలి చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు ఇంకా రూ.28.04 కోట్లు బకాయిపడింది. 2014–15లో చెల్లించాల్సిన బకాయిలను పంచదార విక్రయించడం ద్వారా వచ్చిన సొమ్మును, యాజమాన్యం సర్ధుబాటు చేసిన సొమ్మును రైతులకు చెల్లించాం. మిగిలిన బకాయిల కోసం యాజమాన్యంతో రైతు సంఘం ప్రతినిధులతో పలుసార్లు చర్చించినప్పటికీ ప్రయోజనం కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ రికవరీ యాక్ట్ను అనుసరించి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. – ఎ.సీతారామారావు, అసిస్టెంట్ కేన్ కమిషనర్, తణుకు -
‘సహకార’ పద్ధతి సరికాదు
ఎంపీ కవిత వ్యాఖ్యలు అర్థరహితం బోధన్: నిజాంషుగర్స్ను సహకార పద్ధతిలో నడపాలనే ఆలోచనును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఫ్యాక్టరీ రక్షణ కమిటీ కన్వీనర్ రాఘవులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వం నడుపుతుందని, పూర్వవైభవం తెస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రక్షణ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆదివారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ భవిష్యత్పై ఎంపీ కవిత ఇటీవల చేసిన ప్రకటన అర్థరహితమన్నారు. రైతులు ముందుకు వస్తే సహకారపద్ధతిలో ఫ్యాక్టరీ నడుపుతామని ఎంపీ ప్రకటించడం సమస్యను పక్కదారిపట్టించే విధంగా ఉందన్నారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపలేమని రైతులు, ప్రజాసంఘాలు, రక్షణ కమిటీ ఇదివరకే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షను గుర్తించకుండా మళ్లీ పాతపాటపాడటం సరికాదన్నారు. ప్రైవేట్ యాజమాన్యం లే ఆఫ్ ప్రకటించినా ప్రజాప్రతినిధులు మౌనం వహించారన్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను ఇంటికి పంపిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలని, మొండివైఖరితో వ్యవహరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కమిటీ ప్రతినిధులు పీ వరదయ్య, బీ మల్లేశ్, ఎన్ హన్మంత్రావు, శంకర్గౌ పాల్గొన్నారు. హామీ ఏమైంది..? అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని నడుపుతామని ఇచ్చిన వాగ్ధానం ఏమైందని ప్రజాసంఘాల జేఏసీ కన్వీనర్ జీ నడ్పిభూమయ్య అన్నారు. పట్టణంలోని నీటిపారుదలశాఖ విశ్రాంతిభవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార పద్ధతిలో ఫ్యాక్టరీ నడపాలని ఎంపీ కవిత ప్రకటించడం వెనుక ప్రభుత్వానిది మరో ఆలోచన అని, ఫ్యాక్టరీని సహకారంగంలోకి నెట్టి చేతులు దులుపుకుందామని యోచిస్తోందన్నారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో సహకార రంగంలో కొనసాగుతున్న ఫ్యాక్టరీలు నష్టాలో కూరుకుపోయాయన్నారు. మన జిల్లాలోని సారంగాపూర్ ఫ్యాక్టరీ మూతపడిందని, వీటి నుంచి గుణపాఠం నేర్చుకోకుండా ప్రకటనలు చేయడం తగదన్నారు. సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కో కన్వీనర్ ఎల్ చిన్న పర్వయ్య, ప్రధాన కార్యదర్శి గౌతం కుమార్, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘నానో’ వద్దే వద్దు
– కొండజూటూరు గ్రామస్తుల ఆందోళన – రోడ్డుపై బైఠాయింపు – అధికారులను అడ్డుకున్న వైనం – గ్రామస్తులతో పోలీసుల చర్చలు పాణ్యం: కొండజుటూరు గ్రామ సమీపంలో సుమారు వెయ్యి కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన శాంతిరాం నానో కెమికల్ పరిశ్రమకు వ్యతిరేకంగా గ్రామస్తులు ఆదివారం ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించేందుకు కిందిస్థాయి అధికారులు ఆదివారం గోప్యంగా గ్రామంలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే విషయం గమనించిన గ్రామస్తులు మూకుమ్మడిగా రోడ్డెక్కారు. తహసీల్దార్ చంద్రావతి అడ్డుకున్నారు. గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర ్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఇద్దరు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు 50 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే అప్పటికే మహిళలు, చిన్నపిల్లలు సహా గ్రామస్తులు కర్రలు తీసకుఉని రోడ్డుపై బైఠాయించారు. 500 మంది వరకు స్థానికులు నిరసన గళం విప్పారు. పరిశ్రమ, అదీ ఇదీ అంటూ మరోసారి గ్రామంలోకి వస్తే ఎం జరిగినా తమది బాధ్యత కాదంటూ హెచ్చరించారు. దీంతో చేసేదేమి లేక అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పరిశీలించిన మంత్రులు
అప్పారావుపేట (దమ్మపేట): అప్పారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మంగళవారం పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీ అవసరాన్ని తోటి మంత్రులకు, స్పీకర్కు తుమ్మల వివరించారు. దమ్మపేట మండలంలోని దాదాపు 15వేల ఎకరాల్లో పామాయిల్ పంట సాగవుతోందని వారితో చెప్పారు. అప్పారావుపేటలో నూతన పరిజ్ఞానంతో పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్టు మంత్రులతో ఆయిల్ఫెడ్ ఎండీ మురళి చెప్పారు. ఈ ఫ్యాక్టరీ పూర్తయితే ఆయిల్ రికవరీ శాతంతోపాటు రైతుల పంటలకు ధర పెరుగుతుందని చెప్పారు. నూతన సాంకేతిక పరిజ్ఙానంలో భాగంగా ముందుగా ఇక్కడ గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలు క్రషింగ్ అయ్యేలా మినషరీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తర్వాత పంట దిగుబడుల ఆధారంగా గంటకు 60 టన్నులు క్రషింగ్ అయ్యేలా మిషనరీని ఏర్పాటు చేస్తామన్నారు. -
పిక్కల్లేని ఫ్యాక్టరీ రూ.100 కోట్లకు 30కోట్లే మంజూరు
అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీ పూర్తయ్యెదెపుడు.? అశ్వారావుపేట: తెలంగాణ ఆయిల్ఫెడ్ నేతృత్వంలో దమ్మపేట మండలం అప్పారావుపేటలో నిర్మితం అవుతున్న అత్యాధునిక పామాయిల్ ఫ్యాక్టరీకి నిధుల కొరత వెంటాడుతోందని ఆ శాఖ నుంచి సమాచారం అందుతోంది. ఫ్యాక్టరీకి చెందిన సమాచారం విశ్వసనీయంగా తెలిసింది. 2013లో అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీకి అదనంగా మరో ఫ్యాక్టరీ నిర్మించాలని త్రిసభ్య కమిటీ సూచించింది.. దీనికి రూ. 36కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. అయితే రెండో ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మించాలనే విషయంలో జాప్యం జరిగి ఇన్నాళ్లకు మోక్షం లభించింది. దీంతో ఫ్యాక్టరీ నిర్మాణ అంచనా విలువ రూ.74కోట్లకు చేరింది. దమ్మపేట మండలానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక కృషితో ఫ్యాక్టరీకి ఆమోదం లభించింది. కొందరి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో పామాయిల్ రైతులు చిక్కుల్లో పడనున్నారని లె లుస్తోంది. మంజూరు కాని నిధులు.. ఉన్న ఫ్యాక్టరీని ఆధునికీకరణ, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్సీడీసీ నుంచి సుమారు రూ.100కోట్ల రుణం తీసుకోవాడానికి ఆయిల్ఫెడ్ నిర్ణయించింది. ఎన్సీడీసీ బృందం అశ్వారావుపేట ఫ్యాక్టరీని, అప్పారావుపేట ఫ్యాక్టరీ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించింది. దీనికి ఫ్యాక్టరీల ఆస్తులను గ్యారంటీగా చూపించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఒక వేళ అప్పును తిరిగి కట్టకుంటే భవిష్యత్ ఏమిటనే యోచనలో కొందరు రైతులున్నారు. ఇదిలా ఉండగానే ఇప్పటికే అశ్వారావుపేట ఫ్యాక్టరీ మరామ్మతులకు రూ.18కోట్లు ఖర్చు చేయగా.. మరో 18కోట్లకు ప్రతిపాదనలను పంపించనున్నట్లు సమాచారం. అంతేకాక అప్పారావుపేటలో నిర్మిస్తున్న కొత్త ఫ్యాక్టరీ అంచనాను 104కోట్లకు పెంచినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయిల్ఫెడ్కు కేవలం రూ.30కోట్ల గ్రాంటు మాత్రమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయిల్ఫెడ్కు రూ.100 కోట్లు రుణం ఇస్తే.. ఏడాదికి రూ.9కోట్ల వడ్డీ చల్లించాలి. దీంతో సంస్థపై అదనపు భారం పడి అప్పు తీర్చలేని స్థితికి వెళుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే జరిగిన పలు కుంభకోణాలు, మూతపడిన నూనె పరిశ్రమలు, కల్తీ ఆయిల్ ముద్రలతో సంస్థకు అప్పిచ్చేందుకు ఎన్సీడీసీ విముఖత చూపుతున్నట్లు కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అప్పారావుపేట ఫ్యాక్టరీకి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించుకోకుంటే ఆయిల్ఫెడ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులకు అన్యాయం జరుగుతుంది. పనులు బట్టే నిధులు మంజూరు అవుతాయి.. – ఆయిల్ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్రెడ్డి ఫ్యాక్టరీ నిర్మాణ దశను బట్టి పూర్తయిన పనుల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. ప్రతివారం నిర్మాణ ప్రగతి నివేదికలను ఎన్సీడీసీకి అందిస్తున్నాం. పనులు జరిగే క్రమాన్ని బట్టి నిధులు విడుదల అవుతాయి. ఇక ఆయిల్ఫెడ్ ఆర్థిక వ్యవహారాలు, లాభనష్టాల గురించి తన పరిధిలో లేని అంశం. -
ఫ్యాక్టరీలో బాంబు పేలి ముగ్గురి మృతి
ముంబై: ముంబైలోని ఓ పరిశ్రమలో పేళుడు సంభవించడంతో ముగ్గురు మృతి చెందారు. ఈశాన్య ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఎఎమ్ పీ ఫర్టిలైజర్స్ లో శనివారం పేలుళ్లు సంభవించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫాక్టరీలోని బాయిలర్ లో సంభవించిన ప్రమాదమే ఇందుకు కారణ మని తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది. -
వేతనాల కోసం బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికుల ధర్నా
మంగపేట: పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ బిల్ట్ ఫ్యాక్టరీ కార్మికులు వరంగల్ జిల్లా మంగపేట మండలంలో ఎర్రవాగు బ్రిడ్జిపైన ఆందోళనకు దిగారు. బూర్గంపాడు-ఏటూరునాగారం ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగడంతో కాసేపు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. 13 నెలలుగా వేతనాలు చెల్లించకుండా యాజమాన్యం వేధిస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తంచేశారు. -
కొడుక్కి బొమ్మ కొనడానికి వెళ్లి..
కన్న కొడుక్కి సంతోషాన్ని పంచేందుకు వెళ్లిన ఓ తండ్రి తిరిగిరాని లోకాలకు తరలిపోయాడు. తమిళనాడులోని అత్తూరుకు చెందిన సగ్గు బియ్యం ఫ్యాక్టరీ యజమాని బాలాజీ(28)ని రోడ్డుప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాలాజీ తన స్నేహితుడితో కలిసి కుమారునికి బొమ్మ కొందామని సేలం వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో వాల్పడి దగ్గర ప్రమాదం జరిగింది. ఇతని కారు, ఎదురుగా వస్తున్న మినీలారీ మీదికి దూసుకుపోయింది. దీంతో బాలాజీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన స్నేహితుడు కోలుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. -
దోమల ఫ్యాక్టరీ
హైదరాబాద్: దోమల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది.. దోమలద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికున్గున్యా మొదలుకొని రకరకాల వ్యాధులు. వ్యాధులను వ్యాప్తి చెందించే దోమల నివారణకు వేర్వేరు పద్ధతులను అవలంబిస్తున్నారు. వీటికితోడు చైనాలో ఓ బృందం ఒక వినూత్నమైన ఆలోచనతో దోమల భరతం పడతామంటోంది. ఇందుకోసం ఓ ఫ్యాక్టరీ నెలకొల్పి ప్రతి వారం రెండు కోట్ల దోమల్ని బయటకు వదులుతామంటోంది. ఉన్న దోమలకు తోడు ఈ కొత్త దోమలెందుకబ్బా? అనేగా మీ సందేహం. చైనాలోని సన్ యాట్సెన్ వర్సిటీ శాస్త్రవేత్త జియాంగ్ జీ, మిషిగన్ స్టేట్ వర్సిటీలు సంయుక్తంగా ప్రారంభించిన ఈ ఫ్యాక్టరీలో మగ దోమలను మాత్రమే అభివృద్ధి చేస్తారు. మగవి మనల్ని కుట్టవు... వ్యాధులను వ్యాప్తిచెందించవు. ఈ మగదోమల్లో వోల్ బాకియా అనే బ్యాక్టీరియా ఉండేలా శాస్త్రవేత్తలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మగదోమలు మామూలు ఆడదోమలతో కలిస్తే పుట్టే సంతానం మొత్తానికి వంధ్యత్వం (పిల్లలు పుట్టకపోవడం) వస్తుంది. అవి మళ్లీ సంతానోత్పత్తి చేయలేవు. దీంతో కొన్ని తరాలు గడిస్తే దోమలన్నవి లేకుండా పోతాయి. గత ఏడాది గాంగ్జూలోని ఓ దీవిలో ఈ కొత్త దోమలను ప్రయోగాత్మకంగా వదిలి చూశారు. కొద్దికాలంలోనే దోమల సంఖ్య సగానికి తగ్గిందట. -
మధ్యప్రదేశ్లో భారీ అగ్ని ప్రమాదం
-
పామాయిల్ రైతుల నిరసన
అశ్వారావుపేట (ఖమ్మం) : పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని క్రషింగ్ యూనిట్లో ఏర్పడిన సాంకేతికలోపంతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న రూ. కొటి విలువైన గెలలు కుళ్లిపోయాయి. దీంతో ఈ రోజు రైతుల నుంచి గెలలు కొనడంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. దీంతో రైతులు రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు. -
అట్టల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: కాటేదాన్లోని ఓ అట్టల పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్ని ప్రమాదానికి షార్ట్సర్క్యూట్ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆదివారం కావడంతో పరిశ్రమలో ఎవరూ లేరు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నికీలలకు గాలి తోడు కావడంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు ఫైరింజన్లు వచ్చాయి. ఎంతమేరకు నష్టం సంభవించిందనేది తెలియాల్సి ఉంది. -
ఇక పోరుబాటే
- నిజాం షుగర్స్ భవిత కోసం అఖిల పక్షం ఉద్యమం - ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నాయకుల నిర్ణయం - భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు - ఫ్యాక్టరీని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ బోధన్ : నిజాం షుగర్స్ పరిరక్షణకు అఖిలపక్షం గళమెత్తింది. తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యమ కార్యాచరణకు సమాలోచనలు చేస్తోంది. తాము అధికారంలోకి రాగానే ఫ్యాక్టరీని స్వాధీనం చే సుకుని పూర్వవైభవం తెస్తామని ఎన్నికల ముందు కేసీఆర్ హామీ ఇచ్చిన విషయాన్ని అఖిల పక్ష నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఈ ప్రాంత కార్మిక, కర్షకు ల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల బోధన్లో తెలంగాణ ప్రజాఫ్రంట్, పది వామపక్ష పార్టీ లు, ఇతర పార్టీల ప్రతినిధులు, కార్మిక , రైతు సం ఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. టీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాఘవులు కన్వీనర్గా నిజాం షుగర్స్ రక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. నిజాం షుగర్స్కు ఘన చరిత్ర.. 1937లో నిజాం పాలకుల హయాంలో బోధన్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని నిర్మించారు. అప్పట్లో ఆసియా ఖండంలోనే అతి పెద్ద వ్యవసాయాధార పరిశ్రమగా ప్రఖ్యాతి పొందింది. ఈ ఫ్యాక్టరీకి లాబాలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చక్కెర పరిశ్రమల విస్తరణ సాగింది. దశాబ్దాల పాటు ఈ ఫ్యాక్టరీ ఓ వెలుగు వెలిగింది. జిల్లా అబివృద్ధికి ఎంతగానో దోహదపడింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశానికి విమానాల కోసం ఇథనాయిల్ అందించిన ఘన చరిత్ర ఈ ఫ్యాక్టరీకి ఉంది. దశాబ్దాలుగా ప్రభుత్వ రంగ సంస్థ పరిధిలో కొనసాగగా, రైతులు పండించిన చెరకుకు గిట్టుబాటు ధరతో పాటు వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించింది. అయితే క్రమంగా పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ స్వార్థంతో వైభవం కోల్పోతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటీకరణ.. 2002లో ముఖ్యమంత్రి చంద్రబాబు లాభాల్లో కొనసాగుతున్న ఈ ఫ్యాక్టరీ పరిధిలోని బోధన్ యూనిట్, కరీంనగర్ జిల్లా ముత్యంపేట్, మెదక్ జిల్లా ముంబోజిపల్లి యూనిట్లను ప్రైవేట్ జాయింట్ వెంచర్ పేరుతో డెల్లా పేపర్ కంపెనీకి కారు చౌకగా ధారాదత్తం చేశారు. 51శాతం ప్రైవేట్ సంస్థ, 49 శాతం ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నిన్వహణ అధికారాలను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పట్లో ఈ ప్రాంత రైతులు, కార్మికులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసి ఆందోళన చేపట్టినా చంద్రబాబు పట్టించుకోలేదు. ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపారు. మూడు ఫ్యాక్టరీల విలువ రూ. 365 కోట్లకు పైగా ఉండగా, కేవలం రూ.67 కోట్లకే ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ, కార్మిక సంఘాలు, రైతు ప్రతినిధుల ప్రైవేటీకరణ రద్దుకు పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. వైఎస్ఆర్ హయాంలో సభా సంఘం ఏర్పాటు.. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు, ఈ ప్రాంత రైతులు, కార్మికుల ఆకాంక్ష మేరకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కరీంనగర్ జిల్లాకు చెందిన అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్రావు చైర్మన్గా తొమ్మిది మంది శాసన సభ్యులతో సభా సంఘం నియమించారు. 2006 ఆగస్టులో సభా సంఘం నివేదిక ఇచ్చింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తిరిగి ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. అయితే వైఎస్ఆర్ మరణానంతరం సభా సంఘం నివేదిక అమలు మూలన పడింది. ఆ తర్వాత అప్పటి సీఎం రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి హయాంలో పలుమార్లు నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు అంశం తెరపైకి వచ్చింది. సిఎం కిరణ్కుమార్రెడ్డి హయాంలో నాటకీయ పరిణామాలు, మలుపులు తిరిగింది. 2013 డిసెంబర్లో కిరణ్కుమార్రెడ్డి అప్పటి రాష్ట్ర మంత్రివర్గంలో అనూహ్యంగా నిజాం షుగర్స్ అంశాన్ని ప్రస్తావించి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఏడుగురు మంత్రులతో సబ్ కమిటీని నియమించారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయికి చేరిన సందర్భంలో నిజాంసుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఎం. అప్పిరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, మంత్రి వర్గ ఉపసంఘం నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేసింది. దీంతో నిజాం షుగర్స్ ప్రైవేటీ కరణ అంశం మూలపడింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ హామీ.... మలి దశ తెలంగాణ ఉద్యమ సభలు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాం షుగర్స్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని పలు సభల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ రద్దు వైపు అడుగులు వేసింది. 2015 జనవరి 5న సచివాలయంలో బోధన్, మెట్పల్లి, మెదక్ ఫ్యాక్టరీలకు చెందిన చెరుకు రైతులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ప్రైవేటీకరణ రద్దుపై స్పష్టత ఇచ్చారు. ఫ్యాక్టరీలను రైతుల చేతికి అప్పగిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారని రైతు ప్రతినిధులు అంటున్నారు. ఆ తర్వాత మూడు ఫ్యాక్టరీల పరిధిలోని రైతులు, కార్మికులతో సమావేశాలు నిర్వహించి అబిప్రాయాలు సేకరించారు. ప్రభుత్వం సహకార రంగంలో ఫ్యాక్టరీలను నడపాలని యోచిస్తోందని రైతు ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఈ కోణంలోనే జిల్లా మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో మహారాష్ట్ర ప్రాంతంలో సహకార రంగంలో లాబాల బాటలో నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీల పనితీరు అధ్యయనానికి రైతుల బృందాన్ని తీసుకెళ్లారు. అయితే ముందు ప్రైవేట్ జాయింట్ వెంచర్ రద్దు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వమే నడుపాలంటున్న అఖిల పక్షం .. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఫ్యాక్టరీలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వమే నడపాలని అఖిల పక్షం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో సహకార రంగంలో ప్రారంభించిన సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ కొన్నేళ్ల నుంచి మూతపడిన చేదు అనుభవాలు కళ్ల ముందు కనిపిస్తున్నాయని అఖిల పక్ష నేతలంటున్నారు. -
నాటి మాటలు నీటిమూటలు
రెంటచింతల: ‘పరిశ్రమలు వస్తే అభివృద్ధి జరుగుతుందని చెబితే నమ్మాం.. పిల్లలకు ఉపాధి దొరుకుతుందని ఆశలు కల్పిస్తే మా భూములన్నీ తక్కువ ధరకే ఇచ్చేశాం. నాటి హామీలన్నీ ఇప్పుడు నీటి మూటలుగానే మిగిలిపోయాయి..’ ఇది రెంటచింతల మండలంలో పరాశక్తి సిమెంట్స్ కోసం భూములు విక్రరుుంచిన రైతులు ఆవేదన. ఈ మేరకు బాధితులు ఆదివారం మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వద్ద తమ గోడు వెల్లడించారు. ఫ్యాక్టరీ కోసం గోలి, జెట్టిపాలెం, మల్లవరం గ్రామాల పరిధిలోని భూమిని 1998 నుంచి 2000 వరకూ సేకరించి, 2002లో నిర్మాణం చేపట్టిందనీ, నాడు ఇచ్చిన హామీ ప్రకారం తమ పిల్లలకు ఉద్యోగాలు కల్పించలేదనీ, గ్రామాలు దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామన్న హమీలు మరిచారనీ వారు ఏకరువు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఒక్క సీసీ రోడ్డుకూడా వెయ్యలే దని చెప్పారు. ప్రభుత్వ పోరంబోకు డొంక భూములు నాలుగెకరాలు కూడా ప్యాక్టరీ ఆధీనంలో ఉన్నాయనీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 760/1, 760/2, 760/3, 761/1, 761/2, 762/1, 762/2, 764/1, 764/2, 765/1, 765/2, 766/1, 766/2, 766/3, 767, 773/1. 773/2 సర్వే నంబర్లలోనున్న అసైన్డ్భూములు ఎకరాకు నాడు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మాత్రమే చెల్లించారనీ, 85 ఎకరాలలో ప్యాక్టరీ నిర్మాణం, 59 ఎకరాలలో ఉద్యోగుల కాలనీ, 45 ఎకరాలలో గ్రీన్ పార్కు నిర్మాణం చేపట్టిన యాజమాన్యం జెట్టిపాలెం, గోలి, పశర్లపాడుకు చెందిన 25 మందికి మాత్రమే ఉపాధి కల్పించిందని పేర్కొన్నారు. ప్యాక్టరీ ఆధీనంలో మైనింగ్-1 కింద 448 ఎకరాలు, మైనింగ్ -2 కింద మరో 400 ఎకరాలు భూములున్నాయనీ, భూములిచ్చిన ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు అనేక మార్లు అధికారుల చుట్టూ తిరిగి న్యాయం చేయాలని అర్థించినా పట్టించుకోలేదనీ వారు ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకున్నారు. అన్యాయం చేస్తే సహించం.. దీనికి స్పందించిన ఎమ్మెల్యే పీఆర్కే మాట్లాడుతూ దళిత, గిరిజన, బడుగు వర్గాలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వం అసైన్డ్ భూములను దళిత, గిరిజనులకు కేటాయిస్తే వాటిని కొనుగోలు చేయకూడదన్నారు. దీనిని ఉల్లంఘించి పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం 350 ఎకరాలు తీసుకుని ఉపాధి కల్పించకపోవడం, గ్రామాల అభివృద్ధి మరచిపోవడం దారుణమన్నారు. ఈ సమస్యను జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తానన్నారు. -
ఫ్యాక్టరీలో పేలుడు : ఒకరు మృతి
-
చెరకు క్రషింగ్ లేనట్టేనా ?
బుచ్చిరెడ్డిపాళెం : కోవూరు చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తానన్న సీఎం చంద్రబాబునాయుడు మాటలు నీటి మూటలుగానే మిగిలారుు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలు కేవలం నివేదికలు ఇవ్వడానికే పరిమితమయ్యాయి. ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితులను లక్ష్మీనరసింహ కమిటీ పరిశీలించింది రైతులు, రైతు సంఘాల నాయకులతో మాట్లాడింది. మళ్లీ ఈ నెల 9, 10 తేదీల్లో మరో కమిటీ ప్లాంటేషన్ తదితర విషయాలపై పరిశీలించేందుకు రానుంది. ఈ ఏడాది కర్మాగారంలో క్రషింగ్ నిలిచిపోరుుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టిన దుస్థితే మళ్లీ తలెత్తిందని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లాకే తలమానికంగా నిలిచిన కోవూరు సహకార చక్కెర కర్మాగారం పరిస్థితి దారుణంగా మారింది. ఈ ఏడాది ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు లక్ష టన్నుల వరకు చెరకు సాగు చేశారు. ఏటా డిసెంబరులో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. రైతులు, కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు, ప్రస్తుతం ఫ్యాక్టరీ నడిచేందుకు కావాల్సిన నిధులు విడుదల చేయాలని వివిధ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ క్రమంలో రైతులకు రూ. 4.41 కోట్లు, కార్మికుల జీతాలు రూ.6 కోట్లు చెల్లించాల్సి ఉంది. మరమ్మతులు తదితరాలకు రూ.4 కోట్లు తప్పనిసరిగా కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాళెంలో జన్మభూమి- మాఊరు కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబు కోవూరు చక్కెర కర్మాగారానికి పూర్వవైభవం తెస్తానని ప్రకటించారు. ఫ్యాక్టరీ నడిచేందుకు తగిన చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. నాయుడుపేట ఫ్యాక్టరీకి తరలింపు.. కర్మాగారం పరిధిలో సాగు చేసిన లక్ష టన్నుల చెరకు ప్రస్తుతం క్రషింగ్ దశలో ఉంది. ఈ ఏడాది టన్ను చెరకుకు రూ.2,125 ధర నిర్ణయించారు. పంటకు పెట్టిన పెట్టుబడులకు నిర్ణయించిన ధరకు పొంతన లేకుండా పోయింది. విధిలేని పరిస్థితుల్లో రైతులు నాయుడుపేట ఫ్యాక్టరీకి చెరకును తరలిస్తున్నారు. మూతపడిన మూడు సహకార చక్కెర కర్మాగారాలు.. రాష్ట్రంలో కడప, కోవూరు, జంపని(గుంటూరు) సహకార చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. ఇదే కోవ లో ఉన్న రేణిగుంట, చిత్తూరు, అనకాపల్లి కర్మాగారాలకు నిధులు విడుదల చేయడంతో అవి కాస్తా ప్రారంభమయ్యా యి. ప్రభుత్వ సహకారం నోచుకోకపోవడంతో మూడు చక్కెర కర్మాగారాలు ప్రారంభంకాలేదు. వీటికి సంబంధించి దాదాపు రూ.25 కోట్లకుపైగా బకారుు లు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. పట్టించుకోని ప్రభుత్వం... కేరళకు చెందిన ఓ కంపెనీ కోవూరు చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తే రూ.7 కోట్లు ఇచ్చి ఆదుకుంటామని తెలిపింది. కర్మాగార అభివృద్ధికి తమ వంతు సహాయం అందిస్తామని స్పష్టం చేసింది. ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. మయూరి కర్మాగారానికి తరలుతున్న కార్మికులు.. కోవూరు చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న సీజనల్ కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఏడాది క్రషింగ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. సీజనల్ కార్మికులు చిత్తూరు జిల్లాలోని మయూరి కర్మాగారానికి తరలిపోతున్నారు. ఇప్పటికే తమకు జీతాల్లేక కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత దుస్థితే మళ్లీ.. 2002, 2003 సంవత్సరంలో చెర కు కర్మాగారం మూతపడింది. నామా నాగేశ్వరరావుకు రూ.21 కోట్లకే కర్మాగారాన్ని అమ్మేశారు. ప్రభుత్వ ధర ప్రకారం రూ.30 కోట్లకు పైగా ఉన్నా తక్కువ రేటుకే విక్రరుుంచారు. ఈ అంశంపై భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ధర కాకుండా తక్కువగా అమ్మాల్సిన అవసరం ఏం వచ్చిందని ఆ సమయంలో కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. సహకార రంగంలోని చక్కెర పరిశ్రమలను అమ్మే ప్రసక్తి లేదని, కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించేందుకు అప్పట్లో ఆయన చర్యలు తీసుకున్నారు. 2004లో ప్రారంభించి వరుసగా లక్షల టన్నుల చెరకు క్రషింగ్ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మళ్లీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రావడంతో ఫ్యాక్టరీ అమ్మడం ఖాయమని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం : రైతులు, కార్మికులకు బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. ఫ్యాక్టరీ నడిచేందుకు తగిన మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలి. ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేస్తే సహించం. ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం. - సూరా శ్రీనివాసులు రెడ్డి, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ -
అనుకున్నట్టే అయ్యింది...
సీతానగరం, బొబ్బిలి: అంతా ఊహించినట్టే ఎన్సీఎస్ యాజమాన్యంపై చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్యాక్టరీ ఎం.డి., డెరెక్టర్, ప్రజాప్రతినిధులను చుట్టుముట్టి తమ బకాయిల మాటేంటని నిలదీశారు. గత ఏడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరుకుకు సంబంధించిన బకాయిలు చెల్లించేవరకూ క్రషింగ్ మాటను ఎత్తవద్దని రైతులు కరాఖండీగా చెప్పడంతో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఏడాది తరువాత మళ్లీ మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా, మా జీవితాలతో ఆటలాడింది చాలదా అం టూ రైతులు దుమ్మెత్తి పోశారు. దీంతో ఆ ప్రాంగణంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రషింగ్ మొదలు పెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం రైతులతో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశాన్ని శనివారం సాయంత్రం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ఆవరణలో నిర్వహించారు. ఎప్పటిలాగే ఎం.డి. చాంబర్లో నిర్వహించడానికి ఎం.డి. నాగేశ్వరరావు, డెరైక్టరు శ్రీనివాస్లు ఏర్పాట్లు చేశారు. కేవలం 50 మంది రైతులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సమావేశానికి రమ్మని సమాచారం అందించారు. అయితే సమావేశం పెడుతున్నారన్న సమాచారం తెలుసుకొని రైతులు వందల సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య సమావేశం సరికాదని, ఆరుబయట పెట్టాలంటూ డిమాండ్ చేయడం కార్యాలయం ఫోర్ట్కో వద్దకు మార్చారు. రైతులు, ప్రజాప్రతినిధులు, యాజమాన్యం వచ్చి కూర్చున్నా పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు రాలేదు. ఆయన కోసం కొంత సేపు వేచి చూశారు. ఎమ్మెల్యే చిరంజీవులు వచ్చాక ఎం.డి. నాగేశ్వరరావు ప్రసంగం మొదలు పెట్టారు. జాతీయ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పడంతో రైతులు ఒకే సారి అడ్డుతగిలారు. ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ఎక్కడ సంగతులో ఎందుకు చెబుతున్నారంటూ ఒకే సారి రైతులంతా అందోళనకు దిగారు. బకాయిలు చెల్లింపులు, ఈ ఏడాది మద్దతు ధర గురించి చెప్పకుండా మాట్లాడుతుండడంతో వేదిక వద్దకు వెళ్లి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీ చెరుకు రైతు సంఘ నాయకులు రెడ్డి శ్రీరాంమూర్తి, లక్ష్ముంనాయుడు, గేదెల సత్యనారాయణ, సీడీసీ డెరైక్టరు బేతనపల్లి శ్రీరాంమూర్తి, ఆదర్శ రైతు ముప్పాల మురళీకృష్ణ తదితరులు ఎం.డీ, డెరైక్టరు, ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. బకాయిలు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ పట్టుబట్టారు. ఇంకా పది కోట్ల రూపాయల బకాయి ఉందని, ఈ నెలాఖరునాటికి కొంత, డిసెంబరు పదో తేదీనాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని ఎం.డీ ప్రకటించారు. దీంతో మరింత ఆవేదనకు గురైన రైతులు తీవ్ర పదజాలంతో యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మీ ఫ్యాక్టరీకి చెరుకును తోలుతున్నామంటే మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదని కొందరు రైతులు, మీరు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మా ఇళ్లలో శుభ కార్యాలు జరగడం లేదని మరికొందరు యాజమాన్యం, ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులు, యాజమాన్యం ప్రతినిధుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, కాంతారావులు, ఎస్ఐలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని అందోళన చేస్తున్న వారిని అదుపు చేశారు. దీంతో ఈ సమావేశానికి పోలీసులను ఎందుకు పిలిచారని, మీకు రక్షణగా ఉండడానికా, మమ్మల్ని బయటకు పంపడానికా అంటూ మరో సారి విరుచుకుపడ్డారు. ఈలోగా ఎమ్మెల్యే చిరంజీవులు కలగజేసుకొని యాజమాన్యం వ్యవహార శైలి ఏమీ బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిలు చెల్లించాకే క్రషింగ్ చేయాలని సూచిస్తూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. ఆ తరువాత ఎం.డీ, డెరైక్టరు, సీఈఓలు కూడా అక్కడ నుంచి ఛాంబర్లోనికి వెళ్లిపోయారు. దీంతో రైతులు తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ కార్యాలయం ముందు నినాదాలు చేసి కొంత సేపు బైఠాయించారు. ఈ సమావేశానికి మాజీ ప్రభుత్వ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు, మాజీ మంత్రి డాక్టరు పెద్దింటి జగన్మోహనరావు, మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, సీడీసీ అసిస్టెంటుకేన్ కమిషనర్ ముత్యాలు తదితరులు హాజరయ్యారు. -
చేదుగుళిక
కలిసిరాని చెరకు సాగు స్వల్పకాలిక వంగడాలపై రైతుల ఆసక్తి ఏటేటా తగ్గుతున్న పంట జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ పంటకు మదుపులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కావడం లేదు. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించకపోవడంతో నీటి వసతి పుష్కలంగా ఉన్న భూములలో సైతం సరుగుడు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. చెరకు ఏక వార్షిక పంట. సుమారు పది నెలలు పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టికి గురయితే అంతే సంగతి. మునగపాక : చెరకు సాగు రైతుకు లాభసాటి కావడం లేదు. దీంతో ఈ పంట విస్తీర్ణం జిల్లాలో ఏటేటా తగ్గిపోతోంది. సాధారణ విస్తీర్ణం 38,329 హెక్టార్లు. ఈ ఏడాది 37,459 హెక్టార్లే సాగయింది. మూడేళ్లుగా చీడపీడల బెడద, చక్కెర మిల్లులు మద్దతు ధర చెల్లించకపోవడం, మార్కెట్లో బెల్లం ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పంటను చేపట్టే రైతులను దివాలా తీసేలా చేస్తున్నాయి. తాతల కాలం నుంచి జీవనాధారంగా వస్తున్న పంటను వదులుకోలేక వేరే పనులు చేసే అవకాశం లేక రైతులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబమంతా ఏడాది పాటు కష్టపడినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలైపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ. 40వేల నుంచి రూ. 45వేలు వరకు ఖర్చవుతోంది. పంట చీడపీడలు, అతివృష్టి, అనావృష్టికి గురయి దిగుబడి తగ్గిపోతోంది. కనీసం పదిపాకాలకు మించి దిగుబడులు రావడం లేదు. బెల్లం మొదటిరకం క్వింటా రూ.2910 నుంచి రూ. 3070లు పలుకుతోంది. ఈ లెక్కన పదిపాకాలకు సుమారు రూ.30వేలు ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు రూ.15వేలు నష్టం తప్పడం లేదు. చక్కెర మిల్లులు కూడా మద్దతు ధర చెల్లించడం లేదు. గతేడాది సరఫరా చేసిన చెరకుకు ఇప్పటి వరకు తుమ్మపాల యాజమాన్యం చెల్లింపులు జరపలేదు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టిలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మద్దతు ధర లేదు నాది మునగపాక. చెరకు సాగే జీవనాధారం. అయితే పంట మదుపులకు, ఆదాయానికి పొంతన ఉండడం లేదు. బెల్లం తయారు చేస్తే మార్కెట్లో ధర ఉండడం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే మద్దతు ధర లేదు సరికదా చెల్లింపులు లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే ఈ ఏడాది 30సెంట్ల తోటను రసానికి అమ్మాను. పది టన్నులు వస్తుంది. టన్ను రూ. 2300లు. మొత్తం రూ. 23వేలు వరకు ఆదాయం వస్తుంది. ఇదే బాగుంది. - పెంటకోట శ్రీనివాసరావు ఏటా నష్టమే నాది మునగపాక. రెండెకరాల్లో చెరకు వేశా. గతేడాది రెండెకరాల్లోని పంటకు తెగుళ్లు సోకాయి. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎకరాకు రూ.45వేలు వరకు మదుపు పెట్టా. చీడపీడల కారణంగా ఎకరా చెరకు గానుగాడితే పదిపాకాలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 23వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు రూ 22వేలు వరకు నష్టపోయా. ఇంటిల్లిపాదీ కష్టపడినా నష్టమే వచ్చింది. - పెంటకోట వెంకటరావు, వ్యవసాయ రైతు -
ఎవరబ్బ సొత్తూ కాదు
సాక్షి, బెంగళూరు : ‘నేనెప్పుడు మంత్రి పదవిలోనే ఉంటానని అనడానికి ఆ పదవి ఎవరబ్బ సొత్తూ కాదు. మంత్రి పదవి నుంచి నన్ను తొలగిస్తే నేరుగా హెలికాఫ్టర్ ఎక్కి దావణగెరె వెళ్లిపోతాను. అక్కడ నా సొంత ఇంటిలో మిగతా జీవితాన్ని గడిపేస్తాను’ అని రాష్ట్ర ఉద్యానవన శాఖ మంత్రి శామనూరు శివశంకరప్ప వ్యాఖ్యానించారు. లాల్బాగ్లో ఏర్పాటైన మామిడి, పనస మేళాను ఆయన శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి వర్గంలో మార్పులు చేర్పులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు శామనూరు ఇలా స్పందించారు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సరైన ఫలితాలను సాధించలేకపోవడానికి మోడీ హవానే కారణమని అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే దావణగెరె పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ ఓటమి పాలైందని విశ్లేషించారు. లోక్సభ ఎన్నికల ఓటమికి బాధ్యులను చేస్తూ మంత్రులను తొలగించాల్సి వస్తే చాలా మందిని తొలగించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. మంత్రి వర్గంలో మార్పులపై తనకెలాంటి సమాచారం లేదని, ఇదంతా కేవలం మీడియా సృష్టేనని కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో అనుకున్న విజయాలను సాధించడంలో వెనకబడింది. దీంతో ఆయా పార్లమెంటు స్థానాలకు ఇన్చార్జ్లుగా వ్యవహరించిన మంత్రులపై వేటు వేసే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శామనూరు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. -
ప్రొద్దుటూరులో భారీగా నగదు స్వాధీనం
-
దారులు దారుణం
=చెరకు రైతుకు రహదారుల శాపం =తరలింపునకు అడుగడుగునా అవరోధం చోడవరం/కోటవురట్ల, న్యూస్లైన్ : ఫ్యాక్టరీలకు చెరకు సరఫరాకు రైతులు నానా యాతన పడుతున్నారు. రెండేళ్లుగా జిల్లాలో తుఫాన్ల తాకిడికి రోడ్లు దెబ్బతిన్నాయి. పొలాల్లో నుంచి చెరకు కాటాలకు వెళ్లే రోడ్లతోపాటు కాటాల నుంచి ఫ్యాక్టరీల వరకు పలు రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ కారణంగా సకాలంలో చెరకు మిల్లులకు సరఫరా కావడం లేదు. జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి సుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఈ ఏడాది సుమారు 10 లక్షల టన్నులు క్రషింగ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. అత్యధికంగా 24వేల మంది సభ్యరైతులు ఉన్న గోవాడ సుగర్ ప్యాక్టరీ 5.30లక్షల టన్నులు క్రషింగ్ చేయాలని యోచిస్తోంది. కానీ దీని పరిధిలోని రాయపురాజుపేట-గోవాడ, గుల్లిపల్లి గ్రామం నుంచి చెరకు కాటా మధ్యలోను, మేడిచర్ల-కొత్తపెంట రోడ్డు, భోగాపురం-పీఎస్పేట, జన్నవరం-పీఎస్పేట కాటా, జె.నాయుడుపాలెం, రోలుగుంట కాటాలకు వె ళ్లే రోడ్లు, ఒమ్మలి, చినపాచిలి కాటాలకు వచ్చే రోడ్లు దెబ్బతిన్నాయి. చోడవవరం మండలం లక్ష్మీపురం రైతుల పరిస్థితి మరీ దయనీయం. పెద్ద చెరువు నుంచి బొడ్డేరు వెళ్లే గట్టు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో చెరకు కట్టలు నెత్తిన పెట్టుకుని సుమారు రెండు కిలోమీటర్ల మేర మోసుకొస్తున్నారు. ఇలా 300 ఎకరాల్లో పండించిన వెయ్యి టన్నుల చెరకు తరలింపునకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కోటవురట్ల మండలంలో సుమారు 1400 హెక్టార్లలో చెరకు సాగయింది. పందూరు వరాహ నదిలో కాజ్వే కొట్టుకుపోవడంతో సుమారు 10 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి ఏటికొప్పాక ఫ్యాక్టరీకి చెరకు తరలించాల్సి వస్తోంది. అసలే పంటకు గిట్టుబాటు ధర లేక సతమతం అవుతున్న రైతులకు ప్రస్తుత పరిస్థితుల్లో తరలింపు ఇబ్బందులు అదనపు భారం అవుతున్నాయి. యండపల్లి శివారు వరాహనదిపై వంతెన మరమ్మతులకు గురికావడంతో మాకవరపాలెం, నర్సీపట్నం మండలాలు, కోటవురట్ల మండలం యండపల్లి నుంచి చెరకు సరఫరా ప్రశ్నార్థకంగా ఉంది. కొన్ని చోట్ల రైతులే తాత్కలికంగా మట్టితో పూడ్చి రాకపోకలు సాగిస్తుండగా గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కొన్ని రోడ్ల మరమ్మతులు చేపట్టింది. చెరకు బళ్ల రద్దీతో అవికూడా పాడయ్యాయి. గవరవరం వద్ద శారద నది గట్టు కొట్టేయడంతో ఆ గట్టుపై నుంచి రావాల్సిన చెరకును తీసుకురావడానికి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. -
ఫ్యాక్టరీలో కార్మికురాలు ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్లైన్: కార్మికురాలు ఫ్యాక్టరీలో నిప్పం టించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజగోపాలనగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మైసూరు రోడ్డులోని హొసగుడ్డదహళ్లిలో జనార్దన్, పుట్టమ్మ (37) దంపతులు నివాసం ఉంటున్నారు. పిణ్యా సెకండ్ స్టేజ్లోని 14వ క్రాస్లో ఉన్న స్పాన్ సిల్క్ కంపెనీలో దంపతులు పని చేస్తున్నారు. శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ విధులకు హాజరయ్యారు. ఉదయం టీ తాగే సమయంలో పుట్టమ్మ ఓ గదిలోకి వెళ్లి శరీరపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. సిబ్బంది గుర్తించి అదుపు చేసినప్పటికీ రక్షించలేక పోయారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కంపెనీ మేనేజర్ మురళి వేధింపుల వల్లే తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త జనార్ధన్ ఆరోపించగా వ్యక్తిగతంగా పుట్టమ్మపై తనకు ఎలాంటి కక్షలు లేవని మురళి మీడియాకు చెప్పాడు. పోలీసులు మురళిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో వైపు ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
టన్ను చెరకు రూ.2,215లు
యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్లైన్: ఏటికొప్పాక సుగర్ ఫాక్టరీ పరిధిలో రైతులకు వచ్చే క్రషింగ్ సీజన్లో టన్నుకు రూ.2,215లు మద్దతు ధర చెల్లించడానికి శుక్రవారం జరిగిన మహాజనసభలో తీర్మానించారు. బ్యాంకులద్వారా సభ్య రైతులకు చెల్లించాలని నిర్ణయించారు. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు రూ.200లు ప్రోత్సాహకానికి కమిషనర్కు ప్రతిపాదనలు పంపించగా రూ.120లు చెల్లింపునకు అంగీకరించారని చైర్మన్ రాజాసాగి రామభద్రరాజు సమావేశంలో వెల్లడించారు. వచ్చే సీజన్లో 2.25లక్షల టన్నుల క్రషింగ్ జరుగుతుందని ఆశిస్తున్నామన్నారు. ఇటీవల కేంద్రప్రభుత్వం లెవీని తగ్గించడంవల్ల ఫ్యాక్టరీ పరిధిలో రైతులపై రూ.15లక్షల వరకు అదనపు భారం పడుతుందన్నారు. బేగాస్ కొరత వల్ల కో-జనరేషన్ ప్లాంట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సక్రమంగా జరగడంలేదని, రానున్న సీజన్లో దీనిని అధిగమిస్తామన్నారు. మూడేళ్లుగా ఫ్యాక్టరీకి చెరకు సరఫరా చేస్తున్న సభ్యులుకాని రైతులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. ఈ మేరకు సుగర్కేన్ కమిషనర్కు వివరాలు పంపామన్నారు. ఫ్యాక్టరీ పరిధిలో 5,600ల మంది సభ్యులు ఉండగా ఇటీవల 930 మందిని తొలగించామని, 4700మంది సభ్యులు ఉన్నారని, వీరిలో 1347 మంది వెల్ఫేర్ ఫండ్ చెల్లించడంలేదని వివరించారు. ఇక ముందు రైతులకు నాణ్యమైన ఎరువులను సరఫరాచేస్తామని, ఇకముందు పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. ఆసక్తి ఉన్న రైతులకు సోలార్ పంప్సెట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. యూనిట్ ఖరీదు రూ. 6లక్షలు కాగా, కేంద్రప్రభుత్వం 30శాతం, రాష్ట్రప్రభుత్వం 20శాతం రాయితీ కల్పిస్తోందన్నారు. యూనిట్ ఖరీదును మరింత తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. రికవరీలో ఫ్యాక్టరీ వెనకబడుతోందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయాధికారి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. సూచనలు, సలహాలు ఇవ్వడంలేదన్నారు. ప్రభుత్వ రాయితీల గురించి వివరించడం లేదని వాపోయారు. ఫ్యాక్టరీ పరిధిలో చెరకు ప్లాంటేషన్ ద్వారా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోందని మరి కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంటేషన్ వంటివాటితో అదనపు ఖర్చులు ఫ్యాక్టరీపై పడుతున్నాయని పలువురు రైతులనడంతో ఎమ్డీ విక్టర్రాజు మాట్లాడుతూ అటువంటిదేమీ లేదన్నారు. సమావేశంలో సభ్య రైతులకు రూ.రెండులక్షలవరకు బీమాకు తీర్మానించారు. 60 ఏళ్లు దాటిన సభ్యులకు బీమా వర్తించనందున నగదు చెల్లింపునకు నిర్ణయించారు. గత సీజన్లో అత్యధికంగా చెరకు సరఫరా చేసిన రైతులు సిద్దాబత్తుల వెంకటరమణ, దుబాసి తాతమ్మలతోపాటు 8మందికి ప్రోత్సాహకాలు అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్డీ విక్టర్రాజు, డెరైక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
షుగర్ ఫ్యాక్టరీ ముట్టడి
నంద్యాలరూరల్, న్యూస్లైన్: బకాయిల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ శనివారం రైతులు షుగర్ ఫ్యాక్టరీని ముట్టడించారు. దాదాపు 400 మంది బాధిత రైతులు స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఫ్యాక్టరీకి చేరుకుని సిబ్బంది, సెక్యూరిటీ గార్డులను బయటకు పంపారు. కోపోద్రిక్తులైన కొందరు ఆఫీసు ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. అనంతరం ఫ్యాక్టరీ, ఆఫీసు, క్వార్టర్స్కు తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. నంద్యాల డివిజన్లో 2011-12లో చెరకు పంట సాగు చేసినట్లు తెలిపారు. 2013 జనవరి 20 వరకు సాగైన చెరకును నంద్యాల ఫ్యాక్టరీ యాజమాన్యం మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట ఫ్యాక్టరీకి పంపి సొమ్ము చేసుకుందన్నారు. ఫిబ్రవరి 3 వరకు జరిగిన చెరకు క్రస్సింగ్కు సంబంధించి మొత్తం రూ.6.70 కోట్ల బకాయిలు 545 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందన్నారు. అయితే యాజమాన్యం వాటిని చెల్లించకుండా ఇప్పుడు.. అప్పుడు అంటూ రైతులను మభ్యపెడుతూ వస్తోందన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకొని బకాయిలు చెల్లించాలని చెప్పినా ఫలితం కనిపించలేదని అన్నారు. అందుకే అందోళన చేపట్టాల్సి వచ్చిందని అన్నారు. బకాయిలు చెల్లించకపోతే ఫ్యాక్టరీ మేనేజింగ్ డెరైక్టర్ మధుసూదన్గుప్త ఇంటి వద్ద రైతు కుటుంబాలు మొత్తం దీక్షలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆందోళనలో రైతులు సాగేశ్వరరెడ్డి, పాపిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, ఈశ్వరరెడ్డి, రవికుమార్రెడ్డి, ఎల్లయ్య, మురళీ, సర్వేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమలు పడకే..
న్యూఢిల్లీ: దేశీయంగా పరిశ్రమలు ఇంకా గడ్డుపరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. జూన్లో కూడా పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) తిరోగమనంలో కొనసాగింది.. వరుసగా రెండవ నెలలోనూ పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా క్షీణతను నమోదుచేసుకుంది. ఈ పరిమాణం (-) 2.2 శాతంగా నమోదయ్యింది. మే నెలతో (-2.8 శాతం) పోల్చితే క్షీణత కొంత తగ్గింది. గత ఏడాది జూన్తో (-2.0 శాతం) పోల్చితే పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది జూన్తో పోల్చితే 2013 జూన్లో కీలక రంగాల పరిస్థితి ఇలా... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి -2.2 శాతం క్షీణించింది. 2012 ఇదే నెలలో ఈ క్షీణత 3.2 శాతం. తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూప్లలో 13 గ్రూప్లు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. మైనింగ్: క్షీణత మరింత క్షీణతలోకి జారింది. -1.1 శాతం నుంచి -4.1 శాతానికి దిగింది.విద్యుత్ రంగం: 2012 జూన్లో 8.8 శాతం వృద్ధి సాధించగా, 2013 ఇదే నెలలో అసలు వృద్ధి చోటుచేసుకోలేదు. భారీ యంత్ర పరికరాలు (క్యాపిటల్ గూడ్స్): ఈ రంగం ఉత్పాదకత క్షీణత బాటలోనే కొనసాగింది. అయితే ఈ రేటు -27.7 శాతం నుంచి -6.6 శాతానికి తగ్గింది. వినిమయ వస్తువులు: ఉత్పత్తి రేటు 2.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2012 జూన్లో ఈ క్షీణత రేటు 3.7 శాతం. మొదటి క్వార్టర్లో... ఇక ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (2013-14 ఏప్రిల్-జూన్)లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పరిస్థితి మెరుగుపడలేదు. క్షీణత -0.2% నుంచి -1.1 శాతానికి జారింది. తయారీ రంగం ఉత్పత్తి -0.8 క్షీణతలోంచి మరింతగా -1.2 శాతానికి దిగింది. మైనింగ్ రంగం ఉత్పత్తి కూడా 1.6 క్షీణతలోంచి మరింతగా - 4.5 శాతానికి పడింది. విద్యుత్ రంగంలో వృద్ధి ఉన్నా, ఇది 6.4 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో క్షీణత రేటు 20.1% నుంచి 3.3 శాతానికి తగ్గింది. వినిమయ వస్తువుల ఉత్పత్తి 2.4 క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఈ రంగం 4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా, పారిశ్రామిక రంగం తిరోగమనం నేపథ్యంలో రానున్న పాలసీ సమీక్షలోనైనా ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు డిమాండ్ చేశారు.