పామాయిల్ రైతుల నిరసన | Palm oil Farmers stage dharna | Sakshi
Sakshi News home page

పామాయిల్ రైతుల నిరసన

Sep 7 2015 3:08 PM | Updated on Sep 3 2017 8:56 AM

పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు.

అశ్వారావుపేట (ఖమ్మం) : పామాయిల్ గెలలను ఫ్యాక్టరీ దిగుమతి చేసుకోకపోవడంతో రైతులు ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సోమవారం చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలోని క్రషింగ్ యూనిట్‌లో ఏర్పడిన సాంకేతికలోపంతో ఇప్పటికే దిగుమతి చేసుకున్న రూ. కొటి విలువైన గెలలు కుళ్లిపోయాయి. దీంతో ఈ రోజు రైతుల నుంచి గెలలు కొనడంలేదని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపింది. దీంతో రైతులు రహదారిపై ఆందోళనకు దిగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement