మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాకే | Wife Who Assassinated Her Husband In Anantapur District | Sakshi
Sakshi News home page

మరో మహిళతో భర్త వివాహేతర సంబంధం.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాకే

Published Fri, Sep 30 2022 7:33 AM | Last Updated on Fri, Sep 30 2022 7:33 AM

Wife Who Assassinated Her Husband In Anantapur District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తాడిపత్రి అర్బన్‌(అనంతపురం జిల్లా):  వేధింపులు తాళలేక కట్టుకున్న భర్తనే హతమార్చింది ఓ ఇల్లాలు. వివరాలను తాడిపత్రి డీఎస్పీ చైతన్య వెల్లడించారు. తాడిపత్రికి చెందిన అబ్దుల్‌ బాషా అలియాస్‌ అబ్దుల్‌ (34)కు ఆరేళ్ల క్రితం ఆయేషాతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. లారీ క్లీనర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌.. మద్యానికి బానిసై మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
చదవండి: గాడ్‌ఫాదర్‌ ఈవెంట్‌.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?  

ఈ క్రమంలో రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్య ఆయేషాతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న అబ్దుల్‌... ఆయేషాతో గొడవపడి చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో విసుగెత్తిన ఆమె అర్ధరాత్రి 2 గంటలకు రోకలి బండతో నిద్రపోతున్న అబ్దుల్‌ తలపై మోది హతమార్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement