తాళ్లమ్మకు వెండి, పంచలోహ పాదాల సమర్పణ | - | Sakshi
Sakshi News home page

తాళ్లమ్మకు వెండి, పంచలోహ పాదాల సమర్పణ

Published Sat, Mar 29 2025 12:17 AM | Last Updated on Sat, Mar 29 2025 12:16 AM

ఆలయ అభివృద్ధికి రూ.4.4 లక్షల విరాళం

కొత్తపేట: స్థానిక కమ్మిరెడ్డిపాలెం గ్రామ దేవత తాళ్లమ్మ తల్లికి భక్తులు వివిద రూపాల్లో వితరణలు చేశారు. కొండేపూడి గోవిందరాజు, వీర వెంకట అనంతలక్ష్మి దంపతుల కుమారుడు వీరమణికంఠ రూ.2.04 లక్షలతో వెండి, పంచలోహ పాదములు, గరగను చేయించి శుక్రవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు మిద్దే సత్యనారాయణ ద్వారా ఆలయానికి సమర్పించారు. వాటిని ఆలయ ఆసాదు అమ్మవారికి అలంకరించారు. అలాగే ఆలయ ప్రాంతానికి చెందిన విశ్రాంత ఏఎస్‌ఐ ఏడిద సత్యనారాయణమూర్తి అమ్మవారి అలంకరణకు ఆభరణాలు, ఆలయ అభవృద్ధి నిమిత్తం రూ.1.3 లక్షలు, దెందులూరి వీరభద్రం – భానుతిలకం (మాజీ ఎమ్మెల్యే) దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు, ఎస్‌బీఐ విశ్రాంత ఏజీఎం దెందులూరి జగదీశ్వరప్రసాద్‌ రూ.1.1 లక్షలు, మిద్దే సావిత్రమ్మ, బలరామమూర్తి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు మిద్దే సత్యనారాయణ (ఆలయ కమిటీ ప్రెసిడెంట్‌), ఆదినారాయణ, శ్రీనివాస్‌, శ్రీహరి సోదరులు కలిసి రూ.1,00,116, పట్టపు పద్మావతి – తాతారావు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రూ.1,00,116, విరాళంగా అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement