ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నిర్వహించిన ఇంగ్లీష్ పేపర్ –1 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 55 కేంద్రాల్లో మొత్తం 18,991 మంది విద్యార్థులకు 17844 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 16,374 మంది జనరల్ విద్యార్థులకు గాను 15641 మంది హాజరయ్యారు. 2,617 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,203 మంది హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 94 శాతంగా నమోదయింది. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే యోహాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment