శ్రీశైల మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్లకు దుర్గగుడి తరఫున ఆదివారం పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీశైలం మల్లికార్జున స్వామికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు దుర్గగుడి ఈఓ కె.రామచంద్ర మోహన్, ఆలయ అర్చకులు వెళ్లారు. వారికి శ్రీశైలం దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, ఆలయ వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న దుర్గగుడి అధికారులు... స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, పూజా సామగ్రి, అమ్మవారి ప్రసాదాలను ఈఓ శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment