బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
చందోలు(కర్లపాలెం): చందోలు శ్రీ బగళాముఖి అమ్మవారిని ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గుణరంజన్ సతీమణి విజిత, కుమారుడు గిరీష్, కుమార్తె గ్రీష్మ, రైల్వే కోర్టు జడ్జి పి.రమాదేవి, నూజివీడు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేశ్వరరావులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ విశేషాలను వివరించారు. అనంతరం వారు కానుకలు సమర్పించుకున్నారు. అమ్మవారి చిత్రపటాలను, ప్రసాదాలను వారికి ఈవో అందజేశారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన
తాడికొండ: వెలగపూడి సచివాలయంలో ఈ నెల 30న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీ–4 కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొననున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి ఆదివారం పరిశీలించారు. సభా ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అంతకు ముందు రాష్ట్ర సచివాలయంలో మార్చి 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు జరిగే కలెక్టర్ల సమావేశానికి సంబంధించి ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆమె వెంట ప్రొటోకాల్ డైరెక్టర్ మోహనరావు, జెడ్పీ సీఈఓ జ్యోతి బసు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, పౌర సరఫరాల అధికారి కోమలి పద్మ, జిల్లా ఉపాధి కల్పనాధికారి దుర్గాభాయి, గుంటూరు పశ్చిమ తహసీల్దార్ వెంకటేశ్వర్లు, తుళ్ళూరు తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.
వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాల పరిశీలన
తాడికొండ: తాడికొండ మండలంలో కొనసాగుతున్న వయోజన విద్య, రాత్రి బడి కేంద్రాలను ఆదివారం ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. నాలుగు కేంద్రాలను పరిశీలించిన వారు నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో 50 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 510 మంది చదువుకుంటున్నారని తెలిపారు. ఉల్లాస్ వయోజన విద్య ద్వారా చదువుతున్న మహిళలకు పరీక్ష నిర్వహించి ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కేంద్ర అడల్ట్ ఎడ్యుకేషన్ బ్యూరో కన్సల్టెంట్ అధికారి జగన్ మోహన్ రావు, సభ్యులు ఓంకారం, శిరీష, దాసరి వెంకటస్వామి ఎంపీడీవో కె.సమతా వాణి, ఏపీఎం సాంబశివరావు పాల్గొన్నారు.
శ్రీరంగనాయకులుగా నృసింహస్వామి
మంగళగిరి: మంగళాద్రిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆస్థాన అలంకార ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం శ్రీరంగనాయకులు అలంకారంలో స్వామి దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ కైంకర్యపరులుగా కొడాలి సుగుణమ్మ జ్ఞాపకార్థం సీతారామయ్య, బసవ ఆనంద్, వెంకట అజయ్, ఆస్థాన కైంకర్యపరులుగా పచ్చళ్ళ విజయలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు వ్యవహరించారు. ఉత్సవాన్ని ఆలయ ఈఓ ఎ.రామకోటిరెడ్డి పర్యవేక్షించారు.
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
బగళాముఖి సేవలోన్యాయమూర్తులు
Comments
Please login to add a commentAdd a comment