బ్లేడ్‌తో ఇద్దరిపై దాడి | - | Sakshi
Sakshi News home page

బ్లేడ్‌తో ఇద్దరిపై దాడి

Apr 3 2025 2:06 PM | Updated on Apr 8 2025 1:19 PM

సత్తెనపల్లి: బ్లేడుతో ఇద్దరిపై యువకుడు దాడి చేసిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌లో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన గింజుపల్లి అశోక్‌ కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో బుధవారం పూటుగా మద్యం తాగాడు. ఇంటి సమీపంలోని ఎనిమిదో తరగతి చదువుతున్న మేడూరు చాణిక్యతో ఏంటి రా.. నా వైపు చూస్తున్నావ్‌! అంటూ దూషించి దాడి చేసి బెదిరించడంతో చాణిక్య వెంటనే తల్లి మేడూరు జ్యోతికి ఫోన్‌ చేసి చెప్పాడు. 

దీంతో ఎయిర్‌టెల్‌ కార్యాలయంలో పనిచేస్తున్న జ్యోతి తన బిడ్డ చాణిక్యపై దాడి చేస్తున్నారంటూ చూసి రమ్మని తన వద్ద పనిచేసే ఏల్పూరి నవీన్‌, తూమాటి శ్రీకాంత్‌లను పంపింది. వారు ఘటన స్థలానికి చేరుకొని ఎందుకు దాడి చేసి, బెదిరిస్తున్నావు అంటూ ప్రశ్నించారు. దీంతో అశోక్‌ కుమార్‌ బ్లేడ్‌ తీసుకొని ఏల్పూరి నవీన్‌ మెడ, చెవి పైన, తూమాటి శ్రీకాంత్‌ చేతులపై దాడి చేశాడు. ఎవరైనా దగ్గరకు వస్తే దాడి తప్పదు అంటూ బ్లేడు చూపిస్తూ హల్‌చల్‌ చేయడంతో స్థానికులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఘటనా స్ధలానికి చేరుకున్న పట్టణ ఏఎస్‌ఐ సుబ్బారావు పరారైన అశోక్‌ కుమార్‌ను క్రిస్టియన్‌ పేటలో పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గాయాలపాలైన ఏల్పూరి నవీన్‌ను ఏరియా వైద్యశాలకు తరలించగా, వైద్యులు 10 కుట్లు వేశారు. తూమాటి శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement