![Israeli PM Netanyahu Receive Pravasi Bharatiya Samman Award 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/4/Benamin-nethanyahu.jpg.webp?itok=HhoAa65i)
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు.
సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్ పెరీస్సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు.
ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు
Comments
Please login to add a commentAdd a comment