మార్చి 8దాకా బడి బంద్‌ | PM Boris Johnson Delays Schools Reopening Amid High COVID-19 | Sakshi
Sakshi News home page

మార్చి 8దాకా బడి బంద్‌

Published Thu, Jan 28 2021 4:20 AM | Last Updated on Thu, Jan 28 2021 5:39 AM

PM Boris Johnson Delays Schools Reopening Amid High COVID-19 - Sakshi

లండన్‌: ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో పాఠశాలలను మార్చి 8వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ చెప్పారు. ఆయన తాజాగా పార్లమెంట్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో మాట్లాడారు. మార్చి 8 తర్వాత పాఠశాలలను తెరవడంపై అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నరు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోందని గుర్తుచేశారు. దేశంలో లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయడానికి రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఫిబ్రవరి 15న దీనిపై నిపుణులతో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగానే లాక్‌డౌన్‌పై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యదాకా అర్హులైన విద్యార్థులకు ఫుడ్‌ పార్సెళ్లు/ఓచర్లు అందుతాయని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement