
గ్రామంపై విరుచుకుపడిన హిమానీనదం
జెనీవా: ఆల్ప్స్ పర్వతశిఖర సానువుల్లోని ఓ అందమైన కుగ్రామం రెప్పపాటులో భూస్థాపి తమైంది. స్విట్జర్లాండ్లోని లోట్స్చెంటర్ లోయ ప్రాంతంలోని బ్లాటెన్ గ్రామంపై హిమానీనదం విరుచుకుపడింది. భారీస్థాయి లో మట్టిదిబ్బలు ఒక్కసారిగా పడటంతో కేవలం 40 సెకన్లలో దాదాపు గ్రామం మొత్తం మట్టిలో కలిసిపోయింది. బిర్క్ గ్లేసియర్లో కదలికలను ముందే కనిపెట్టిన స్థానిక యంత్రాంగం కొద్దిరోజుల ముందే గ్రామంలోని దాదాపు 300 మంది స్థానికులను ఖాళీ చేయించారు.
దీంతో ప్రాణనష్టం తప్పింది. అయితే 64 ఏళ్ల ఒక వృద్ధుని ఒకరి జాడ తెలీడంలేదని వార్తలొచ్చాయి. హిమచరియలు ఇంకా పడుతున్నాయని వాలేయిస్ కంటోన్మెంట్ పోలీస్ అధికారి చెప్పారు. పర్వతం పైనుంచి జారి కిందకొచ్చిన మట్టిపెళ్లలతో కిందనున్న లోన్జా నదిలో పెద్ద అలజడి చెలరేగింది. దీంతో దిగువ ప్రాంతాలను నదీజలాలు ముంచెత్తనున్నాయి. శుక్రవారం ఈ ప్రాంతంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు కరెన్ కెల్లర్ సూటర్ పర్యటించనున్నారు.