భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు!  | US President Donald Trump calls Pahalgam terror attack bad one | Sakshi
Sakshi News home page

భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు! 

Published Sun, Apr 27 2025 4:44 AM | Last Updated on Sun, Apr 27 2025 6:26 AM

US President Donald Trump calls Pahalgam terror attack bad one

ట్రంప్‌ వ్యాఖ్యలపై ట్రోలింగ్‌ 

న్యూయార్క్‌: భారత్, పాక్‌ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్‌ అంత్యక్రియల నిమిత్తం వాటికన్‌ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్‌ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్‌ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. 

బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్‌ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్‌లో ట్రోల్‌ చేస్తున్నారు. కశీ్మర్‌ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్‌ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement