శివరాత్రికి ఆలయాలు ముస్తాబు | - | Sakshi
Sakshi News home page

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు

Published Tue, Feb 25 2025 12:25 AM | Last Updated on Tue, Feb 25 2025 12:23 AM

శివరా

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు

● రేపు మహాశివరాత్రి

ధర్మపురి: మహా శివరాత్రికి శివాలయాలను ముస్తాబు చేశారు. ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి, అక్కపెల్లి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయంతోపాటు మండలంలోని నేరెల్ల సాంబశివ దేవాలయాలను రంగులు, విద్యుత్‌దీపాలతో అలంకరించారు. బుధవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి రాత్రివరకు పంచోపనిషత్తులతో అభిషేకాలు, రుద్రహోమాలు నిర్వహిస్తారు. రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి లింగోద్భవం ఉంటుంది. అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆలయ చైర్మన్‌ సీపతి సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలతోపాటు సాయంత్రం శివ పార్వతుల కల్యాణ వేడుకలు నిర్వహిస్తారు. భక్తుల దర్శనాల కోసం ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అక్కపెల్లి రాజరాజేశ్వర ఆలయానికి ఉచిత వాహన సౌకర్యం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
శివరాత్రికి ఆలయాలు ముస్తాబు1
1/1

శివరాత్రికి ఆలయాలు ముస్తాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement