జిల్లాలో ఏసీబీ దాడుల వివరాలిలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఏసీబీ దాడుల వివరాలిలా..

Published Sun, Feb 16 2025 12:51 AM | Last Updated on Sun, Feb 16 2025 12:51 AM

-

● 2018 ఫిబ్రవరి 19వ తేదీన అయిజ మండలం చిన్న తాండ్రపాడుకు చెందిన వీఆర్‌ఓ మద్దిలేటి రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికాడు.

● 2019 మార్చి 12వ తేదీన మల్దకల్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వీఆర్‌ఏ చిన్నయ్య రైతుల నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కారు.

● 2020 జూలైలో డీఎంహెచ్‌ఓ బీమానాయక్‌ డాక్టర్‌ నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

● 2021 సెప్టంబర్‌ 21వ తేదీ కేటీదొడ్డి మండల సర్వేయర్‌ తిక్కన్న రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.

● 2023లో అయిజ విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న లైన్‌మెన్‌ జీవరత్నం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.

● 2024 జూన్‌ 12న బీచుపల్లి పదో బెటాలియన్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ నరసింహతో పాటు రిటైర్డు ఏఆర్‌ఎస్‌ఐ అబ్దుల్‌ వహాబ్‌ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

● 2024 నవంబర్‌ 18న ఎర్రవల్లి మండలంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పాండురంగరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement