గద్వాల: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకం కింద మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఉచితంగా కుట్టుమిషన్లను అందిస్తున్నట్లు మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్బాబు ప్రకటనలో తెలిపారు. అర్హులైన మహిళలు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్కార్డు, తెల్లరేషన్కార్డు, కనీసం 5వ తరగతి చదివి ఉండాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వారికి వార్షిక ఆదాయం రూ.1.50లక్షలు, పట్టణాల్లో ఉన్నవారికి రూ.2లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉండాలని, దరఖాస్తులను మార్చి 2వ తేదీ లోపు జిల్లా మైనారిటీ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment