మంత్రి దృష్టికి ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమస్య | - | Sakshi
Sakshi News home page

మంత్రి దృష్టికి ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమస్య

Published Wed, Feb 19 2025 1:25 AM | Last Updated on Wed, Feb 19 2025 1:21 AM

మంత్రి దృష్టికి ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమస్య

మంత్రి దృష్టికి ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమస్య

రాజోళి: ఇథనాల్‌ ఫ్యాక్టరీ సమస్యను పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు మాజీ ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు శాంతినగర్‌లోని క్యాంప్‌ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెద్ద ధన్వాడలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా 20 రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన క్రమంలో సమస్యను పరిష్కరిస్తామని సంపత్‌ కుమార్‌ ఇచ్చిన హామీ మేరకు దీక్షలను విరమించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో సంపత్‌కుమార్‌ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబుతో ఫోన్‌లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలవనున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ వ్యతిరేక పోరాట సమితి సభ్యులు బాబురావ్‌, రఘువర్ధన్‌ రెడ్డి, మధు రెడ్డి, మన్సూర్‌, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement