అయినవిల్లిలో భక్తుల సందడి | - | Sakshi
Sakshi News home page

అయినవిల్లిలో భక్తుల సందడి

Published Mon, Feb 24 2025 12:08 AM | Last Updated on Mon, Feb 24 2025 12:14 AM

అయినవిల్లిలో భక్తుల సందడి

అయినవిల్లిలో భక్తుల సందడి

అయినవిల్లి: విఘ్నేశ్వర స్వామివారిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీగణపతి హోమం, గరిక పూజ జరిపారు. స్వామిని అర్చకులు వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహానివేదన చేశారు. రాత్రి 8 గంటలకు విశేష సేవలు చేసి, ఆలయ తలుపులు మూసివేశారు. స్వామివారి పంచామృతాభిషేకాల్లో 3 జంటలు లక్ష్మీగణపతి హోమంలో 25 జంటలు, గరిక పూజలో ఒక జంట పాల్గొన్నాయి. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 62 మంది పాల్గొన్నారు. ముగ్గురు భక్తులు ఉండ్రాళ్ల పూజలు జరిపారు. 77 మంది చిన్నారులకు అక్షరాభ్యాసాలు, 15 మంది చిన్నారులకు అన్నప్రాశనలు, 14 మందికి తులాభారం, ఒకరికి నామకరణం చేశారు. స్వామికి 12 మంది తలనీలాలు సమర్పించారు. 48 నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి అన్నప్రసాదాన్ని 4,100 మంది భక్తులు స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు స్వామివారికి వివిధ పూజా టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా రూ.5,72,525 ఆదాయం లభించినట్లు ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement