కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Published Mon, Mar 3 2025 12:15 AM | Last Updated on Mon, Mar 3 2025 12:13 AM

కారు

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఘటన

క్షతగాత్రులు రాజమహేంద్రవరం వాసులు

దెందులూరు: వివాహానికి కారులో వెళ్లి తిరిగివస్తుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్ద శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నివాసం ఉంటున్న ఊట్ల రామకృష్ణ కుటుంబ సభ్యులు ఐదుగురు కలసి తమ సొంత కారులో పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో వివాహానికి వెళ్లారు. వివాహానంతరం శనివారం రాత్రి తిరిగి రాజమహేంద్రవరానికి బయలుదేరారు. రాత్రి రెండు గంటల సమయంలో వీరు ఏలూరు జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురం గుండేరు వాగు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వెళుతున్న లారీని దాటేందుకు ప్రయత్నించగా, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ఊట్ల రామకృష్ణకు తలపై, ఆయన భార్య అరుణకు కాలిపై గాయాలయ్యాయి. ఈ ఘటనలో రామకృష్ణ నాన్నమ్మ అనంతలక్ష్మి, అరుణ అమ్మమ్మ సామ్రాజ్యం, వారి కుటుంబ సభ్యుడు ఇరుసుమల్లి మణికంఠ కూడా గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న దెందులూరు ఏఎస్‌ఐ వెంకటేశ్వరరావు, హైవే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్‌న్సులో ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 1
1/4

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 2
2/4

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 3
3/4

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు 4
4/4

కారు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement