యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల వాక్థాన్
బాలాజీచెరువు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో మహిళా సాధికారత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వాక్థాన్ నిర్వహించారు. బ్యాంక్ మహిళా ఉద్యోగులు మెయిన్రోడ్ మీదుగా ప్లకార్డులు చేతపట్టుకుని, ర్యాలీ నిర్వహించారు. అన్ని రంగాల్లో మహిళల ప్రతిభను తెలియజేస్తూ ప్రదర్శన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ హెడ్ కాకి సాయిమనోహర్, కృష్ణమాచారి, నారాయణ, అర్చన, యూనియన్ నాయకులు జేఎన్వీ శ్రీనివాస్, ఆకుల సాంబశివరావు, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment