సీఐపై చర్యలు తీసుకోవాలి
● ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కవిత డిమాండ్
ఎడపల్లి(బోధన్): ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గురువారం మహిళపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని ‘ఎక్స్’ వేదికగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం డిమాండ్ చేశారు. బాధిత మహిళ భాగ్యకు సత్వరం న్యాయం చేయాలని పేర్కొన్నారు. పోలీసు అధికారి మానవత్వం మరిచి మహిళపై లాఠీతో దాడి చేయడం అమానుషమన్నారు. రేవంత్రెడ్డి ప్రజాపాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment