ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి

Published Wed, Feb 19 2025 1:23 AM | Last Updated on Wed, Feb 19 2025 1:19 AM

ఆరోగ్

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి

రాజంపేట: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని రాజంపేట్‌ మండల వైద్యాధికారి విజయ మహాలక్ష్మి తెలిపారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 76 మంది మహిళలకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. మహిళలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని, పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. హెల్త్‌ సూపర్వైజర్‌ మంజూర్‌ తదితరులు పాల్గొన్నారు.

లింగంపేట పీహెచ్‌సీలో అమ్మ ఒడి

లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో మంగళవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించినట్లు డాక్టర్‌ హిమబిందు తెలిపారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతున్న సీ్త్రలు, గర్భిణులు తీసుకోవాల్సిన పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. పలువురికి రక్త పరీక్షలు చేసి నమూనాలను టి–హబ్‌కు పంపినట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఐరన్‌ మాత్రలు పంపిణీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి1
1/1

ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement